ఈవీఎంను పరిశీలించిన ‘ఆప్’ నేత.. వీడియో వైరల్‌ | Lok Sabha Election Delhi Election AAP Leader | Sakshi
Sakshi News home page

ఈవీఎంను పరిశీలించిన ‘ఆప్’ నేత.. వీడియో వైరల్‌

May 25 2024 12:06 PM | Updated on May 25 2024 12:40 PM

Lok Sabha Election Delhi Election AAP Leader

దేశంలో లోక్‌సభ ఎన్నికల జరుగుతున్నాయి. వీటిలో భాగంగా నేడు(శనివారం) ఆరవ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు  ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ, భారత్‌ కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీకి దిగాయి. ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

ఓటు వేసేందుకు వచ్చిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఈవీఎం యంత్రాన్ని పైనుంచి కింది వరకూ పరిశీలనగా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ అంశంలో ఒక్క ఆధారం కూడా దొరకలేదని ప్రధానే స్వయంగా అంగీకరించారు. ఇంతకంటే పెద్ద అంశం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.  

కాగా తూర్పు ఢిల్లీ నుంచి కుల్‌దీప్‌ కుమార్‌, పశ్చిమ ఢిల్లీ నుంచి మహాబల్‌ మిశ్రా, న్యూఢిల్లీ నుంచి సోమనాథ్‌ భారతి, దక్షిణ ఢిల్లీ నుంచి సాహి రామ్‌ పెహల్వాన్‌లను ‘ఆప్‌’ బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ తరపున చాందినీ చౌక్‌ నుంచి జేపీ అగర్వాల్‌, ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్‌, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ నుంచి ఉదిత్‌ రాజ్‌ బరిలో  ఉన్నారు.

ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీని బీజేపీ తమ అభ్యర్థిగా నిలిపింది. దక్షిణ ఢిల్లీ నుంచి రామ్‌వీర్ సింగ్ బిధూరి, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, తూర్పు ఢిల్లీ నుంచి హర్ష్ దీప్ మల్హోత్రా, వాయువ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రావత్ బీజేపీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement