Kerala man loses Rs 40,000 to AI-based Deepfake WhatsApp fraud; Deets Inside - Sakshi
Sakshi News home page

AI: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..

Jul 20 2023 8:03 AM | Updated on Jul 20 2023 11:07 AM

AI Whatsapp video call scam - Sakshi

ప్రపంచం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న తరుణంలో కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అరంగేట్రం చేసింది. ఇది చాలా రంగాలకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించి కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కేరళ కోజికోడ్‌కు చెందిన 'రాధాకృష్ణన్‌' అనే వ్యక్తికి గుర్తుతెలియని ఒక నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని అతని మాజీ సహోద్యోగిని పోలి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తి అనుకుని సంభాషణ కొనసాగించాడు. మాట్లాడుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్న బంధువుకు సాయం చేయాలనీ రూ. 40,000 కావాలని అభ్యర్థించాడు.

ఏఐ డీప్‌ఫేకింగ్‌..
తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని వెంటనే రాధాకృష్ణన్‌ రూ. 40,000 పంపించాడు. ఆ తరువాత కొంతసేపటికి మళ్ళీ రూ. 35000 కావాలని అడిగాడు. దీంతో సదరు వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాలు వెల్లడించారు.

(ఇదీ చదవండి: ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!)

మోసానికి పాల్పడిన వ్యక్తి AI డీప్‌ఫేకింగ్‌ ఉపయోగించి డబ్బు తీసుకున్నట్లు, లావాదేవీలు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడికి డబ్బు తిరిగి అప్పగించినట్లు సమాచారం. కేరళలో ఇలాంటి చీటింగ్ వెలుగులోకి రావడం కేసు ఇదే మొదటిదని భావిస్తున్నారు. కావున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement