హీరోయిన్ త్రిష పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్లు వస్తూనే ఉంటాయి. దశాబ్ద కాలంగా ఆమె పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్ల సంగతి పక్కనపెడితే, ఆమె జీవితంలో పెళ్లికి సంబంధించిన కీలక పరిణామం 2015లో జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్తో త్రిషకు 2014లో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని 2015 జనవరిలో త్రిష స్వయంగా వెల్లడించారు. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని నెలలకే జరగాల్సిన వివాహం రద్దయింది.
ఆ వ్యాపారవేత్త పెళ్లి తర్వాత త్రిష సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు కారణంగానే నిశ్చితార్థం రద్దయిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే దీనిపై త్రిష అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అనంతరం తాను సింగిల్గా, సంతోషంగా ఉన్నాననే సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆ తర్వాత టాలీవుడ్ రానా సహా పలువురు హీరోలు, ప్రముఖులతో త్రిషకు సంబంధాలు ఉన్నాయంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని ఖండిస్తూ తన కెరీర్పై దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో త్రిషతో తమిళ నటుడు, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ పేర్లను కలిపి పలు కథనాలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. వీటిలో కొన్ని వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నప్పటికీ త్రిష మాత్రం సంయమనం పాటిస్తూ, తనదైన శైలిలో స్పందిస్తున్నారు.


