'లక్ష్మీ నరసింహా'లో కొత్త పాట.. రీ రిలీజ్‌లో ట్రెండ్‌ | Mandesinodu Ghanudu Lyrical Song Out from Lakshmi Narasimha Movie | Sakshi
Sakshi News home page

'లక్ష్మీ నరసింహా'లో కొత్త పాట.. రీ రిలీజ్‌లో ట్రెండ్‌

Jun 5 2025 5:43 PM | Updated on Jun 5 2025 6:44 PM

Mandesinodu Ghanudu Lyrical Song Out from Lakshmi Narasimha Movie

బాలకృష్ణ (Balakrishna), అసిన్ నటించిన 'లక్ష్మీ నరసింహా' (Lakshmi Narasimha) చిత్రం సుమారు 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మరో కొత్త సాంగ్‌ను ఈ చిత్రంలో చేర్చారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దానిని తాజాగా విడుదల చేశారు. 'మంచినీళ్లు తాగినోడు మామూలోడు' అంటూ సాగే ఈ సాంగ్‌ను చంద్రబోస్‌ రచించగా భీమ్స్‌ సంగీతం అందించారు.  2004లో విడుదలైన ఈ చిత్రం హిందీలో IPS నరసింహగా డబ్చేశారు. తమిళ చిత్రం సామికి రీమేక్‌గా తెలుగులో  జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు. జూన్‌ 8న ఈ మూవీ 4కె వెర్షన్‌లో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement