
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. మిక్స్డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్లో ధీరజ్–భజన్ కౌర్ (భారత్) ద్వయం 5–3తో మటియాస్–వలెన్సియా (మెక్సికో) జోడీపై గెలిచింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్లో ధీరజ్ 7–3 తో మౌరో నెస్పోలి (ఇటలీ)పై విజయం సాధించాడు.