విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'కెరూబ్' బాలు బల్లెకారి నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె నాయుడు (జీవన్) తీశారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకనిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఆహ్లాదకరమైన ప్రకృతిలో హీరో వేణువు వాయిస్తున్నట్లు ఇందులో చూపించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.


