దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కాస్త లాభాలతో పుంజుకున్నాయి.
నిఫ్టీ 0.04 శాతం లేదా 9.75 పాయింట్ల లాభంతో 24,624.65 వద్ద, సెన్సెక్స్ 152.05 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 78,581.00 వద్ద ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.18 శాతం, 0.7 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి.


