అగ్రరాజ్యంలో తెలుగు తేజం | Telugu woman received the Immigrant Achievement Award | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యంలో తెలుగు తేజం

Jul 17 2023 3:53 AM | Updated on Jul 17 2023 3:53 AM

Telugu woman received the Immigrant Achievement Award - Sakshi

తెనాలి: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యకు విశేష కృషి చేసినందుకు ఇమ్మిగ్రెంట్‌ అచీవ్‌మెంట్‌ అ­వార్డ్‌ అందుకున్నారు గుంటూ­రుకు చెందిన తెలుగు మహిళ నీలి బెండపూడి (59). అమె­రికాలోని ప్రతిష్టాత్మక పెన్సి­ల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ నీలి బెండపూడి గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో స­మా­వేశమైన వ్య­క్తి­గా వార్తల్లోకి వచ్చా­రు.

భార­తదేశంలోని గొప్ప విద్యా­ల­యా­లను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశా­లకు అవ­సరమైన సిఫార్సులను చేసే కోచర్‌గా ఆమె నియ­మితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ నీలి విశాఖపట్నంలో చదువు­కున్నారు. అక్కడినుంచే అమెరికా వెళ్లారు. ఆమె జీవిత విశేషాల్లో విశాఖ వాసి­గానే పేర్కొంటున్నారు. నిజానికి ప్రొఫెసర్‌ నీలి గుంటూరులో జన్మించారు. తల్లి దత్తావఝుల పద్మ, తండ్రి రమేష్‌. ఇద్దరూ ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేశారు. ఈ కారణంగా నీలి బీఏ, ఎంబీఏ వరకు చదువు మొత్తం అక్కడే సాగింది. 

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి..
ఉన్నత చదువుల కోసం 1986లో నీలి బెండపూడి అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సాస్‌లో మార్కెటింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అకడమిక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నైపుణ్యం సాధించి.. తాను విద్య అభ్యసించిన కాన్సాస్‌ యూని వర్సిటీలో ప్రొవోస్ట్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చాన్సలర్, స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌తో సహా అనేక అడ్మినిస్ట్రేటివ్‌ హోదాల్లో సేవలందించారు. ఓహియో స్టేట్‌ యూనివర్సిటీలో ఇనీషి యేటివ్‌ ఫర్‌ మేనేజింగ్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు.

అంతకుముందు హంటింగ్‌టన్‌ నేషనల్‌ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ కస్టమర్‌ ఆఫీ సర్‌గానూ విధులు నిర్వర్తించారు. అకాడమీ ఆఫ్‌ మార్కె టింగ్, అత్యుత్తమ మార్కెటింగ్‌ టీచర్‌ అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. 2018–21లో కెంటకీలోని లూయిస్‌విల్లే యూనివర్సిటీకి 18వ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2022 మే 10న పెన్సిల్వేనియా స్టేట్‌ వర్సిటీ 19వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక ‘ఇమ్మిగ్రెంట్‌ ఎచీవ్‌మెంట్‌’ అవార్డు అందుకు న్నారు. ప్రొఫెసర్‌ నీలి బెండపూడిని భారత్‌లోని ప్రముఖ వర్సిటీల్లో పరిశోధనను మెరుగుపరచి ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా 2 దేశాల మధ్య ఆరంభమైన కార్యక్రమానికి అవసరమైన సిఫార్సులను ప్రొఫెసర్‌ నీలి చేశారు. ఇందుకోసం ఆమె కోచర్‌గా నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement