సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 544.39 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 78,639.03 వద్ద, నిఫ్టీ 390.70 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 24,774.30 వద్ద నిలిచాయి.
అర్బన్ కంపెనీ లిమిటెడ్, బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్, పైన్ ల్యాబ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


