
ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి టెన్షన్ మొదలైంది. ఎన్నికల్లో ఒంటరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక మరోసారి పొత్తులపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్తో కలిసి బీజేపీని ఒప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీరి భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపైనే చర్చ జరిగింది. ప్రస్తుతం తమకున్న బలం పూర్తిస్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వచ్చారు. దీంతో, పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను చంద్రబాబు ఆయనకు అప్పగించారు. పొత్తులో భాగంగా బీజేపీ అడిగినన్ని ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పాలని పవన్కు చంద్రబాబు సూచించారు.
ఇక, ఈసారి పొత్తుల అనంతరం తాము నమ్మకంగా ఉంటామని ఢిల్లీ బీజేపీ పెద్దలకు హామీ ఇవ్వాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టోకు కూడా సిద్దంగా ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. అలాగే, బీజేపీ సూచించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టేందుకు టీడీపీ రెడీగా ఉందని క్లారిటీ ఇచ్చినట్టు చెప్పాలన్నారు. తమతో పొత్తుకు బీజేపీ ఒకే అంటే మొదటి జాబితాలోనే బీజేపీ నేతల పేర్లను ప్రకటించేందకు సిద్ధంగా ఉన్నట్టు హైకమాండ్కు స్పష్టం చేయాలన్నారు.
మరోవైపు.. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే రాష్ట్రంలో ఉమ్మడి సభలు ఎక్కడెకక్కడ నిర్వహించాలనే అంశంపైన కూడా చర్చ జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోను తొందరగా విడుదల చేయాలని భేటీలో చర్చించారు. ఈ నెలలోనే కనీసం మినీ మేనిఫెస్టోను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన మధ్య మాత్రం చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఇక, వీరిద్దరూ దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.