ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమైన ఫొటో.. ఏది మార్ఫింగ్ చేసిన చిత్రం అనేది గుర్తించడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఏఐ సాయంతో మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడం తరచూ కనిపిస్తోంది. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార విషయంలోనూ ఇలాంటి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నయనతార గుండు చేయించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో నిజం లేదని తెలుస్తోంది.

నిజానికి నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్తో కలిసి ఈ ఏడాది ఏప్రిల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విడుదలకు ముందు ఈ దంపతులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో నయనతార తెలుపు రంగు కుర్తా, లెగ్గింగ్స్తో పాటు ఆకుపచ్చ రంగు దుపట్టాలో కనిపించారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వారికి అభివాదం చేశారు. అయితే అప్పటి ఫొటోలను తీసుకుని నయనతార తలనీలాలు సమర్పించినట్లుగా ఏఐ టెక్నాలజీతో మార్చి, ఆ వీడియో, ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
నయనతార గుండు చేయించుకున్నారా? అసలు నిజం ఇదే!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నయనతార గుండు ఫొటోలు నిజం కావని తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారంటూ వైరల్ చేస్తున్న ఈ చిత్రాలు.. ఆమె ఏప్రిల్లో తిరుమలకు వచ్చినప్పటి ఫొటోలను AIతో మార్ఫింగ్ చేసినవిగా… pic.twitter.com/wb3y86bmfY— Tupaki (@tupaki_official) August 18, 2026


