టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా ప్రకటించారు. త్రిశూలంతో ఉన్న ప్రత్యేక పోస్టర్ను షేర్ చేశారు. ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్.. త్రివిక్రమ్తో మరోసారి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మూవీని పురాణాల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు.
కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో అరవింద సమేత వీరరాఘవ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2018లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. తాజాగా వీరిద్దరు మరోసారి జతకట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ అరుదైన కాంబోలో మరో హిట్ కొడతారా టాలీవుడ్లో చర్చ మొదలైంది.
The Son of Shiva.
The Pride of Parvathi.
The Eternal Commander.
And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu— Jr NTR (@tarak9999) June 29, 2026


