breaking news
Karimnagar Diamonds
-
క్వాలిఫయర్-2లో కరీంనగర్ ఓటమి.. ఫైనల్కు హైదరాబాద్
తెలంగాణ టీ20 లీగ్-2026లో కరీంనగర్ డైమండ్స్ పోరాటం ముగిసింది. శుక్రవారం ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 8 వికెట్ల తేడాతో కరీంనగర్ పరాజయం పాలైంది. దీంతో కరీంనగర్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టగా.. హైదరాబాద్ జట్టు ఆదివారం అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుతో ఫైనల్లో తలపడేందుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ సింహా(38) టాప్ స్కోరర్గా నిలవగా.. శుభమ్ శర్మ(31), సాత్విక్ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్, షణ్ముఖ, ప్రణవ్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి(45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 82) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి(45) రాణించాడు. కరీంనగర్ బౌలర్లలో ఆఖిల్, శుభమ్ తలా వికెట్ సాధించారు. -
హైదరాబాద్తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన కరీంనగర్
Update: హైదరాబాద్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ సింహా(38) టాప్ స్కోరర్గా నిలవగా.. శుభమ్ శర్మ(31), సాత్విక్ రెడ్డి(28) రాణించారు.కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ పది పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్, షణ్ముఖ, ప్రణవ్ తలా రెండు వికెట్లు సాధించారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న కరీంనగర్తెలంగాణ టీ20 లీగ్-2026లో మరో కీలక మ్యాచ్కు తెరలేచింది. క్వాలిఫయర్-2లో భాగంగా ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్ , హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలిమినేటర్లో రంగారెడ్డిని చిత్తు చేసిన కరీంనగర్ డైమండ్స్.. ఇప్పుడు క్వాలిఫయర్-2లో అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు క్వాలిఫయర్-1లో ఖమ్మం చేతిలో ఖంగుతిన్న హైదరాబాద్ జట్టు తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుకరీంనగర్ డైమండ్స్: తన్మయ్ అగర్వాల్ (సి), సాత్విక్ రెడ్డి, హెచ్కె సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, నారాయణ తేజ, శుభం శర్మ, అఖిల్ కుమార్ సంకోజు, రత్లావత్ దినేష్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీష్ కుమార్హైదరాబాద్ ఈ ఛాంపియన్స్: అభిరత్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, యశ్వీర్ గౌడ్, గడుగు గణేష్, వైష్ణవ్ రెడ్డి ఎ, ప్రణవ్ వర్మ, పి అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్ -
క్వాలిఫయర్-2కు కరీంనగర్ డైమండ్స్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో ఉప్పల్ వేదికగా రంగారెడ్డి రైజర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 75 పరుగుల తేడాతో కరీంనగర్ ఘన విజయం సాధించింది. దీంతో కరీంనగర్ జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఎలిమినేటర్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో ఏకంగా 137 పరుగులు రాబట్టాడు. ఈ టీజీ 20 లీగ్లో తన్మయ్కు ఇది మూడో సెంచరీ.తన్మయ్తో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సింహా అర్ధ శతకం (50)తో రాణించాడు. తన్మయ్, సింహా కలిసి రెండో వికెట్కు 69 బంతుల్లో ఏకంగా 139 పరుగులు జోడించారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప రెండు వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్, సచేత్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్ స్పిన్నర్ ఆశిష్ శ్రీవాస్తవ్ 5 వికెట్లు పడగొట్టి కరీంనగర్ను దెబ్బతీశాడు. ఆశిష్ 3.3 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడితో పాటు శుభమ్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. రంగారెడ్డి బ్యాటర్లలో కెప్టెన్ తనయ్ త్యాగరాజన్(33 బంతుల్లో 63), నితన్ సాయి యాదవ్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: అలాంటి వాళ్లకు ఈ లోకంలో స్థానం ఉండదు: కపిల్ దేవ్ -
ఎలిమినేటర్ మ్యాచ్లో శతక్కొట్టిన కెప్టెన్
రంగారెడ్డి రైజర్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ దంచికొట్టాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో అద్భుత శతకంతో అదరగొట్టాడు. కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో ఏకంగా 137 పరుగులు రాబట్టాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో తన్మయ్కు ఇది మూడో సెంచరీ. సింహా అర్ధ శతకంఇక రంగారెడ్డితో మ్యాచ్లో ఓపెనర్లలో తన్మయ్ ఇలా సెంచరీతో చెలరేగగా.. సాత్విక్ రెడ్డి మాత్రం 15 పరుగులకే నిష్క్రమించాడు. అయితే, తన్మయ్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ హెచ్కే సింహా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 28 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్స్లు బాది సింహా అర్ధ శతకం (50) పూర్తి చేసుకుని అవుటయ్యాడు. తన్మయ్, సింహా కలిసి రెండో వికెట్కు 69 బంతుల్లో ఏకంగా 139 పరుగులు జోడించారు. ఇక వీరిద్దరు అవుటైన తర్వాత కరీంనగర్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. వైస్ కెప్టెన్ చందన్ సహానీ 3, వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ 14 పరుగులు చేసి అవుట్ కాగా.. నారాయణ తేజ డకౌట్గా వెనుదిరిగాడు.కరీంనగర్ భారీ స్కోరుమిగిలిన వారిలో హరీశ్ ఠాకూర్ 9 పరుగులు చేయగా.. శుభం శర్మ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సరికి కరీంనగర్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది.రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప రెండు వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్, సచేత్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.Absolute Cinema! ✋🤩🤚There is literally no stopping Tanmay Agarwal! 🔥3rd 💯 of the season! 🥊#Eliminator #KDvRRR #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/JuWbLnjU2z— tg20official (@tg20official) July 9, 2026 -
ఎలిమినేటర్ మ్యాచ్.. కరీంనగర్ బ్యాటింగ్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026 తుది అంకానికి చేరుకుంది. ఉప్పల్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన కరీంనగర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా లీగ్ దశలో ఏడింట చెరో నాలుగు విజయాలతో కరీంనగర్, రంగారెడ్డి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. నెట్రన్రేటు పరంగా రంగారెడ్డి (1.211) కంటే మెరుగ్గా ఉండి కరీంనగర్ (1.535) మూడో స్థానంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాటి ఎలిమినేటర్లో గెలిచిన జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. తుదిజట్లుకరీంనగర్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్కే సింహా, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.రంగారెడ్డితనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అలంకృద్ రాపోలు (వికెట్ కీపర్), జ్ఞానప్రకాశ్ రెడ్డి, వెంకట్ కార్తిక్, ఆదిత్య జవ్వాజి, నితిన్సాయి యాదవ్, అరుణ్ కుమార్, హితేశ్ యాదవ్, సచేత్ బింజ్రాజ్క, ఆర్యన్ కరియప్ప. -
కరీంనగర్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు!
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ అరంగేట్ర సీజన్లో కరీంనగర్ డైమండ్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. పాలమూరు స్ట్రైకర్స్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో కరీంనగర్ ఆటగాళ్లు దుమ్ములేపారు. ఈ క్రమంలో ప్రత్యర్థిని ఏకంగా 73 పరుగుల తేడాతో చిత్తు చేసింది కరీంనగర్.ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో పాలమూరు- కరీంనగర్ తలపడ్డాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం ఓపెనర్లలో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం (58 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు; 109) సాధించాడు. సాత్విక్ రెడ్డి 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో నారాయణ తేజ మెరుపులు (8 బంతుల్లో 23 నాటౌట్) మెరిపించాడు.ఇక లక్ష్య ఛేదనలో పాలమూరును కరీంనగర్ 143 పరుగులకే కట్టడి చేసింది. కరీంనగర్ బౌలర్లలో రత్లావత్ దినేశ్, శుభం శర్మ మూడేసి వికెట్లతో చెలరేగి పాలమూరు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. నారాయణ తేజ, ఆశిష్ శ్రీవాస్తవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.A true all-rounder! 😍This return catch deserves a place in the greatest museums of the world! 🥵#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/dgGVkLTZ6M— tg20official (@tg20official) July 7, 2026సంహిత్ రెడ్డి మెరుపులు వృథాపాలమూరు బ్యాటర్లలో సంహిత్ రెడ్డి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా షాదాబ్ అహ్మద్ (16 బంతుల్లో 24) రాణించాడు. కానీ మిగతా వాళ్లంతా తేలిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాలమూరు తొమ్మిది వికెట్లు నష్టపోయి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో ఓటమితోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.కాగా లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్లలో పాలమూరుకు ఇది ఐదో ఓటమి. మరోవైపు.. కరీంనగర్కు ఏడింట ఇది నాలుగో గెలుపు. ఇక ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం ప్లే ఆఫ్స్ చేరగా.. మూడు, నాలుగు స్థానాల కోసం కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి బరిలో నిలిచాయి. అయితే, మంగళవారం జరిగే రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు నిలిచారో అధికారికంగా తేలుతుంది. కరీంనగర్ ఎనిమిది పాయింట్లతో పాటు మెరుగైన నెట్రన్రేటు (+1.424)తో బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. -
సెంచరీతో చెలరేగిన కెప్టెన్
పాలమూరు స్ట్రైకర్స్పై కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. ఫలితంగా.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కరీంనగర్ భారీ స్కోరు చేయగలిగింది.తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్లో భాగంగా మంగళవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్తో కరీంనగర్ డైమండ్స్ తలపడుతోంది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. కరీంనగర్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.తన్మయ్ శతకంతో చెలరేగడంతోఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109), సాత్విక్ రెడ్డి (22 బంతుల్లో 32) శుభారంభం అందించారు. ముఖ్యంగా తన్మయ్ శతకంతో చెలరేగడంతో మిగతా బ్యాటర్లు విఫలమైనా కరీంనగర్ స్కోరు 200 దాటింది. చందన్ సహాని 16, సింహా 15, రాహుల్ రాదేశ్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.Brutal hitting! 💥Tanmay Agarwal upped the ante with 2️⃣0️⃣ off the over, putting the Diamonds in a position of stength! 💪#KDvPS #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/mNgmtOh5lc— tg20official (@tg20official) July 7, 2026ఆఖర్లో నారాయణ తేజ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 23 నాటౌట్) ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 216 పరుగులు చేసింది. పాలమూరు బౌలర్లలో అశ్వద్ రాజీవ్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆఫ్రిది, రిషభ్ బిస్లాస్, నిశాంత్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్లో గెలిస్తేనే కరీంనగర్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు.. పాలమూరు ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో ఒక్కటి మాత్రమే గెలిచి ఇప్పటికే ఎలిమినేట్ అయింది.తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
కరీంనగర్కు చావోరేవో.. టాస్ గెలిచిన పాలమూరు
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్- కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన పాలమూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్కు దిగింది. ఇరుజట్లకు లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడం గమనార్హం.కాగా హైదరాబాద్ ఇ- చాంపియన్స్ లీగ్ దశలో ఏడింట ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక హైదారాబాద్తో పాటు ఖమ్మం ఏసెస్ (ఏడింట ఐదు గెలిచి) తమ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిన రెండు బెర్తుల కోసం కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్ పోటీలో ఉన్నాయి.ఇక మంగళవారం కరీంనగర్ పాలమూరుతో మ్యాచ్లో గెలిస్తేనే రేసులో ఉండగలుగుతుంది. అనంతరం రంగారెడ్డి- వరంగల్ మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు ఏవో తేలుతుంది. తుదిజట్లుపాలమూరు స్ట్రైకర్స్ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్, వికెట్ కీపర్), విఘ్నేశ్ రెడ్డి, రోహిత్ రాయుడు, మణికంఠేశ్వర్రెడ్డి, రిషభ్ బిస్లాస్, ఎండీ ఆఫ్రిదీ అహ్మద్, సంహిత్ రెడ్డి, ఎండీ షాదాబ్ అహ్మద్, నిపుణ్ రెడ్డి, అశ్వద్ రాజీవ్, నిశాంత్ సేన్ రెడ్డి.కరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హెచ్కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహాని, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్. -
రంగారెడ్డి రైజర్స్ను చిత్తు చేసిన కరీంనగర్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో కరీంనగర్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ను 58 పరుగుల తేడాతో కరీంనగర్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మరోసారి వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాదేష్(37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 72) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు హెచ్కే సింహా(60), చందన్ సహనీ(7 బంతుల్లో 17) రాణించారు. రంగారెడ్డి బౌలర్లలో తన్మయ్ జడ్డూ రెండు, త్యాగరాజన్, నితిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. రైజర్స్ ఇన్నింగ్స్లో ఆధిత్య జవ్వాజీ(48), కరియప్ప(30) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ స్పిన్నర్ నారయణ తేజ మూడు వికెట్లు పడగొట్టగా.. శుభమ్ శర్మ, దినేష్ తలా రెండు వికెట్లు సాధించారు. -
కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా గురువారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్- రంగారెడ్డి రైజర్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన రంగారెడ్డి మొదట బౌలింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్కు దిగింది.కరీంనగర్ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?ఓపెనర్లు సాత్విక్ రెడ్డి (24), కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (29) ఫర్వాలేదనిపించగా.. సింహా, రాహుల్ రాదేశ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సింహా 38 బంతుల్లోనే 60 పరుగులు చేయగా.. రాహుల్ 37 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. చందన్ సహానీ (19), శుభం శర్మ (17 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్నీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్ 230 పరుగులు సాధించింది. రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డు రెండు వికెట్లు తీయగా.. తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్కే సింహ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), చందన్ సహానీ, టీవీఎస్ నారాయణ తేజ, హరీశ్ ఠాకూర్, శుభం శర్మ, రత్లావత్ దినేశ్, ఆశిష్ శ్రీవాస్తవ్, సతీశ్ కుమార్.రంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గీస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డు, ఆర్యన్ కరియప్ప. -
కరీంనగర్ ఘన విజయం.. 99 పరుగులకే మెదక్ ఆలౌట్
తెలంగాణ టీ20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో 133 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది.మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) రాణించారు. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు.కుప్పకూలిన మెదక్అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్.. కరీంనగర్ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. మెదక్ బ్యాటర్లలో తెలకపల్లి రవితేజ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ బౌలర్లలో శ్రీవాస్తవ్, శుభమ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హారీష్, నారయణ్, సతీష్ కుమార్, సాత్విక్ రెడ్డి తలా వికెట్ సాధించారు. -
రాహుల్ సూపర్ సెంచరీ.. మెదక్ ముందు భారీ టార్గెట్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో మరో సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాదేశ్ తన విరోచిత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెదక్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు. -
నరాలు తెగే ఉత్కంఠ.. బోణీ కొట్టిన కరీంనగర్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వరంగల్ వారియర్స్తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో.. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకంకరీంనగర్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత రీతిలో రాణించాడు. 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. కిరణ్ బౌలింగ్లో LBW కావడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది. Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ హెచ్కే సింహ (24) ఫర్వాలేదనిపించాడు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ రెండు వికెట్లు తీయగా.. ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది.గెలుపు ఆశలపై నీళ్లుఓపెనర్లు హర్షిత్ చౌదరి (31), కెప్టెన్ అమన్ రావు (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ రిషికేత్ సిసోడియా అర్ధ శతకం (31 బంతుల్లో 65)తో రాణించాడు. మిగిలిన వారిలో భవేశ్ సేత్ కూడా హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 53 నాటౌట్) బాదాడు. శౌనక్ (6 బంతుల్లో 14) దూకుడుగా ఆడగా.. ఆఖరి ఓవర్లలో మూడు సిక్సర్లు బాది భవేశ్ గెలుపు ఆశలు రేపాడు. కానీ విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరంగల్ ఓటమిపాలైంది.కరీంనగర్ బౌలర్లలో సతీశ్ కుమార్ రెండు... శుభం శర్మ, రత్లావత్ దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికి కరీంనగర్ మూడు మ్యాచ్లు ఆడగా ఇదే తొలి గెలుపు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి. -
కెప్టెన్ సూపర్ సెంచరీ.. 200 దాటిన స్కోరు
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. వరంగల్ వారియర్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. కాగా ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కరీంనగర్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముదస్సర్ బౌలింగ్లో ఓపెనర్ సాత్విక్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరుకే (4) వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 133 పరుగులుఈ క్రమంలో 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు.అయితే, కిరణ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోవడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది. వన్డౌన్ బ్యాటర్ హెచ్కే సింహ (24) ఫర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా పూర్తిగా నిరాశపరిచారు. వైస్ కెప్టెన్ చందన్ సహాని 16 పరుగులు చేయగా.. హరీశ్ ఠాకూర్ 1, శుభం శర్మ 2 (రిటైర్డ్ అవుట్) పరుగులకే నిష్క్రమించారు.రాహుల్ రాధేశ్ 15, నారాయణ తేజ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది. కాగా కరీంనగర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండూ ఓడిపోయింది. వరంగల్పై గెలిచి బోణీ కొట్టాలని పట్దుదలగా ఉంది.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి.Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026 -
వరంగల్ వారియర్స్తో మ్యాచ్.. కరీంనగర్ బోణీ కొట్టేనా?
టీజీ20 లీగ్లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా 14వ మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్, వరంగల్ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక వరంగ్ వారియర్స్ ఆడిన మూడింటిలో ఒక మ్యాచ్లో గెలిచి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆడిన రెండింటిలోనూ ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఆఖరి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్లోనైనా గెలిచి కరీంనగర్ డైమండ్స్ టోర్నీలో బోణీ చేయాలని చూస్తుండగా, రెండో విజయంతో పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని వరంగల్ వారియర్స్ భావిస్తోంది.తుదిజట్లు:కరీంనగర్ డైమండ్స్: సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్కే సింహా , రాహుల్ రాధేష్(వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్: హర్షిత్ చౌదరి అమన్ రావు (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్ప,ల్లెపాటి క్రాంతి -
ఉత్కంఠపోరులో ఖమ్మం ఏసెస్దే గెలుపు
టీజీ20 లీగ్లో మరో ఉత్కంఠభరిత పోరుకు వేదికైంది. శుక్రవారం కరీంనగర్ డైమండ్స్తో జరిగిన మ్యాచ్లో అన్వితా ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్ను తలపించిన మ్యాచ్లో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోరర్గా నిలవగా, చివర్లో శుభమ్ శర్మ (54 నాటౌట్) ఆఖరి వరకు నిలిచినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఖమ్మం ఏసెస్ బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా, సాహేంద్ర మల్లు రెండు వికెట్లు తీయగా, వాఫీ కచ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (30 బంతుల్లో 55 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఖమ్మం ఏసెస్ 200 పరుగులు మార్క్ను దాటింది. ఆఖర్లో జైస్వాల్ కూడా భారీ సిక్సర్లు బాది భారీ స్కోరుకు బాటలు వేశాడు. కరీంనగర్ డైమండ్స్ బౌలర్లలో హరీష్ ఠాకూర్ 3 వికెట్లు, రత్లావత్, ఆశిష్, నారాయణ తేజ తలా ఒక వికెట్ తీశారు. -
రాణించిన జైస్వాల్, హిమతేజ.. ఖమ్మం భారీ స్కోరు
టీజీ20 లీగ్లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఖమ్మం ఏసెస్ 200 పరుగులు మార్క్ను దాటింది. ఆఖర్లో జైస్వాల్ కూడా భారీ సిక్సర్లు బాది భారీ స్కోరుకు బాటలు వేశాడు. కరీంనగర్ డైమండ్స్ బౌలర్లలో హరీష్ ఠాకూర్ 3 వికెట్లు, రత్లావత్, ఆశిష్, నారాయణ తేజ తలా ఒక వికెట్ తీశారు. -
కరీంనగర్ డైమండ్స్పై ఖమ్మం ఏసెస్ విజయం
శుక్రవారం కరీంనగర్ డైమండ్స్తో జరిగిన మ్యాచ్లో అన్వితా ఖమ్మం ఏసెస్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్ను తలపించిన మ్యాచ్లో 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోరర్గా నిలవగా, చివర్లో శుభమ్ శర్మ (54 నాటౌట్) ఆఖరి వరకు నిలిచినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఖమ్మం ఏసెస్ బౌలర్లలో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెలరేగగా, సాహేంద్ర మల్లు రెండు వికెట్లు తీయగా, వాఫీ కచ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ విజయం కోసం పోరాడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి కరీంనగర్ డైమండ్స్ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కరీంనగర్ విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు కావాలి.మూడో వికెట్ కోల్పోయిన కరీంనగర్214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీంనగర్ డైమండ్స్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (23 బంతుల్లో 60 నాటౌట్) ధాటిగా ఆడుతుండగా, హరీశ్ఠాకూర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.టీజీ20 లీగ్లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా కరీంనగర్ డైమండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్కే రెడ్డి (43) రాణించాడు. 👉 17 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీవీ మిలింద్ (14), జైస్వాల్ (25) ఆడుతున్నారు.👉14 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (20), ప్రతీక్రెడ్డి (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కొడిదెల హిమతేజ (56) అర్ధసెంచరీ చేయగా, జీఎస్కే రెడ్డి (43) పరుగులతో రాణించాడు.👉 6 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం అన్వితా ఏసెస్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. హిమతేజ (42), జీఎస్కే రెడ్డి (19) పరుగులతో ఆడుతున్నారు.👉టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. నాలుగు పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. వాఫి కాచీ దినేశ్ బౌలింగ్లో డకౌట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ గుప్తా 2 పరుగులు చేసి హరీష్ ఠాకూర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 2 ఓవర్లు ముగిసేసరికి ఖమ్మం ఏసెస్ 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది.టీజీ20 లీగ్లో భాగంగా శుక్రవారం 11వ మ్యాచ్లో అన్వితా ఖమ్మం ఏసెస్, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కరీంనగర్ డైమండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక లీగ్లో అన్వితా ఖమ్మం జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక విజయం, ఒక గెలుపు సాధించగా, కరీంనగర్ డైమండ్స్ ఆడిన ఒక్క మ్యాచ్లో పరాజయం చవిచూసింది.తుది జట్లుఖమ్మం ఏసెస్: కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డికరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్ -
మా బ్యాటింగ్ బాగుంది.. ఛేజింగ్లో బెటర్: తన్మయ్ అగర్వాల్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) ద్వారా స్థానిక ఆటగాళ్లకు చక్కటి వేదిక దొరికిందని కరీంనగర్ డైమండ్స్ కోచ్ సుమంత్ కొల్లా అన్నారు. తమ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నారని.. వారు తప్పక రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ డైమండ్స్ జట్టు గురువారం సాక్షి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కోచ్ సుమంత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం, ప్రత్యర్థిని బట్టి మా వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాము.అందుకు అనుగుణంగానే జట్టు కూర్పు కూడా ఉంటుంది. ఏదేమైనా ప్రతీ మ్యాచ్లో దూకుడుగా ఆడుతూ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం పంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా ఆఖరి వరకు మేము పోరాడతాము. మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెంట నిలిచే అభిమానులను గర్వపడేలా చేయడమే మా లక్ష్యం.ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారుహైదరాబాద్ ఇ- చాంపియన్స్ జట్టును ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాము. ఆ జట్టుతో మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఆడతాము. ఇక తిలక్ వర్మ (మెదక్ ఫాల్కన్స్), మహ్మద్ సిరాజ్ (వరంగల్ వారియర్స్) వంటి టీమిండియా స్టార్లపై ఆడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వాళ్లతో పోటీని కూడా మా వాళ్లు పూర్తిగా ఆస్వాదిస్తూ.. సత్తా చాటగలరనే నమ్మకం ఉంది’’ అని సుమంత్ పేర్కొన్నారు.ఇక కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘అభిమానుల మద్దతు మాకు చాలా అవసరం. నా భార్య కూడా స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూస్తుంది. కుటుంబం నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే, మైదానంలో దిగిన తర్వాత మాత్రం దృష్టి మొత్తం ఆట మీదే ఉంటుంది. మేము మా యాజమాన్యం పట్ల కృతజ్ఞులమై ఉంటాము. మ్యాచ్ ఓడినా.. గెలిచినా... నా సహచర ఆటగాళ్ల పట్ల నాకు కృతజ్ఞతాభావం ఉంటుంది. మేమంతా కలిస్తే జట్టు. కాబట్టి గెలుపోటములలో అందరికీ సమాన భాగం ఉంటుంది’’ అని తెలిపాడుడ్రెసింగ్రూమ్ వాతావరణంఅదే విధంగా.. ‘‘మ్యాచ్కు ముందు ఒత్తిడి ఉండటం సహజం. అప్పుడు మా టీమ్మేట్ ఆశిష్ శ్రీవాస్తవ్ మమ్మల్ని కూల్ చేస్తాడు (నవ్వులు). ఇక మా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కాబట్టి మా జట్టు ఛేజింగ్లో మరింత గొప్పగా రాణించగలదని చెప్పగలను. మా ఆల్రౌండర్ హరీశ్ ఠాకూర్ ఏడో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయగలడు.గత మ్యాచ్లో కూడా మేము బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ 8-9 తొమ్మిది బంతుల్లో వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆటలో ఇవన్నీ సహజం. మేము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాము. ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నా.ఇక కెప్టెన్గా జట్టును సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించడం అత్యంత ముఖ్యం. గత పదిహేనేళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నా. మా జట్టు సభ్యుల సందేహాలు తీర్చడం, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలు మార్చడం నా విధి. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే నా లక్ష్యం. యాజమాన్యం మాపై ఒత్తిడి పెట్టదు. టీజీ20 ద్వారా మాకు మంచి ప్లామ్ఫామ్ దొరికింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని తన్మయ్ అగర్వాల్ పేర్కొన్నాడు.చదవండి: కరీంనగర్పై నల్గొండ గెలుపు -
రాణించిన నితీశ్ రెడ్డి.. కరీంనగర్పై నల్గొండ గెలుపు
టీజీ20 లీగ్ 2026లో నల్గొండ నైట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్ 24) రాత్రి జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కరీంనగర్ డైమండ్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్వర్త్ లూయిస్ పద్దతిలో).వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు.. నల్గొండ బౌలర్లు వరుణ్ గౌడ్ (2-0-8-3), రక్షణ్ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ్ ఖాన్ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది.కరీంనగర్ ఇన్నింగ్స్లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా ప్లేయర్లలో షరన్ (15), షుభమ్ శర్మ (20), హరిశ్ ఠాకూర్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం లక్ష్య ఛేదనకు ముందు వరుణుడు మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. ఛేదనలో నల్గొండ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా, నితీశ్ రెడ్డి (52), దివేశ్ సింగ్ (36 నాటౌట్) బాధ్యతాయుంగా ఆడారు. నితీశ్ నల్గొండను గెలుపు తీరాలకు చేర్చిన తర్వాత ఔట్ కాగా.. దివేశ్, అర్ఫాజ్ ఖాన్ (6 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో 18 బంతులు మిగిలుండగానే నల్గొండ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
కరీంనగర్పై నల్గొండ గెలుపు
కరీంనగర్పై నల్గొండ గెలుపుటీజీ20 లీగ్ 2026లో నల్గొండ నైట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్ 24) రాత్రి జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కరీంనగర్ డైమండ్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్వర్త్ లూయిస్ పద్దతిలో). లక్ష్యం దిశగా సాగుతున్న నల్గొండవరుణుడు అంతరాయం కలిగించడంతో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. 10 ఓవర్ల తర్వాత నల్గొండ స్కోర్ 76-3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే మరో 42 బంతుల్లో 41 పరుగులు చేయాలి. చెలరేగిన రక్షణ్, వరుణ్.. స్వల్ప స్కోర్కే పరిమితమైన కరీంనగర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు.. నల్గొండ బౌలర్లు వరున్ గౌడ్ (2-0-8-3), రక్షణ్ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ్ ఖాన్ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్ ఇన్నింగ్స్లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. షరన్ (15), షుభమ్ శర్మ (20), హరిశ్ ఠాకూర్ (21) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కష్టాల్లో కరీంనగర్వర్షం అంతరాయం తర్వాత మ్యాచ్ తిరిగి మొదలైంది. వర్షానికి ముందే 9వ ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. అదే ఓవర్ చివరి బంతికి, మరుసటి ఓవర్ తొలి బంతికి మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత 14 ఓవర్ వరకు జాగ్రత్తగా ఆడిన కరీంనగర్.. 15వ ఓవర్ మూడో బంతికి మరో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. రక్షణ్ రెడ్డి బౌలింగ్లో షుభమ్ శర్మ (20) ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 102-6గా ఉంది. ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన కరీంనగర్కరీంనగర్ జట్టు 9వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. వరుణ్ గౌడ్ బౌలింగ్లో తొలుత సాత్విక్ రెడ్డి (1), ఆతర్వాత షరణ్ (15) ఔటయ్యారు. తొలి వికెట్ కోల్పోయిన కరీంనగర్.. 8 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?7.1వ ఓవర్- 61 పరుగుల వద్ద కరీంనగర్ తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న తన్మయ్ అగర్వాల్ (46) అర్ఫాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 62-1గా ఉంది.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నల్గొండటీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 23) రాత్రి జరుగుతున్న మ్యాచ్లో అనురాగ్ నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో నల్గొండ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు..నల్గొండ నైట్స్:రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, అనికేత్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను. కరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్


