సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆయనొక పార్టీ జిల్లా అధ్యక్షుడు. సంపాదన కోసం పరితపిస్తున్నారు. సొమ్ము చేసుకోవడానికి సరైన అధికారిక పదవి దక్కలేదని ఏళ్ల తరబడి అసంతృప్తిగా ఉన్న ఆయనకు అనూహ్యంగా లభించిన జిల్లా పార్టీ పదవిని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల బీ-ఫారాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే అప్రతిష్టను మూటగట్టుకున్నారు... తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని, చైర్పర్సన్ పదవికి లైన్ క్లియర్ చేస్తానని ఆశావహుల నుంచి డబ్బు గుంజుతున్నారు.
దీంతో సొమ్ముతో పాటు వసూలు రాజాగా బాగా పేరు గడించారు. అప్పుడప్పుడు పోటీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. ఎన్నికల్లో ఓటమి తప్ప విజయం దరిచేరడం లేదు. దీంతో ఎన్నాళ్లైనా ఇలాగే ఉండిపోతున్నాన్న ఆవేదన ఒక పక్క, కూడబెట్టుకోవడానికి అవకాశం దక్కడం లేదన్న బాధ మరో పక్క ఆయన్ను పీడించాయి. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. ఎన్నికల రాక ముందు నమ్మకంగానే పనిచేశారు. అధినేతల అడుగుజాడలో నడుస్తూ, వంగి వంగి నమస్కారాలు పెట్టి గురుభక్తి చాటుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు రావడమే తరువాయి చెలరేగిపోవడం మొదలు పెట్టారు. తొలుత మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి రూ. లక్షలు తీసుకున్నారు.
దీనిపై పార్టీలో కూడా వివాదం చోటు చేసుకుంది. గొడవ పడేవరకూ కార్యకర్తలు వచ్చారు. ఇదే విషయమై అధినేతలు సంజాయిషీ కోరినట్టు తెలిసింది. అయినా ఆయన మారలేదు. ఎంపీటీసీ బీ-ఫారాలు ఇచ్చేందుకు కూడా సొమ్ము వసూలు చేశారు.ఇదొక వైపు జరుగుతూనే మరోవైపు జెడ్పీ పదవులకు అడ్డు రాకుం డా ఉంటానని, తనవంతు సహకారమందిస్తానని చెప్పి ఆశావహుల నుం చి పెద్ద ఎత్తున వసూలు చేశారు. అలాగే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని కూడా కొంతమంది నుంచి రూ.20లక్షల నుంచి రూ.40లక్షల వరకు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పుడాయన ఆ పార్టీలో హాట్ టాపి క్ అయ్యారు. అధికారంలో లేనప్పుడే ఇంత దందా చేస్తుంటే చేతిలోకి అధికారం వస్తే ఇంకెంత రెచ్చిపోతారోనన్న చర్చ మొదలైంది. అంతా అధికారం కోసం పాకులాడుతుంటే పార్టీ పదవితో డబ్బులు కోసం ఆరాటపడుతున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయన గురిం చి ఆ పార్టీలోని నాయకులను కదిపితే ఆయనకిదేమీ కొత్తకాదని, కాకపోతే ఇప్పుడు మరింత ఎక్కువగా గడిస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి ఆయ న తీరుతో పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వసూల్ రాజా!
Published Wed, Mar 26 2014 1:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement