డాక్యుమెంటరీగా వారణాసి మేకింగ్‌ | Mahesh Babu Varanasi is 80 percent shot completed | Sakshi
Sakshi News home page

డాక్యుమెంటరీగా వారణాసి మేకింగ్‌

Aug 18 2026 2:05 AM | Updated on Aug 18 2026 2:05 AM

Mahesh Babu Varanasi is 80 percent shot completed

మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా   ‘వారణాసి’. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్   ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతానికిపైనే పూర్తయినట్లు రాజమౌళి పేర్కొన్నారు. అయితే ఈ మూవీ జర్నీలో జార్జియాకు చెందిన సినిమాటోగ్రాఫర్‌– డాక్యుమెంటరీ డైరెక్టర్‌ గోగితా చిక్వాడ్జే భాగమయ్యారట. ‘వారణాసి’ మేకింగ్‌ డాక్యుమెంటరీని ఆయన చిత్రీకరిస్తున్నారని టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ని అక్టోబరుకల్లా పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్‌గా పెట్టుకున్నారట.

అయితే ‘వారణాసి’ ప్రయాణాన్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించే బాధ్యతలను గోగితా చిక్వాడ్జేకు అప్పగించారట రాజమౌళి. ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్స్  నుంచే గోగితా తన పనిని ప్రారంభించార ట. నటీనటుల రిహార్సల్‌ సీన్స్ , వర్క్‌ షాప్స్, లొకేషన్స్ , మేకింగ్, సెట్‌ వర్క్స్‌... ఇలాంటివన్నీ ఈ డాక్యుమెంటరీలో ఉంటాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ అంశాలపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న  ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement