‘రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’? | MLC Kavitha Chitchat with Media | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?

Jun 18 2025 3:09 PM | Updated on Jun 18 2025 3:27 PM

MLC Kavitha Chitchat with Media

సాక్షి,తెలంగాణ: రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్‌18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.

‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే  ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఒరిగేదేమీ లేదు.  డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్‌ ఏసీబీ విచారణ అంతా టైంపాస్‌

నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్‌ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.

సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్‌ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్‌లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.

కేటీఆర్‌పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement