
న్యూఢిల్లీ: కాంగ్రెస్- బీజేపీల మధ్య మరోమారు దుమారం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను అమెరికా ఆహ్వానించిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. అమెరికా ఈ నకిలీ వార్తలను ఖండించిందని పేర్కొన్న బీజేపీ.. పాకిస్తాన్న్కు కాంగ్రెస్ మౌత్పీస్గా మారిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ వైఖరి అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారని, దీనిపై విలేకరుల సమావేశంలో ప్రస్తావించారని, అయితే మునీర్ అమెరికా వెళ్లడం లేదని తేలిందని బీజేపీ నేత చెందిన నిషికాంత్ దూబే మీడియాకు తెలిపారు. కాంగ్రెస్.. పాక్కు మౌత్ పీస్ మాదిరిగా ప్రవర్తిస్తూ, ప్రజలను ఇలా తప్పుదారి పట్టిస్తున్నదని, పాకిస్తాన్ ముస్లిం లీగ్- జైరామ్ రమేష్ మధ్య తేడా ఏమిటని దూబే ప్రశ్నించారు.
पाकिस्तान मुस्लिम लीग और कांग्रेस पार्टी में कोई अंतर है तो हमें ज़रूर बताएँ https://t.co/DhjDypN3Fa
— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 15, 2025
ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం, ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విదేశాంగ విధానమే కారణమని దూబే ఆరోపించారు. దీనికి ఉదాహరణగా 1970లనాటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న కెనడా కేసును ఆయన ఉదహరించారు. 1970- 1984 మధ్య కాలంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఖలిస్తానీలపై చర్య తీసుకోవాలని కోరుతూ, కెనడా ప్రధాని పియరీ ఎలియట్ ట్రూడోకు ఏడు లేఖలు రాశారని, అయితే వాటిపై ఎటువంటి అర్థవంతమైన స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఇరాన్ వరుస క్షిపణి దాడులు.. ఇజ్రాయెల్లో నిరంతర హెచ్చరిక సైరన్లు