Top Stories
ప్రధాన వార్తలు
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ ట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు.
May 16th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 16th AP Elections 2024 News Political Updates12:20 PM, May 16th, 2024గవర్నర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందంతాడేపల్లి :సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందంపోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుసీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్ను కలవనున్న నేతలుహింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్న వైఎస్సార్సీపీ బృందం12:00 PM, May 16th, 2024అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుఅనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు11:45 AM, May 16th, 2024టీడీపీ నాయకుడి దాష్టీకంకృష్ణా జిల్లా..ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు దాష్టీకంఫ్యాన్కు ఓటు వేసిందని మహిళను ట్రాక్టర్తో ఢీకొట్టిన టీడీపీ నాయకుడు ఏడుకొండలుఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణికి తీవ్ర గాయాలు.సంధ్యారాణి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలుపిన్నమనేని హాస్పిటల్కు తరలింపుహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంధ్యారాణిని పరామర్శించిన వల్లభనేని వంశీఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు 10:25 AM, May 16th, 2024ఎన్నికల హింసపై గవర్నర్కు ఫిర్యాదుఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదుఇవాళ సాయంత్రం రాజ్భవన్ వెళ్లనున్న వైఎస్సార్సీపీ బృందంమంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్ అబ్దుల్ నజీర్కు కలవనున్న వైఎస్సార్సీపీ బృందంపోలింగ్ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్కు వివరించే అవకాశంహింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్సీపీ నేతలు 9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్కు వైఎస్సార్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్లో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీపోలింగ్కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి
కవిత బయటకు వచ్చేనా?.. కాసేపట్లో బెయిల్పై విచారణ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ జరుగనుంది. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజైన కవిత బెయిల్ దొరుకుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్పై ఇదే ధర్మాసనం గత శుక్రవారం విచారించి ఈడీ సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు సౌత్ గ్రూప్ తరఫున కవిత ఆప్ అగ్ర నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్న కారణంతో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్ 11న ఆమెను అరెస్ట్ చేశాయి. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసుకున్న దరఖాస్తులను రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొట్టివేశారు. ఈ క్రమంలో ఈనెల 6న తీర్పునిచ్చారు. ఈ మొత్తం కుంభకోణంలో ఈమెదే ప్రధానపాత్ర అని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
‘CAA మోదీ గ్యారెంటీ.. ఎవరూ చెరపలేరు’
లక్నో: మోదీ వెళ్లిపోతే.. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఏఏ మోదీ గ్యారెంటీ అనిర, దానిని ఎవరూ తొలగించలేరని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్ అజాంఘడ్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మోదీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది. సీఏఏ(CAA) చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ. సీఏఏ కింద భారత పౌర సత్వం ఇవ్వడం మొదలైంది. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్లోనూ లక్షలమంది శరణార్థులు ఉన్నారు. వాళ్లందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్లిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మోదీ గ్యారెంటీని ఎవరూ చెరపలేరు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోంది. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్. మోదీ గ్యారెంటీ కశ్మీర్లోనూ కనిపిస్తోంది. కశ్మీర్లో శాంతికి గ్యారెంటీ ఇచ్చాం. కశ్మీర్లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయి. మోదీ వెళ్తే ఆర్టికల్ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నాల్గొ దశలో జరిగిన పోలింగ్లో శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఆజాంఘడ్ గురింంచి చర్చ వచ్చేది. స్లీపర్సెల్స్ గురించి చర్చ జరిగేది. సమాజ్వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్ గురించి ఆలోచించలేదు. ఆజాంఘడ్లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుంది అని ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోంది. 50 శాతం బడ్జెట్ను మైనారిటీలకు కేటాయించాలనుకుంటోంది. 70 ఏళ్లుగా హిందూ, ముస్లిం అంటూ మతాల పేరిట వాళ్లు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రామమందిర ప్రారంభం నాడు ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసింది. పేదల అభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా. మీ బాధలన్నింటిని తొలగిస్తున్నాం. వివిధ పథకాలతో పేదలను ఆదుకుంటున్నాం అని మోదీ తెలిపారు.
Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
‘‘క్రీడాకారులుగా మన కెరీర్కు కచ్చితంగా ఆఖరి తేదీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను నా ఆటలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడంపైనే ఎల్లప్పుడూ దృష్టి సారిస్తాను.కెరీర్ ముగిసి పోయిన తర్వాత.. ‘ఓహ్.. ఆరోజు నేను అలా చేస్తే బాగుండు.. ఇలా చేస్తే ఇంకా మెరుగ్గా ఉండేది’ అని పశ్చాత్తాపపడాలని అనుకోవడం లేదు. కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఎల్లకాలం గతం గురించే ఆలోచిస్తూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతీ పని ఇప్పుడే పూర్తి చేసుకుంటాను.పశ్చాత్తాపపడేందుకు ఏదీ మిగలనివ్వను. కచ్చితంగా నేను ఇది సాధిస్తాననే అనుకుంటున్నా’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.మీ కంటికి కూడా కనిపించనుఆర్సీబీ రాయల్ గాలా డిన్నర్ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత తాను చేయాలనుకుంటున్న పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మీ కంటికి కూడా కనిపించను(నవ్వుతూ).అందుకే ఇక్కడ ఉన్నంతసేపు నా శాయశక్తులా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తపిస్తున్నా. ఆ తపనే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2008లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.రికార్డుల రారాజుగా పేరొంది కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్లో ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అత్యధిక పరుగుల వీరుడుపదహారేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా గాయాల బెడదతో కోహ్లి జట్టుకు దూరం కాలేదంటే ఫిట్నెస్ మీద అతడికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 35 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో 13 మ్యాచ్లలో ఆడి 661 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి.. అత్యధిక పరుగుల వీరుడి(ఆరెంజ్ క్యాప్ హోల్డర్)గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఆర్సీబీ తమ ఆఖరి మ్యాచ్లో మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. కాగా బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేదన్న సంగతి తెలిసిందే.చదవండి: IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్ View this post on Instagram A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్ కేన్సర్ని జయించాడు!
కేన్సర్ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్ రిచర్డ్ స్కోలియర్ బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్ ..తన స్నేహితుడు ప్రొఫెసర్ జార్జినా లాంగ్ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్ ట్రయల్స్ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్ లాంగ్ అన్నారు. (చదవండి: 'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?)
కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
బంగారం ధరల మోత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 16) ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. నాలుగు రోజుల తగ్గుదలకు బ్రేకిచ్చి క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత ఎగిశాయి. తులం బంగారం రూ.700 పైగా పెరిగి రూ. 74,000 మార్కును దాటేసింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.700 పెరిగి ప్రస్తుతం రూ.67,850 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.770 పెరిగి రూ. 74,020 లను తాకింది.ఇతర నగరాల్లో ధరలుఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.68,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,170 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.770 పెరిగి రూ.74,020 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,950లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,130 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.770 పెరిగి రూ.74,020 లకు ఎగిసింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి ఏకంగా రూ.1500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్తీక్ తల్లి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది. ఈ విషాద వార్తను కమెడియన్ బుధవారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'అమ్మా.. గత ఐదు సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా దానిపై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్ధమే! కంటికి రెప్పలామమ్మల్ని కన్నావు.. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ, నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు.. ఎందుకమ్మా..? వారికి పాదాభివందనాలుమా అమ్మ కోసం ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాభివందనాలు' అని ఇన్స్టాగ్రామ్లో తన తల్లి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek)
దుశ్శాసన పర్వం.. అయ్యన్న అనుచరుల అరాచకం
రాత్రి వేళ జుత్తు పట్టుకొని లాక్కొచ్చారు.. కాళ్లతో తన్నుకుంటూ.. తాకరాని చోట తాకుతూ.. దుస్తులు చింపేశారు. అడ్డు వచ్చిన వారిని గాయపరిచారు. ఫోన్లు, ఒంటిపైనున్న బంగారు వస్తువులు లాక్కెళ్లారు. నర్సీపట్నంలో ఒంటరి మహిళపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచరులు జరిపిన దాష్టీకమిది. వలంటీర్గా సేవలందించడమే ఆమె చేసిన పాపమట.. వలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయడంతో రాజీనామా చేయడమే ఆమె తప్పట.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పనిచేయడమే ఆమె దోషమట.. అందుకే దుశ్శాశనుల్లా ఆమెను ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేశారు. ఈ ఘటనతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. గాంధీ గారి దేశంలో గజానికో గాంధారి కొడుకు తయారయ్యాడని.. వారికి అడ్డుకట్ట వేసేందుకు దశ ‘దిశ’ నిర్దేశించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నా.. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నవారన్నా ఎందుకంత కక్ష, కార్పణ్యం అని ప్రశ్నిస్తోంది.విశాఖ సిటీ : వలంటీర్లంటే వారికి ఒళ్లు మంట. సేవలతో ప్రజలకు దగ్గరవుతున్నారని, సీఎం జగన్ ప్రతినిధులుగా ప్రజలు వారిని ప్రేమిస్తున్నారని ద్వేషం. వారి వల్ల రాజకీయంగా తాము బలహీనపడుతున్నామని కడుపు మంట. అందులో మహిళా వలంటీరంటే మరింత చులకన. అందుకే నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో పూర్వ వలంటీర్ పొలమూరి రాజకుమారిపై మంగళవారం రాత్రి అయ్యన్నపాత్రుడి అనుచరులు కీచకపర్వానికి తెగబడ్డారు. రాజకుమారికి భర్త లేడు. 13 ఏళ్ల కుమారుడితో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వలంటీర్గా చేరారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా మనసారా సేవలందించారు. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టమన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనస్తాపం చెంది రాజీనామా చేశారు. ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించారు. పోలింగ్ రోజున ఓటర్లకు స్లిప్లు రాసిచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేయడం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. అదే గ్రామానికి చెందిన టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ అనుచరులు రెడ్డి రాజేష్, రెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి శివ, సుకల రాజే‹Ùతో పాటు మరికొందరు రాజకుమారిని టార్గెట్ చేశారు. తప్పిన ప్రాణాపాయం పోలింగ్ మరుసటి రోజు మంగళవారం రాత్రి రాజకుమారి పడుకునేందుకు తన 13 ఏళ్ల కుమారుడిని వెంట పెట్టుకొని అదే గ్రామంలో ఉన్న అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ మూకలు రెడ్డి రాజేష్ రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్ పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు వారి ఇంటి మీదకు ఎగబడ్డారు. రాజకుమారిపై దాడి చేశారు. వారి చర్యలను ఆమె సెల్ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయతి్నంచడంతో ఆమె చేతిలో ఉన్న మొబైల్ను లొక్కొని జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. ఛాతి మీద చేయి వేసి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆమె ఒంటి మీద బట్టలను చించేసి వివస్త్రను చేశారు. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. రాజకుమారిపై దాడిని అడ్డుకోవడానికి స్థానిక యువకులు, మహిళలు ప్రయత్నించారు. టీడీపీ నేతలు వారిపై కూడా దాడి చేసి గాయపరిచారు. దీంతో ఒమ్మి గోవింద, గజ్జల గోపీచంద్, వియ్యపు వరహాలు, గుమ్మిడి సీతమ్మలకు కూడా గాయాలయ్యాయి. రాజకుమారిని రక్షించడానికి ప్రయత్నించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై గట్టిగా కొట్టి ఆమె బంగారు చెవి దుద్దులు లాక్కొని వెళ్లిపోయారు. ఒంటరిగా ఉంటే చంపేసే వారని, అమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డానని రాజకుమారి చెప్పారు. ఈ ఘటనపై ఆమె నర్సీపట్నం రూరల్ పోసులకు ఫిర్యాదు చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
ప్రేగ్: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. అయితే ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని, ప్రాణాపాయ స్థితి తప్పిందని ఆ దేశ ఉప ప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్ తరాబా మీడియాకు తెలిపారు.దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో నిన్న మధ్యాహ్నాం ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. సమావేశ ముగిశాక బయటకు వచ్చిన ఆయన.. అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఈలోపు ఓ వృద్ధుడు ఆయనపై కాల్పులు జరుపుతూ మెరుపు దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 ఆ వెంటనే ఆలస్యం చేయకుండా ప్రధాని ఫికోను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. బన్స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రిలో ఫికోను సర్జరీ జరిగింది. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని, ప్రధాని కడుపులో బుల్లెట్లు దిగి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024ఇక కాల్పులకు సంబంధించి స్పాట్లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. నిందితుడ్ని జురాజ్ సింటులా(71)గా నిర్ధారించారు. అయితే దాడికి ఎందుకు పాల్పడ్డాడనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబర్ట్ ఫికో గురించి.. 1964 చెకోస్లోవేకియాలో రాబర్ట్ ఫికో జన్మించారు.ఫికోకు భార్యా, కొడుకు ఉన్నారు. ఫికో రష్యా అనుకూలవాది. ఉక్రెయిన్ యుద్ధం నుంచి పుతిన్కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నాలుగో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై.. 1992లో డెమొక్రటిక్ లెఫ్ట్ పార్టీ తరఫున తొలిసారి పార్లమెంట్కు ఎన్నికయ్యాడు. 1990లో.. యూరోపియన్ మానవ హక్కుల సంఘాలకు స్లోవేకియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1999లో.. స్మెర్(Direction – Social Democracy) పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ పార్టీకి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 2006 నుంచి 2010 దాకా, ఆపై 2012 నుంచి 2016, 2016 నుంచి 2018 ప్రధానిగా పని చేశారు. 2014లో అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసి ఓడారు.ఈయన హయాంలోనే స్లోవేకియా నాటోతో పాటు యూరోపియన్ యూనియన్లో సభ్య దేశంగా మారింది. అధికారంలో ఉండగా.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కారనే విమర్శ ఒకటి ఫికోపై బలంగా వినిపిస్తుంది. జర్నలిస్టులపై దాడులు చేసేందుకు క్రిమినల్ గ్యాంగ్లను సైతం ప్రొత్సహించారనే అభియోగాలు ఆయనపై నమోదు అయ్యాయి కూడా. అధికారం కోసం సిద్ధాంతాలు మార్చుకునే అవకాశవాదంటూ ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శిస్తుంటాయి. స్లోవేకియా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ జాన్ కుసియాక్తో పాటు అతనికి కాబోయే భార్య హత్య కేసు దుమారం రేపడంతో.. 2018లో ఫికో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన ఫికో.. కిందటి ఏడాది జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రష్యా అనుకూలవాదం, అమెరికా వ్యతిరేక నినాదాలతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. ఆ సమయంలో తాను అధికారంలోకి వస్తే.. ఉక్రెయిన్కు మిలిటరీ సాయం అందించడం ఆపేస్తానని చెబుతూ.. ఈ యుద్ధ సంక్షోభానికి నాటో, అమెరికాకే కారణమంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ హింస స్లోవేకియాకు కొత్తేం కాదు. అందుకే ఆ దేశ ప్రజలకు ప్రధానిపై జరిగిన దాడి పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు.
తప్పక చదవండి
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- ‘వర్జిన్ ఓటర్’గా మిగలకండి!
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- క్యాన్సర్తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
- ‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
- గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
సినిమా
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి కేన్స్కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్లో పింక్ లుక్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరొసారి వాయిదా.. కారణం ఇదే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్ తెలిపింది.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్ నుంచి సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు చెందిన ప్రొడక్షన్ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Manikarnika Films Production (@manikarnikafilms)
సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
సన్నీలియోన్ బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. మే 13న తన 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఆమె అభిమానులు సైతం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానాలు చేశారు. అలా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన యువకులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్నీలియోన్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి అక్కడ వారందరూ కేక్ కట్ చేశారు. ఈ యువకుల బృందం తమను తాము కర్కల్లి బాయ్స్ అని పిలుస్తారు. సన్నీ పుట్టినరోజును ఎందుకు జరుపుకున్నారో కూడా వారు చెప్పుకొచ్చారు. సన్నీ చేస్తున్న సామాజిక సేవతో పాటు ఆమెలో ఉన్న దాతృత్వమే తమను అభిమానులుగా మార్చిందని వారు తెలిపారు. కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చిందని వారు గర్తుచేశారు. ఆమె నటించిన గత సినిమాలు ఎలా ఉన్నా సరే సన్నీలో సేవా గుణం ఉంది. భారత్పై గౌరవంతో ఇక్కడే ఉంటుంది. అందుకు తగ్గట్లు తన జీవితాన్ని మార్చుకుంది. ఇక్కడి ప్రజల్లో మమేకమైంది. ఇక్కడి ప్రజలకు ఆమె ఎంతో సాయం చేస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి..? అంటూ వారు సన్నీ లియోన్ గురించి చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ తెలిపింది. దీంతో టీమ్ఇండియాకు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? లేదా కొత్త కోచ్ వస్తారా..? అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందుకు అర్హతలు, బాధ్యతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో తమ వివరాలు నింపాలని తెలిపింది.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అందరికీ అందుబాటులో వెబ్సైట్ను బీసీసీ ఉంచింది. దీంతో చాలామంది నెటిజన్లు సరదాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్స్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పడంలేదు.అయితే, టాలీవుడ్ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కానీ, తన దరఖాస్తును బీసీసీఐ రిజక్ట్ చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ అప్లికేషన్ను నింపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో తనకు చాలా సరదాగా అనిపించిందని ఆయన అన్నారు. ' నేను ఒకసారైనా టీమ్ఇండియాకు హెడ్ కోచ్గా ఉండాలనుకుంటున్నాను.' అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. I thought it’d be fun to just fill up the form and submit it for the heck of it. Thought I could tell my kids someday that “you know, I was in the running to be Head Coach of Team India once.” But… ☹️☹️ pic.twitter.com/b54ochsyhQ— Rahul Ravindran (@23_rahulr) May 15, 2024
ఫొటోలు
151 కంటే ఎక్కువ సీట్లు.. ఏపీ ఫలితాలపై సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్ (ఫొటోలు)
Anasuya Birthday Photos: ఫ్యామిలీతో అనసూయ బర్త్డే సెలబ్రేషన్స్.. రంగమ్మత్త డ్రెస్పై ట్రోల్స్ (ఫోటోలు)
స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటున్న శుభ్ర అయ్యప్ప (ఫోటోలు)
ఒకే ఒక్కడు.. పుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటన (ఫొటోలు)
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
క్రీడలు
Sunil Chhetri: భారత ఫుట్బాల్ దిగ్గజం కీలక ప్రకటన
భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను. దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.రొనాల్డో, మెస్సీ తర్వాత..1984, ఆగష్టు 3న సికింద్రాబాద్లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్బాలర్గా కెరీర్ మొదలుపెట్టాడు.ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్గా ఎదిగాడు.మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ఫుట్బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం. అందుకున్న పురస్కారాలు👉అర్జున అవార్డు👉పద్మశ్రీ👉ఖేల్రత్న👉ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు👉శాఫ్ చాంపియన్షిప్లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీచదవండి: Sunil Chhetri Life Story In Telugu: సికింద్రాబాద్లో పుట్టిన ఛెత్రీ.. కుటుంబ నేపథ్యం ఇదే! కెప్టెన్ ఫెంటాస్టిక్గా ఘనతలు
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు.
సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
క్రిమినల్ కేసు నుంచి నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానేకు హైకోర్టు లో పెద్ద ఊరట లభించింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు విధించిన 8 ఏళ్ల జైలు శిక్షను పటాన్ హైకోర్టు రద్దు చేసింది.నేపాల్ మాజీ కెప్టెన్ లమిచానే 2022 ఆగస్టు 21న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఖాట్మండు కోర్టు అతనికి రూ. 3 లక్షలు జరిమానా, మరో రూ. 2 లక్షలు బాధితురాలికి పరిహారంతో పాటు 8 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.బెయిల్పై బయటికి వచ్చిన లమిచానే కేసును బుధవారం విచారించిన హైకోర్టు కింది కోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 23 ఏళ్ల లమిచానే నేపాల్ తరఫున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టి20లు ఆడి 98 వికెట్లు తీశాడు. వరల్డ్కప్ జట్టులోఇక సందీప్ లమిచానే నిర్దోషిగా తేలడంతో అతడు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే నేపాల్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.
బిజినెస్
వణికిస్తున్న వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఏప్రిల్లో ఆందోళన కలిగించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, సమీక్షా నెల్లో ఎగుమతుల విలువ కేవలం ఒక శాతం పెరిగి (2023 ఇదే నెలతో పోల్చి) 35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతుల విలువ ఇదే కాలంలో 10.25 శాతం ఎగసి 54.09 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ⇒ ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, పెట్రోలియం ప్రొడక్టులు, ఫార్మా ఎగుమతులు బాగున్నాయి. ⇒ విలువైన మెటల్స్ దిగుమతులు రెట్టింపై 3.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ⇒ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 20.22% పెరిగి 16.5 బిలియన్ డాలర్లుకు ఎగసింది. ⇒ 30 కీలక రంగాల్లో 13 వస్తు ఎగుమతుల్లో పెరుగుదలను నమోదుచేశాయి. వీటిలో కాఫీ, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, ప్లాస్టిక్, హస్తకళలు ఉన్నాయి.2023–24లో రికార్డు మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతుల మొత్తం విలువ 778.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఒక రికార్డు. ఇందులో వస్తు ఎగుమతులు 437.1 బిలియన్ డాలర్లు. సేవల ఎగుమతుల విలువ 341.1 బిలియన్ డాలర్లు. సేవలు ఇలా... తొలి అంచనాల ప్రకారం ఏప్రిల్లో సేవల ఎగుమతులు 29.57 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 25.78 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 16.97 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 13.96 బిలియన్ డాలర్లు. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుంది.. అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం కొంత సానుకూలంగానే ప్రారంభమైంది. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నాం. – సునిల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్..
ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్ తర్వాత బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్ రేట్లు 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్ సిటిజన్లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్ రేట్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్పై ఏకంగా 1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. తాజా రేట్లు ఇలా... కాల పరిమితి వడ్డీ(%) 7–45 రోజులు 3.546–179 రోజులు 5.5 180–210 రోజులు 6.0 211 రోజులు– ఏడాది 6.25 ఏడాది–రెండేళ్లు 6.80 రెండేళ్లు–మూడేళ్లు 7.00 మూడేళ్లు– ఐదేళ్లు 6.75ఐదేళ్లు– పదేళ్లు 6.50
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో తమకు జాయింట్ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్లో ప్రకటించింది. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది.
ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్లో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్ ఎండెడ్ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్ ఫండ్స్లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్ ఫండ్స్లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్నైట్ ఫండ్స్లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య ఆల్టైమ్ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది.
వీడియోలు
ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్
ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్
కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?
సాయంత్రం గవర్నర్ ను కలవనున్న YSRCP నేతల బృందం
రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
కూటమి గుండెల్లో ఓటమి భయం..
తిరుపతి అలిపిరి మెట్ల వద్ద తగలబడ్డ కారు
రెచ్చిపోయిన పచ్చమూకలు..BC నేత వెంకటేశ్వరులు ఇంటిపై రాళ్ళ దాడి
ఫ్యామిలీ
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్ కేన్సర్ని జయించాడు!
కేన్సర్ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్ రిచర్డ్ స్కోలియర్ బ్రెయిన్ కేన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్ ..తన స్నేహితుడు ప్రొఫెసర్ జార్జినా లాంగ్ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్ ట్రయల్స్ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్ లాంగ్ అన్నారు. (చదవండి: 'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?)
కిచెన్లోని ఈ వస్తువులతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
ఇంట్లో ఉన్నటువంటి వస్తువులుగానీ, తిను పదార్థాలు గానీ చాలారోజులు నిలువలేకుండా పాడవుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోతుంది. కానీ మనకు తెలియకుండానే కొన్నిరకాల టిప్స్తో చాలాకాలం మన్నికగా ఉండేట్లు చేయవచ్చు. మరవేంటో చూద్దాం!ఇలా చేయండి..అరకిలో వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. కప్పు సూజీ రవ్వను బాణలిలో వేసి, వేడెక్కిన తరువాత రవ్వలో వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. రవ్వ, వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి దించే యాలి. వెల్లుల్లి ముక్కలను రవ్వ నుంచి వేరుచేసి మిక్సీజార్లో వేసి పొడిచేసుకోవాలి. దీనిని పిండి జల్లెడతో జల్లించుకుని మెత్తని పొడిని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఇది ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లి పేస్టుకు బదులు ఈ పొడిని కావాల్సిన కూరల్లో వేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే తరచూ వెల్లుల్లి పొట్టు తీసి దంచే పని ఉండదు.అన్నం కొద్దిగా మాడినా, అడుగున మొత్తం మాడిపోయినా మిగతా అన్నం కూడా మాడు వాసన వస్తుంది. ఆ వాసనకు అన్నం తినబుద్ది కాదు. ఒక ఉల్లిపాయను తీసుకుని నాలుగు ముక్కలుగా తరగాలి. మాడిన అన్నం గిన్నె మధ్యలో నాలుగు ముక్కలను నాలుగు చోట్ల పెట్టి పదిహేను నిమిషాలపాటు మూతపెట్టి ఉంచాలి. పావు గంట తరువాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల మాడు వాసనపోతుంది. అన్నం ఉల్లిపాయ వాసన కూడా రాకుండా చక్కగా ఉంటుంది.ఇంట్లో అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు... తొక్క తీసి కొద్దిగా నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ఐస్ ట్రేలో వేసుకుని ఫ్రీజర్లో నిల్వ చేసుకోవాలి. ఈ అల్లం క్యూబ్స్ ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.స్ప్రే బాటిల్లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీస్పూను డిష్వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లుపోసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ΄్లాట్ఫాం, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే ఎటువంటి క్రిములు దరిచేరవు.సాల్ట్ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యం వేసి తరువాత సాల్ట్ వేయాలి. సాల్ట్లోని తేమను బియ్యం పీల్చుకుని సాల్ట్ను పొడిగా ఉంచుతుంది.ప్లాస్టిక్ రోల్ అతుక్కుని త్వరగా ఊడి రాదు. ఇటువంటప్పుడు అరగంటపాటు రోల్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి తరువాత ఓపెన్ చేస్తే అతుక్కోకుండా సులభంగా వచ్చేస్తుంది.
Beauty Tips: చర్మం కాంతివంతంగా మెరిసేలా.. ఈ బ్యూటీ టిప్స్!
దగదగా మెరిసే ముఖానికై చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఉన్న పసుపు, కొబ్బరిపాలు, రోజ్వాటర్తో ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చని మీకు తెలుసా! అయితే ఇలా ప్రయత్నించి చూడండి..ఇలా చేయండి..టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పీల్ పౌడర్, కప్పు రోజ్వాటర్, టీస్పూను కొబ్బరిపాలు, ఆరు చుక్కల నిమ్మనూనెను తీసుకుని ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్క్యూబ్స్ ట్రేలోపోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్క్యూబ్స్తో ఇరవై నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి.ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ను రాసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకు΄ోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ప్రకాశవంతంగా... తాజాగా కనిపిస్తుంది.చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య ఛాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
‘రైజ్ ఏ చైల్డ్’..! కొత్త తల్లులకు పెద్ద బాలశిక్ష..
పాపాయి నిద్రపుచ్చినంతసేపు కూడా పడుకోలేదు. భుజానికెత్తుకుని తిప్పి తిప్పి నిద్రపుచ్చి ఇలా మంచం మీద పెట్టానో లేదో వెంటనే లేచేసింది. ఈ బిడ్డతో నేనేం చేయను’ చంటిబిడ్డను పెంచే ప్రతి తల్లి నుంచి వినవచ్చే మాటే ఇది. ఆ తల్లి వెలిబుచ్చిన నిస్సహాయతలో అగాధం వంటి ఆవేదన దాగి ఉంటుంది. ఈపాట్లన్నీ పడిపాపాయిని ఆరు నెలలు పెంచేసరికి మెటర్నిటీ లీవ్ అయిపోతుంది.అప్పుడు మరో ప్రశ్న... ‘బిడ్డను కేర్ టేకర్ చేతిలో పెట్టి ఉద్యోగానికి వెళ్లవచ్చా. చక్కగా చూసుకోగలిగిన ఆయాలు దొరికితే బావుణ్ను’. బిడ్డకు ఘనాహారం ఎప్పుడు ఇవ్వాలో డాక్టర్లు చెబుతారు, కానీ ఎలా తినిపించాలనేది మాత్రం బిడ్డను పెంచిన అనుభవం ఉన్న తల్లులే చెప్పాలి. పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెలిసిందో గ్రామం. దాని పేరే ‘రైజ్ ఏ చైల్డ్’. ఎక్కడ ఉందీ గ్రామం. ఈ గ్రామం అడ్రస్ చెప్పాలంటే కేరాఫ్ డిజిటల్ మీడియా అని చెప్పాలి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు, నగరాల్లో అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పసిబిడ్డ అమ్మమ్మ, నానమ్మల చేతిలో పెరిగే అవకాశాలు తగ్గిపోయిన ఈ కాలంలో బిడ్డ సంరక్షణలో తల్లులకు ఎదురయ్యే సందేహాలను డిజిటల్ మాధ్యమం ద్వారా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. వివిధ ్రపాంతాల్లో ఉన్న తల్లులు ఇందులో జాయిన్ అయ్యారు. ‘క్వశ్చన్స్ అరౌండ్ బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ మదర్స్, బేబీ లెడ్ వీనింగ్, గుడ్ షెడ్యూల్ ఫర్ బేబీస్, క్లాత్ డయాపరింగ్ ఇండియా, ఫస్ట్ ఫార్టీ డేస్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్’ వంటి పది గ్రూప్లను ఒక గొడుగు కిందకు తీసుకువస్తూ ‘రైజ్ ఏ చైల్డ్’ పేరుతో ఒక వర్చువల్ విలేజ్కి రూప కల్పన చేసింది రోహిణి అనే మహిళ.‘‘నిజానికి నాకెదురైన సమస్యలే ఈ వర్చువల్ విలేజ్ రూపకల్పనకు నాంది. గర్భధారణ, ప్రసవం 30 ఏళ్లలోపు జరగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలలో స్థిరపడిన తరవాతనే పెళ్లి. దాంతో పిల్లలను కనే వయసు దాటిపోతోంది. నేను 32 ఏళ్ల వయసులో గర్భం దాల్చాను. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ రోజువారీ ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం మళ్లీ డాక్టర్ చెకప్ వరకు ఆగలేం.అప్పటికీ రోజూ ఫోన్ చేసి అమ్మ, అత్తగారిని అడిగి తెలుసుకుంటున్నప్పటికీ నేను సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నానా లేదా అనే సందేహం. పాత తరం వారి అనుభవంతోపాటు కొత్తతరంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో సోషల్ మీడియాలో ఇన్ని వేదికలున్నాయని తెలిసింది. ఆ గ్రూప్ల అడ్మిన్లందరితో మాట్లాడి అన్నింటినీ ‘రైజ్ ఏ చైల్డ్’ గొడుగు కిందకు తీసుకువచ్చాను. గర్భిణులకు, కొత్త తల్లులకు ఇది ఒక వరంగా మారింది. ఇది మనదేశంలో ఉన్న వాళ్లకే కాదు, విదేశాల్లో ఉన్న మనవాళ్లకు కూడా ఉపయోగపడుతోంది. నిజానికి మనకంటే వాళ్లకే ఎక్కువగా ఉపయోగపడుతోంది.ఎందుకంటే ఐర్లాండ్లో ఉన్న ఒక మహిళ అక్కడి వైద్యవిధానాలు, వైద్యుల సూచనను యథాతథంగా పాటించింది. కానీ ఆ పద్ధతులుపాపాయికి సౌకర్యంగా అనిపించడం లేదని తెలిసి ‘రైజ్ ఏ చైల్డ్’లో చేరింది. చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒకరు తమ సమస్యనుపోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు’’ అని వివరించింది రోహిణి. రైజ్ ఏ చైల్డ్ మొత్తానికి కొత్త తల్లులకు పెద్దబాలశిక్ష అయింది. "ఇందులో ఒకరు తమ సమస్యను పోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు".
న్యూస్ పాడ్కాస్ట్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో వన్స్మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
క్రైమ్
ప్రేమించి పెళ్లాడి.. ఆత్మహత్య
సాక్షి బళ్లారి/ హుబ్లీ: ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న నవ దంపతులు ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ విధి మరోలా తలచింది. అంతు తెలియని సమస్యలతో ఆ జంట ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విజయపురలో చోటు చేసుకుంది. వివరాలు.. విజయపుర నగరంలోని సిద్దేశ్వర బడావణెలో నివాసం ఉంటున్న మనోజ్కుమార్ పోలా (30), రాఖీ (23) అనే యువతీ యువకులు ప్రేమలో పడ్డారు. నాలుగు నెలల క్రితం పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకొన్నారు. మనోజ్ తల్లి ఇంట్లోనే ఇద్దరూ కాపురం పెట్టారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని మంగళవారం రాత్రి ఇద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మనోజ్కుమార్ తల్లి ఊరికి వెళ్లి బుధవారం ఉదయమే తిరిగి రాగా ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనపై జలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలే కారణం కావచ్చని స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులు దుర్మరణం
బోనకల్(ఖమ్మం): కుమారుడికి వద్దకు వెళ్తున్న వృద్ధ దంపతులకు అదే ఆఖరి ప్రయాణమైంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ(92) డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య రుక్మిణి(85)తో మధిరలోనే స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వృద్ధాప్యం కారణంగా వారి సంరక్షణ కోసం ఒకే కేర్టేకర్గా నియమించడంతో కుమారుల వద్ద కొన్నేసి రోజుల చొప్పున ఉంటున్నారు. బుధవారం మధిరలోని ఇంటి నుంచి ఖమ్మంలో ఉంటున్న పెద్దకుమారుడు వద్దకు మనవడు కొత్తూరు అనిల్, కేర్టేకర్ నాగరాజుతో కలిసి వెళ్తున్నాడు. కారును అనిల్ నడుపుతున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.ఈ ఘటనలో సూర్యనారాయణ, రుక్మిణి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మనుమడు అనిల్, కేర్టేకర్ నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు లాక్ పడి ఉండడంతో తలుపులు పగులగొట్టి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. కారు తలుపులను పగలగొట్టడంలో ఏమాత్రం ఆలస్యమైనా లోపల ఉన్న వారంతా మంటల్లో కాలిపోయే వారని తెలిసింది.
పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
వెంగళరావునగర్: పెంపుడు కుక్క అరచిందని పెద్ద గొడవే జరిగింది. ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి చితకబాదారు కొందరు. తన తమ్ముడితో పాటు మరదలును, కుక్కను హత్య చేయబోయారంటూ ఓ వ్యక్తి మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహమత్ నగర్ లో నివాసం ఉండే ఎన్. శ్రీనాధ్, అతని భార్య స్వప్నలు ఈ నెల 8వ తేదీనాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ్ అనే వ్యక్తి భార్య భర్తలను దుర్భాషలాడాడు. ఈ విషయంపై నాడు మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సాయంత్రం శ్రీనాధ్ కుక్కతో బయటకు రాగా ధనుంజయ్ అనే వ్యక్తితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనాధ్ ను, అతని భార్య స్వప్నతో పాటుగా మేనల్లుడు, కోడలును, కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో, రాడ్లతో కొట్టారు. దాంతో శ్రీనాథ్ అపస్మారకస్థితికి వెళ్లాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్.మధు మధురానగర్ పీఎస్ లో ఎల్. మధుతో పాటు మరో నలుగురిపై హత్యయత్నం కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత
‘అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్క సారిగా దఢేల్ మని పే..ద్ద శబ్ధం.. కళ్లు తెరిచి చూసేలోగా మంటలు.. నిప్పు రవ్వలు మీద పడి అంటుకుంటున్న దుస్తులు.. కేకలు, అరుపులు.. కాపాడండని ఆర్తనాదాలు.. కిటికీ అద్దాలు పగులగొట్టి కొందరు.. డోర్ తెరుచుకుని మరికొందరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు అక్కడికక్కడే క్షణాల్లో కాలి బూడిదయ్యారు.. అంతా కలలోలాగా జరిగింది. నిజంగా కల అయితే బాగుండు’ అని ఆ ప్రమాదం నుంచి బయట పడిన వారుఅంటున్నారు. వారింకా షాక్ నుంచి తేరుకోలేదు.చినగంజాం/చిలకలూరిపేట : ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న చినగంజాం, చీరాల వాసులు నలుగురు, రెండు వాహనాల డ్రైవర్లు మృత్యువాత పడ్డారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంకో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓటేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటున్న చాలా మందికి పర్చూరు నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. దీంతో పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి, ఆదివారం రాత్రి వారిని పర్చూరుకు తరలించారు. ఇందులో భాగంగా చినగంజాంకు చెందిన ఓటర్లు సైతం హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరంతా సోమవారం ఓట్లు వేసి, మంగళవారం రాత్రి ఏలూరు సాంబశివరావు ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు. చినగంజాంకు చెందిన 42 మంది చీరాలకు చెందిన ట్రావెల్స్ బస్సు (ఏపీ 27 టీటీ 6577)లో రాత్రి 11 గంటలకు బయలు దేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ బస్సు.. పల్నాడు జిల్లా ఈవూరుపాలెం వద్ద ఎదురుగా కంకర మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ (ఆర్జే 23 జీసీ 2452)ను ఆయిల్ ట్యాంక్ వద్ద బలంగా ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు టిప్పర్, ఇటు బస్సుకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బస్సులో బ్యాటరీ ఫెయిల్ అవడంతో చీకటి అలముకొంది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తప్పించుకొని వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో బస్సు డోర్ వద్ద ఉన్న చినగంజాంకు చెందిన యువకుడు సింగోతు సాయి కేకలు వేస్తూ ప్రయాణికులను నిద్ర లేపాడు. చాలా మంది ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ డోర్ ద్వారా బయటకు రాగా, మరికొంత మంది కిటికీ అద్దాలను పగులగొట్టి, అత్యవసర ద్వారాన్ని తెరచుకొని బయటకు దూకేశారు. అప్పటికే మంటలు అంటుకొని కొందరు ప్రయాణికులు హృదయ విదారకంగా కేకలు పెట్టారు. ఈ లోగా మంటలు భారీగా చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు నలుగురు బస్సులోనే కాలి బూడిదయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు..ఉప్పుగుండూరి కాశీ బ్రహ్మేశ్వరరావు, అతని భార్య లక్ష్మీ బస్సు వెనుక భాగంలో కూర్చొన్నారు. వీరు వృద్ధులు కావడంతో త్వరగా బయట పడలేకపోయారు. పైగా మనవరాలు ఖ్యాతి సాయి నిద్రలో ఉండటంతో ఆ పాపను లేపి.. బయటకు రాలేకపోయారు. అంతలోనే మంటలు చుట్టు ముట్టడంతో తప్పించుకోలేని స్థితిలో ఆహుతై ప్రాణాలు విడిచారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి భావన హైదరాబాద్లో, చిన్నమ్మాయి పూజ ఒంగోలులో ఉంటున్నారు. ఓటు వేసేందుకని పెద్ద కుమార్తెతో కలిసి నీలాయపాలెం వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి చిన్న కుమార్తె కూతురు ఖ్యాతి సాయిని వెంట తీసుకుని చినగంజాం నుంచి టీడీపీ వారు ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు. పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న దావులూరి శ్రీను కూడా ఓటు వేసేందుకే వచ్చారు. 20 మంది క్షతగాత్రులు చినగంజాం వాసులేదుర్ఘటనలో గాయపడిన 30 మందిని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెందిన 108 వాహనాల ద్వారా చిలకలూరిపేట ఏరియా ఆçస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎన్.కీర్తి, కె.వెంకటరావు, సీహెచ్.శంకర్రావు, ఎన్.రాజ్యలక్ష్మి, ఎస్.కళావతి, డి.భువన, సీహెచ్.ఆదిలక్ష్మి, పి.లక్ష్మి, కె.లిప్సికను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరో 20 మందికి ప్రా«థమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. క్షతగాత్రుల్లో 20 మందికి పైగా చినగంజాం మండల వాసులే. మృతి చెందిన పాప పెద్దమ్మ భావన తన వారిని రక్షించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలైంది. శరీరం బాగా కాలిపోవడంతో గుంటూరులో చికిత్స పొందుతోంది. కడవకుదురుకు చెందిన తాటి రాజీ (సాఫ్ట్వేర్), గొల్లపూడి ఉదయభాను(సాఫ్ట్వేర్), చినగంజాంకు చెందిన తాటి సాయిలక్ష్మి (సాఫ్ట్వేర్), మమత (కోచింగ్), అడివీధిపాలెంకు చెందిన రాయని బాలాజీ (ఫొటోగ్రాఫర్), పెదసింగు నాగరాజు, పెదసింగు తిరుపతమ్మ, పెదసింగు నాగరాజు కుమారుడు ఈశ్వరసాయి, కుమార్తె జస్వంతి, బొమ్మిడి మాలతి, గొనసపూడికి చెందిన కందిమళ్ల తేజీ, యలమల ఆకాష్, నీలాయపాలెంకు చెందిన దంపతులు అంజిబాబు, సామినేని సింధూజ, చినగంజాం అంబేడ్కర్ నగర్కు చెందిన బొలిమెర సుధాకర్, మేడికొండ చినఅంకయ్య, అతని భార్య సౌజన్య, కుమార్తె అక్షయ, బడుగు సంజన తదితరులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల వివరాలివీ..ఈ దుర్ఘటనలో చీరాలలోని పేరాలకు చెందిన బస్సు డ్రైవర్ షేక్ మస్తాన్ షరీఫ్ (47), టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్కు చెందిన హరిసింగ్ (39), బస్సులో ప్రయాణిస్తున్న చినగంజాం మండలం నీలాయపాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉప్పుగుండూరు కాశీబ్రహ్మేశ్వరరావు (65), ఉప్పుగుండూరు లక్ష్మీ(55), వీరి మనవరాలు ఒంగోలు పట్టణానికి చెందిన బొప్పిరాజు ఖ్యాతి సాయి (9), చినగంజాం మండలం గోనెపూడి గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసరావు (54) సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిందిలా..చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం డొంక సమీపానికి బస్సు రాగానే, అదే సమయంలో పసుమర్రు వైపు నుంచి గ్రావెల్తో కూడిన టిప్పర్ ( చీరాల వైపు వెళుతూ) ఎదురుగా వస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో రోడ్డు మార్జిన్ కనిపించక వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొంది. టిప్పర్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ దిగినప్పటికీ, బస్సు వేగంగా వెళ్లి టిప్పర్ లారీకి ఉన్న డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ జి.రవికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా∙స్థలం వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి రజినిరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పోలీస్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి, గుంటూరు ఎస్పీ తుషార్ డూడి, నరసరావుపేట డీఎస్పీ వర్మ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించి ప్రభుత్వం నుంచి తగు సహాయం అందేలా చూస్తామని మంత్రి రజిని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై నరసరావుపేట డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ.. బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నామని, డ్రైవర్లు మద్యం సేవించారా లేదా అనే విషయం ల్యాబ్ రిపోర్టుల తర్వాత తెలుస్తుందని చెప్పారు. చిట్టితల్లికి అప్పుడే నూరేళ్లు నిండాయిఒంగోలు టౌన్: ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఉంటున్న సుబ్బారావు, పూజ దంపతుల గారాల పట్టి, ఏకైక పుత్రిక ఖ్యాతి సాయి. పెద్దయ్యాక పెద్ద డాక్టరై మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాపకు ఖ్యాతి అని పేరు పెట్టుకున్నారు. ప్రాణంగా పెంచుకున్నారు. చిట్టి తల్లిని చూసి మురిసిపోయారు. స్కూలులో మీ పాపే ఫస్ట్ అని టీచర్లు చెప్పిన మాటలు విని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాపకు మంచి చదువులు చదివించుకోవచ్చని దర్శి మండలం వీరాయపాలెం నుంచి ఒంగోలుకు వచ్చి ఉంటున్నారు. నగరంలోని లంబాడిడొంకలో ఒక స్కానింగ్ సెంటర్లో సుబ్బారావు పీఆర్ఓగా, పూజ రిసెప్షనిస్టుగా పని చేస్తున్నారు. ఇద్దరి సంపాదనతో ఖ్యాతిని బాగా చదివించుకోవాలని కలలు కన్నారు. అయితే విధి వక్రీకరించింది. కన్నకూతురు కాలి బూడిదైందన్న వార్త విన్న ఆ దంపతుల గుండె పగిలిపోయింది. గుండెలవిసేలా రోధించారు. స్కూలుకు సెలవులు కావడంతో అవ్వా తాతల వెంట హైదరాబాద్కు పంపారు. ఖ్యాతి ఇక లేదన్న వార్త విని చుట్టుపక్కల వారంతా కంట నీరు పెట్టుకున్నారు. పాప తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.