Maha Kumbh Mela 2025
-
Mahakhumb 2025 : తండ్రితో కలిసి సైనా నెహ్వాల్ పడవ ప్రయాణం (ఫొటోలు)
-
మోదీ పుణ్య స్నానం
ఢిల్లీ: మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఉన్నారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ వచ్చారు. హెలికాప్టర్లో అరైల్ ఘాట్ వద్దకు.. అక్కడి నుంచి బోట్లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు. #WATCH | Prime Minister Narendra Modi to shortly take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh(Source: ANI/DD) #KumbhOfTogetherness pic.twitter.com/3F2guB1ElQ— ANI (@ANI) February 5, 2025 -
Maha Kumbh: భూటాన్ రాజు పుణ్య స్నానం
మహాకుంభ్ నగర్: భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్చుక్ మంగళవారం మహాకుంభ్ నగర్ను సందర్శించారు. త్రివేణీ సంగంలో పుణ్య స్నానం చేశారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అంతకుమునుపు వీరు సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పణ తదితర పూజలు చేశారు. భూటాన్ సంప్రదాయ దుస్తుల్లో విమానాశ్రయంలో ల్యాండైన వాంగ్చుక్ కాషాయ రంగు కుర్తాపైజామా ధరించి పుణ్యస్నానాల్లో పాల్గొన్నారు. వాంగ్చుక్, యోగితోపాటు సతువా బాబాగా అందరూ పిలిచే జగద్గురు సంతోష్ దాస్ మహారాజ్ కూడా ఉన్నారు. అనంతరం భూటాన్ రాజు అక్షయ్వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. డిజిటల్ మహా కుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను కూడా సందర్శించారు. వాంగ్చుక్ సోమవారం థింపూ నుంచి లక్నోకు చేరుకున్నారు. -
కుంభమేళాలో అయోధ్య రాముని రెప్లికా
మహా కుంభమేళాకి వెళ్తున్నారా? వెళ్లట్లేదా! అయోధ్య నుంచి బాలరాముడు కూడా మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ (Prayagraj) చేరుకున్నాడు. నిజమా! అవును నిజమే. అయోధ్య వెళ్లలేని వాళ్ల కోసం రాముడే స్వయంగా త్రివేణి సంగమానికి (Triveni Sangam) తరలి వచ్చాడని సంబరపడుతున్నారు భక్తులు. అచ్చం అయోధ్యలోని బాలరాముడి ఆలయాన్ని పోలిన నిర్మాణాన్ని యూపీలోని కుంభమేళాలో ఆవిష్కరించాడు మన హైదరాబాదీ. ఆయన పేరు రమణ వంక (Ramana Vanka). సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా సొబగులద్దే రమణ ఈ మహాకుంభమేళా సందర్భంగా అయోధ్యరాముడి ఆలయాన్ని, బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‘భీమ సినిమాకు టెంపుల్ సెట్ వేసిన అనుభవం ఉంది. అది తెలిసి ఆద్యశ్రీ ఎన్ఫోటైన్మెంట్, శ్రీ గరుడ రామ్మందిర్ వారు పిలిచారు. ‘శతమానం భవతి’ సినిమా కోసం దాదాపు యాభై రోజులు నియమనిష్ఠలు పాటించాను. అలాగే రాముడి మందిరానికి భూమి పూజ చేసిన డిసెంబర్ 26 నుంచి నిష్ఠలో ఉన్నాను. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగుస్తుంది. కానీ శ్రీరామనవమి వేడుకల వరకూ (మార్చి 15) మందిరాన్ని ఉంచాలని అనుకుంటున్నారు. అప్పటి వరకూ నిష్ఠను కొనసాగిస్తాను’ అన్నారు రమణ వంక.అయోధ్య మందిరాన్ని చూడలేదు.. అయోధ్య మందిరానికి ప్రతిరూప నిర్మాణాన్ని 25 రోజుల్లో పూర్తి చేశారు రమణ. ఒక ఆలయానికి రూపకల్పన చేయాలంటే శాస్త్రాలను, మత విశ్వాసాలను, నిర్మాణశైలిని అధ్యయనం చేయాలి. ప్రతి చిన్న డీటెయిలింగ్ వెనుక ఒక అధ్యయనం ఉంటుంది. అప్పటికే ఉన్న ఆలయానికి రెప్లికా కాబట్టి రోజుల్లోనే చేయగలిగానని, ఇది నా అదృష్టమని రమణ చెబుతున్నారు. అయితే ‘అయోధ్య మందిరాన్ని సందర్శించలేదని, కానీ నిర్మాణాన్ని ఫొటోలో చూడగానే ఒక అవగాహన వచ్చిందని, ఈ నిర్మాణంలో వెదురు, ఫైబర్, ఫోమ్, క్లాత్ వాడామని, ఎనిమిది డిగ్రీల చలిలో, మంచుతో తడిసిన వెదురు కర్రల మీద 80 అడుగుల ఎత్తులో పని చేస్తున్నప్పుడు ఆందోళనగా ఉండేదని, ఎటువంటి చిన్న ప్రమాదం లేకుండా పని పూర్తి చేయగలిగామని, అవకాశం వచ్చినప్పుడే మనల్ని మనం నిరూపించుకోవాలి’ అని చెబుతున్నారు రమణ. కాగా కుంభమేళాలో అయోధ్య రాముడి నమూనా నిర్మాణం చేపట్టిన ఘనత హైదరాబాదీది, పైగా తెలుగువాడిది కావడం గర్వకారణం.అయోధ్యలో సగం! ప్రయాగ్రాజ్ రామ మందిరానికి అయోధ్య మందిరం కొలతల్లో యాభై శాతం తీసుకున్నారు. 161 అడుగుల ఎత్తును 81 చేశారు. 360 అడుగుల పొడవు, 161 అడుగుల వెడల్పు 140, 120గా తీసుకున్నారు. రాముడి విగ్రహాన్ని అసలు రూపం కంటే మూడు అంగుళాలు తక్కువగా తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ బదులు జల ప్రతిష్ఠ చేశారు. నిత్యపూజలు దర్శనాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటాయి. రోజుకు 15 నుంచి 20 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.చదవండి: ప్రత్యక్ష దైవమా.. ప్రణామంసర్వమతం.. శ్రీరామం.. ప్రయాగ్రాజ్ రామమందిరం రూపశిల్పి రమణ తెలుగు వాడు. అయితే హిందీ, బెంగాలీ వాళ్లు మొత్తం రెండు వందల మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. నిత్యం ‘జై శ్రీరామ్’ అంటూ దీక్షగా పని చేసుకుపోయిన వారిలో వివిధ భాషలే కాదు, మతాలు కూడా ఉన్నాయి. ఈ 200 మందిలో హిందూ, క్రిస్టియన్, ముస్లింలు ఉన్నారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో ఉంది. త్రివేణి సంగమం, సెక్టార్ 1, గ్రౌండ్ 17లో ఉంది.రాముడే పిలిచాడు! బీఎస్సీ చదివి 10–5 జాబ్ చేశాను. సంతృప్తినివ్వలేదు. దీంతో నాకిష్టమైన డ్రాయింగ్లో ఎమ్ఎఫ్ఏ చేశాను. ఆర్ట్ డైరెక్టర్గా పాతికకు పైగా సినిమాలకు పనిచేసి నేషనల్ అవార్డు అందుకున్నాను. నా కెరీర్లో ది బెస్ట్ టాస్క్ అయోధ్య ఆలయ రెప్లికా నిర్మాణం. వెనక్కి తిరిగి చూసుకుంటే నా చరిత్రలో రాముడున్నాడు. జీవితానికి ఇది చాలు. – రమణ వంక, సినీ ఆర్ట్ డైరెక్టర్ -
తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని
న్యూఢిల్లీ: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని మహా కుంభమేళా దుర్ఘటనపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో అంత మంది చనిపోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారామె. మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. మరణాల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ అంశం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలనూ కుదిపేస్తోంది. అయితే ఈ విమర్శలపై హేమా మాలిని స్పందించారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025‘‘మేమూ పుణ్య స్నానం కోసం అక్కడికి వెళ్లాం. జరిగిందేదో జరిగింది. అయినా అదేం అంత పెద్ద ఘటనేం కాదు. కేవలం ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న అతిశయోక్తి మాత్రమే. కుంభ మేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది. అంతా సజావుగానే జరుగుతోంది. అయితే అంత మంది వస్తుండడంతో.. నిర్వాహణ కాస్త కష్టతరమే. కాబట్టి తొక్కిసలాట పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అన్నారామె. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ కౌంటర్ ఇచ్చారు. ఆమె నటి, పైగా అధికారంలో ఉన్నారు. అందుకే ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ దక్కి ఉంటుంది. తొక్కిసలాటకు దారి తీసే భయంకరమైన రద్దీ ఎలా ఉంటుందో బహుశా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారామె. ఒకవేళ అది(తొక్కిసలాట ఘటన) పెద్ద విషయం కాదని ఆమె అంటే.. అది నిజంగా దురదృష్టకరం. అది బాధిత కుటుంబాలను అవమానించడమే అని అన్నారాయన#WATCH | On BJP MP Hema Malini's statement on the Maha Kumbh Stampede, Congress MP Tariq Anwar says, "Hema Malini can never know what it was really like. When she visited, she was given VIP treatment. Things at Maha Kumbh went downhill because the police and administration were… pic.twitter.com/SnsQGfnIkA— ANI (@ANI) February 4, 2025ఇదిలా ఉంటే.. గత వారం పుణ్య స్నానానికి వెళ్లిన హేమా మాలిని.. గొప్ప అనుభూతిని పొందినట్లు ఆ టైంలో వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఆమె వీవీఐపీ టట్రీట్మెంట్ గురించి చర్చ నడిచింది. మరోవైపు మహాకుంభమేళాలో సామాన్యులను పట్టించుకోవడం లేదని, కేవలం వీవీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు ఉంటున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వినవస్తున్నాయి. -
మోడీ కుంభమేళ షెడ్యూల్
-
తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్సభలో అఖిలేష్ ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఈ దుర్ఘటనలో మరణాలు దాస్తున్నారంటూ.. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా సందర్భంగా యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు.రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో.. కుంభమేళా దుర్ఘటనపై అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అని అఖిలేష్ ప్రశ్నించారు.#WATCH | Samajwadi Party Chief Akhilesh Yadav says "Uttar Pradesh Chief Minister did not express condolence. When the President and Prime Minister of the country expressed condolence, after 17 hours the (State) government accepted it. These are the people who cannot accept the… pic.twitter.com/4F3ONlYA0l— ANI (@ANI) February 4, 2025కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలి. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారాయన. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపేంతదాకా యోగి సర్కార్ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి.. మౌని అమావాస్య పురస్కరించుకుని అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలకు పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు సాయంత్రం ప్రకటించారు. -
Maha Kumbh: మిగిలినవి అమృత స్నానాలు కాదు.. కారణమిదే
మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya) ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం -
5న ప్రధాని మోదీ కుంభస్నానం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించనున్నారు. అనంతరం పవిత్ర తివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. బుధవారం, మాఘ మాసం అష్టమి తిథి నాడు ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేయనున్నారు. తరువాత త్రివేణీ సంగమం ఒడ్డున గంగామాతను పూజించి, దేశప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు మహాకుంభ్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అనంతరం అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా సంగమ ప్రాంతానికి వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్లో దాదాపు గంటసేపు ఉంటారు. కాగా 2024 డిసెంబర్ 13న ప్రధాని సంగమం ఒడ్డున గంగా నదికి హారతినిచ్చి, పూజలు నిర్వహించి, కుంభమేళా విజయవంతం కావాలని ప్రార్థించారు. బుధవారం కుంభమేళాకు వస్తున్న ప్రధాని మోదీ అక్కడ అఖాడాలను కలుసుకోనున్నారు.2019లో ప్రయాగ్రాజ్లో జరిగిన అర్థ కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్య సందేశాన్ని అందించారు. ప్రధాని నుంచి అటువంటి గౌరవాన్ని పొందిన ఐదుగురు సిబ్బందికి నోటమాటరాలేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇతర పారిశుధ్య కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ కూడా దీనిని తన జీవితంలో అత్యంత మరపురాని క్షణంగా అభివర్ణించారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్తో భేటీ? -
మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్కు చుక్కలే.. -
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరమే, కానీ..
న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్కు స్పష్టం చేసింది.మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులే బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు జారీ చేయాలని విశాల్ తివారీ తన పిల్లో ప్రస్తావించారు.అయితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ.. ఉత్తర ప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే.. ఈ పిల్పై విచారణ జరపలేం అని చెప్పారు. ఈ ఘటనపై జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి, అలహాబాద్ హైకోర్టును సంప్రదించండి అని పిటిషనర్ విశాల్ తివారీకి సీజేఐ సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. హైకోర్టులో ఇదే అంశంపై పిల్ దాఖలైన విషయాన్ని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.కుంభమేళాలో భాగంగా.. మౌనీ అమావాస్య అమృత స్నానాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. -
Mahakumbh: అఖాడాల అమృతస్నానం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. వార్ రూమ్లో సీఎం యోగి
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు(సోమవారం) వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాటికి ఐదు కోట్లకు పైగా భక్తులు స్నానాలు ఆచరిస్తారని కుంభమేళా నిర్వాహకులు అంచనా వేశారు. జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వసంత పంచమి అమృత స్నానాల సందర్బంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘వార్ రూమ్’లో కూర్చుని, కుంభమేళా పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: A woman devotee blows the conch shell at Sangam Ghat as saints and devotees gather for Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/vXlIqmiVun— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానానికి సిద్ధమైన సాధువులు, భక్తుల మధ్య సంగమ్ ఘాట్ వద్ద శంఖం పూరిస్తున్న ఒక మహిళా భక్తురాలు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Foreign devotees sing 'Hanuman Chalisa' as they head to Triveni Sangam for the 'Amrit Snan' on the occasion of Basant Panchami. pic.twitter.com/Fnmw9AhYP8— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లో వసంత పంచమి సందర్భంగా 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమం వైపు వెళుతున్న విదేశీ భక్తులు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ కనిపించారు.స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ ‘13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నారు. మేము గంగా మాతను, శివుడిని పూజించాం. నాగ సాధువులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది మా మూడవ 'అమృత స్నానం', నేను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాను. 13 అఖాడాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అభినందనలు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Spiritual leader Swami Kailashanand Giri says, "All the 13 Akhadas took a holy dip at Triveni Sangam...We offered prayers to Ganga Maa, Lord Shiva...All the Nagas are very excited...This was our third 'Amrit Snan'...I congratulate UP… pic.twitter.com/po5OtrAArf— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లోని ఒక నాగ సాధువు మాట్లాడుతూ ‘గత రెండు అమృత స్నానాల కంటే ఈరోజు ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు స్నానం మాకెంతో ముఖ్యమైనది’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A Naga sadhu says, "Arrangements today were better than the previous two Amrit Snans... Today's snan was the biggest for us saints..." pic.twitter.com/n1OPYfYw34— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లోని ఒక సాధువు మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు అమృత స్నానం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అఖాడాలు, సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A saint says, "... The Amrit Snan was very good today... All akharas and saints took a holy dip. The arrangements were very nice." pic.twitter.com/Ebqvcv8oTG— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఒక విదేశీ భక్తుడు మాట్లాడుతూ ‘ఇది మాటల్లో చెప్పలేని మధుర అనుభవం. నేను చాలా ధన్యుడినయ్యానని భావిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ పవిత్రమైన రోజున అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అఖాడాలు ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉంటారు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025జునా అఖారా స్నానం పూర్తయింది. మొదట మహానిర్వాణి, తరువాత శ్రీ నిరంజని, అనంతరం జునా అఖారా స్నానం చేశారు. జూనా అఖారాకు చెందిన నాగ సాధువులు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Acharya Laxminarayan Tripathi of Kinnar Akhara says, "... We are all very happy on this auspicious day. The Kinnar Akhara was, is, and will always be united." pic.twitter.com/z867gPFecp— ANI (@ANI) February 3, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Naga sadhus of the Juna Akhara take a holy dip as part of the Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/1WsR4Elltj— ANI (@ANI) February 3, 2025 -
Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు(సోమవారం) వసంతపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే త్రివేణీ సంగమంలో అమృత స్నానాలు మొదలయ్యాయి. నాగ సాధువులు ఈరోజు తొలిస్నానం ఆచరిస్తున్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: The Juna Akhada reaches for the 'Amrit Snan' on the occassion of Basant Panchami. pic.twitter.com/CSVam6KdGJ— ANI (@ANI) February 3, 2025మహాకుంభమేళా ప్రాంతంలో వసంత పంచమి సందర్భంగా మూడవ అమృత స్నానానికి వేలాది మంది భక్తులు సిద్ధమయ్యారు. దీంతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది.Millions of pilgrims, saints, yogis, and visitors from around the world gathered at the sacred Triveni Sangam—the confluence of Maa Ganga, Yamuna, and Saraswati—seeking spiritual purification. They took a holy dip in the sacred waters during the Amrit Snan on the auspicious… pic.twitter.com/FahoAvrb0O— Mahakumbh (@MahaKumbh_2025) February 2, 2025గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాఢా అధిపతి కైలాశానంద గిరి మహారాజ్, నిరంజని అఖాఢాకు చెందిన ఇతర సాధువులు పవిత్ర స్నానాలు చేశారు. మహంత్ రవీంద్ర పూరి మాట్లాడుతూ తమ స్నానం ఎంతో సంతోషంగా జరిగిందని, అందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. పవిత్ర స్నానాలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు.#WATCH | #MahaKumbh2025 | Prayagraj: Avigail from Austria says, "It is unbelievable and amazing. This is once in a lifetime experience...I have started understanding the people of India...I have never seen anything like this..." pic.twitter.com/3wXVj392J2— ANI (@ANI) February 3, 2025రష్యాకు చెందిన మహానిర్వాణి అఖాడాకు చెందిన మీనాక్షి గిరి మాట్లాడుతూ ‘ఇది నా జీవితంలో చాలా పవిత్రమైన క్షణం. నేను గత 17 సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | Prayagraj, UP | #MahaKumbhMela2025 | Drone visuals of Maha Kumbh Mela Kshetra, Triveni Sangam, as thousands of devotees gather for the third Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/LtLjC083QP— ANI (@ANI) February 3, 2025నాగ అఖాడాలన్నింటిలో అతిపెద్దదైన జునా అఖాఢా సాధువులు అమృత స్నానం కోసం వేచిచూస్తున్నారు. ఇదేవిధంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు(వసంత పంచమి)ఇప్పటివరకు 16.58 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.VIDEO | Maha Kumbh 2025: Juna Akhara prepares to leave for Basant Panchami Amrit Snan. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/c2Mq1AXipQ— Press Trust of India (@PTI_News) February 2, 2025వసంత పంచమి అమృత స్నానాల వేళ నాగ సాధువులు మాత్రమే కాకుండా అదృశ్య ఋషులు కూడా స్నానం చేయడానికి వస్తారని చెబుతుంటారు. ఈ రోజున స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని అఖాఢా మహానిర్వాణికి చెందిన ఒక సాధువు తెలిపారు.నిరంజని అఖాడా ఆచార్య మహామండలేశ్వర్, నిరంజన్ పీఠాధీశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ మాట్లాడుతూ ‘నేడు వసంత పంచమి. ఈరోజు సనాతనీయులంతా సరస్వతి మాతను పూజిస్తారని అన్నారు.VIDEO | Maha Kumbh 2025: A seer from Panchayati Akhara Mahanirvani speaks on the importance of Basant Panchami Amrit Snan and praises the administration for the arrangements. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/dwaspnZrrC— Press Trust of India (@PTI_News) February 2, 2025శ్రీ పంచాయితీ అఖాడ మహానిర్వాణి 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమానికి చేరుకున్నారు. అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి మాట్లాడుతూ ‘ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశాక, తాము తిరిగి వారణాసికి బయలుదేరుతామన్నారు. భక్తులంతా సంయమనం పాటిస్తూ అమృతస్నానం చేయాలి’ అని అన్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP | Akhadas head towards Triveni Sangam with their deities for the Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/5pbNqS2eTa— ANI (@ANI) February 2, 2025ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
Mahakumbh: వసంత పంచమికి ముమ్మర ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల త్రివేణీ సంగమంలో కుంభమేళా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం(ఫిబ్రవరి 2) కావడంతో ఉదయం నుంచే పవిత్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలున్నాయి.వసంతపంచమి(Vasanta Panchami) నాడు స్నానాలు ఆచరించేందుకు రెండురోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంనకు దారితీసే అన్ని మార్గాలు భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లపై జనసమూహం కనిపిస్తోంది. దీనిని గుర్తించిన అధికారులు ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.జనవరి 29 మౌని అమావాస్య రోజున దాదాపు ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరుసటి రోజు కూడా ఇదే తీరు కనిపించింది. తరువాత శుక్ర, శనివారాల్లో రద్దీ కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే ఈరోజు (ఆదివారం) ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారులలో భద్రతను మరింత కట్టిదిట్టం చేశారు. మరోవైపు మౌని అమావాస్య స్నానోత్సవంలో జరిగిన ప్రమాదం తర్వాత, ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది.వసంత పంచమి రోజున సంగమ ఘాట్(Sangam Ghat) వద్ద జనం గుమిగూడకుండా చూసుకోవాలని పోలీసులకు, సైనికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భక్తులు స్నానం చేసిన వెంటనే ఘాట్ నుంచి బయటకు వెళ్లేలా చూడాలని అధికారులు వారిని ఆదేశించారు. వసంత పంచమినాడు ఎవరూ కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటవద్దని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కుంభమేళాలో కనిపించిన కొందరు వ్యక్తులు కూడా అందరి నోళ్లలో నానుతున్నారు. వారిలో ఒకరే కుంభమేళాలో పూసల దండలు అమ్మేందుకు వచ్చిన తేనెళ్ల మోనాలిసా. ఆమె తాజాగా మరో వీడియో విడుదల చేసింది.కుంభమేళా మోనాలిసా(Kumbh Mela Mona Lisa)కు సంబంధించిన పలు వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీంతో ఆమె విధిరాత మారిపోయిందంటున్నారు. త్వరలోనే ఆమె సినిమాల్లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ‘డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటించనున్నదని, ఇందుకోసం ఆమె సంబంధిత ప్రాజెక్టుపై సంతకం చేసిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతలో, తాజాగా మోనాలిసా మరో వీడియోను వీడుదల చేశారు. దీనిలో ఆమె సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు వివరణ ఇచ్చారు.#monalisabhosle video #MahaKumbh2025 pic.twitter.com/OgosaBMXeg— Narinder Saini (@Narinder75) February 2, 2025ఆ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ‘హలో.. నేను మోనాలిసా. నేను రుద్రాక్ష దండలు అమ్మడానికి మహా కుంభమేళాకు వెళ్లాను. మహాదేవుని అనుగ్రహంతో పాటు అందరి ఆశీస్సులతో నేను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాను. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి దయతోనే నాకు ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’(‘The Diary of Manipur’) అనే సినిమాలో అవకాశం వచ్చింది. దీనికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆయన మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుని వెళ్లారు. హీరోయిన్ కావాలనేది నా కోరిక. అది ఈరోజు నెరవేరబోతోంది. మీ అందరి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ప్రస్తుతం నేను నటన నేర్చుకోబోతున్నాను. ఆ తరువాత సినిమాల్లో నటిస్తాను. మోనాలిసా లక్షలు సంపాదిస్తోందని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎవరో నాకు కారు ఇచ్చారని కూడా రాశారు. ఇవన్నీ అబద్దాలే. అయితే సనోజ్ మిశ్రా జీ ముంబై నుండి వచ్చి నాకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ఇకపై నేను ముందుకు సాగడానికి మీరందరూ నన్ను ఆశీర్వదించండి’ అని మోనాలిసా కోరారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్లోని ముజఫర్పూర్లోని మధుబని నాలుగు లేన్ల రోడ్డులో చోటుచేసుకుంది.బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్కేఎంసీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్లోని మొహతారికి చెందిన కొందరు ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి ధన్కర్
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు చేశారని యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పరిస్థితులు సద్దుమణిగాయని, దీనిని చూస్తుంటే యూపీ సర్కారు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదో ఇట్టే గ్రహించవచ్చని అన్నారు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ను మెచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి(Vice President) అన్నారు. ఈ భూమిపై ఎక్కడా ఇంతటి భారీ కార్యక్రమం జరిగివుండదు. కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ధన్కర్ పేర్కొన్నారు.మహా కుంభమేళాలో లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించారని, యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్ మహా కుంభ్(Maha Kumbh)కు వచ్చిన వారి సంఖ్య అమెరికా జనాభాకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారని ఆయన అన్నారు. తాను కుంభ్ స్నానం కోసం నీటిలోకి దిగిన క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అని ధన్కర్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం మరొకటి లేదని, అంకితభావం, సామర్థ్యం, సంస్కృతి పరిజ్ఞానం, దేశానికి సేవ చేసే స్ఫూర్తి ఇక్కడ ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. -
Mahakumbh-2025: యాత్రికులకు మమతా సర్కారు హెల్ఫ్డెస్క్
కోల్కతా: మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్కు చెందిన నలుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన మమతా సర్కారు పశ్చిమ బెంగాల్ నుంచి కుంభమేళాకు వెళ్లేవారికి పలు సూచనలు జారీ చేసింది. ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.కుంభమేళాకు పశ్చిమబెంగాల్ నుంచి వెళుతున్న యాత్రికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి(Emergency) తలెత్తినప్పుడు ఈ హెల్ప్డెస్క్ సాయం అందించనుంది. వారంలో ప్రతిరోజూ 24 గంటల పాటు సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ, పౌర రక్షణ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ హెల్ప్డెస్క్(Helpdesk) పర్యవేక్షణ జరగనుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు మహా కుంభమేళాకు వెళ్తున్నారని, వారికి సహాయం చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు హెల్ప్లైన్ నంబర్ (033) 2214-3526, టోల్-ఫ్రీ నంబర్ 1070ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఇదిలావుండగా మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల గణాంకాలను ప్రభుత్వం అందించాలని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరూ విశ్వసించడం లేదన్న అఖిలేష్ ఒక ప్రకటనలో ఈ ప్రభుత్వానికి దేశ ప్రజల విషయంలో ఎలాంటి దార్శనికత లేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, యువత, పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ గణాంకాల కంటే, మహా కుంభ్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన, గాయపడిన, తప్పిపోయిన వారి గణాంకాలు చాలా ముఖ్యమైనవని అఖిలేష్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అయితే జనవరి 29న మౌని అమావాస్య అమృత స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు.బాధితులు చికిత్స పొందుతున్న ప్రయాగ్రాజ్లోని స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రి(Swaroop Rani Nehru Hospital)కి చేరుకున్న ఆదిత్యనాథ్ బాధితులను పరామర్శించడంతో పాటు, వారి ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తుందని, వారికి అవసరమైన ఇతర ఏర్పాట్లలో ఎటువంటి లోటు ఉండదని సీఎం యోగి హామీనిచ్చారు. ఒక బాధితురాలితో సీఎం మాట్లాడుతూ దేనికీ ఆందోళన చెందవద్దని, వైద్యులు అంతా చూసుకుంటారని తెలిపారు. మరో బాధితురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్(Discharge) అవుతుండటాన్ని గమనించిన యోగి ఇలాంటివారిని వారిని ఇళ్లకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది సీఎంతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న ఏ బాధితుని పరిస్థితి విషమంగా లేదని, కొందరు బాధితులు కోలుకునేందుకు నాలుగువారాల సమయం పడుతుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్రాజ్కు బస్సులు.. చౌకలో ప్రయాణం -
Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్రాజ్కు బస్సులు.. చౌకలో ప్రయాణం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివెళుతున్నారు. ఇప్పుడు బీహార్ నుండి మహా కుంభమేళాకు వెళ్లే వారికి బీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పట్నా నుండి ప్రయాగ్రాజ్కు బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సు సర్వీసు ఫిబ్రవరి 28 వరకు నడుపుతున్నట్లు పేర్కొంది. మహా కుంభమేళా(Great Kumbh Mela)కు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఈ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు తెలిపిన బీఎస్ఆర్టీసీ ఈ సర్వీసును రాత్రిపూట నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ బస్సు ఎక్కినవారు ఉదయానికల్లా గమ్యస్థానానికి చేరుకుంటారని వెల్లడించింది. మహాకుంభ్లో పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా, రెండు కొత్త బస్సులను నడపాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సులు బీహార్ రాజధాని పట్నా నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్(Prayagraj) వరకు నడుస్తాయి.బీహార్ రాష్ట్ర రవాణా కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లే ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సుల ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించి మహా కుంభమేళాకు చేరుకోవచ్చని తెలిపారు. పట్నా నుండి ప్రయాగ్రాజ్కు బస్సు ఛార్జీ రూ. 550. ఈ బస్సు పట్నాలో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం(Return journey)లో ఈ బస్సులు ప్రయాగ్రాజ్ నుండి రాత్రి 10 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు పట్నా చేరుకుంటాయని సంజయ్కుమార్ తెలిపారు. ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం
అయోధ్య: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. వీరిలోని చాలామంది అయోధ్యకు చేరుకుని, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యలోనూ జనప్రవాహం కనిపిస్తోంది. కుంభమేళా ప్రారంభమైనది మొదలు ప్రతిరోజూ రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దీంతో గరిష్ట సంఖ్యలో భక్తులు రాంలల్లాను దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయాన్ని ప్రతిరోజూ 18 గంటల పాటు తెరిచి ఉంచుతున్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు శ్రీరాముణ్ణి దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆలయానికి భక్తులు పోటెత్తుతుండటంతో కొన్ని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రెండవ అంతస్తుతో పాటు శిఖరంపై నిర్మాణ పనులు, సప్త మండపం, శేషావతార్ ఆలయం పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై కుడ్యచిత్రాలను రూపొందించే పనులు కూడా మందకొడిగా కొనసాగుతున్నాయి. దర్శన్ మార్గ్ ప్రక్కనే ఉన్న యాత్రికుల సౌకర్యాల కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా నిలిపివేశారు.రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు కొన్ని పనులు నిలిపివేశామన్నారు. గడచిన 10 రోజుల్లో 70 లక్షలకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించారని తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి సరయు నదిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. అయోధ్యకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. విదేశీ భక్తులు కూడా సరయు నదిలో స్నానం చేసిన తర్వాత రామ్లల్లా దర్శనం చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు.. -
Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు..
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 30 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు. ఈ సంఖ్య పలు రికార్డులను నెలకొల్పుతోంది. ప్రపంచంలోని 195 దేశాలలోని 192 దేశాల జనాభా 30 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 192 దేశాలకు మించినంతటి జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పరంగా చూస్తే ప్రపంచంలోని నాల్గవ, ఐదవ అతిపెద్ద దేశాలైన ఇండోనేషియా, పాకిస్తాన్లలో కూడా 30 కోట్ల కంటే తక్కువ జనాభా ఉంది. దీనిప్రకారం చూస్తే కేవలం 19 రోజుల్లో పాకిస్తాన్, ఇండోనేషియా జనాభాకు మించిన భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇండోనేషియా జనాభా(Indonesian population) 28 కోట్లు కాగా, పాక్ జనాభా 25.35 కోట్లు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యను చూస్తే వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాటికి సంగమంలో పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 91,690 మంది విమాన ప్రయాణం(Air travel) ద్వారా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. 650 కి పైగా విమానాలు ఇక్కడకు రాకపోకలు సాగించాయి. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటిన ఇక్కడికి వచ్చే విమానాలు, ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుండి, తొలిసారిగా ప్రయాగ్రాజ్ నుండి చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలకు నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఢిల్లీకి 10 విమానాలు, ముంబైకి ఏడు విమానాలు ఉన్నాయి. ఇది సరికొత్త రికార్డు కానుంది. ఇది కూడా చదవండి: Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్? -
Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు మనదేశం నుంచి కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారంతా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడి పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. వీటిలో ‘సరస్వతి బావి’ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, అదృశ్య సరస్వతి(Invisible Saraswati) నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. త్రివేణి సంగమానికి కొద్ది దూరంలోని సరస్వతి బావి ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ సరస్వతి మాత జలాన్ని నేరుగా దర్శనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.ప్రయాగ్రాజ్ కోటలో కనిపించే ఈ సరస్వతి బావి.. సరస్వతి నదికి రహస్య వనరు అని పండితులు చెబుతుంటారు. ఈ బావి నుంచి ఊరుతున్న నీటి ప్రవాహం నేరుగా త్రివేణి(Triveni) సంగమానికి అనుసంధానమై ఉంది. 2016లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాగించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ సరస్వతి బావికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్న సుబేదార్ మేజర్ రామ్ నారాయణ్ పాండే మాట్లాడుతూ ఇక్కడి నీటి ఊట బావి ఆకారంలో ఉన్నందున దీనికి సరస్వతి బావి అనే పేరు వచ్చిందన్నారు. సరస్వతి నది మానా గ్రామంలో ఉద్భవించిందని చెబుతుంటారు.పురాణాలలోని వివరాల ప్రకారం మహర్షి వేద వ్యాసుడు(Maharishi Veda Vyas) చెబుతుండగా గణేశుడు 18 పురాణాలను రాస్తున్నాడు. అయితే అదే సమయంలో సరస్వతి నది ప్రవాహ ధ్వని కారణంగా గణేశునికి వినికిడి సమస్య ఏర్పడిందట. దీంతో సరస్వతి మాత తన నీటి ప్రవాహాన్ని పాతాళం వైపు ప్రవహించాలని ఆదేశించిందట. సరస్వతి ప్రవాహం ప్రయాగ్రాజ్ చేరుకున్న సమయంలో విష్ణువు ఆ నీటిని సంగమంలో విలీనం చేయమని సరస్వతి మాతను కోరాడట. దీనికి సర్వస్వతి మాత సమ్మతించిందట. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తులు సరస్వతి బావిని తప్పకుండా సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi Elections: ఆప్కు భారీ షాక్.. -
కుంభమేళా ఎఫెక్ట్.. గంగా హారతి నిలిపివేత
ప్రయాగ్రాజ్: మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని ఆపేస్తున్నట్లు చెప్పారు.కుంభమేళా జరిగే ప్రాంతాల్లో ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకే గంగా హారతిని తాత్కాలికంగా ఆపేసినట్లు తెలిపారు.ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసికి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని వారి సంఖ్య తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని విజ్ఞప్తి చేశారు.కాగా,మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రద్దీ నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసకుంది. ఈ క్రమంలోనే కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. దీంతోపాటు వీవీఐపీ, స్పెషల్ పాసులను రద్దు చేశారు.ఇప్పటివరకు 29.64 కోట్లమంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. -
భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనం : రాష్ట్రపతి