భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి.. | - | Sakshi
Sakshi News home page

భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి..

Aug 3 2023 1:42 AM | Updated on Aug 3 2023 10:16 AM

- - Sakshi

నల్గొండ: వ్యసనాలకు బానిసలైన యువ జంట.. ఓ అమాయకుడిని మోసగించి రూ.30 లక్షలు కాజేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకవీడు మండలం గూడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన సట్టు నారాయణ నేరేడుచర్లకు చెందిన గడ్డం భారతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

నారాయణ క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడుతుంటాడు. వీరి అవసరాలకు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు డబ్బు అవసరం కావడంతో అదే గ్రామానికి చెందిన దొంగల సతీష్‌ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసానికి తెరలేపారు. నారాయణ తన భార్య భారతిని సంధ్య అనే పేరుతో సతీష్‌కు పరిచయం చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో సతీష్‌ వద్ద నుంచి డబ్బులు కాజేయడం మొదలు పెట్టారు.

సతీష్‌ను బెదిరించి నాలుగేళ్లుగా సుమారు రూ.30 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన సతీష్‌ పోలీసులను ఆశ్రయంచాడు. జరిగినదంతా పోలీసులకు వివరించి నారాయణ, భరతిలపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పిట్టిన పోలీసులు బుధవారం వారిని మిర్యాలగూడ వద్ద అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.13వేల నగదు, బైక్‌ ఇతర సామగ్రి స్వాధీనపరుచుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ లింగయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement