
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయన అభిమానులను అలరించారు. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బ్లాక్బస్టర్ భైరవం పేరుతో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీ రిలీజ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రీ రిలీజ్ సినిమాలు వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో పెట్టుకుంటే బాగుంటుందని మనోజ్ సూచించారు. అలా చేయడం వల్ల కొత్త సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. వీకెండ్స్లో విడుదల చేస్తే మన సినిమాను ఇంకో సినిమాతో చంపేసినట్లు ఉంటుందన్నారు. ఎలాగైనా ఏ సినిమాకు ఉండే బలం.. ఆ సినిమాలకు ఉంటుంది.. ఎందుకంటే వీకెండ్స్లోనే అందరికీ టైమ్ దొరుకుతుందని తెలిపారు. ఈ విషయంపై సినీ పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదే ఈవెంట్లో కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్పై ప్రశ్న ఎదురవడంతో మనోజ్ స్పందించారు. ఇది సినిమా ఈవెంట్.. ఇక్కడ కేవలం సినిమా గురించే మాట్లాడుకుందాం.. ఎందుకంటే ఒక సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసని అన్నారు. మనోజ్ గతంలో కన్నప్ప సినిమాపై తాను చేసిన సరదాగా మాట్లాడానని తెలిపారు. ఆ సినిమా వెనుక ఉండే కష్టం నాకు తెలుసు.. కన్నప్ప ఘన విజయం సాధించాలని విష్ణు అన్నకు కోసం ఆల్ ది బెస్ట్ అంటూ మంచు మనోజ్ మాట్లాడారు.
కాగా.. భైరవం రిలీజ్ అయినరోజే మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదలైంది. ఈ సినిమాకు సైతం మహేశ్ బాబు ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్లోనూ ఖలేజాను రీ రిలీజ్ చేశారు. మొదటి రోజే థియేటర్లలో మహేశ్ బాబు అభిమానులు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు.