
ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
ఒంగోలు మండల పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాలు,ఒక జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.
ఒంగోలు రూరల్, న్యూస్లైన్ : ఒంగోలు మండల పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. శనివారం ఉదయం వల్లేటివారిపాలెంలో ఎంపీటీసీ అభ్యర్థి కామని రాఘవేంద్రరావు, కరవది దక్షిణంలో మన్నే సుజాత ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
ప్రచారంలో ఆ పార్టీ నాయకులు వాకా బసివిరెడ్డి, నాయకులు మన్నే శ్రీనివాసరావు, మన్నే చిరంజీవి, డాకా అంజిరెడ్డి, నల్లమలపు హనుమారెడ్డి, డాకా ఆదిరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు, దగ్గుమాటి గోపాల్రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు సోమన హనుమంతరావు, నంది అవార్డు గ్రహీత యలమంద, బాలినేని యూత్ఫోర్స్ బాబురావు, కైలా శ్రీను, రమేష్, కోటి పాల్గొన్నారు.
దేవరంపాడు, బొద్దులూరిపాలెంలో గంటా అంజమ్మ విజయాన్ని కాంక్షిస్తూ మండువ సుబ్బారావు నేతృత్వంలో సాగి ప్రసాద్, సాగి అంగిరాజు, చుంచు నాగేశ్వరరావు, నడిపినేని రాంబాబు, మాజీ సర్పంచ్ కొట్టే హనుమంతరావులు ప్రచారం చేశారు. మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య నేతృత్వంలో మండలంలోని యరజర్ల, వలేటివారిపాలెం, ఉలిచి, చింతాయిగారిపాలెం, చేజర్ల, మండువవారిపాలెం, దశరాజుపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు.
కొత్తపట్నం మండలంలో..
కొత్తపట్నం-2 ఎంపీటీసీ స్థానానికి వెఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తంబి కాంతారావు శనివారం స్థానిక డీటీ కాలనీ, డీడీ కాలనీల్లో ప్రచారం చేశారు. కాలనీ వాసులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి చేసిన సేవలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో పార్టీ కొత్తపట్నం గ్రామ అధ్యక్షుడు ఎం సుధాకర్రెడ్డి, బేతాళ రమేష్, కొత్తపట్నం ఉప సర్పంచ్ మాకాణి ఏడుకొండలు, హరి, రామ్మోహన్, రాగాల పోలయ్య, మూగ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదే విధంగా కొత్తపట్నం-1లో సీపీఐ అభ్యర్థి మేడా సుబ్బారావు కొత్తపట్నం బస్టాండ్, బీసీ కాలనీ పోస్టాఫీస్ బజారులో ప్రచారం చేశారు.