సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ | Today Stock Market Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Jan 17 2024 3:46 PM | Updated on Jan 17 2024 6:55 PM

Today Stock Market Closing - Sakshi

Stock Market Closing Update: ఈ రోజు (బుధవారం) నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల భారీ నష్టంతో 71515.13 వద్ద, నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నేడు నష్టాల్లోనే ముగిసినట్లు స్పష్టమైంది. 

టాప్ గెయినర్స్ జాబితాలో HCL టెక్నాలజీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి టెక్నాలజీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయ. HDFC బ్యాంక్,  టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement