వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

- - Sakshi

గుడివాడరూరల్‌: గుట్టు చప్పుడు కాకుండా గుడివాడలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై టూటౌన్‌ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు విటులను అరెస్ట్‌ చేసినట్లు గుడివాడ సీఐ బి.తులసీధర్‌ తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సత్యనారాయణపురంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడి చేశామని చెప్పారు.

నిర్వాహకురాలు పోతులూరి నాగ పుష్పావతి అలియాస్‌ శిరీషతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.1800 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిర్వాహకురాలు శిరీష 2018 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు పోలీసులకు పట్టుబడిందని వెల్లడించారు.

ఇప్పటికే ఆమైపె రౌడీషీట్‌ కూడా ఉందని వివరించారు. అరెస్టు చేసిన వారిని న్యాయమూర్తి వద్ద హాజరుపర్చనున్నట్లు తెలిపారు. డీఎస్పీ పి.శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్‌ చేసిన రైటర్‌ రమేష్‌, ముగ్గురు కానిస్టేబుల్స్‌ రామకృష్ణ, రాజేష్‌, హరిబాబులకు రివార్డులు అందచేశామని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ మురళీకృష్ణ, ఏఏస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top