ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద టీడీపీ లాయర్ల హంగామా  | Advocates came to file a house motion petition | Sakshi
Sakshi News home page

ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద టీడీపీ లాయర్ల హంగామా 

Sep 10 2023 5:28 AM | Updated on Sep 10 2023 5:28 AM

Advocates came to file a house motion petition - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు హంగామా సృష్టించారు. టీడీపీ న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి జడ్జిని కలిసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగారు.

చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ ఇచ్చేందుకు రాత్రి 12 గంటల సమయంలో టీడీపీ న్యాయవాదులు వెళ్లారు. పిటిషన్‌ తీసుకునేందుకు జడ్జి నిరాకరించారు. కోర్టుకే రావాలని సూచించారు. జడ్జి సూచనల మేరకు పోలీసులు న్యాయవాదులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో లాయర్లు పోలీసులతో గొడవకు దిగారు. జడ్జి చెప్పడం వల్లే తాము బయటకు వెళ్లాలంటున్నామని పోలీసులు చెబుతున్నా వినలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement