
హీరో సూర్య 45వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. గతేడాదిలో పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. నటుడు ఆర్జే బాలాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

సూర్య- ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్కు 'కరుప్పు' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఏడాది చివరలో కరుప్పు విడుదల కావచ్చని సమాచారం. రేటియో జాకీగా కెరీర్ను ప్రారంభించిన ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన నటుడు, గాయకుడు మాత్రమే కాదు, దర్శకుడిగానూ కొలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘వీట్ల విశేషం’ అంటూ సత్యరాజ్తో ఓ మూవీ తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరో సూర్యతోనే ఛాన్స్ దక్కించుకుని హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు.