మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌ | BJP MLA Kolambkar takes oath as Maharashtra Pro Tem speaker | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌

Dec 6 2024 2:28 PM | Updated on Dec 6 2024 4:56 PM

BJP MLA Kolambkar takes oath as Maharashtra Pro Tem speaker

ముంబై: బీజేపీ సీనియర్‌ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో శుక్రవారం  జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్.. కొలాంబ్‌కర్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌ ప్రమాణస్వీకారం చేశారు. 

మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేలతో కొలాంబ్‌కర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 15వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల్లో సెంబ్లీకి శాశ్వత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.  త్వరలో నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.

కాగా మహారాష్ట్రలో ఎట్టకేలకు  దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా  దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్‌ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మోంశాఖమంత్రి అమిత్‌ షా సహా  బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్‌ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement