breaking news
parliament monsoon sessions
-
లోక్సభలో 12, రాజ్యసభలో 14
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమైంది మొదలు ఉభయసభలు ప్రతిరోజూ మాటల మంటలతో రగిలిపోయి గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశంతో తొలిరోజు నుంచే విపక్షసభ్యుల నుంచి తీవ్ర ఆందోళనలు, అభ్యంతరాలు వెల్లువెత్తినాసరే అధికార పార్టీ ఎట్టకేలకు ఈ వర్షాకాల సెషన్లో లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో 14 బిల్లులకు మోక్షం ప్రసాదించింది. ఐదేళ్లకు మించి శిక్షపడే స్థాయి నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులను పదవుల నుంచి తొలగించే మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఈ సెషన్ మొత్తంలోనే ఉధృతస్థాయిలో విపక్షనేతల నుంచి ప్రతిఘటన ఎదురైంది. మొత్తం సెషన్ ఆద్యంతం వాగ్వాదాలు, వాయి దాలు, వాకౌట్లతో కొనసాగింది. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లుల్లో ఆన్లైన్ గేమింగ్ ప్రచారం, నియంత్రణ బిల్లు–2025, ఆదాయపన్ను బిల్లు– 2025, జాతీయ క్రీడల నిర్వహన బిల్లు– 2025, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ), బిల్లు–2025, పన్నుల చట్టాల(సవరణ) బిల్లు– 2025, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ఐఐఎం(సవరణ) బిల్లు వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ల్యాండింగ్ బిల్లు–2025, సముద్రమార్గంలో సరకు రవాణా బిల్లు–2025, తీరప్రాంతంలో రవాణా బిల్లు–2025 14 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి.విలువైన కాలాన్ని కోల్పోయిన లోక్సభమొత్తం సెషన్లో లోక్సభ పలుమార్లు వాయిదా పడిన కారణంగా మొత్తంగా 84 గంటల పనిగంటలను కోల్పోయింది. 18వ లోక్సభలో ఇన్ని గంటలను వృథాగా కోల్పోవడం ఇదే తొలిసారి. జూలై 21న మొదలైన లోక్సభ మొత్తంగా 21 రోజులు సమావేశమైంది. కేవలం 37 గంటల 7 నిమిషాలు మాత్రమే లోక్సభ సజావుగా సాగిందని లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది.ఆన్లైన్ గేమింగ్ బిల్లు తర్వాత..ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించాక రాజ్యసభ సైతం నిరవధికంగా వాయిదాపడింది. విపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో మొత్తం సెషన్లో విలువైన కాలం వృథా అయిందని రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రాజ్యసభ కేవలం 41 గంటల 15 నిమిషాలు మాత్రమే సజావుగా సాగిందని చెప్పారు. బిహార్ ఓటర్ల జాబితా, ఆప రేషన్ సిందూర్, నేరారోపణలు ఎదుర్కొంటున్న పీఎం, సీఎం, మంత్రుల ఉద్వాసన బిల్లులపై విపక్షాలు నిరసనలతో ఉభయసభలో హోరెత్తాయి. జగదీప్ధన్ఖడ్ అనూహ్యంగా తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం సైతం సభను కుదిపేసింది. -
ఎస్ఐఆర్పై ఆగని ఆందోళన
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో రగడ ఆగడం లేదు. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనలు, నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకు న్నాయి. ఫలితంగా లోక్సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్సభ ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. మణిపూర్కు నిధులు కేటాయించేందుకు ఉద్దేశించిన మణిపూర్ అప్రొప్రియేషన్ బిల్లు–2025లో లోక్సభలో ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. దేశ ప్రయోజనాల కోసమే మా పోరాటం: ఖర్గే రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనలు కొనసాగాయి. సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నినాదాలు ఆపలేదు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండానే మరోవైపు కోస్టల్ షిప్పింగ్ బిల్లు–2025ను ప్రవేశపెట్టి ఆమోదించారు. కొందరు విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్పై సభాపతి స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొద్దిసేపు మాట్లాడారు. ఎస్ఐఆర్పై చర్చకు అనుమతించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ఎస్ఐఆర్పై ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐఆర్ అంటే కంటికి కనిపించని రహస్య రిగ్గింగ్ అని ఆరోపించారు. -
సభలో సిందూరం
న్యూఢిల్లీ: పహల్గాం ఉదంతం, ఆపరేషన్ సిందూర్పై తక్షణం చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్లకు తలొగ్గి సోమవారం వివరణలతో చర్చను మొదలెట్టిన అధికార పక్షం, ప్రభుత్వ వివరణను తీవ్రంగా తప్పుబడుతూ విపక్షసభ్యులు చేసిన నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రభుత్వం తరఫున రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్లు లోక్సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనను బలంగా వినిపించారు. ఇదేసమయంలో జైశంకర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకోవడం, అడ్డుకున్నందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించడంతో సభలో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓవైపు ఆపరేషన్ సిందూర్పై చర్చ జరుగుతుండగానే బిహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపైనా చర్చ జరపాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదాపడి చివరకు అర్థాంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడింది.పాక్ కాళ్లబేరానికి వచ్చిందితొలుత లోక్సభలో ఆపరేషన్సిందూర్పై చర్చపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ అనేది ముమ్మాటికీ చరిత్రాత్మకమైన సైనిక చర్య. ఉగ్రవాదంపై అత్యంత ప్రభావవంతమైన భారత విధానాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటింది. యుద్ధరంగంలో తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన ధైర్యవంతులైన సైనికులందరికీ నా సెల్యూట్. పాక్ పౌరులకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్కు పథకరచన చేశారు. కేవలం ఉగ్రవాదులకే భారీ నష్టం చేకూర్చాం. కేవలం 22 నిమిషాల్లో 9 కీలక ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసి మన సత్తా చాటాం. ఊహించని మెరుపుదాడితో చేష్టలుడిగిన పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) స్వయంగా ఫోన్ చేసి తమకు ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యంలేదని స్పష్టంచేశారు. ఆలోపు పాక్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులను మన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా నిర్వీర్యంచేశాయి. మన దాడులకు ప్రతీగా పాక్ జరిపిన దాడుల్లో భారత్లో ఏ ఒక్క కీలక స్థావరం, ఆయుధాగారం దెబ్బ తినలేదు. ఉగ్రవాదుల స్థావరాలు, వాళ్లకు మద్దతిచ్చేవాళ్లను అంతంచేసేందుకే ఆ ఆపరేషన్. లక్ష్యం నెరవేరిన కారణంగానే ఆపరేషన్ సిందూర్ను ఆపేశాం. ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, ప్రమేయం లేవు. బయటిశక్తుల (అమెరికా, ట్రంప్) కారణంగానే పాక్పై మనం దాడులను ఆపేశామనడంలో వాస్తవం లేదు. భారత వాయుసేన అసాధారణ దాడులు, సరిహద్దు వెంట ఆర్మీ దీటైన జవాబుకు తోడు నావికాదళం దాడులకు దిగొచ్చన్న భయాలతో పాక్ కాళ్లబేరానికొచ్చింది’’ అని రాజ్నాథ్ స్పష్టంచేశారు. ‘‘మమ్మల్ని విపక్షాలు అడగదల్చుకుంటే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా? అని ఒక్కటే ప్రశ్న వేయాలి. అందుకే మేం అవును అని సూటి సమాధానం చెప్తాం. పాక్ దాడుల్లో మన సైనికులెవరూ వీరమరణం పొందలేదు. ఏ పరీక్షలోనైనా ఫలితమే ముఖ్యం. పరీక్ష రాసేటప్పుడు పెన్సిల్ విరగడము, కలం కనిపించకుండా పోవడమూ సాధారణం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే ముఖ్యం. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సైనికదళాలు 100 శాతం కచ్చితత్వంతో సాధించాయి. పాక్తోగానీ మరే ఇతర దేశంతోగానీ ఎప్పుడూ విజయవంతమైన ప్రభుత్వాల సారథ్యంలో స్నేహాన్నే భారత్ కోరుకుంటోంది. గతంలో భారత్ ‘లాహోర్ బస్సు యాత్ర’ బాషలో మాట్లాడితే ధూర్త పాక్కు బోధపడలేదు. వాళ్లకు అర్థమయ్యేలా ఈసారి మేం ‘బాలాకోట్ దాడి’ భాషలో మాట్లాడాం. భారత్ ఏ దేశంతోనైనా కరచాలనం కోసం స్నేహహస్తమే అందిస్తుంది. చేతిని మెలిపెట్టాలని చూస్తేమాత్రం ఆ చేతినే విరిచేస్తుంది. పౌరుల ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తే భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుంతో ఆపరేషన్ సిందూర్ కళ్లకుకట్టింది. భారత్ను ఏనాటికీ ఓడించలేమని పాక్ పాలకులకు అర్థమైంది. అందుకే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారు. కానీ అది వాళ్లనే మింగేస్తోంది. అమాయక పాక్ ప్రజలనూ చంపేస్తోంది. ఆపరేషన్ ముగియలేదు. పాక్ మళ్లీ తోక జాడిస్తే మళ్లీ సిందూర్ మొదలవుతుంది’’ అని రాజ్నాథ్ అన్నారు.వాణిజ్య అంశాల్లో సిందూర్ ప్రస్తావన రాలేదు: జైశంకర్ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో చర్చ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ వేళ ట్రంప్, మోదీ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. అమెరికాతో వాణిజ్యానికి, ఈ ఆపరేషన్కు సంబంధం లేదు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించడంలో విజయంసాధించిన భారత దౌత్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మనం పాక్ నడిబొడ్డులోని బహావల్పూర్, మురిద్కేలోని స్థావరాలను నేలమట్టంచేయగలమని ఎవరైనా ఊహించారా?. పహల్గాం దాడిని బ్రిక్స్, క్వాడ్ కూటములేకాదు ఎన్నో దేశాలు ఖండించాయి. పాక్పై దాడిచేశాక దాడులను ఆపాలని పాక్ నుంచే అభ్యర్థన వచ్చింది. కానీ మేం పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి అభ్యర్థన వస్తేనే ఆపుతామని చెప్పాం’’ అన్నారు. ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం..విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తుంటే విపక్ష సభ్యులు పదేపదే అడ్డుత గిలారు. హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ‘‘ఆపరేషన్ సిందూర్పై మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సభ్యులు అస్సలు విశ్వసించట్లేరు. బయటివాళ్లు (ట్రంప్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్కు నమ్మకం ఎక్కువ. మీ పార్టీలో విదేశీయుల అభిప్రాయాలకు ఎంతటి విలువుందో ఇప్పుడే తెలుస్తోంది. మీ అభిప్రాయాలను పార్లమెంట్పై రుద్దకండి. విదేశీయులను నమ్మినందుకే మీరు విపక్షంలో కూర్చున్నారు. ట్రంప్ వంటి విదేశీయుల మాటలను ఇలాగే నమ్ము తూ పోతే మీరు ఇలాగే మరో 20 సంవత్సరాలు విపక్షంలోనే ఉండిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.ప్రశ్నలు కురిపించిన కాంగ్రెస్చర్చలో కాంగ్రెస్ తరఫున లోక్సభలో ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ‘‘ పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం మోదీ సర్కార్కు లేనట్లుంది. నిజంగా తిరిగి హస్తగతం చేసుకునే ఆలోచనే ఉంటే హఠాత్తుగా ఆపరేషన్ సిందూర్ను ఎందుకు ఆపాల్సి వచ్చింది?. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పీఓకేను స్వాధీనంచేసుకుంటాం?. పాక్, భారత్ పరస్పర సైనిక చర్యలకు ముగింపు పలికింది తానేనని ట్రంప్ 26 సార్లు ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?. భారత్, పాక్ యుద్దం ఆపితేనే వాణిజ్యం కొనసాగి స్తానని ట్రంప్ అమెరికా వాణిజ్య కత్తిని చూపి బెదిరించారా?. ఇంట్లో చొరబడి మరీ చంపుతామని ఇప్పటికి ఎన్నోసార్లు మోదీ అదే డైలాగ్లు కొడుతున్నారు. మరి సిందూర్ పరిసమాప్తంకాలేదని, పాక్ దాడిచేస్తే మళ్లీ మొదలవుతుందని వాళ్లే చెబుతున్నారు. అలాంటప్పుడు సిందూర్ విజయవంతమైందని ఎలా అంటారు? యుద్ధం చేయడం తమ విధానం కాదంటారు? మరి సిందూర్వేళ చేసిందేంటి? వాళ్ల అధీనంలోని భూభాగాన్ని స్వాధీనంచేసుకోవడానికి సిందూర్ చేయలేదంటున్నారు. మరి దేని కోసం చేసినట్లు? సిందూర్ వేళ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయాం?’’ అని గొగోయ్ ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్కు 26 నోటీసులుబిహార్ ఓటర్ల జాబితా అంశంతోపాటు ఇతర రాష్ట్రాల్లో బెంగాళీ వలసకూలీలు వివక్షను ఎదుర్కొనే పలు అంశాలపై రాజ్యసభలో చర్చించాలంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు మొత్తం 26 వాయిదా తీర్మానాలు వచ్చాయి. వీటన్నింటినీ ఆయన తోసిపుచ్చారు. జోరీఅవర్ సెషన్ను మొదలుపెట్టాలని నామినేటెడ్ సభ్యురాలు సుధామూర్తిని హరివంశ్ కోరగానే విపక్షసభ్యులు ఆందోళన పెంచారు. ఓటు చోరీని ఆపాలి అని నినాదాలుచేశారు. దీంతో మధ్యాహ్నం సెషన్లోపే సభ రెండుసార్లు వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే పునరావృతమైంది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా విపక్షసభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలిస్తూ సభ జరక్కుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక సభను మంగళవారానికి వాయిదావేశారు. ó డీ చర్చ -
పార్లమెంట్లో రచ్చ రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు గురువారం ఎలాంటి కార్యకలాపాలు చోటుచేసుకోలేదు. బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు కీలక అంశాలపై విపక్షాలు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం స్పందించాలని తేలి్చచెప్పాయి. నిరసనలు, నినాదాలు యథావిధిగా కొనసాగించాయి. ఉభయ సభలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. గురువారం ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు సహకరించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ బిర్లా కోరినా వారు వినిపించుకోలేదు. సభకు అంతరాయం సరైన పద్ధతి కాదని స్పీకర్ హితవు పలికారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. గోవా అసెంబ్లీలో ఎస్టీలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్æ విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. ఎస్టీలకు సంబంధించిన బిల్లుపై చర్చకు అడ్డుపడడం పట్ల విపక్షాలపై న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో సభాపతి లోక్సభను శుక్రవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ గందరగోళం బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వారు అలజడి సృష్టించడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లుపై చర్చ మొదలైంది. దీనిపై ఏఐఏడీఎంకే నేత తంబిదురై మాట్లాడారు. ఇంతలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. వెల్లోకి చేరుకొని నినాదాలతో హోరెత్తించారు. తంబిదురై తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. విపక్ష ఎంపీలు తమ నినాదాలు ఆపలేదు. సభలో వారి ప్రవర్తన పట్ల బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్పాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితాను కోరారు. ప్రతిపక్ష నేత ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ విన్నవించారు. అందుకు సభాపతి అంగీకరింకపోవడంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దాంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రాంగణంలో నిరసన బిహార్లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఓటు బందీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియా గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విపక్షాలు ప్రదర్శించిన ప్లకార్డుల్లో లోక్తంత్ర బదులు లోక్తంతర్ అని రాసి ఉండడంతో బీజేపీ‡ నేత మాలవీయా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ఏది ఎలా రాయాలో తెలియనివారు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. -
పట్టువీడని ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు బుధవారం సైతం విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఢిల్లీలో మురికివాడల కూల్చివేత, బెంగాలీ వలస కారి్మకుల పట్ల వివక్ష వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సభకు సహకరించాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. బుధవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వెల్లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. వారిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో ఎంపీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వెల్లడించాలి. ఇలా నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదు. ఇది పార్లమెంటరీ విధానం కాదు. ఎంపీల ప్రవర్తనను దేశమొత్తం గమనిస్తోంది. సభా మర్యాదను కాపాడండి. వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించే సభ్యులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే తీరు రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చకు ఇచి్చన వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలు చేపట్టినా విపక్షాల ఆందోళన, నిరసనలతో 2 గంటల వరకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. నల్ల దుస్తులతో నిరసన తమ డిమాండ్లపై పార్లమెంట్లో చర్చ చేపట్టాల్సిందేనని తేల్చిచెబుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), జేఎంఎం, ఆర్జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘, ‘ఓటు బందీని ఆపండి‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్పై 28న ప్రత్యేక చర్చ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్లో ప్రత్యేక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న లోక్సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో ఈ అంశంపై 16 గంటలపాటు చర్చ జరపడానికి ఈ నెల 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత సైన్యం దాదాపు ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్లో తొలుత లోక్సభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ ఈనెల 28వ తేదీ కల్లా స్వదేశానికి తిరిగివస్తారు. -
పార్లమెంట్లో విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా
Parliament Monsoon Session Live Updates.. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమమయ్యాయి. ఈరోజు కూడా విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు..ఆపరేషన్ సిందూర్పై మోదీని నిలదీసిన రాహుల్యుద్ధంలో భారత్ గెలిచిందా?ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందా?.బీహార్ ఓటర్ జాబితా సవరణపై ఈసీ వివరణ ఇవ్వాలి.భారత్లో ఎన్నికలనే దొంగిలిస్తున్నారు.. ఇదే వాస్తవం.ఎలా ఓటింగ్ జరుగుతుందో.. ఎవరు ఓట్లే వేస్తున్నారో మేం గమనిస్తున్నాం.కర్ణాటక తరహాలోనే బీహార్లో కూడా ఓట్లను దొంగిలిస్తున్నారు. #WATCH | Delhi: On US President Trump's claims of brokering a ceasefire between India and Pakistan, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "You are saying that the Operation Sindoor is ongoing, and on one hand, you say that we have become victorious. On one side, Donald… pic.twitter.com/9GxHSESkp8— ANI (@ANI) July 23, 2025 ఆపరేషన్ సిందూర్పై చర్చకు కేంద్రం సిద్ధం.మంగళవారం నుంచి ఉభయ సభల్లో చర్చకు కేంద్రం సిద్ధం.ఆపరేషన్ సిందూర్పై చర్చకు 16 గంటలు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదారాజ్యసభలో విపక్ష నేతల నిరసనల కారణంగా మరోసారి వాయిదాసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాRajya Sabha adjourned till 2 pm following sloganeering by Opposition MPs demanding discussion on Special Intensive Revision of electoral rolls in Bihar pic.twitter.com/zORXTafwQD— ANI (@ANI) July 23, 2025కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కామెంట్స్..ఇండియా బ్లాక్ 'హుల్లాద్' బ్లాక్గా మారింది.పార్లమెంట్ వెలుపల చర్చ జరగాలని వారు అంటున్నారుకానీ సభలో చర్చకు రాకుండా పారిపోతున్నారు.నిన్న చేతులు జోడించి చర్చ జరగనివ్వమని నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశాను.కానీ వారు హంగామా చేస్తూనే ఉన్నారు.రైతుల సంక్షేమం, సంబంధిత పథకాలకు సంబంధించి సభలో చాలా ప్రశ్నలు జాబితా చేయబడ్డాయి.ఇండియా బ్లాక్ ద్వంద్వ ప్రమాణాలను చూడాలని నేను రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. #WATCH | Union Minister Shivraj Singh Chouhan says," INDIA bloc has become 'hullad' bloc...Outside the Parliament, they say, there should be discussion, but they are running away from debate in the House. Yesterday, with folded hands, I had appealed to the Opposition to let… pic.twitter.com/lrLCQNr7qA— ANI (@ANI) July 23, 2025లోక్సభ స్పీకర్తో బీజేపీ నేతల కీలక భేటీలోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో బీజేపీ నేతల కీలక భేటీ.స్పీకర్ను కలిసిన కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజుజు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కామెంట్స్..బీహార్లో ఓట్లను నిషేధించే పనిని ఎన్నికల సంఘం చేస్తోంది.ఇది ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతితో మాత్రమే జరుగుతోంది.ప్రధాని మోదీ చర్చల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం.ఆపరేషన్ సిందూర్, Special Intensive Revision (SIR) పై చర్చలు ఎప్పుడు జరుగుతాయో ఆయన మాకు తెలియజేయాలి.#WATCH | Delhi: Congress MP Gaurav Gogoi says, "Election Commission is doing the work of banning votes in Bihar. It can only be done with the consent of PM Modi and Union HM Amit Shah. We want PM Modi to participate in the discussions of SIR, and he should inform us when the… pic.twitter.com/DyqQRNDBZX— ANI (@ANI) July 23, 2025పార్లమెంటులో మూడో రోజూ ఆందోళనల పర్వంసభ సజావుగా సాగేలా సహకరించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లావిపక్ష సభ్యుల నినాదాల మధ్యే కొనసాగిన ప్రశ్నోత్తరాలుమధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన ఉభయసభలు#WATCH | Lok Sabha adjourned till 12 noon amid sloganeering by the Opposition MPs.Speaker Om Birla says, "...This House is for discussion and dialogue, not for sloganeering. Maintain the decorum of the House..."(Source: Sansad TV) pic.twitter.com/HpaUPGknGb— ANI (@ANI) July 23, 2025పార్లమెంట్లో విపక్షాల ఆందోళనఉభయ సభలు వాయిదా.. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్సభ వాయిదా. మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.పార్లమెంట్లో విపక్షాల ఆందోళనబీహార్ ఓటర్ ప్రత్యేక సవరణపై చర్చ జరపాలని కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాల డిమాండ్పార్లమెంట్ బయట ఎంపీల నిరసనలునిరసనల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్Lok Sabha session begins with Opposition MPs sloganeering Lok Sabha Speaker Om Birla urges the Opposition MPs to maintain decorum.House adjourned till 12 noon(Source: Sansad TV/ YouTube) pic.twitter.com/a0AwiBXZuw— ANI (@ANI) July 23, 2025 పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన.లోక్సభలో విపక్ష ఎంపీల నినాదాలు #WATCH | Delhi: Opposition MPs, including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, hold protest against ongoing Special Intensive Revision (SIR) of electoral rolls in Bihar, in Parliament. pic.twitter.com/Z4ZT2Z7jjY— ANI (@ANI) July 23, 2025 -
పార్లమెంటు సమావేశాలు తొలిరోజే దుమారం
న్యూఢిల్లీ: ధూర్తదేశం పాక్పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు తొలిరోజే తీవ్రస్థాయి వాదోపవాదాలతో మొదలయ్యాయి. పహల్గాం ఉదంతంలో కేంద్ర నిఘా వర్గాల ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆపరేషన్ సిందూర్పై వెనువెంటనే చర్చ మొదలెట్టాలన్న విపక్షాల డిమాండ్లు ఓవైపు.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భం, కేసులను మోస్తున్న రాబర్డ్ వాద్రాపై అధికార పార్టీ ప్రతివిమర్శలతో తొలిరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడెక్కాయి. బిహార్లో ఓటర్ల జాబితా విస్తృతస్థాయిలో సవరించడం, మణిపూర్లో జాతుల మధ్య వైరంపై అధికార, విపక్ష పార్టీల పరస్పర ఆరోపణలతో లోక్సభ, రాజ్యసభల్లో వాతావరణం ఓవైపు మరింత ఉద్రిక్తంగా మారినా.. కాలిన కరెన్సీ కట్టల వ్యవహారంలో అపకీర్తిని మూటగట్టుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంలో అంతా ఏకతాటి మీదకు రావడం విశేషం. అవినీతిమరకలు అంటుకున్న జడ్జీని న్యాయపీఠం నుంచి పక్కకు తప్పించే క్రతువులో పార్టీలకతీతంగా సభ్యులు ఒకేమాటపై నిలబడ్డ సందర్భానికీ పార్లమెంట్ వేదికైంది. తొలిరోజే నాలుగుసార్లు వాయిదాసోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. పహల్గాంలో అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇరు సభల్లో సభ్యులు నివాళులర్పించారు. అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో సజీవదహనమైన ప్రయాణికులకూ ఇరుసభల సభ్యులు నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు. తర్వాత లోక్సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ బిర్లా మొదలెట్టగానే విపక్ష సభ్యులు వెంటనే వెల్లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఘోర నిఘా వైఫల్యం వల్లే పహల్గాం ఉదంతం చోటుచేసుకుందని, ఆపరేషన్ సిందూర్పై తక్షణం చర్చ జరపాలని డిమాండ్లుచేశారు. ఈ అంశంలో సభకు వచ్చి ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. ‘‘ప్రశ్నోత్తరాల గంట ముగిశాకే మీకు మాట్లాడే అవకాశం ఇస్తా. క్వశ్చన్ అవర్ సజావుగా సాగనివ్వండి. మనల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యలపై చర్చ జరగనివ్వండి. మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే బయటికెళ్లి ఇచ్చుకోండి’’ అని బిర్లా సూచించినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను 12 గంటల దాకా వాయిదావేశారు. తర్వాత 12 గంటలకు సభ ఆరంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మీరు ఎత్తిచూపిన అంశాలపై సుదీర్ఘ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అప్పటిదాకా ఓపిక పట్టాలని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. సభావ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) ఎదుట విపక్ష సభ్యులు తమ వాదనల్ని మధ్యాహ్నం 2.30గంటలకు వినిపించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. దీంతో అప్పుడు సభాధ్యక్షపీఠంపై కూర్చున్న జగదాంబికా పాల్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా ఎలాంటి మార్పులేదు. అప్పటి స్పీకర్ స్థానంలో కూర్చున్న సంధ్యా రాయ్ సభను మధ్యాహ్నం నాలుగు గంటలకు వాయిదావేశారు. నాలుగు గంటలకు సభ సమావేశమైంది. అప్పుడు కూడా విపక్షసభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసనలతో సభను హోరెత్తించారు. ఇక చేసేదిలేక సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా లోక్సభను మంగళవారానికి వాయిదావేశారు. ఇలా తొలిరోజే లోక్సభ నాలుగుసార్లు వాయిదాపడింది. రాజ్యసభ లోనూ ఇదే వాయిదా పర్వం కొనసాగింది. వచ్చే వారం సిందూర్పై చర్చపహల్గాంలో ఉగ్రదాది, ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై విస్తృతస్థాయి చర్చకు కేంద్రప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. వచ్చే వారం ఈ అంశాలపై సమగ్రస్థాయిలో లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈవారం ఆయన పార్లమెంట్కు రాలేరని, వచ్చే వారం ఆయన సమక్షంలోనే పార్లమెంట్లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు ఈ విషయాలను విపక్ష నేతలకు తెలియజేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షిప్పింగ్ డాక్యుమెంట్ల సరళీకరణకు బాటలువేసే ‘ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్ బిల్లు– 2025’ కు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు మార్చిలోనే లోక్సభ ఆమోదం పొందింది. -
సిందూర్పై చర్చకు సై
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలకాంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. విపక్షాల ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం ఇస్తాం. అయితే పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న రోజుల్లో మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. – కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్లో ఓటర్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్పందించాలి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించాలి. – గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ లేవనెత్తాల్సిన కీలక అంశాలపై విపక్షాలు కసరత్తు పూర్తిచేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్రామ్ మేఘ్వాల్, మురుగన్తోపాటు కాంగ్రెస్ ఆర్జేడీ, జేడీ(యూ), సమాజ్వాదీ పార్టీ, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, బీఆర్ఎస్, శివసేన(షిండే), ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. విపక్షాలు తమ ఎజెండాను ప్రస్తావించాయి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పహల్గాం ఉగ్రవాద దాడి, భారత్–పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను లేవనెత్తాయి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, తాజా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కోరాయి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్లో ఓట్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.అఖిలపక్ష భేటీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఎంపీలు జైరాం రమేశ్ తదితరులు కొత్త బిల్లులు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు, పన్నుల చట్టాలు(సవరణ) బిల్లులతో పాటు జియోహెరిటేజ్ సైట్స్, జియో–రెలిక్స్(సంరక్షణ), జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక(సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరనుంది. వీటితోపాటు పెండింగ్లో ఉన్న సముద్ర వస్తువుల రవాణా బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఓడరేవుల బిల్లులపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. చర్చకు వెనుకాడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికార, విపక్ష సభ్యులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉందన్నారు. ఉభయ సభల్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చిన్న పార్టీల ఎంపీలు కోరారని, అందుకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్న ఎంపీలకు తగినంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కిరణ్ రిజిజు వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సంబంధిత కేబినెట్ మంత్రులు సమాధానం ఇస్తారని స్పష్టంచేశారు. 17 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. -
త్వరలో యూపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి, అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్టానం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు అతిత్వరలో శ్రీకారం చుట్టబోతోంది. మరో పది రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా.. అంతకంటే ముందే ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. బీజేపీకి ఆయువు పట్టులాంటి ఉత్తర్ప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనంతరమే చేపట్టే అవకాశం ఉన్నట్లు సమచారం. ఉత్తరప్రదేశ్కు ఉన్న రాజకీయ ప్రాధాన్యత వల్ల అధ్యక్షుడి ఎంపికలో ఆచితూచి వ్చవహరించాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఎన్నికలే లక్ష్యంగా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బీజేపీకి జాట్ వర్గానికి చెందిన భూపేంద్రసింగ్ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023లోనే ఆయన పదవీకాలం ముగిసినా 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పొడిగించారు. లోక్సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను బీజేపీ కేవలం 33 స్థానాలు గెలుచుకుంది. పార్టీ పేలవ ప్రదర్శన దృష్ట్యా ఆయనను మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం యూపీలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీల చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. బీజేపీ సైతం ఆయా వర్గాల నుంచి సమర్థులైన నేతలను అన్వేషిస్తోంది. ఓబీసీ వర్గానికి చెందిన స్వతంత్రదేవ్ సింగ్, ధరంపాల్ సింగ్, బీఎల్ వర్మలు ప్రధాన పోటీదారులుగా ఉండగా, కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, సీనియర్ నేతలు బాబూరామ్ నిషాద్, అశోక్ కటారియాలు సైతం రేసులో ఉన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా ఆయన సారథ్యంలోనే 2027లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. క్రమంగా బలపడుతున్న సమాజ్వాదీ పార్టీ, దానికి అండగా ఉన్న కాంగ్రెస్ను ఎదిరించాలంటే బీజేపీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడి ఎంపిక సాధ్యం కాదని, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే ఈ ప్రక్రియ మొదలవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సైతం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడి వస్తారని అంటున్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా నేతృత్వంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకే మళ్లీ పగ్గాలు కట్టబెడతారా? లేక కొత్త వారికి అవకావం ఇస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. -
మణిపూర్ శాంతికి నాదీ హామీ: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఐదేళ్లు గడువిచ్చినా.. ప్రతిపక్షాలు అవిశ్వాసానికి సిద్ధం కాలేకపోయాయని, నో కాన్ఫిడెన్స్.. నో బాల్గానే మిగిలిపోయింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మణిపూర్ అంశంపై విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గురువారం సాయంత్రం లోక్సభలో ప్రసంగించారాయన. ఈ మోషన్ మీద మీ చర్చ ఎలా జరిగింది?.. చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాట దేశం మొత్తం వింది. సోషల్ మీడియాలో దీనిపై ఏమని చర్చించారో తెలుసా?.. ‘విపక్షాలు ఫీల్డింగ్ చేస్తుంటే.. ఫోర్లు, సిక్సర్లు మా నుంచి పడ్డాయి’ అని మోదీ ఛలోక్తులు సంధించారు. మా గెలుపును నిర్ణయించేశారు దేవుడే ఎంతో దయ గలవాడు. ఏదో ఒక విధంగా మాట్లాడాలని చూస్తాడు. దేవుడి దయతోనే విపక్షాలు అవిశ్వాసం పెట్టాయని నమ్ముతున్నా. 2018లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నేను చెప్పాను, ఇది మాకు బలపరీక్ష కాదు, వారికి బలపరీక్ష అని. ఫలితంగా వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల అవిశ్వాసం మాకు ఎప్పుడూ అదృష్టమే. ఈ రోజు మీరు మీరు (ప్రతిపక్షం) చేసిన పని మా గెలుపును నిర్ణయించేసింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయే, బీజేపీ గొప్ప విజయం సాధిస్తాయని, మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని.. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తాయని ఒక అభిప్రాయానికి వచ్చేశా. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో నిండిపోయింది. భారత్ను అప్రతిష్టపాలు జేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. మేం దేశ ప్రతిష్టతను ఖండాంతరాలకు వ్యాపింపజేశాం. స్కామ్లు లేని భారత్ను అందించాం. ఫలితంగానే.. భారత్పై ప్రపంచ దేశాల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దేశం ఎంత బలపడిందో చెప్పేందుకు విదేశీ పెట్టుబడులే నిదర్శనం. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించింది. భారత్ నలుమూలలా విస్తారంగా అవకాశాలు దక్కుతున్నాయి. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది. భారత్లో ప్రణాళిక, కృషి కొనసాగింపు కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి దానికి కొత్త సంస్కరణలు ఉంటాయి. పనితీరు కోసం అన్ని ప్రయత్నాలు చేయబడతాయి. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. మీరు 2028లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినప్పుడు, ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో దేశం ఒకటిగా ఉంటుందని దేశం విశ్వసిస్తోంది అంటూ ప్రధాని మోదీ విపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోల్కతా నుంచి ఫోన్ వచ్చిందా? ఈ అవిశ్వాసంతో మునుపెన్నడూ చూడనివి, కొత్తవి, ఊహించలేనివి చూస్తున్నాం. ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ మాట్లాడకపోవడం విడ్డూరం. ఆయన్ని కాంగ్రెస్ ఎందుకు మాట్లానివ్వలేదు. బహుశా కోల్కతా నుంచి ఫోన్ వచ్చిందేమో. కాంగ్రెస్ ఆయన్ని పదే పదే అవమానిస్తూ వస్తోంది. అందుకే ఆయన్ని పక్కనపెడుతోంది. #WATCH | PM Modi says, "A few things in this No Confidence Motion are so strange that they were never heard or seen before, not even imagined...The name of the Leader of the largest Opposition party was not among the speakers...This time, what has become of Adhir ji (Adhir Ranjan… pic.twitter.com/NXdGzauxjT — ANI (@ANI) August 10, 2023 అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. తమ విధానాలతో దేశం కంటే పార్టీనే ముఖ్యమని కొన్ని విపక్ష పార్టీలు చాటి చెబుతున్నాయి. బహుశా మీకు దేశంలోని పేదల ఆకలితో పట్టింపులేదేమో. ఎందుకంటే వాళ్లకు అధికార దాహమే ఆలోచనగా ఉండిపోయింది కాబట్టి. ఎల్ఐసీపై దుష్ప్రచారం చేశారు అనరాని మాటలు అనడంతో విపక్షాల మనస్సులు శాంతించి ఉంటాయి. భారత్లో జరిగిన మంచిని విపక్షాలు సహించలేకపోతున్నాయి. HAL దివాళా తీస్తుందని ప్రచారం చేశారు. కానీ, హెచ్ఏఎల్ సరికొత్త రికార్డులు సృష్టించింది. అత్యధిక ఆదాయం అర్జించింది. ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేస్తే నాశనం అవుతుందని, దివాళ తీస్తుందని ప్రచారం చేశారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారు. కానీ, ఎల్ఐసీ పటిష్ట స్థితిలో ఉంది. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుంది అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Hindustan Aeronautics Limited (HAL) recorded its highest-ever revenue. Despite their (opposition's) allegations, HAL has emerged as the pride of the country. They said many things about LIC that the money of the poor will sink but today LIC is getting stronger. 'Share… pic.twitter.com/dH2eOoGuk9 — ANI (@ANI) August 10, 2023 కాంగ్రెస్పై ప్రజలకు నో కాన్ఫిడెన్స్ కాంగ్రెస్కు ఎలాంటి విజన్ లేదు. నిజాయితీ లేదు. కాంగ్రెస్కు అంతర్జాతీయ ఆర్థిక విధానం లేదు. కాంగ్రెస్ హయాంలో దేశం పేదరికంలో మగ్గిపోయింది. కశ్మీర్పై, కశ్మీర్ ప్రజలపై కాంగ్రెస్కు ప్రేమ లేదు. తమిళనాడులో 1962లో, త్రిపురలో 1988లో, నాగాలాండ్లో 1988లో చివరిసారిగా నెగ్గారు. తమిళనాడు భారత్లో భాగం కాదన్నట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీ, ఏపీలోనూ ప్రజలు కాంగ్రెస్ను దూరం పెట్టారు. యూపీ, బీహార్, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారు. అధికారం కాంగ్రెస్కు అహంకారంతో కళ్లు మూసుకుపోయాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్పై నో కాన్ఫిడెన్స్ ప్రకటించారు. విపక్షాలకు పాకిస్తాన్ అంటే ప్రేమ కనిపిస్తోంది. పాక్ చెప్పిందే విపక్షాలు నమ్ముతున్నాయి. పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేశామంటే సైన్యాన్ని సైతం కాంగ్రెస్ నమ్మలేదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఎగతాళి చేశారు. భారత్లో తయారైన వ్యాక్సిన్పై విపక్షాలకు నమ్మకం లేకుండా పోయింది. #WATCH | PM Modi says, "People of the country have no confidence in Congress. Due to arrogance, they are not able to see the reality. In Tamil Nadu, they won in 1962 and since 1962 the people of Tamil Nadu are saying 'No Congress'. In West Bengal they won in 1972, people of West… pic.twitter.com/8xHvTcIIKm — ANI (@ANI) August 10, 2023 ఇండియా కూటమిపై సెటైర్లు విపక్షాలు కొన్నిరోజుల కిందట బెంగళూరులో యూపీఏకి అంత్యక్రియలు జరిపాయి. ఇన్ని తరాలు గడిచినా.. పచ్చి మిర్చి, ఎండు మిర్చికి తేడా తెలియని రీతిలో ఉంది మీ తీరు. విపక్షాలు చివరకు ఇండియాను.. I.N.D.I.Aగా ముక్కలు చేశారు. తమను తాము బతికించుకోవడానికి ఎన్డీయే మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి వారిది. NDAలో రెండు ఐ(I లెటర్లు)లు చేర్చారు. మొదటి I.. 26 ;పార్టీల అహకారం. రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనం. అలవాటు లేని ‘నేను’(I) అనే అహంకారం వారిని వదలడం లేదు. ఈ క్రమంలో ఎన్డీయేను కూడా దోచుకున్నారు. #WATCH | PM Narendra Modi says, "I want to express my sympathy with the opposition because a few days ago you performed the last rites of UPA in Bengaluru. On one hand, you were performing last rites par aap jashan bhi mana rahe the aur jashan bhi kis cheez ka- khandhar par naya… pic.twitter.com/cJXh220UNk — ANI (@ANI) August 10, 2023 ప్రతీ పథకం పేరు కాంగ్రెస్ ఒక కుటుంబం పేరును చేర్చింది. అక్కడ స్కీమ్లు లేవు. అన్నీ స్కామ్లే. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారు. తమ పేర్ల మీద పథకాలు నడిపించారు. కాంగ్రెస్కు కుటుంబ పాలన, దర్బార్ పాలన అంటేనే ఇష్టం. వారి కుటుంబం నుంచి కాకుండా వేరే కుటుంబం నుంచి ప్రధాని అయితే సహించలేరు. మేం కుటుంబ పాలనకు వ్యతిరేకం. విపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి. ఫెయిల్డ్ ప్రాజెక్టును కాంగ్రెస్ పదేపదే లాంచ్ చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఇండియా కూటమిలో ప్రతీ ఒక్కరిదీ ప్రధాని కావాలనే కోరిక. ప్రజలే దేవుళ్లు.. తీర్పు ఇచ్చారు లంక దహనం జరిగింది హనుమాన్ వల్ల కాదు. రావణుడి అహంకారం వల్లే!. ప్రజలు కూడా రాముడి లాంటివాళ్లు. అందుకే 400 నుంచి మిమ్మల్ని 40కి పడేశారు. ప్రజలు రెండుసార్లు పూర్తి మద్దతు మాకు ఇచ్చారు. కానీ, మీకు ఓ పేద వ్యక్తి ఎలా ఇక్కడికి ఎలా వచ్చాడనే ఆలోచన మీకు నిద్రపట్టనివ్వడం లేదు. ప్రజలు 2024లోనూ మిమ్మల్ని నిద్రపోనివ్వరు. ఒకప్పుడు విమానాల్లో కేక్ కట్టింగులు జరిగాయి. కానీ, ఇప్పుడు అవే విమానాల్లో పేద ప్రజల కోసం వ్యాక్సిన్లు పంపుతున్నాం. #WATCH | PM Narendra Modi says, "It is true that Lanka was not set ablaze by Hanuman, it was set ablaze by his (Ravan) arrogance. People are also like Lord Ram and that is why you have been reduced to 40 from 400. People elected full majority government twice but it is troubling… pic.twitter.com/aMaxHkyfbH — ANI (@ANI) August 10, 2023 వారికి కలలో కూడా మోదీ కనిపిస్తాడు. 24 గంటలు మోదీ నామస్మరణ చేస్తారు. విపక్షాలు కొత్త కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. కాంగ్రెస్ది అబద్ధాల దుకాణం. త్వరలో ఆ దుకాణానికి కూడా తాళాలు వేయాల్సి వస్తుంది. దేశంలోని వ్యవస్థలన్నీ చచ్చిపోయానని వీళ్లు అంటున్నారు. కానీ, అవేంతో అదృష్టం చేసుకుని ఉన్నాయి. దేశానికి, ప్రజాస్వామ్యానికి వాళ్లు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, మన దేశం, ప్రజాస్వామ్యం మరింత బలపడతాయి. అలాగే.. మేం కూడా మరింత బలోపేతం అవుతాం. విపక్షాలపై ప్రధాని విసుర్లు కొనసాగుతుండగానే.. ఇండియా కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. #WATCH | Opposition MPs walk out of the Lok Sabha as Prime Minister Narendra Modi speaks on #NoConfidenceMotion pic.twitter.com/2kYKRBiP1Z — ANI (@ANI) August 10, 2023 మణిపూర్పై.. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు అర్థవంతమైన చర్చ జరిపే ఉద్దేశం లేదు. మేం చర్చలకు ఆహ్వానించినా.. వాళ్లు రావడం లేదు. ఎందుకంటే మణిపూర్పై చర్చ విపక్షాలకు అవసరం లేదు. మణిపూర్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందటారు. వాళ్ల మనసులో ఏదుంటే అదే కనిపిస్తుంది.. అదే బయటపడుతోంది. కొందరు భారతమాత చావు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాతను ముక్కలు చేసింది వీళ్లే. వందేమాతరం కూడా ముక్కలు ముక్కలు చేసింది కూడా వీళ్లే. కాపాడాల్సిన వాళ్లే భారతమాత భుజాలు నరికేశారు. తుక్డే గ్యాంగ్ను ప్రొత్సహిస్తున్నారు. 1966లో మిజోరాం ఘటనలకు కారణం ఎవరు? మిజోరాంలో సామాన్యులపైనా దాడులు చేయించారు. ఎయిర్ఫోర్స్ను ఉపయోగించారు. నెహ్రూపై లోహియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈశాన్య భారతంను చీకట్లో ఉంచేశారని లోహియా అన్నారు. మిజోరాం వాస్తవాన్ని కాంగ్రెస్ దేశ ప్రజల ముందు ఉంచింది. ఈశాన్య రాష్ట్రంలో 50సార్లు పర్యటించాను. మా ప్రభుత్వ హయాంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అలాంటిది ఈశాన్య రాష్ట్రాల గురించి వీళ్లా మనకు చెప్పేది. మణిపూర్లో సాయంత్రం నాలుగు తర్వాత గుడిలు, మసీదులు మూసేవారు. ఈ పాపం కాంగ్రెస్ది కాదా? అని నిలదీశారాయన. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లో అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారాయన. #WATCH | PM Narendra Modi speaks on Manipur; says, "Both the state and central governments are doing everything possible to ensure that the accused get the strictest punishment. I want to assure the people that peace will be restored in Manipur in the coming time. I want to tell… pic.twitter.com/cgI7RqSWs4 — ANI (@ANI) August 10, 2023 హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్లో పరిస్థితులు మారాయి. హైకోర్టు తీర్పులో రెండు కోణాలు ఉన్నాయి. మణిపూర్లో జరిగింది దిగ్భ్రాంతికరం. రాబోయే కాలంలో మణిపూర్లో శాంతి నెలకొంటుందని నేను అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నాను. నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయి. దేశం మీ వెంట ఉందని అక్కడి ఆడపడుచులు, బిడ్డలకు నేను చెప్పాలనుకుంటున్నా. ‘యావత్ దేశం మీ వెంట(మణిపూర్ ప్రజలను ఉద్దేశించి..) ఉందమ్మా’. మణిపూర్ త్వరలో ప్రగతి పథంలో పయనిస్తుంది. మణిపూర్ అభివృద్ధికి అన్నివిధాలుగా అండగా ఉంటాం. #WATCH | Prime Minister Narendra Modi says, "...In 2018, I gave them (Opposition) a work - bring No Confidence Motion in 2023 - and they followed my words. But I am sad. In 5 years, they should have done better. But there was no preparation, no innovation, no creativity...I will… pic.twitter.com/5gNGZ2OlP7 — ANI (@ANI) August 10, 2023 ప్రపంచానికి ఈశాన్య రాష్ట్రాన్ని దిక్సూచిని చేస్తాం. మన నుంచి ప్రజలు మంచి ఆశిస్తారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి. 2047 నాటికి భారత్ అభివృద్ధిచెందిన దేశంగా ఉంటుంది. మరోసారి అవిశ్వాసం పెట్టేముందు సరిగ్గా ప్రిపేర్ అవ్వండి అంటూ విపక్షాలకు చురకలంటించారాయన. -
అసలు మీది ఇండియానే కాదు.. రాహుల్కు స్మృతి ఇరానీ స్ట్రాంగ్ కౌంటర్
న్యూ ఢిల్లీ: బుధవారం జరిగిన లోక్ సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపైనా ప్రధానిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంతేస్థాయిలో తిప్పికొట్టారు. మీరసలు భారత దేశానికి చెందినవారే కాదన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశాలు మొదలవుతూనే ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈరోజు సమావేశాల్లో లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి సభలో ప్రసంగించారు. ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా మాట్లాడిన రాహుల్ మణిపూర్ భారత దేశంలో భాగమన్న విషయాన్ని ప్రధాని మర్చిపోయారని, మణిపూర్ లో భారత మాతను చంపేశారన్నారు. రావణాసురుడు ఎలాగైతే కుంభకర్ణుడు, మేఘనాధుడు ఇద్దరి మాటలు విన్నాడో ప్రధాని కూడా ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల మాటలే వింటున్నారని విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం తన స్వార్ధ రాజకీయాల కోసం ఒకే దేశంలో రెండు మణిపూర్ లను సృష్టించారన్నారు. #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "Bharat maa ki hatya ki baat karne wale kabhi bhi mez nahi thapthapate. Congressiyo ne baith kar maa ki hatya ke liye mez thapthapaai hai..." https://t.co/Nay92GDe4k pic.twitter.com/uAPE2YQIRN — ANI (@ANI) August 9, 2023 రాహుల్ మాట్లాడిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ విభజించబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు. ఆయన మణిపూర్లో భారత మాత చంపబడిందని అన్నారు. దానికి వారి మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది. అందుకే కుటుంబపాలను స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి అన్నారు. మీరనుకునే ఇండియా కాదిది. అవినీతి రహిత ఇండియా. ఇక్కడ కుటుంబపాలనకు చోటు లేదన్నారు. అసలు మీరు ఇండియాకు చెందిన వారే కాదన్నారు. నాడు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నినదించినట్లు ఇప్పుడు మీ కుటుంబ పాలనకు,అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలన్నారు. #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "Manipur is an integral part of India. Khandit na tha, na hai aur na kabhi hoga..." https://t.co/CIFqt9F5H4 pic.twitter.com/2uTrTWRG84 — ANI (@ANI) August 9, 2023 కశ్మీర్ లో గిరిజా టిక్కు అనే పండిట్ పై సామూహిక అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు. అదే విషయాన్ని సినిమాలో చూపిస్తే కొంతమంది కాంగ్రెస్ లీడర్లు దాన్ని దుష్ప్రచారమన్నారు. ఇప్పుడు విచిత్రంగా వారే మాట్లాడుతున్నారు. రాజ్జస్థాన్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న బిల్వారాలో అభంశుభం తెలియని పసికందుపై మానభంగం జరిగింది. ఇవేవీ మీకు కనిపించవా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆమె 1984లో కాంగ్రెస్ పాలనలో నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. చరిత్ర చూస్తే కాంగ్రెస్ పాలన అంతా రక్తసిక్తమై ఉంటుందని అన్నారు. -
రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మంగళవారం వెల్లడించారు. ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్లో చిక్కుకున్న యాత్రికులు -
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
No Confidence Motion Day-1 Live Updates పార్లమెంట్ ఉభయ సభలు రేపటి(బుధవారం)కి వాయిదా. ► పార్లమెంట్ సాక్షిగా ఆర్టికల్ 370 రద్దయ్యి నాలుగేళ్లు పూర్తి కావొచ్చింది. కానీ, ఇంకా అక్కడ ఎన్నికలు జరగలేదు అని ఎంపీ తివారి అన్నారు. ఆ టైంలో కొందరు ఎన్డీయే ఎంపీలు ‘ఈ వ్యవహారం కోర్టులో ఉందని.. సభలో చర్చించొద్ద’ని తివారికి సూచించారు. వెంటనే తివారి ‘నేషనల్ హెరాల్డ్ కేసు న్యాయస్థానంలోనే ఉంది కదా!’ అని వాళ్లను ఎదురు ప్రశ్నించారు. ► అవిశ్వాసంపై చర్చ సందర్భంగా.. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి ప్రసంగిస్తున్నారు. విపక్షాలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్.. ► గతంలో ఒలింపిక్స్లో భారత్ పతకాల వేటలో చతికిలపడేది. కానీ, 2020లో ఏడు మెడల్స్ గెలిచింది. క్రీడాకరులపై మోదీ సర్కార్ చూపిన శ్రద్ధే అందుకు ప్రధాన కారణం అని చెప్పనక్కర్లేదు. ► ప్రమాదాలు ఊహించని విషాదాలే. అలాంటిది రైలు ప్రమాదంలో ఒక్క ప్రాణం పోయినా.. అది పెద్ద నష్టం కిందకే వస్తుంది. 2004-14 మధ్య 171 రైలు ప్రమాదాలు జరిగాయి. ఆ సంఖ్య 2014-23 మధ్య 71కి చేరి.. ప్రమాదాల తగ్గుముఖం తెలియజేస్తోంది. ► అమృత్కాల్ అనేది ఎన్డీయే కోసమో బీజేపీ కోసమో కాదు.. ఇది దేశం కోసం. మా పార్టీ తరపున.. ప్రభుత్వం తరపున అందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. 2047 కల్లా.. భారత్ను అభివృద్ధి చెందిన కేసుగా నిలబెట్టే ప్రయత్నాలు చేద్దాం. ► విదేశీ శక్తులు భారత్కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే రోజులు పోయాయి. ఇవాళ మన అంతర్గత విషయాల్లో ఏ విదేశీ శక్తి జోక్యం చేసుకోవట్లేదు. ► ఇస్రో చంద్రయాన్-3 లాంటి ప్రాజెక్టులతో భారత్ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా చాటుతోంది. అమెరికాలాంటి అగ్రరాజ్యాలు సైతం అంతరిక్ష రంగంలో భారత్తో పని చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ►ఇండియా కూటమితో ఒరిగేదిమీ లేదు. వీరంతా దేశానికి చేసిందేమీ లేదు. ► 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్షకు గురయ్యారు. ► 2014 తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. ► స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా గౌహతిలో డీజీపీ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు పోలీసులు తప్పనిసరిగా భద్రత కల్పించాలని ప్రధానమంత్రి ఆదేశించారు. Before 2014, many people from the Northeast faced racial discrimination and atrocities in Delhi and other major cities of the country. After 2014 the situation changed, and the DGP conference was held in Guwahati for the first time after independence. During this meeting, the PM… pic.twitter.com/YRYCW6DPX9 — ANI (@ANI) August 8, 2023 ►అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదు: బీజేడీ(బిజూ జనతా దళ్) ఎంపీ పినాకి మిశ్రా ►బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నేను మద్దతు ఇవ్వడం లేదు. ►ఒడిశా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది. అందుకే అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం లేదు. No Confidence Motion Discussion | BJD MP Pinaki Misra says, "I cannot support a No Confidence Motion against a Central Govt today, even though we are against the BJP as a political party...I am grateful for the many things that the Central Govt has done for Odisha which is why,… pic.twitter.com/RLHk17UesH — ANI (@ANI) August 8, 2023 కేంద్ర ప్రభుత్వానికి మనసు లేదు ►మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతుంటే ప్రధాని విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారు?: టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ ► కేంద్ర ప్రభుత్వానికి మనసు లేదు. ►మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరించడం లేదు ► పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ప్రతిసారీ అక్కడికి ఓ ప్రతినిధి బృందాన్ని పంపుతారు. కానీ మణిపూర్కు ఒక్క ప్రతినిధి కూడా వెళ్లలేదు. ►మణిపూర్లో ఎంతో మంది మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ►మణిపూర్పై కనికరం లేదు కాబట్టే అక్కడికి వెళ్లడం లేదు. ►భారత్ను ప్రేమించేవారెవరైనా మోదీని ద్వేషిస్తారు. No Confidence Motion discussion | TMC MP Saugata Roy says, "This Government is government of the heartless. They are sending delegation to West Bengal on any plea. But not one delegation has gone to Manipur where our brothers and sisters are dying...You have no compassion and… pic.twitter.com/CDEvfQaaIY — ANI (@ANI) August 8, 2023 మణిపూర్ భగ్గుమంటుంటే ప్రధాని మోదీ ఎక్కడున్నారు? ►పార్లమెంట్కు వచ్చేందుకు వచ్చేందుకు మోదీకి అభ్యంతరం ఏంటి?: డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ►మణిపూర్లో శాంతిభద్రతలు పడిపోతే ఐరోపా, యూకే ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా మోదీ సర్కార్ మౌనం దాల్చింది. ►మణిపూర్ అల్లర్లలో 163 మంది మరణించినా ప్రధాని నోరుమెదపలేదు. ► దేశంలో నెలకొన్న పరిస్ధితిలాగే మణిపూర్లోనూ మెజారిటీ వర్సెస్ మైనారిటీ అన్నట్టుగా పరిస్ధితులు నెలకొన్నాయి. No Confidence Motion discussion | DMK MP TR Baalu says, "Minorities of Manipur have been killed ruthlessly. 143 people have been killed. 65,000 people have fled the state. Two women were stripped, gang-raped and paraded naked on the streets of Manipur...The CM is helpless. The PM… pic.twitter.com/3giXM3oFFq — ANI (@ANI) August 8, 2023 మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలి ►మణిపూర్లో 10 వేల అల్లర్లు, హత్యలు, అత్యాచార కేసులు నమోదయ్యాయి: సుప్రియా సూలే ►అయినప్పటికీ కేంద్రంలో చలనం లేదు. ►మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. No Confidence Motion discussion | NCP MP Supriya Sule says, "I demand that the (Manipur) CM must resign immediately...10,000 cases of rioting, murder and rape. Have we become so insensitive? This is the problem with this Govt..." pic.twitter.com/9UCFXjtWad — ANI (@ANI) August 8, 2023 రాహుల్ గాంధీ ఎప్పటికీ సావర్కర్ కాలేరు: నిషికాంత్ దూబే ►మోదీ సర్కార్పై అవిశ్వాసం పెట్టారు. ఇంతకీ విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా? ►ఇండియా ఫుల్ఫామ్ కూడా ఆ కూటమిలోని సభ్యులకు తెలియదు. ►కూటమిలో ఏ పార్టీ ఎవరి వైపు తెలుసుకునే పరీక్ష ►ఇండియా అని పేరు పెట్టుకున్నారు.. కానీ అందరూ గొడవ పడుతున్నారు. ►లాలూ ప్రసాద్ యాదవ్ను జైలుకు పంపింది ఎవరు? ►రాహుల్ మాట్లాడుతారని ఆశించాం. కానీ ఆయన రెడీగా లేరు. ►రాహుల్ గాంధీ సభకు వస్తే పెద్దగా సెలబ్రేట్ చేశారు. ►సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. స్టే మాత్రమే ఇచ్చింది ►రాహుల్ లేటుగా నిద్రలేచారేమో? ►నేను సావర్కర్ కాను.. క్షమాపణలు చెప్పనని రాహుల్ అంటున్నారు. ►రాహుల్ గాంధీ ఎప్పటికీ సావర్కర్ కాలేరు. #WATCH | BJP MP Nishikant Dubey raises the issue of the Supreme Court staying Rahul Gandhi's conviction in the ‘Modi’ surname remark case following which his membership was restored. He says, "The Supreme Court has not given a judgement. It has given a stay order...He is saying… pic.twitter.com/7Q6UZ5Fxd9 — ANI (@ANI) August 8, 2023 లోక్సభలో అధికార, విపక్షాల ఎంపీల నినాదాలు ►నిన్న సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు ►చైనా, న్యూస్ క్లిక్ విషయంలో దూబే ఘాటు వ్యాఖ్యలు ►దూబే వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ లేఖ ►దూబే వ్యాఖ్యలు తొలగించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన ►రికార్డులు మళ్లీ అపడ్లోడ్ చేశారంటూ అధిర్ రంజన్ అభ్యంతరం లోక్సభలో గందరగోళం ►బీజేపీ తరపున చర్చను ప్రారంభించిన నిషికాంత్ దూబే ►బీజేపీ ఎంపీపై విపక్షాల ఆందోళన ►నిషికాంత్ దూబే ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ సభ్యులు ►షేమ్ షేమ్ అంటూ ఇండియా కూటమి ఎంపీల నినాదాలు ►గందరగోళం మధ్యం నిలిచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రధాని మణిపూర్ ఎందుకు వెళ్లరు? ►కోక్రాఝర్లో హింస జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ అసోం వెళ్లారు. ►2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని వాజ్పేయూ అక్కడికి వెళ్లారు. ►ఇండియా కూటమిని తిట్టండపైనే మోదీ ఫోకస్ ►మణిపూర్లో శాంతి స్థాపన మోదీ ప్రాధన్యత కాదా ►మణిపూర్కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లారు. ►మేము అధికారాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నాం. సంక్షోభ సమయాల్లో మౌనమే మోదీ సమాధానమా? ►చైనా విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. ►బాలీలో జిన్పనింగ్, మోదీ ఏం మాట్లాడుకున్నారో కేంద్రం దాచేసింది. ►చైనా గురించి మీరు మాట్లాడుతున్నారా? ►ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►రెజర్ల ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►రైతు ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►అదానీ విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►తప్పును దేశ ప్రజల ముందు ఒప్పుకోవడం లేదు ►మణిపూర్లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ►అసోం రైఫిల్స్ మణిపూర్ పోలీసులు కొట్టుకున్నారు ►ఇదేనా నవభారతం ►ప్రభుత్వంపై నమ్మకం లేకే సుప్రీంకోర్టు కమిటీ వేసింది అసలు మణిపూర్లో ఏం జరగుతోంది? ►సంఖ్యాబలం లేదన్న విషయం మాకు తెలుసు. తప్పని పరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టాం. ►మణిపూర్కు రాహుల్, విపక్ష ఎంపీలు వెళ్లారు. ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదు. ►మణిపూర్లో హింస కొత్తది కాదు, గతంలోనూ చాలాసార్లు అల్లర్లు జరిగాయి. ►ఇప్పటి పరిస్థితికి అప్పటి పరిస్థితికి సంబంధమే లేదు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ►ఒక వర్గం మరో వర్గాన్ని తీవ్రంగా ద్వేషిస్తుంది. ►మణిపూర్ అల్లర్లపైప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదు. ►80 రోజుల తర్వాత అది కూడా 30 సెకన్లు మాత్రమే మాట్లాడారు. ►ఎంతమంది మాట్లాడినా ప్రధాని స్పందిస్తే వేరుగా ఉంటుంది. ►మణిపూర్లో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైంది. ►అక్కడ ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. 5 వేల వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది శిబిరాల్లో ఉన్నారు. 60 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. Congress MP Gaurav Gogoi says, "PM will have to accept that his double-engine govt, his govt in Manipur has failed. That is why, 150 people died in Manipur around 5000 houses were torched, around 60,000 people are in relief camps and around 6500 FIRs have been registered. The CM… pic.twitter.com/MBSbSsyJLH — ANI (@ANI) August 8, 2023 మణిపూర్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తోంది? ►మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదు? ►మణిపూర్ అంతా బాగుందని మీరు అంటున్నారు. ►ఇప్పటికీ ఇంటర్నెట్ లేదు, పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. ►ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు, అయినా మోదీ మౌనం వీడలేదు. ►డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని మాట్లాడాల్సి వస్తుందని మోదీ స్పందించడం లేదా? ►మణిపూర్లో పోలీస్ స్టేషన్లోకి చొరబడి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ►అక్కడి ప్రజలు న్యాయం కోరుతున్నారు #WATCH | Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to… pic.twitter.com/rfAVe77sNY — ANI (@ANI) August 8, 2023 మణిపూర్ భారత్లో అంతర్భాగం: గౌరవ్ గోగోయ్ ►మణిపూర్ మండుతుంటే దేశం మండుతున్నట్లే. ►మణిపూర్పై పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలి. ►మణిపూర్ కోసమే అవిశ్వాసం తెచ్చాం. ►మణిపూర్ న్యాయం కోరుతోంది. ►లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. మొదట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది జరగకపోవడంతో సభ ప్రారంభమైన వెంటనే తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ ఎందుకు చర్చ ప్రారంభించలేదని బీజేపీ ఎంపీలు చురకలు అంటించారు. పార్టీలకు సమయం కేటాయించిన స్పీకర్ ►మొత్తం 16 గంటలపాటు చర్చ కొనసాగనుంది. ►బీజేపీకి 6. 41 గంటలు, కాంగ్రెస్కు గంటా 9 నిమిషాలు కేటాయింపు ►డీఎంకే, టీఎంసీకి 30 నిమిషాల చొప్పున సమయం కేటాయింపు ►వైఎస్సార్సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, బీఆర్ఎస్కు 12 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు కేటాయింపు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడనున్నారు. దీంతో మణిపూర్ హింసపై కాంగ్రెస్ అగ్రనేత ఎలాంటి ప్రసంగం చేస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాహుల్ ఏం మాట్లాడనున్నారు? మూడు నెలలుగా హింసాకాండతో రగిలిపోతున్న మణిపూర్లోని ఘర్షణ ప్రాంతాలను జూన్లో రాహుల్ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్ 'సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్' అవుతారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై.. సాయంత్రం 7 గంటల వరకూ ఉంటుంది. ఇలా వరుసగా మూడు రోజులపాటు చర్చ జరుగనుంది. అనంతరం చివరి రోజైనా ఆగస్టు 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చకు సమాధానమిస్తారు. అదే రోజు గురువారం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాహుల్ ఈజ్ బ్యాక్ ఇదిలా ఉండగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని సోమవారం పునరుద్దరించడంతో నాలుగు నెలల అనర్హత వేటు అనంతరం నిన్న ఆయన పార్లమెంటులో అడుగు పెట్టారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ప్రతిపక్ష కూటమి నేతలు సంబరాలు చేసుకొని.. రాహుల్కు ఘన స్వాగతం పలికారు. చదవండి: పంచాయతీ రాజ్ ప్రాముఖ్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు లోక్సభలో ఎవరి బలం ఎంత? కాగా లోక్సభలో మెజారిటీ మార్కు 272. లోక్సభలో ఎన్డీయే కూటమి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 301 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్సభలో 64 మంది తటస్థ ఎంపీలు ఉండగా.. ఆరు అయిదు స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది. ► లోక్సభలో మొత్తం సీట్లు : 543 ►ఖాళీగా ఉన్న స్థానాలు: 5 ► ప్రస్తుత లోక్ సభలో ఉన్న సభ్యులు: 537 ►ఎన్డీయే కూటమిబలం : 331 (లోక్ సభ స్పీకర్ తో కలిపి) ►బీజేపీ – 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ – 5, ఏడీపీ – 2, రాంవిలాస్ పార్టీ – 1, అజిత్ పవార్ కూటమి – 1, ఏజేఎస్ యూ – 1, ఎన్డీపీపీ – 1, ఎపీఎఫ్ – 1, ఎపీపీ – 1, ఎస్కేఎం – 1, ఎంఎన్ఎఫ్ – 1, స్వతంత్రులు(సుమలత, నవనీత్ కౌర్) – 2 ►విపక్ష ఇండియా కూటమి బలం: 143 ఎంపీలు ►కాంగ్రెస్ – 51, డీఎంకే – 24, టీఎంసీ – 23, జేడీయూ – 16, శివసేన (ఉద్దవ్ థాక్రే) – 6, శరద్ పవార్ – 4, ఎస్పీ – 3, సీపీఎం – 3, సీపీఐ – 2, ఆప్ – 1, జేఎంఎం – 1, ఆర్ఎస్పీ – 1, వీసీకే – 1, కేరళ కాంగ్రెస్ (మని) – 1 తటస్థ పార్టీల బలం : 63 ►వైఎస్సార్సీపీ-22, బీజేడీ – 12, బీఆర్ఎస్-9, ఎంఐఎం-2, బీఎస్పీ – 9, టీడీపీ – 3, ఎస్ఏడీ – 2, జేడీఎస్ 1, ఆర్ఎల్పీ 1, ఏఐయూడీఎఫ్ 1, ఇండిపెండెంట్ – 1. ఏ పార్టీకి ఎంత సమయం! లోక్సభలోని పార్టీ సభ్యుల బలం ఆధారంగా.. బీజేపీకి దాదాపు 6 గంటల 41 నిమిషాలు అవిశ్వాసంపై చర్చించేందుకు సమయం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి దాదాపు గంటా 15 నిమిషాల సమయం కేటాయించారు. వైఎస్సార్ సీపీ. శివసేన, జనతాదళ్ -యునైటెడ్ (జేడీయూ, బిజూ జనతాదళ్ (బీజేడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) , లోక్ జనశక్తి పార్టీకి (ఎల్జీపీ) కలిపి మొత్తం 2 గంటల సమయం ఇచ్చారు. ఇక ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 1 గంట 10 నిమిషాల కాల పరిమితిని నిర్ణయించారు. వీగిపోతుందని తెలిసినా.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2018లో తొలిసారి ప్రతిపక్షాలు మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. 325 ఎంపీల మద్దతుతో ఎన్డీయే కూటమి ఈ చర్చలో నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 126 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి కూడా బల పరీక్షలో కేంద్రం తేలిగ్గా గెలవగలదు. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినా.. మణిపూర్ అంశంపై ప్రధాని ఇంత వరకూ మాట్లాకపోవడంతో, ఇప్పుడైనా ఎలాగైనా స్పందిస్తారని ప్రతిపక్ష కూటమి ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. కీలకంగా మూడు రోజుల చర్చలు పార్లమెంట్లో మోదీ మాట్లాడాలని వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి విపక్ష పార్టీ సభ్యులు ఉభయసభలను అడ్డుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు వారాల నుంచి పార్లమెంట్ ఏ ఒక్క రోజూ కూడా సజావుగా సాగలేదు. ప్రతి రోజూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది. అయితే జులై 26న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్.. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. లోక్సభ ఒప్పుకుంది. ఆ తర్వాత చర్చకు లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ 3 రోజుల సమయం ఇచ్చింది. మరి ఈ మూడు రోజులు పార్లమెంట్ సమావేశాలు ఎలా సాగుతాయో వేచిచూడాలి. -
Rahul Gandhi: ఇలా జరిగితేనే లోక్సభలో అడుగుపెట్టేది
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నిజంగానే ఇవాళ ఊరట ఇచ్చింది. పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా.. ఆయన తన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ పోటీ చేసేందుకు వీలు కల్పిచింది. అయితే.. రాహుల్ గాంధీ ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే సభలో అడుగుపెడతారా? కేంద్రంపై అవిశ్వాస చర్చలో పాల్గొంటారా?.. లోక్సభ సెక్రటేరియెట్ ఏం చేయబోతుంది.. అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు. లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ జరగాలంటే.. సుప్రీం కోర్టు తన శిక్షను నిలుపుదల చేసిందని, కాబట్టి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ లోక్సభ కార్యదర్శికి రాహుల్ గాంధీ ఒక విజ్ఞప్తిని సమర్పించాలి. పనిలో పనిగా సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని సైతం జత చేయాల్సి ఉంటుంది. ఆ కాపీల ఆధారంగానే రాహుల్గాంధీ అనర్హత వేటును లోక్సభ ఎత్తేస్తుంది. ఆపై అధికారిక ప్రకటనచేస్తుంది. అయితే ఇది జరిగినా.. రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరణ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఫైజల్(లక్షద్వీప్) విషయంలోనూ ఇలాగే జరిగింది. హత్యాయత్నం కేసులో శిక్ష పడిన ఆయన సభ్యత్వం కోల్పోగా.. కేరళ హైకోర్టు ఆయన శిక్షపై స్టే విధించింది. అయితే రెండున్నర నెలల తర్వాతే లోక్సభ సెక్రటేరియెట్ ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాహుల్ విషయంలోనూ అదే జరగొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే ఫైజల్ కేసులో మరో ఆసక్తికరమైన పరిణామం ఉంది. ఆయన తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ మరికొద్ది గంటల్లో విచారణ జరగాల్సి ఉండగా.. లోక్సభ సెక్రటేరియెట్ హడావిడిగా ఆయన సభ్యత్వ పునరుద్ధరణ ప్రకటన చేసింది. ఇక రాహుల్ విషయంలో మాత్రం ఎలాంటి జాప్యం జరగొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇవాళ సుప్రీం కోర్టు స్టే ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీతో లోక్సభ స్పీకర్ను కలిశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి. వీలైనంత త్వరగా రాహుల్పై అనర్హత వేటు ఎత్తేసేలా లోక్సభ కార్యదర్శిపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మోదీ ఇంటి పేరు కేసు.. రాహుల్కు శిక్ష.. టైం లైన్.. ఏప్రిల్ 13, 2019.. కోలార్(కర్ణాటక) ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ.. ఇలా దొంగలందరికీ ఒకే ఇంటిపేరు (మోదీ) ఎందుకు ఉంటుంది..?’ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 15, 2019: రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్లోని సూరత్ ఎమ్మెల్యే, భాజపా నేత పూర్ణేశ్ మోదీ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. జులై 7, 2019: ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సూరత్ మెట్రోపాలిటన్ కోర్టుకు రాహుల్ గాంధీ తొలిసారి హాజరయ్యారు. మార్చి 23, 2023: మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మార్చి 24, 2023: రెండేళ్ల శిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఏప్రిల్ 2, 2023: మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఏప్రిల్ 20, 2023: రాహుల్ అభ్యర్థనను పరిశీలించిన సూరత్ సెషన్స్ కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఏప్రిల్ 25, 2023: సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. జులై 7, 2023: రాహుల్కు అక్కడ కూడా చుక్కెదురైంది. తీర్పుపై స్టే విధించాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. జులై 15, 2023: గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ స్టే విధించకుంటే భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు. జులై 21, 2023: హైకోర్టు ఆదేశాలను సవాలు చేసిన కేసులో గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4, 2023: రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సూరత్ కోర్టు కచ్చితంగా రెండేళ్లపాటు శిక్ష విధించడానికి కారణాలేంటో తెలియదని, దాని మూలంగానే రాహుల్పై అనర్హత వేటు పడిందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక్క రోజు తక్కువ శిక్ష వేసినా.. లోక్సభలో అనర్హత వేటు నుంచి ఆయన బయటపడేవారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. -
‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ విపక్ష కూటమి ఇండియాపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. గురువారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా.. బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాల తీరును తప్పుబట్టారాయన. ఢిల్లీ ఆర్డినెన్స్(సవరణ) బిల్లు-2023 రాజ్యాంగ బద్ధమే. కేంద్రానికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు ఆర్డినెన్స్ ప్రకారమే ఈ బిల్లు తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ దీనిని వ్యతిరేకిస్తోంది. దానికి కూటమి పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి. ఓట్లు, అధికారం కోసం కాదు. కూటమి కోసం కాదు.. ఢిల్లీ కోసం ఆలోచించండి. దేశం మంచి కోసం చేస్తున్న చట్టాల్ని వ్యతిరేకించొద్దు అంటూ విపక్షాలకు చురకలటించారాయన. 2015లో సేవ చేయాలనే ధ్యాస లేని ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే.. విజిలెన్స్ డిపార్ట్మెంట్ నియంత్రణ కోసం వాళ్లు పడుతున్న పాట్లు ఇవి. ఎందుకంటే బంగ్లాల కట్టడం లాంటి అవినీతిని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి.. అని ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారాయన. #WATCH | In the year 2015, a party came to power in Delhi whose only motive was to fight, not serve...The problem is not getting the right to do transfer postings, but getting control of the vigilance department to hide their corruption like building their bungalows: Union Home… pic.twitter.com/pelULwGMgH — ANI (@ANI) August 3, 2023 నెహ్రూను నేనేం పొగడలే! పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గురువారం లోక్సభ సెషన్లో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. భారత సమాజ వ్యవస్థాపకులైన జవహార్లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభ్భాయ్ పటేల్, సీ రాజగోపాలచారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్లు.. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను వ్యతిరేకించినవాళ్లే అని అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ‘‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను చూస్తోంది నిజమేనా?. ఇది పగలా లేక రాత్రా?.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన(అమిత్ షా) నోట్లో లడ్డూ పెట్టాలని ఉంది. ఎందుకంటే అమిత్ షా నెహ్రూను, కాంగ్రెస్ను పొగిడారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే షా జోక్యం చేసుకని.. తానేం నెహ్రూని పొగడలేదని స్పష్టత ఇచ్చారు. ‘‘పండిట్ నెహ్రూను నేను పొగడలేదు. ఆయన ఏం చెప్పారో.. అదే ప్రస్తావించా. దానిని వాళ్లు పొగడ్తగా భావిస్తే.. నాకేం అభ్యంతరం లేదు’’ అని బదులు ఇచ్చారు. దీంతో రంజన్ మరోసారి జోక్యం చేసుకుని షా వ్యాఖ్యలకు కొనసాగింపుగా మాట్లాడారు. -
పార్లమెంట్ అంతరాయాలు.. మధ్యే మార్గం ద్వారా పరిష్కారం?
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగటం లేదు. ఈ తరుణంలో అంతరాయాలు లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ‘ఇండియా’ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అంతరాయాన్ని ఛేదించడానికి, రాజ్యసభలో మణిపూర్పై చర్చ జరగడానికి ఇండియా కూటమి పార్టీలు ఆ సభా నాయకుడికి మధ్యే మార్గం పరిష్కారాన్ని అందించాయి. మోదీ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. దీంతో ఆ ప్రతిపాదన ఏమై ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. INDIA parties have offered a middle path solution to the Leader of the House to break the logjam and get a discussion on Manipur going in an uninterrupted manner in the Rajya Sabha. Hope the Modi government agrees. — Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. సభలు పట్టుమని పూట సరిగ్గా నడిచిన దాఖలాలు లేవు. మణిపూర్ అంశంపై రూల్ నెంబర్ 267 ద్వారా సుదీర్ఘ చర్చకు పట్టుబడుతూ.. ప్రధాని మోదీ మణిపూర్ శాంతిభద్రతలపై ప్రసంగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. కేంద్రం మాత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ప్రసంగిస్తారని, అదీ రూల్ నెంబర్ 176 ప్రకారం స్వల్ప కాలిక చర్చకే సిద్ధమని కరాకండిగా చెబుతోంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసనల హోరు కొనసాగుతుంది. అధికార పార్టీ తరపు నుంచి ఫ్లోర్ లీడర్లు.. విపక్ష నేతలతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ఒక అడుగు వెనక్కి వేసి మధ్యే మార్గ పరిష్కారంతో ముందుకు రావడం గమనార్హం. -
అప్పటిదాకా లోక్సభకు రాను: స్పీకర్ ప్రకటన
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో ఇవాళ(బుధవారం) కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే లోక్సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారాయన. ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి సెషన్కు సైతం ఆయన హాజరు కాలేదు. అధ్యక్ష స్థానంలో మరొకరు బాధ్యతలు నిర్వహించారు కూడా. అయితే.. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్ నినాదాల నడమే ఇవాళ్టి లోక్సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్ అంశంపై సుదీర్ఘ చర్చ జరగాలనిRule 267.. ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. స్వల్పకాలిక చర్చతోRule 176 సరిపెడతామని, అదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడతారంటూ కేంద్రం చెబుతోంది. Lok Sabha Speaker Om Birla has expressed deep displeasure with both the ruling party and the opposition over the functioning of the House. Birla told both sides that he will not come to Lok Sabha until MPs behave according to the dignity of the House. Even today, when the… — ANI (@ANI) August 2, 2023 -
‘ప్రధాని మోదీ రావాలి.. మాట్లాడాలి’
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి.. సమాధానం ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెప్పారు. ప్రధానమంత్రి మొండి వైఖరిని నిరసిస్తూ నల్లరంగు దుస్తులు ధరించి పార్లమెంట్కు హాజరయ్యారు. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం సైతం వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. మోదీ మౌనాన్ని వీడాలని, మణిపూర్ హింసపై నోరు విప్పాలని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అధికార బీజేపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖనిజ చట్ట సవరణ బిల్లును, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జన్విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత జన్విశ్వాస్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. 76 కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. అనంతరం లోక్సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ భేటీని బహిష్కరించిన ఎంపీలు రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. మణిపూర్ అంశంపై ప్రధాని వైఖరికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. రాజ్యసభ బీఏసీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సమావేశాన్ని జైరాం రమేశ్(కాంగ్రెస్), మీసా భారతి(ఆర్జేడీ), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ) బహిష్కరించారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సభ్యుడు కేశవరావు గైర్హాజరయ్యారు. దేశాన్ని విభజిస్తున్నారు: రాహుల్ దేశాన్ని విభజించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసికట్టుగా కుట్రపన్నుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ప్రజల దుఃఖం బాధ వారికి పట్టడం లేదు. అధికారం తప్ప వారికి మరి దేనిపైనా ఆసక్తి లేదు’ అని అన్నారు. యువజన కాంగ్రెస్ గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్లో పాల్గొని ప్రసంగించారు. ‘బీజేపీ–ఆర్ఎస్ఎస్కి కావాల్సింది అధికారమే. దాని కోసం ఏమైనా చేస్తారు. అధికారం కోసం వారు మణిపూర్ను రావణకాష్టంలా మారుస్తారు. యావత్ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తారు. దేశ ప్రజల బాధ, శోకం వారికి పట్టదు’ అని తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. ‘మీరు ఒక వైపు కూర్చొని ప్రేమను పంచుతూ ఉంటారు. దేశానికి, దేశ ప్రజలకి గాయమైతే మీకూ ఆ నొప్పి తెలుస్తుంది. కానీ వాళ్లకి అలాంటి భావాలే లేవు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రజల బాధ ఏంటో తెలీదు. వాళ్లు దేశాన్ని విభజించే పనిలో బిజీ’ అని అన్నారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మణిపూర్లో మంటలు చెలరేగుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ప్రయ తి్నస్తుండగా, అధికారపక్ష ఎంపీలు అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్షాల తీరును ఆయన తప్పుపపట్టారు. దాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఒక సమయంలో ప్రతిపక్ష సభ్యులు ‘ఇండియా, ఇండియా’ అంటూ నినాదాలు చేయగా, బీజేపీ సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినదించారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. -
27సార్లు అవిశ్వాసాలు.. ఒక్కటీ నెగ్గలేదు
స్వతంత్ర భారత చరిత్రలో లోక్సభలో ఇప్పటిదాకా ఏకంగా 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెగ్గలేదు. వాటి కారణంగా ఒక్కసారి కూడా కేంద్రంలో ప్రభుత్వం పడిపోలేదు. అయితే ప్రభుత్వమే కోరి తెచ్చుకునే విశ్వాస పరీక్షల్లో మాత్రం కనీసం మూడుసార్లు ప్రభుత్వాలు పడిపోయినట్టు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన సంస్థ పేర్కొంది. ఇందిరపై అత్యధికంగా 15 ‘అవిశ్వాసాలు’ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రధాని హయాంలో ఇదే అత్యధికం! ► ఇందిరపై తొలి అవిశ్వాసాన్ని 1966లో ఆమె అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు దిగ్గజం హీరేంద్రనాథ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపీలే మద్దతివ్వగా 270 మంది వ్యతిరేకించారు.1966లోనే ఆమెపై రెండో అవిశ్వాసమూ వచి్చంది. తర్వాత 1967, 1968 (రెండుసార్లు), 1969, 1970, 1973, 1974 (రెండుసార్లు), 1975 (రెండుసార్లు–రెండోసారి ఎమర్జెన్సీ విధింపుకు కేవలం నెల రోజుల ముందు), 1976, 1978, 1981 (రెండుసార్లు), 1982ల్లో ఇందిరపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ► 1976లో ఇందిర ప్రభుత్వంపై బీజేపీ (నాటి జనసంఘ్) మేరునగం అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టడం విశేషం! దానికి ఏకంగా 162 మంది ఎంపీలు మద్దతిచ్చారు! ఒక అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచి్చన అత్యధిక ఓట్లు ఇవే. 257 మంది వ్యతిరేకంచడంతో తీర్మానం వీగిపోయింది. ఇదీ చరిత్ర... ► స్వతంత్ర భారత చరిత్రలో తొట్టతొలి అ విశ్వాస తీర్మానం 1963లో లోక్సభ తలుపు తట్టింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్కే చెందిన ఆచార్య కృపాలనీ దీన్ని ప్రవేశపెట్టడం విశేషం. 1962లో చైనాతో యుద్ధంలో ఓటడిన వెంటనే కృపాలనీ ఈ చర్యకు దిగారు. దీనిపై ఏకంగా 4 రోజుల పాటు 20 గంటలకు పైగా చర్చ జరిగింది. కేవలం 62 మంది ఎంపీలు మాత్రమే దీన్ని సమరి్థంచారు. 347 మంది వ్యతిరేకించడంతో చివరికి తీర్మానం వీగిపోయింది. ► లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంపై 1964లో ఎన్సీ ఛటర్జీ 1965లో ఎస్.ఎన్.ది్వవేది, స్వతంత్ర పార్టీ ఎంపీ ఎం.ఆర్.మసానీ ప్రవేశపెట్టారు. ► 1979లో లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామాకు దారితీసింది. తీర్మానంపై ఓటింగ్ జరగక చర్చ అసంపూర్తిగా మిగిలిపోయినా ఆయన స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం! ► 2003లో వాజ్పేయీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్ష నేత హోదాలో నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కేవలం 189 మంది ఎంపీలు మద్దతివ్వగా, 314 మంది వ్యతిరేకించారు. దాంతో 21 గంటల చర్చ అనంతరం తీర్మానం వీగిపోయింది. ► 2018 మోదీ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి 135 మంది ఎంపీలు మద్దతివ్వగా 330 మంది వ్యతిరేకించారు. పీవీపై మూడుసార్లు తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రభుత్వం మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొంది! తొలిసారి 1992లో బీజేపీ ఎంపీ జశ్వంత్సింగ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలపై లోక్సభ వేదికగా నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం జరిగింది. ఏకంగా 225 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతిచ్చారు. 271 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయి పీవీ సర్కారు ఊపిరి పీల్చుకుంది! 1992లోనే పీవీ ప్రభుత్వంపై వాజ్పేయీ, 1993లో అజయ్ ముఖోపాధ్యాయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాజీవ్ సర్కారుపై మన ఎంపీ మాధవరెడ్డి... ► 1987లో రాజీవ్గాంధీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ టీడీపీ ఎంపీ సి.మాధవరెడ్డి కావడం విశేషం! అయితే అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంట్లో మణిపూర్ మంటలు.. లోక్సభ రేపటికి వాయిదా
Updates.. ► మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్ సభ మరోసారి దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్సభ రేపటికి వాయిదా పడింది. ► మణిపూర్ అంశంపై తప్పుకుండా చర్చిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. లోక్సభలో మణిపూర్ అంశంపై చర్చను జరగనీయాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ సున్నితమైన అంశానికి సంబంధించిన వివరాలను దేశ ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా చెప్పారు. ► మణిపూర్ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వెల్లోకి దూసి ఆయనపైకి ఫ్లకార్డ్లతో నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనల నడుమ లోక్సభ రేపటికి వాయిదా పడింది. #WATCH | Rajya Sabha Chairman suspends AAP MP Sanjay Singh for the remaining duration of the Monsoon session during the Opposition's protest in the House over the Manipur issue pic.twitter.com/YpNYIhhMck — ANI (@ANI) July 24, 2023 ► ఈ క్రమంలో ధన్కర్.. సంజయ్ సింగ్ను సభ నుంచి సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ధన్కర్ స్పష్టం చేశారు. ► మళ్లీ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో రెండు సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ► లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. ► మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ వాయిదా. #MonsoonSessionofParliament | Rajya Sabha adjourned till 12 noon. — ANI (@ANI) July 24, 2023 ► లోక్సభలో ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసనలు.. Opposition MPs with placards 'INDIA for Manipur' and 'INDIA demand PM statement on Manipur' in Lok Sabha as the session gets underway pic.twitter.com/uHcmyheJDI — ANI (@ANI) July 24, 2023 ► లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మణిపూర్కు చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. "We are ready for discussion in Parliament," says Defence Minister Rajnath Singh in Lok Sabha as opposition MPs demand PM Modi's statement on Manipur#MonsoonSession pic.twitter.com/36t74wKlBL — ANI (@ANI) July 24, 2023 ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 140 కోట్ల మంది ప్రజల నాయకుడు(ప్రధాని మోదీ) పార్లమెంటు వెలుపల ప్రకటన చేశారు. అలాగే, ప్రజాప్రతినిధులు కూర్చునే పార్లమెంటులో కూడా ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు. #WATCH | "We are ready...If the leader of 140 crore people makes a statement outside the Parliament, then he should make a statement in the Parliament where people's representatives sit," says LoP Rajya Sabha & Congress President Malliakarjun Kharge. pic.twitter.com/QtT5JiNYAO — ANI (@ANI) July 24, 2023 ► టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. మణిపూర్ దారుణ ఘటనలో సోషల్ మీడియాలో మేము చూసిన విజువల్స్ చాలా కలవరపెడుతున్నాయి. మణిపూర్పై సభలో చర్చను ప్రధాని మోదీ కోరుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిని మళ్లిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అసమర్థమైనది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ► ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ ఘటన మహిళలకు సంబంధించిన విషయం. ఇదేమీ రాష్ట్రాల మధ్య పోటీ కాదు. ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలో జరిగినా అది తప్పే అవుతుందన్నారు. #WATCH | NCP MP (Sharad Pawar faction) Supriya Sule on Manipur viral video, says, "This is about women, not a competition between States. Such a thing happening in any state is wrong." pic.twitter.com/YCdnaF40VR — ANI (@ANI) July 24, 2023 ► పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. #WATCH | Congress Parliamentary Party Chairperson and Lok Sabha MP Sonia Gandhi arrives at the Parliament. #MonsoonSession pic.twitter.com/PPzBrtXlA9 — ANI (@ANI) July 24, 2023 ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మరోసారి మణిపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు మణిపూర్పై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ► ఇటు, అధికార బీజేపీ పార్లమెంట్ సభ్యులు.. పలు రాష్ట్రాలకు మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. #WATCH | Opposition parties (I.N.D.I.A) protest in Parliament demanding PM Modi's statement on Manipur in both houses. pic.twitter.com/b8kjFA7UUB — ANI (@ANI) July 24, 2023 ► రాజస్థాన్కు చెందిన ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. వీరంతా రాజస్థాన్లో జరుగుతున్న క్రైమ్స్, మహిళలపై దాడులను ఖండిస్తూ నిరసనలు తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Delhi: BJP Rajasthan MPs along with senior leaders hold a protest in front of the Gandhi statue. The protest is against issues of rising atrocities and crime against women in the state. pic.twitter.com/ruyKBbsZEM — ANI (@ANI) July 24, 2023 ► ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభల్లో మాట్లాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. మణిపూర్ శాంతి నెలకోల్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. మణిపూర్ విషయంలో కేంద్రం తీరుకు మేము ఈరోజు నిరసనలు తెలుపుతాము. రాజ్యసభ ఛైర్మన్ చర్చకు అనుమతించాలని కోరారు. #WATCH | AAP MP Raghav Chada says "The country demands that the Govt and PM Modi should speak on the issue of Manipur. It is the responsibility of the Central govt to restore peace in the country. Today we are going to protest against this issue in the Parliament. Rajya Sabha… pic.twitter.com/bHGAVZMqOF — ANI (@ANI) July 24, 2023 ► ‘ఇండియా’.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనకు దిగారు. మణిపూర్ అంశంపై ఉభయ సభల్లో ప్రధాని చర్చకు రావాలని డిమాండ్ చేశారు. #WATCH | Opposition parties (I.N.D.I.A) protest in Parliament demanding PM Modi's statement on Manipur in both houses. pic.twitter.com/zhX9ZKMtal — ANI (@ANI) July 24, 2023 ► కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నాం. చర్చల నుంచి ఎందుకు పారిపోతున్నారు? వారి వ్యూహాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు అని అన్నారు. #WATCH | We request the Opposition to take part in structured and constructive discussions in the Parliament. Why are they running away from discussions? Nobody is able to understand their strategy: Union minister Pralhad Joshi on Manipur issue pic.twitter.com/CQrNoMZP3W — ANI (@ANI) July 24, 2023 #WATCH | Delhi: On BJP's protest against rising atrocities & crime against women in Rajasthan, BJP MP Ravi Kishan says, "We demand the resignation of Rajasthan CM Ashok Gehlot. The atrocities on Dalits (women) need to be stopped. The atrocities have tremendously increased and so… pic.twitter.com/bLrZPf6ADf — ANI (@ANI) July 24, 2023 -
పార్లమెంట్లో మణిపూర్ మంటలు
-
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
Updates.. ►పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మణిపూర్ ఘటనపై చర్యలు విపక్షాలు పట్టుపట్టడంతో.. ఆందోళనలతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. ►మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు ► రాజ్యసభ సభలో గందరగోళం నెలకొంది. మణిపూర్ ఘటనపై చర్చకు టీఎంసీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో మణిపూర్ ఘటనపై సభలో మోదీ ఎందుకు మాట్లాడరని టీఎం సభ్యులు ప్రశ్నించారు. దీంతో, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ► మణిపూర్ ఘటనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై ఒవైసీ పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్గా మారిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. అక్కడ నరమేధం జరుగుతోంది. మణిపూర్ సీఎంను తొలగించి, సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించినప్పుడే న్యాయం జరుగుతుంది అని అన్నారు. #WATCH | Speaking on Manipur, AIMIM MP Asaduddin Owaisi says, "...PM was compelled to react on the video because it has become viral now...Genocide is going on there...Justice will prevail only when the CM is removed and the PM orders CBI inquiry." pic.twitter.com/L2ZZTpBALe — ANI (@ANI) July 20, 2023 ► కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. #WATCH | Congress Parliamentary Party Chairperson and MP Sonia Gandhi arrives at the Parliament#MonsoonSession2023 pic.twitter.com/DkGPk2hOY8 — ANI (@ANI) July 20, 2023 ► మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ వాయిదా. Lok Sabha adjourned till 2 pm as a mark of respect to the Members of the House who passed away recently. pic.twitter.com/yujVzqf9um — ANI (@ANI) July 20, 2023 ► మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా. ► ఇటీవల కన్నుమూసిన పార్లమెంట్ సభ్యులకు నివాళిగా రెండు సభాలు వాయిదా. Rajya Sabha adjourned till 12 noon as a mark of respect for sitting MP Hardwar Dubey who passed away in June. pic.twitter.com/2JkEzrZ5Zc — ANI (@ANI) July 20, 2023 ► ఆప్ ఎంపీగా లోక్సభలో సుశీల్ కుమార్ రింకూ ప్రమాణం చేశారు. ► పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. స్పీకర్ స్థానంలో ఓం బిర్లా కూర్చుని సెషన్స్ని ప్రారంభించారు. AAP's Sushil Kumar Rinku takes oath as a Member of the Parliament, in Lok Sabha. pic.twitter.com/LwpP6DKvIz — ANI (@ANI) July 20, 2023 ► మణిపూర్ ఘటనపై మోదీ సీరియస్ అయ్యారు. ► మణిపూర్ ఘటన బాధాకరం. ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటన కలచివేసింది. మణిపూర్ రేపిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ► మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. మణిపూర్ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. Speaking at the start of the Monsoon Session of Parliament. https://t.co/39Rf3xmphJ — Narendra Modi (@narendramodi) July 20, 2023 సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక, పార్లమెంట్ సమావేశాల సందర్బంగా సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. -
‘పార్లమెంట్లో రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి’
సాక్షి, ఢిల్లీ: నేటి(గురువారం) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం అంటూ కామెంట్స్ చేశారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్లో.. ‘ఈరోజు నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్పాదకతతో సాగుతాయని ఆశిస్తున్నాను. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలి. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం. ప్రత్యేకించి రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి’ అని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు. I am hoping that the Monsoon Session of Parliament commencing today will be highly productive. It would be good if constructive discussion is held on all the bills to be tabled by the Government. There shall also be discussions on the issues concerning the people of the country… — Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2023 ఇదే సమయంలో బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై ట్విట్టర్ వేదికగా కామెంట్స చేశారు. ఈ సందర్భంగా..‘ఢిల్లీలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది’ అని తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. pic.twitter.com/554M6h5sB5 — Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2023 ఇది కూడా చదవండి: ముగిసిన అఖిలపక్ష భేటీ.. సహకరించాలని విపక్షాలకు ప్రభుత్వం వినతి.. -
జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు
-
పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎంపీల వినతి మేరకే షెడ్యూల్కు రెండు రోజులు ముందుగానే నిరవధికంగా వాయిదా వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 12 కంటే ముందుగానే ముగించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, సభను నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సభలో చర్చ జరగాలంటూ బయటకు చెప్పుకుంటూ అంతరాయం కలిగించడం, వాకౌట్ చేయడం ప్రతిపక్షాల ఎజెండాగా మారిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా వర్షాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే 4 రోజులు కాదు, 2 రోజులు ముందుగా వాయిదా వేశాం. ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని పేర్కొన్నారు. చదవండి: నితీశ్కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ సభలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందిస్తూ..‘అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక కుటుంబం వ్యక్తిగత సమస్యలపై పార్లమెంట్ సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రయోజనాల కంటే ఒక కుటుంబాన్ని రక్షించడానికే ఎక్కువ ఆసక్తి చూపారు’అని ఎత్తిపొడిచారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ని ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: నలుగురికి కోవిడ్ పాజిటివ్.. భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం TMC leader @derekobrienmp should stop preaching about democratic values and the sanctity of institutions. The people of Bengal have elected BJP as the main opposition but TMC, in its arrogance, has denied BJP the post of PAC Chairman. https://t.co/YeKpYJdXWE — Pralhad Joshi (@JoshiPralhad) August 8, 2022 -
‘ఏపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు’
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఎలాంటి సందర్భాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. స్పిల్వే, అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, కాంక్రీట్ డ్యామ్ (గ్యాప్–3), డయాఫ్రమ్ వాల్ ఆఫ్ ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్–ఈసీఆర్ఎఫ్ (గ్యాప్–3) వంటి అనేక కీలక నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఈ ఏడాది జూన్ వరకు హెడ్ వర్క్స్ 77%, ఎడమ మెయిన్ కెనాల్ 72%, కుడి మెయిన్ కెనాల్ 93% పనులు పూర్తయ్యాయని అన్నారు. కాగా, పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. షెడ్యూల్ కంటే ముందుగానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. -
రాజ్యసభ నుంచి 19మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
-
రాజ్యసభలో 19 విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నందున 19 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభా కార్యకలాపాలను అడ్డుకొని, నిబంధనలను ఉల్లంఘించినందుకు వారం రోజులపాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో ఏడుగురు టీఎంసీ ఎంపీలు, తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, అయిదుగురు డీఎంకే ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తెలంగాణ నుంచి బడుగు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర రావు సస్పెండ్ అయ్యారు. కాగా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఉభయ సభల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా ప్రధానమంత్రి డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 5,000 మంది కాశ్మీరీ వలసదారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించినట్లు కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ‘ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద, 5,502 కాశ్మీరీ వలసదారులు ప్రభుత్వ ఉద్యోగాలను అందించాం. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ద్వారా లోయలో వివిధ విభాగాల్లో నిమగ్నమై ఉన్న కాశ్మీరీ వలస ఉద్యోగుల కోసం 6000 ట్రాన్సిట్ అకామిడేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది’ అని లోక్సభలో నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా తెలిపారు. చదవండి: ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
లోక్సభలో గందరగోళం.. నినాదాలతో హోరెత్తిస్తున్న విపక్షాలు
-
పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
-
మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు: ఎంపీ వంగా గీత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ఫిషింగ్ హార్బర్ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత కోరారు. ఈ మేరకు రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని తెలిపారు. అన్నవరం నుంచి జీఎంఆర్ఎస్ఈజడ్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు ఇతర అభివృద్దికి కేంద్రం సహకరించాలని కోరారు. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని, కేంద్రం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదని, డిజైన్లలో కరెక్షన్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే అత్యంత ముఖ్యమని, జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రూ. 20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతుందన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాంమని, ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన రామాయపట్నం పోర్ట్ పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ పోర్ట్ నిర్మిస్తోందన్నారు. రామాయపట్నం పోర్టును కేంద్రమే నిర్మించాలని కోరినట్లు గుర్తు చేశారు. అయిదు వేల కోట్ల రూపాయలతో పోర్ట్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని, దీని వల్ల నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతందని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పోర్ట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
Parliament First day: ఏపీ ఇన్ పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఖాతాదారుల లాకర్ల విషయంలో బ్యాంకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ చెప్పారు. లోక్సభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం తదితర అంశాల్లో లాకరు వార్షిక అద్దెకు వందరెట్లను ఖాతాదారుకు బ్యాంకులు చెల్లించాలనే నిబంధన ఆర్బీఐ చేర్చిందని చెప్పారు. ఏపీ రిసోర్సు గ్యాప్ రూ.4,117.89 కోట్లు చెల్లించాం రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్కు రిసోర్స్ గ్యాప్ రూ.4,117.89 కోట్లు మాత్రమేనని, ఆ మొత్తాన్ని విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌధరి చెప్పారు. 2014–15లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ రూ.22,949 కోట్లు ఉందా అని వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు మంత్రి కాదని జవాబిచ్చారు. 2014–15లో 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,079 కోట్లు అని ఆంధ్రప్రదేశ్ తెలిపిందని చెప్పారు. 2014–15 ఏపీ, తెలంగాణల అకౌంటెంట్ జనరల్ ప్రచురించిన స్టేట్ ఫైనాన్స్ అకౌంట్స్లో ఆ కాలానికి రెవెన్యూలోటు రూ.13,775.76 కోట్లని తెలిపారు. నీతి ఆయోగ్ వాస్తవ అంచనా ప్రకారం కొత్త పథకాలపై వ్యయం, నెలవారీ పింఛను పెంపు ప్రభావంతో రూ.11,960.87 కోట్లు అనుమతించలేదన్నారు. 2013–14కి సంబంధించిన బకాయిలు రూ.91.27 కోట్లను 2014–15 రిసోర్సు గ్యాప్లో చేర్చినట్లు తెలిపారు. ఈ మేరకు 2014–15లో పేర్కొన్న కాలానికి రిసోర్సు గ్యాప్ రూ.4,117.89 కోట్లుగా తేలిందని, ఆమొత్తాన్ని రాష్ట్రానికి విడుదల చేశామని చెప్పారు. అనంతరం ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డిస్కంలకు ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ బాండ్స్ నిమిత్తం రూ.1,500 కోట్లను ఈ ఏడాది మార్చి 21న విడుదల చేసినట్లు తెలిపారు. 7 పాలిటెక్నిక్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో 2017–18 నుంచి 2021–22 మధ్య ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జవాబిచ్చారు. ఏనుగుల కదలికల గుర్తింపునకు డ్రోన్లు ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల కదలికలు గుర్తించేందుకు డ్రోన్లు వినియోగించడానికి ప్రాజెక్టు ఎలిఫెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం అమలు చేస్తున్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే చెప్పారు. 2020–21లో రూ.4 లక్షలు, 2021–22లో రూ.3.5 లక్షలు డ్రోన్లు కొనుగోలుకు విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ–శ్రమ్ పోర్టల్లో 2.76 కోట్లమంది డొమెస్టిక్ వర్కర్లు నమోదు ఈ–శ్రమ్ పోర్టల్లో దేశవ్యాప్తంగా 2.76 కోట్లమంది డొమెస్టిక్ వర్కర్లు నమోదు చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిచ్చారు. 33 శాతం సంస్థలు సీఎస్ఆర్ నిధులు ఖర్చు ఆంధ్రప్రదేశ్లో 33 శాతం సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు ఖర్చుచేసినట్లు సీఎస్ఆర్ డాటా విశ్లేషణలో తేలిందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బెల్లాన చంద్రశేఖర్, గొడ్డేటి మాధవి, మద్దిళ్ల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 2019–20లో రూ.710 కోట్లు, 2020–21లో రూ.662 కోట్లను సంస్థలు ఖర్చు చేశాయని చెప్పారు. మూలధన వ్యయం నిమిత్తం ఏపీకి సాయం మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు 2021–22లో రూ.501 కోట్లు, 2020–21లో రూ.688 కోట్లు ప్రత్యేక సాయంగా ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ సభ్యులు మిథున్రెడ్డి, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. పెరుగుతున్న కార్మికుల సంఖ్య అందుబాటులో ఉన్న డాటా ప్రకారం పదేళ్లుగా దేశంలో కార్మికుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు. వెనకబడిన జిల్లాలకు రూ.1,750 కోట్లు విడుదల ఏపీ విభజన చట్టాన్ని అనుసరించి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు రూ.1,750 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,049.34 కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీతావిశ్వనాథ్, పి.వి.మిథున్రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. 2022–23లో కేజీబీవీల కేటాయింపు లేదు ఆంధ్రప్రదేశ్కు 2022–23లో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలను కేటాయించలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 499 కేజీబీవీలు ఉన్నాయని తెలిపారు. ఏపీ విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్లో జాతీయ ప్రాధాన్యం ఉన్న పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఐఐటీ–తిరుపతి, ఎన్ఐటీ–తాడేపల్లిగూడెం, ఐఐఎం–విశాఖపట్నం, ఐసెర్–తిరుపతి, కేంద్రీయ విశ్వవిద్యాలయం–అనంతపురం, పెట్రోలియం యూనివర్సిటీ–విశాఖపట్నం, వ్యవసాయ వర్సిటీ–గుంటూరు ఇప్పటికే కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీ నుంచి నాబార్డుకు ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ రహదారుల అభివృద్ధి నిమిత్తం 2021–22, 2022–23ల్లో నాబార్డుకు ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కారద్ తెలిపారు. 2021–22లో గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని ఆరు రహదారులు ప్రతిపాదించగా రెండు రహదారులకు అనుమతి రాలేదని, 2022–23లో గుంటూరు జిల్లాలోని రహదారి ప్రతిపాదనలు కార్యాచరణ దశలో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీలో యువకళాకారులకు ఉపకారవేతనాలు ఆంధ్రప్రదేశ్లో వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ‘స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్, ఫెలోషిప్తోపాటు స్కాలర్షిప్–ఫెలోషిప్ పథకం ద్వారా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. 2019–20, 2020–21, 2021–22ల్లో రూ.55 కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్ ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 48 ఎస్హెచ్ఐలు వొకేషనల్ విద్యలో శిక్షణ నిమిత్తం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 48 స్కిల్ హబ్స్ ఇనిషియేటివ్ (ఎస్హెచ్ఐ)లు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి -
అన్పార్మమెంటరీ పద జాబితాపై కాంగ్రెస్ విమర్శలు
-
ఇకపై ఇలాంటి పదాలు పార్లమెంట్లో నిషిద్ధం.. కాదని మాట్లాడితే..
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సభ్యులు ఇకపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కుదరదు. అభ్యంతరకర పదాలు వాడితే చర్యలు తప్పవు. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలు వాడడానికి వీల్లేదు. వీటిని అన్పార్లమెంటరీ పదాలుగా గుర్తిస్తారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఒక బుక్లెట్ విడుదల చేసింది. లోక్సభ, రాజ్యసభలో అన్పార్లమెంటరీ పదాలు వాడొద్దని ఎంపీలకు సూచించింది. బ్లడ్షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, చంచా, చంచాగిరి, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్లీడ్, లై, అన్ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్గేట్ వంటి ఆంగ్ల పదాలను ఇందులో చేర్చారు. అసత్య, అహంకార్, గిర్గిట్, గూన్స్, అప్మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్కట్, లాలీపాప్, విశ్వాస్ఘాత్, సంవేదన్హీన్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ, బాల్బుద్ధి వంటి హిందీ పదాలు కూడా బుక్లెట్లో చోటు చేసుకున్నాయి. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. -
ప్రధాని దేశాన్ని అమ్మేస్తున్నారు: రాహుల్
విజయ్చౌక్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. వాస్తవం చెప్పాలంటే దేశంలోని 60 శాతం ప్రజల దృష్టిలో అసలు పార్లమెంటు సమావేశాలే జరగలేదు. దేశంలో 60 శాతం ప్రజల గొంతును నొక్కేశారు. అవమానించారు. బుధవారం రాజ్యసభలో భౌతికదాడులు చేశారు. పెగసస్ అంశంపై చర్చించాలని అడిగితే ప్రభుత్వం నిరాకరించింది. రైతుల సమస్యలను మేం పార్లమెంటు వెలుపల లేవనెత్తాం. ఎందుకంటే మేం సభలోపల లేవనెత్తలేకపోయాం. పెగసస్ అంశాన్ని కూడా పార్లమెంటు వెలుపలే లేవనెత్తాం. అది కూడా పార్లమెంటులో లేవనెత్తలేకపోయాం. పార్లమెంటులో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు కాబట్టి ఈరోజు మీ (మీడియా) ముందుకు వచ్చాం. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కంటే ఇది తక్కువ కాదు’ అని రాహుల్ అన్నారు. ‘రాజ్యసభలో తొలిసారి సభ్యులపై దాడి చేశారు. బయటి నుంచి వ్యక్తులను తీసుకొచ్చి భౌతిక దాడులు చేయించారు. రాజ్యసభ ఛైర్మన్ కంట తడి పెట్టారని మీడియా అంటోంది. ఆయన బాధ్యత ఏంటి? సభను నడిపించడం. ఇన్ని రోజులు ఎందుకు నడిపించలేకపోయారు? సభాపతి ఎందుకు నిర్వహించలేకపోయారు? విపక్షాల వాణిని ఎందుకు విననివ్వలేదు? మీకు, దేశానికి చెప్పదలుచుకున్నా. సభలో విపక్షాలను ఎవరు, ఏరకంగా ఆపుతున్నారు? ఈరోజు మీ ఫోన్లో పెగసస్ సాఫ్ట్వేర్ ఉంది. ఈ దేశ ప్రధాని దేశాన్ని అమ్మేసే పనిలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు వ్యాపారులకు ఈ దేశ ఆత్మను అమ్మేస్తున్నారు. అందుకే విపక్షాలను సభలో రైతుల గురించి గానీ, నిరుద్యోగుల గురించి గానీ, ఇన్సూరెన్స్ బిల్లు గురించి గానీ, పెగసస్ గురించి గానీ మాట్లాడనివ్వడం లేదు. ఇది వాస్తవం. దేశ ప్రధాన మంత్రి దేశాన్ని అమ్మేస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
పన్ను చట్టాల సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ
-
పార్లమెంటు ముందుకు మరో నాలుగు బిల్లులు
-
మెట్టు దిగని విపక్షాలు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా, కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు పట్టిన పట్టు వీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గురువారం సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లోక్సభ ఉదయం ప్రారంభం కాగానే స్పీకర్ బిర్లా టోక్యో ఒలింపిక్ క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత పతకం సాధించిన భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేశారు. పలు క్రీడల్లో పతకాలు సొంతం చేసుకున్న భారత మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి చేరుకొని నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాల నిరసన కొనసాగుతుండగానే 10 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలను సభ్యులు అడిగారు. ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉందని, ఇందులో పాలుపంచుకోవాలని స్పీకర్ కోరారు. పార్లమెంట్ సభా సంప్రదాయాలను ఉల్లంఘించవద్దని సూచించారు. పార్లమెంట్ సమావేశాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, సభ ఎందుకు సాగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు లెక్కచేయకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటనను సభలో లేవనెత్తారు. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత అధిర్ రంజన్ దీనిపై మళ్లీ మాట్లాడారు. దళిత బాలిక వ్యవహారంపై కాంగ్రెస్ వాదనను కేంద్ర సహాయ మంత్రి మేఘవాల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. ఇన్కం యాక్ట్ ఆఫ్ 1961, ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ 2012కు సవరణ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఎగువ సభలో రెండు బిల్లులకు ఆమోదం తమ డిమాండ్లపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. పెగసస్, కొత్త సాగు చట్టాలపై సభలో చర్చించాలని పేర్కొన్నారు. వారి ఆందోళనలు, నినాదాల కారణంగా సభను సభాపతి పలుమార్లు వాయిదా వేశారు. ఒకవైపు విపక్షాల నినాదాలు కొనసాగుతుండగానే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ‘ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను గురువారం లోక్సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై పర్యావరణ మంత్రి భూపేందర్ రాజ్యసభలో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వాయు కాలుష్యానికి కారణమైన వారికి సెక్షన్ 14 కింద జరిమానా విధిస్తారని, పంటల వ్యర్థాలను దహనం చేసే రైతులకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. ఈ బిల్లు వాయు కాలుష్యానికి సంబంధించినదని, సభలో మాత్రం శబ్ద కాలుష్యం ఉందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. -
లోక్సభలో ‘పెగసస్’ మంటలు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో ఫోన్ల హ్యాకింగ్, కొత్త సాగు చట్టాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు లోక్సభ అట్టుడికింది. శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి సభా కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం కలిగించడంతో డిప్యూటీ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కొందరు ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు ఆయా పార్టీల సభాపక్ష నాయకులు వారిని వెనక్కి తీసుకెళ్లారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు స్పీకర్ ఓం బిర్లా లోక్సభ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారులకు సంఘీభావం తెలియజేస్తూ పలువురు ఎంపీలు నీలం రంగు టీ–షర్టులు ధరించి సభకు వచ్చారు. మన క్రీడాకారులకు మద్దతుగా ఎంపీలు బల్లలు చరిచారు. అనంతరం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్కు చెందిన పలువురు ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చారు. ఫోన్ల హ్యాకింగ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పెగసస్ స్పైవేర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. పెగసస్ అంశంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ సెల్ఫోన్లను స్పీకర్కు కనిపించేలా చూపారు. సీనియర్లు ప్రవర్తించేది ఇలాగేనా? కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డు ప్రదర్శించారు. జసూసీ కర్నా బంద్ కరో(గూఢచర్యం ఆపండి) అంటూ ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్పై ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం ఇస్తారని, సభ్యులు శాంతించాలని స్పీకర్ పదేపదే కోరినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. ఆందోళనలు ఆగకపోవడంతో ఉదయం 11.20 గంటలకు స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ 12 గంటలకు సభ ప్రారంభం కాగానే సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన సాగించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కిరీట్ సోలంకి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోలేదు. అదేసమయంలో పలు పార్లమెంటరీ కమిటీల్లో కొత్త సభ్యులను నియమిస్తూ తీర్మానాలను ఆమోదించారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై డిప్యూటీ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ సభ్యులు సైతం ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ ఎంపీ శంతను సేన్ సస్పెన్షన్ పెగసస్ స్పైవేర్, ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో రాజ్యసభ నాలుగు సార్లు సభ వాయిదా పడింది. సభ్యుల నిరసనలతో సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. టీఎంసీ సభ్యుడు శంతను సేన్ గురువారం రాజ్యసభలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతిలోని పత్రాలను లాక్కొని చింపేసిన విషయం తెలిసిందే. దీంతో శంతను సేన్ను సభ నుంచి బహిష్కరిస్తూ శుక్రవారం ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు శంతను సేన్ సభకు హాజరయ్యారు. బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. -
పోలవరం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలి
-
ప్రత్యేకహోదాపై మరోసారి నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై నోటీసు ఇచ్చారు. పోడియం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్లకార్డుతో ఆందోళన తెలిపారు. పోలవరానికి నిధుల విడుదల, పెగాసస్ డేటాలీక్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ, విపక్ష ఎంపీల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్గాని భరత్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యత గల అంశం. దీనిపై చర్చ కోసం రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్ చేశాం’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘పోలవరం ప్రాజెక్ట్ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం’’ అని వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ‘‘విభజన చట్టం ప్రకారం పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆమోదిస్తేనే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయగల్గుతాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో విజయసాయిరెడ్డి పోరాడుతున్నారు.రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న వెంకయ్యే గతంలో ఏపీకి పదేళ్లు హోదా ఇవ్వాలన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదే’’ అని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. -
ప్రశ్నోత్తరాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ప్రయివేటు మెంబర్ బిజినెస్ను రద్దు చేస్తున్నట్టు లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా జారీచేసిన బులెటిన్లలో వెల్లడించాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వారాంతపు సెలవులు కూడా లేకుండా వరుసగా 18 రోజులపాటు జరిగే ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని, అలాగే శుక్రవారం మధ్యాహ్నం జరిగే ప్రయివేటు మెంబర్ బిజినెస్ను కూడా కార్యకలాపాల నుంచి తొలగించారు. లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరితో సహా ప్రతిపక్ష నాయకులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు క్వశ్చన్ అవర్ తొలగించవద్దని లేఖ రాశారు. ఒక సభకు సంబంధించిన ఎంపీల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసేందుకు రెండు సభల్లోని సీట్లను కేటాయించనున్నారు. రెండో సభలో కూర్చునే వారు సభాపతి ఉన్న సభలోకి కనిపించేలా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్సభ మొదటి రోజు మినహా మిగిలిన 17 రోజులు లోక్సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 లగంటల వరకు నడుస్తుంది. అయితే తొలి రోజు మాత్రం ఉదయం 9 నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. రాజ్యసభ మొదటి రోజు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకలాపాలను కలిగి ఉంటుంది. మొదటి రోజు మాత్రం మధ్యాహ్నం 3 నుండి 7 గంటల వరకు కార్యకలాపాలు కలిగి ఉంటుంది. అప్రజాస్వామికం: కాంగ్రెస్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్ను రద్దు చేయడం ఏకపక్షం, అప్రజాస్వామికమని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అ«ధీర్రంజన్ చౌధరి అన్నారు. కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సభ్యుల హక్కు అన్నారు. సమావేశాలకు ప్రాణాధారమైన ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆనంద్ శర్మ అన్నారు. చర్చల నుంచి పారిపోవడం లేదు: జోషి విపక్షాల విమర్శలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. సమావేశాల్లో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీఏసీలో తీసుకునే నిర్ణయం మేరకు ఏ అంశాన్ని చేపట్టడానికైనా తమకు అభ్యంతరం లేదన్నారు. ఎంపీలు ‘అన్స్టార్డ్’ప్రశ్నల అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, వీటికి లిఖితపూర్వక సమాధానాలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. జీరో అవర్ కనీసం అరగంటపాటు ఉంటుందని తెలిపారు. -
పార్లమెంట్లో హోరా హోరీ!
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని ప్రతి రాజకీయ పార్టీ చెబుతుంది. తీరా సమావేశాలు ప్రారంభమయ్యాక ఎవరి సత్తా మేరకు వారు గోల చేస్తారు. తప్పు మీదంటే మీదంటూ పాలక, ప్రతిపక్ష సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాల సాక్షిగా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటాయి. తాజాగా బుధవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాలకాల సమావేశాలు కూడా హోరెత్తనున్నాయి. రెండు రోజుల ముందు, అంటే సోమవారం నాడు 13 ప్రతిపక్ష పార్టీలు సమావేశమై పరస్పర సహకారంతో పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలుగకుండా చూడాలని బలంగా నిర్ణయించుకున్నారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, బ్యాంకు కుంభకోణాలు, వ్యవసాయ సంక్షోభం, దళితులు, ఆదివాసీలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులకు ప్రభుత్వాన్ని బాధ్యున్ని చేయడమే తమ లక్ష్యం అని కూడా సమావేశంలో అభిప్రాయపడ్డారు. తానే పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించి నిందను ప్రతిపక్షం మీద వేయడానికి ఆస్కారం ఇవ్వకుండా పరస్పర సహకారంతో సమావేశాలు నిరాటంకంగా సాగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తోటి ప్రతిపక్షాలను కోరారు. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎన్డీయే వర్గాలు ప్రదర్శించిన తీరును గుర్తు చేసింది. ఈ సమావేశాలకు సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, తణమూల్ కాంగ్రెస్. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు హాజరయ్యాయి. ఏప్రిల్ ఆరవ తేదీన ముగిసిన బడ్జెట్పార్లమెంట్ సమావేశాలే ఘోరమైనవని, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాలకన్నా ఈ సమావేశాలే పేలవంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కాకుండా సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథయంలో పార్లమెంట్ సమావేశాలు పాలక, ప్రతిపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. రాహుల్ వర్సెస్ నరేంద్ర మోదీ ఈ పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ వాగ్వాదం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ వెలుపలు ఇప్పటికే ఇరువురు మాటల తూటాలతో పేల్చుకుంటున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని కొంత మంది ముస్లిం మేథావులతో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు’ అంటూ ‘ఇంక్విలాబ్’ అనే ఉర్దూ పత్రిక గత గురువారం ఓ వార్తను ప్రచురించడంపై బీజేపీ వివాదం లేవదీసింది. ఆ వార్తలో ఇసుమంత కూడా నిజం లేదని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నప్పటికీ బీజేపీగానీ, నరేంద్ర మోదీగానీ ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో శనివారం నాడు నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని ఓ పత్రికలో చదివానని, అది ఒక్క ముస్లిం పురుషుల పార్టీ మాత్రమేనా, ముస్లిం మహిళల పార్టీ కూడానా? అని ఈ సందర్భంగా తాను అడుగుతున్నానని అన్నారు. త్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును దష్టిలో పెట్టుకొనే మోదీ ఈ ప్రశ్న వేశారని సులభంగానే గ్రహించవచ్చు. పాలకపక్షం మెజారిటీ వున్న లోక్సభలో ఈ బిల్లును గత డిసెంబర్ నెలలోనే ఆమోదించగా, ప్రతిపక్షం మెజారిటీలో ఉన్న రాజ్యసభలో పెండింగ్లో పడిపోయిన విషయం తెల్సిందే. బిల్లులోని కొన్ని అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాన్ని సెలక్ట్ కంపెనీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముస్లిం మహిళలను మంచి చేసుకునేందుకు మోదీ తలాక్ ప్రస్థావన తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ విషయమై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి ఓ లేఖ కూడా రాశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా పార్లమెంట్ సమావేశాలను వేడెక్కించనున్నాయి. ఈ పదవికి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని కూడా సోమవారం నాడు జరిగిన సమావేశంలో ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే ఎవరి పేరు పరిశీలనకు రాలేదు. జూలై ఒకటవ తేదీ వరకు ఆ పదవిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజే కురియన్ కొనసాగారు. రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ డిప్యూటీ చైర్పర్సన్ను ఎంపిక చేసుకునేంత మద్దతు లేదు. అయినప్పటికీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్కు చెందిన నరేష్ గుజ్రాల్ను నిలబెట్టాలని యోచిస్తోంది. -
జూలై 18 నుంచి పార్లమెంటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం అనంత్కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 18 పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ జాతీయ కమిషన్కు రాజ్యంగబద్ధత బిల్లు, జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లు, ట్రాన్స్జెండర్స్ బిల్లుతో పాటు 6 ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీకాలం జూన్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకునేందుకు ఈ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు అనంత్ విజ్ఞప్తి చేశారు. -
రూ.10 నాణేలు చెల్లట్లేదు..
►రెండో దఫా డీమానిటైజేషన్లో నాణేలు వెనక్కి! ►పార్లమెంట్లో గళం విప్పిన విపక్ష ఎంపీలు న్యూఢిల్లీ: ‘దుకాణదారులు రూ.10 నాణేల్ని తీసుకోవట్లేదు. ఎందుకని అడితే చెల్లవని సమాధానం చెబుతున్నారు. బ్యాంకులు కూడా నాణేల్ని తీసుకోవట్లేదు. అక్కడాఇక్కడని కాదు దేశమంతటా ఇదే పరిస్థితి. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?’ అని ప్రశ్నించారు జేడీయూ ఎంపీ అలీ అన్వర్ అన్సారీ. సోమవారం రాజ్యసభ జీరోఅవర్లో నాణేల చెల్లుబాటు అంశంపై గళం విప్పిన అన్సారీ.. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని సభకు తెలిపారు. ఈ సందర్భంగా నాణేల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. రెండో ధఫా డిమానిటైజేషన్ ద్వారా నాణేలన్నీ వెనక్కి.. గత ఏడాది నవంబర్8నాటి డిమానిటైజేషన్ నిర్ణయాన్ని గుర్తుచేసిన ఎంపీ అన్సారీ.. మొదటి విడతలో పాత రూ.500, రూ1000 నోట్లను రద్దు చేసినట్లే రెండో దఫా డిమానిటైజేషన్ ద్వారా రూ.10, రూ.5, రూ.2, రూ.1 నాణాలను రద్దు చేసి, వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా భవిశ్యత్తులో నాణాలె చెల్లుబాటుపై ఎలాంటి సమస్యలూ తలెత్తబోవని ఎంపీ అన్సారీ అన్నారు. ఆయన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సిఉంది. రాజ్యసభలో నేటి జీరో అవర్లో విపక్ష ఎంపీలు పలు సమస్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. నర్మదా నదిపై గల సర్దార్ సరోవర్ డ్యామ్ గేట్లను జులై 31 నుంచి మూసివేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అలా చేస్తే(గేట్లు మూసేస్తే) లక్షల కుటుంబాలు నీటమునుగుతాయని ఆందోళనవ్యక్తం చేశారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలపై నామినేటెడ్ సభ్యుడు కేటీఎస్ తులసీ మాట్లాడారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని మోదీ హెచ్1బీ వీసాలపై మాటమాత్రమైన చర్చించలేదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఎం సభ్యుడు సీపీ నారాయణ తప్పుపట్టారు. -
రాజీనామా చేసిన మాయావతి
- ‘దళితులపై దాడులు’ అంశంపై మాట్లాడనీయనందుకు నిరసన - సభలో ప్రకటించినట్లే సంచలన నిర్ణయం తీసుకున్న బీఎస్పీ అధినేత్రి న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజ్యసభ సభ్యత్వానికి ఆమె మంగళవారం రాజీనామా చేశారు. దళితులపై దాడుల అంశంపై తనకు మాట్లాడే అవకాశం కల్పించనందుకు నిరసనగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ చైర్మన్కు లేఖ పంపిన అనంతరం మాయవతి మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో నెలకొన్న అతిప్రధాన సమస్యపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అక్కడ ఉండే కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని భావించా. అందుకే రాజీనామా చేశా’అని వివరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం, రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ రైతుల అంశంపై, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారత్-చైనా ప్రతిష్టంభనపై వాయిదా తీర్మానాలు ఇవ్వగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఉత్తరప్రదేశ్ షహరాన్పూర్లో దళితులపై దాడి అంశాన్ని లేవనెత్తారు. ఆమె మాట్లాడుతుండగా సభాపతి అడ్డుపడటంతో మాయావతి ఒకింత ఆగ్రహానికిలోనయ్యారు. ’మాట్లాడటానికి అవకాశం కల్పించకపోతే తక్షణమే రాజీనామా చేస్తా..’అని ఆవేశపూరితంగా ప్రకటించి, సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, సభాపతిని అవమానించేలా మాయవతి ప్రవర్తించారని, ఇందుకుగానూ ఆమె క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ డిమాండ్ చేసింది. -
మహిళా మంత్రిని ‘చెత్త’ అన్న రేణుకాచౌదరి!
పార్లమెంటులో నేతల మధ్య దూషణల పర్వం శ్రుతి మించుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తన పట్ల అసభ్య పదజాలం ఉపయోగించారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. రేణుకా చౌదరి, జైరాం రమేష్ ఇద్దరూ తనను చెత్త అన్నారని.. శుక్రవారం నాడు సభ వాయిదా పడిన తర్వాత ఇదంతా జరిగిందని ఆమె చెప్పారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వీళ్లిద్దరిపైనా రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వల్ల పార్లమెంటు భద్రతకు ముప్పు ఉంటుందన్న అంశంపై తాను మాట్లాడబోతుండగా జైరాం రమేష్, రేణుకా చౌదరి ఇద్దరూ అడ్డుపడ్డారని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ చాలా మొరటుగా ప్రవర్తించారని.. అసలు రాజ్యసభలో సభ్యత్వం లేకుండా ఆ సభలోకి ఎలా వస్తారని అడిగారని అన్నారు. నిజానికి బాదల్ లోక్సభ ఎంపీయే అయినా.. మంత్రి కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడేందుకు ఆమెకు అర్హత ఉంటుంది. అయితే.. రేణుకా చౌదరి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాదల్ చేసేదంతా రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు కచరా అనే పదం ఆమెకు ఎక్కడి నుంచి వినిపించిందని ప్రశ్నించారు. తాను ఇంగ్లీషులో మాట్లాడాను తప్ప హిందీలో కాదని అన్నారు. ఆమెకు వినికిడి లోపం అయినా ఉండాలి లేదా ఇంగ్లీషు అయినా రాకపోవాలని వ్యాఖ్యానించారు. వాళ్లు పంజాబ్లో ఓడిపోతున్నారని.. అందుకే ఓట్ల కోసం ఈ రాజకీయ డ్రామా చేస్తున్నారని అన్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన
-
వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన
న్యూఢిల్లీ: తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జీఎస్టీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీలతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దీనికి వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బరెడ్డిలు వెంకయ్యతో మాట్లాడిన విషయాన్ని మీడియాకు తెలిపారు. జీఎస్టీ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఎంపీలు 20న పార్లమెంట్ ముందుకు రానున్న ప్రైవేట్ బిల్లుకు కూడా బేషరతుగా మద్దతు పలకుతామన్నారు. తాము కూడా పలు మార్లు హోదా అంశాన్ని లేవనెత్తామని, 20న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇస్తామని, బిల్లు ఎవరు పెట్టారనేదానికంటే హోదా రావడమే తమకు ముఖ్యమని ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డిలు తెలిపారు. -
నాటకాలాడడంలో నేర్పరి
సుష్మా స్వరాజ్పై సోనియా గాంధీ ధ్వజం * లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడో చెప్పాలన్న రాహుల్ న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వివరణ ఇచ్చినప్పటికీ ఆమెపై కాంగ్రెస్ తన దాడిని ఆపలేదు. సుష్మ వివరణను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తోసిపుచ్చారు. ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సుష్మ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు రాహుల్గాంధీ సైతం తల్లి సోనియా బాటలో కొనసాగుతూ సుష్మపె మాటల దాడి కొనసాగించారు. ఒక దొంగతనం విషయంలో ఎలా వ్యవహరిస్తారో, అదేమాదిరిగా ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారని ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం కూడా పార్లమెంటు ఆవరణలో తమ ఆందోళన కొనసాగించారు. మీడియాతో సోనియా మాట్లాడుతూ సుష్మ నాటకాలాడుతున్నారని, ఆమె అందులో నేర్పరి అంటూ విమర్శించారు. ఒకవేళ తానే కనుక సుష్మ స్థానంలో ఉండి ఉంటే.. ఆపదలో ఉన్న మహిళకు తప్పక సహాయం చేసేదాన్నని, అదే సమయంలో చట్టపరిధిని మాత్రం అతిక్రమించేదాన్ని కాదని అన్నారు. కేవలం మానవతా దృక్పథంతో లలిత్కు సాయం చేశానని, తన స్థానంలో మీరున్నా ఇలాగే చేసేవారన్న సుష్మ వ్యాఖ్యలకు ప్రతిగా సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ.. లలిత్ నుంచి సుష్మ కుటుంబం ఎంత సొమ్ము పొందారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన మంత్రిత్వశాఖలో, తన పేషీలో కూడా సుష్మ ఎవరికీ ఏమీ చెప్పలేదని, అంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు. లలిత్ జైలు పాలవకుండా చూసేందుకోసం తన కుటుంబానికి, తన కుమార్తెకు, తన భర్తకు ఎంత ముట్టజెప్పారో సుష్మ చెప్పాలని డిమాండ్ చేశారు. తన స్థానంలో సోనియా ఉంటే ఏం చేసేవారన్న సుష్మ మాటల్ని రాహుల్ ప్రస్తావిస్తూ.. తన తల్లి ఆమెలా చట్ట వ్యతిరేకమైన పని చేసేవారు కాదన్నారు. సోనియా, రాహుల్ల వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ.. సుష్మపై సోనియా, రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతిస్పందిస్తూ.. సుష్మపై సోనియా చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు గౌరవాన్ని తగ్గిస్తాయని ఆమె అన్నారు. లలిత్ మోదీ నుంచి సుష్మ కుటుంబం డబ్బు తీసుకున్నారన్న రాహుల్ ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. సామాన్య కుటుంబాలకు చెందినవారిలో కుటుంబ సభ్యులంతా జీవనం కోసం తమ వంతుగా కష్టపడి సంపాదించుకోవాలని, అయితే ఇందుకు గాంధీ కుటుంబం అతీతమని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ‘సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ సమాజంలోనేగాక, ఆర్థికపరంగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందన్నది దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయా మహిళల పిల్లలు సైతం తమ వంతుగా కష్టపడడం అంతా చూస్తున్నదే. అయితే గాంధీ కుటుంబం ఇందుకు అతీతం. తమ జీవనంకోసం వారు కష్టపడాల్సిన అవసరం లేదాయె’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడు?
న్యూఢిల్లీ: నాటకాలండంలో నేర్పరంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విరుచుకుపడిన కొద్దిసేపటికే తనయుడు రాహుల్ గాంధీకూడా ఆమెను అనుసరించారు. సహాయం చేసినందుకుగానూ లలిత్ మోదీ ఎంత డబ్బు ముట్టజెప్పాడో వెంటనే వెల్లడించాలని సుష్మాను డిమాండ్ చేశారు. 'నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్.. మా అమ్మ (సోనియా గాంధీ)ని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధాంనం నేను చెబుతా. సుష్మాజీ.. మా అమ్మ మీలా చట్టవ్యతిరేకమైన పనులు చేయరని కచ్చితంగా చెప్పగలను. మీరు మీ శాఖను చీకటిమయం చేశారు. తనకు సహాయం చేసినందుకు లలిత్ మోదీ మీ కుటుంబానికి ఎంత డబ్బిచ్చాడో వెల్లడించాలి' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. -
లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడు?
-
నాటకాలాడటంలో సుష్మా నేర్పరి
-
'లోక్సభ సస్పెన్షన్ల'పై రాజ్యసభలో రచ్చ
న్యూఢిల్లీ: లోక్సభలో 25 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పన్షన్ అంశం రాజ్యసభనూ కుదిపేస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం తీరుపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు.. పోడియాన్ని చుట్టుముట్టారు. ఉపాధ్యక్షుడు పీజే కురియన్ ఎంతగా వారించినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. అంతలోనే కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ లేచి.. కాంగ్రెస్ సభ్యుల తీరుపై విమర్శలు గుప్పించారు. సభాసాంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో విపక్ష సభ్యులు హెచ్చు స్వరంతో మరింత రచ్చ చేశారు. గందరగోళం మధ్యే ఉపాధ్యక్షుడు సభను అరగంటపాటు (12 గంటల వరకు) వాయిదావేయాల్సి వచ్చింది. ఉపరాష్ట్ర పతి హమీద్ అన్సారీ చైర్మన్ స్థానంలో ఆసీనులు కాగా 12 గంటకు సభ తిరిగి ప్రారంభమైంది. అప్పుడు కూడా విపక్ష సభ్యులు నిరసనలను కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను మద్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు 30 మంది బీజేపీ సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. కాగా, శుక్రవారం నాటి సమావేశాలకు సభ్యులందరూ హాజరుకావాల్సిందేనని అధికార, విపక్ష పార్లీలన్నీ విప్ లు జారీచేయడంతో రాజ్యసభ నిండుకుండలా కనబడింది. -
నాటకాలాడటంలో సుష్మా నేర్పరి: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ గడిచిన నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరింత దూకుడు పెంచింది. ఈ రోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై తీవ్ర స్వరంతో, అనూహ్యరీతిలో విరుచుకుపడ్డారు. సుష్మా స్వరాజ్ నాటకాలాడటంలో నేర్పరి అని దుయ్యబట్టారు. 'ఒకవేళ నేనే గనుక సుష్మా స్థానంలో ఉండి ఉండేదుంటే ఆపదలో ఉన్నవారికి తప్పక సహాయం చేసేదాన్ని.. అయితే చట్టపరిధిని మాత్రం మీరేదాన్ని కాదు' అని సోనియా అన్నారు. కేవలం మానవతా దృక్పథంతోనే లలిత్ మోదీకి సహాయం చేశానని, నా స్థానంలో మీరున్నా ఇలానే చేసేవారన్న సుష్మా వ్యాఖ్యలకు కౌంటర్గా సోనియా ఈ కామెంట్లు చేయడం గమనార్హం. లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, బీజేపీ మంత్రులు వసుంధర రాజే, శివారాజ్ సింగ్ చౌహాన్ లు రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం, ప్రతిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ 25 మంది కాంగ్రెస్ సభ్యులను సస్సెండ్ చేయడం తెలిసిందే. సదరు ఆరోపితులు రాజీనామాలు చేసేంతవరకు తమ నిరసన కొనసాగిస్తునే ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. -
ఏపీ, తెలంగాణలకు భరోసా!
-
ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తాం
- 'హోదా'పై లోక్సభలో వైఎస్ఆర్ సీపీ ఎంపీల ఆందోళన.. స్పందించిన హోం మంత్రి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో లోక్సభలో నినదించడంతో రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన మంగళవారం సభలో ప్రకటించారు. ఈ విషయంలో ఆందోళన తగదని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. అలాగే హైకోర్టు విభజన అంశంపై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కూడా మాట్లాడారు. హైకోర్టు విభజనకు సంబంధించి న్యాయ శాఖ మంత్రితో మాట్లాడానని, ఆయన తగిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. అంతకు ముందుకు రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రద్యేకహోదా కల్పించాల్సిందేనని, ఆ మేరకు చర్చ చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం అందుకు అభ్యంతరం తెలుపుతూ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ఫ్లకార్డులు చేతబట్టిన వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంపీల ఆందోళనపై స్పందిచిన హోం మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఆంధ్రప్రదేశ్కు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. 'తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం చేయబోం. కచ్చితంగా న్యాయమే చేస్తాం. హైకోర్టు ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడా దీనిని పర్యవేక్షిస్తున్నారు' అని రాజ్నాథ్ లోక్సభలో ప్రకటించారు. -
'మోదీ.. మన్కీ బాత్ కాదు, జనతాకీ బాత్ విను'
న్యూఢిల్లీ: అవినీతి మంత్రులు రాజీనామా చేయాలంటూ సభలో నిరసన తెలిపిన కారణంగా తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని మండిపడింది. సభ్యుల సస్పెన్షన్ ను నిరసిస్తూ మంగళవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఇతర విపక్ష పార్లీలతో కలిసి బీజేపీపై ముప్పేట దాడికి పూనుకొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు బీజేపీపై నిప్పులు చెరిగారు. 'సభను సజావుగా నడపడం ప్రభుత్వ విధి. అలా చేయకుండా విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం. 25 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యుల సస్పెన్షన్ తో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్యచేసింది' అని సోనియా గాంధీ అన్నారు. ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అసరం ప్రభుత్వానికి తప్పనిసరని మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత మాట్లాడిన రాహుల్.. 'ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు రాజీనామా చేయాలని కోరిది మేమే కాదు.. యావత్ దేశం కోరుతోంది. మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మోదీ.. అంతకంటే ముందు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలి' అని చురకలంటించారు. -
మోదీపై సోనియా గాంధీ విసుర్లు
-
ఆగని ఆందోళనలు.. విపక్షాల అరుపులు నినాదాలు..
-
మోదీపై సోనియా గాంధీ విసుర్లు
న్యూఢిల్లీ: వరుస ఆందోళనలతో సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ విపక్ష పార్టీలపై అధికార బీజేపీ వ్యాఖ్యాలు చేసిన నేపథ్యంలో అంతకు రెట్టింపు స్వరంతో, ఘాటైన పదజాలంతో బీజేపీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరేముందు సోనియా మీడియాతో మాట్లాడారు. 'మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేసేదాకా మా నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం. సభ కొనసాగనివ్వబోము. మమ్మల్ని విమర్శించేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. సభలో మెజారిటీ ఉన్నంత మాత్రాన తప్పులు ఒప్పులైపోవు' అని విమర్శించారు. తరచూ మనసులో మాట (మన్ కీ బాత్) వెల్లడించే మనిషి తన సహచరులు కుంభకోణాలకు పాల్పడినప్పుడు మాత్రం మౌనవ్రతం చేపడతారని ప్రధానిని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో సభాకార్యక్రమాలను అడ్డుకున్నవారు నేడు డిబేట్లు, డిస్కషన్ల ఛాంపియన్లయ్యారని బీజేపీ సభ్యులపై మండిపడ్డారు. -
సే(షే)మ్ సీన్ రిపీట్స్..
న్యూఢిల్లీ: ఆగని ఆందోళనలు.. విపక్షాల అరుపులు నినాదాలు.. ప్రభుత్వం మొండిపట్టు.. ప్రతి సవాళ్లు.. వాటి మధ్యే ప్రశ్నలు.. వినిపించీ వినిపించని మంత్రుల సమాధానాలు.. ఇవీ ప్రస్తుతం సోమవారం ఉదయం లోక్సభలో నెలకొన్న తాజా దృశ్యా లు. రెండు రోజుల విరామం తరువాత సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని ప్లకార్డులతో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఓ వైపు గందరగోళం నెలకొన్నప్పటికీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను అలానే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సభ్యులు ఏయే ప్రశ్నలు అడుగుతున్నారో, వాటికి మంత్రులు ఏం సమాధానాలు చెప్పారనేదానిపై సమావేశాల వీక్షకులకు స్పష్టత లేకుండాపోయింది. రాజ్యసభ: విపక్షా లను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా హఠాత్తుగా మైకు అందుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. లలిత్ మోదీకి తాను సహాయం చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ఆమె అన్నారు. అయితే ఈ చర్యను అనూహ్యంగా భావించిన విపక్షాలు.. ఒక్కసారిగా స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లాయి. ముందు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని, ఆ తరువాత వివరణ ఇవ్వాలని పట్టుబట్టాయి. సుష్మా స్వరాజ్ తిరిగి తన స్థానంలో కూర్చున్నతర్వాత కాస్త వెనక్కు తగ్గిన విపక్షాలు తమ తమ స్థానలవద్దకు వెళ్లి అక్కడ నిల్చొని స్లోగన్లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. -
ఎదురు దాడే సర్కారు ఆయుధం
చల్లటి వాతావరణంలో.. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడిగా, వేడిగా జరగనున్నాయి. వివిధ కుంభకోణాలు, వివాదాస్పద బిల్లులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు సిద్ధం కాగా, వాటి ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టేందుకు పాలక బీజేపీ ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా సమావేశాలు, మంతనాలు జరిపి ఓ కృతనిశ్చయానికి వచ్చింది. ప్రధానంగా లలిత్ గేట్ కుంభకోణంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ల రాజీనామాలను డిమాండ్ చేస్తూ సమావేశాలను స్తంభింపచేయాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేయగా, ఈ కుంభకోణాల్లో తమవారి తప్పేమీ లేదని సమర్థించుకోవడంతో పాటు కుక్క కాటుకు చెప్పుదెబ్బలా కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగాలని పాలక ఎన్డీయే పక్షాలు వ్యూహరచన చేశాయి. తమ పార్టీకి చెందిన మంత్రులు గానీ, ముఖ్యమంత్రులు గానీ ఎవరూ ఎలాంటి తప్పుచేయలేదని, వారు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రభుత్వం తరఫున ఇప్పటికే స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. సమావేశాలను సజావుగా నిర్వహించడం సమష్టి బాధ్యతని కూడా ఆయన చెప్పారు. ఏ దశలోనూ ప్రతిపక్షం ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని, ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టడమే తమ వ్యూహమని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలతో అమిత్ షా పార్లమెంట్లో ఎన్డీయే పక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చోప చర్చలు జరిపారు. జైట్లీ, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితర పార్టీ నేతలను తోడ్కొని వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చర్చించారు. పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉండేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కూడా ఢి ల్లీలోనే మకాం వేశారు. అవసరమైతే సుష్మా స్వరాజ్తో సభలో సమాధానం ఇప్పించాలని కూడా అభిప్రాయానికొచ్చారు. సభలో పరిస్థితులను బట్టి వివాదాస్పదమైన భూసేకరణ, జీఎస్టీ, రియల్ ఎస్టేట్ లాంటి పెండింగ్ బిల్లులను తీసుకరావాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడమే ఉత్తమ వ్యూహంగా ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత అమిత్ షా పార్టీ మీడియా ప్రతినిధులతో సమావేశమై పార్టీ వైఖరిని వెల్లడించారు. ఈ సమావేశంలో శ్రీకాంగ్ శర్మ, ఎంజె అక్బర్, సాంబిత్ పాత్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షాలు దాడి, ఎదురుదాడులకు సిద్ధపడడంతో పార్లమెంట్ సమావేశాలు హోరెత్తనున్నట్టు స్పష్టమవుతోంది. -
'భూసేకరణ చట్ట సవరణకు పూర్తి మద్దతు'
భూసేకరణ సంపూర్ణ చట్ట సవరణ బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. దాంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న అంశంపై సభలో చర్చకు పట్టుబడతామన్నారు. పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇంకా అనేక అంశాలు అమలు కాలేదని, ఇప్పటికి రాష్ట్రం విడిపోయి 14 నెలలు కావస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు. ఇలా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.