జపాన్‌ బుల్లెట్‌ ‍ట్రైయిన్‌లో ప్రయాణించిన స్టాలిన్‌

Bullet Train Journey For MK Stalin In Japan And Then A Tweet For India - Sakshi

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్‌, జపాన్‌ రెండు దేశాల్లో అధికారికగా పర్యటించనున్న తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదివారం రాజధాని టోక్యోకి చేరుకోవడానికి బుల్లెట్‌ రైలులో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ బుల్లెట్‌ ట్రైయిన్‌ జపాన్‌కు 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న టోక్యోకు వెళ్లారు.

స్టాలిన్‌ ట్విట్టర్‌ వేదికగా..ఇది భారతీయ పౌరులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బుల్లెట్‌ ట్రైయిన్‌కి సమానమైన డిజైన్‌లో వేగం, నాణ్యతలలో లోపం లేని రైలు భారతదేశంలో కూడా అందుబాటులోకి రావాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ రైలు ద్వారా ప్రయోజనం పొందాలే ప్రయాణం సులభతరం చేయాలన్నారు.

(చదవండి: కొత్త పార్లమెంట్‌ భవనంపై లాలు యాదవ్‌ పార్టీ వివాదాస్పద ట్వీట్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top