హీరోయిన్ నిధీ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా సోమవారం ప్రారంభమైంది. ఈ మైథాలజీ థ్రిల్లర్కి ‘తంత్ర’ మూవీ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. వరాహ్ ఫిల్మ్స్ పతాకంపై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పి.అశోక్, పి. రేణుక కెమెరా స్విచ్చాన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు.
సోమవారం (ఆగస్టు 17) నిధి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నిధీ అగర్వాల్ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు శ్రీనివాస్. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.


