breaking news
lakshmi narasimha
-
బాలకృష్ణ బర్త్డే సందేశం... కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!
ఆధునిక టెక్నాలజీతో బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సినిమాలను కలర్ లోకి తీసుసుకురావడం, ఆ తరువాత పాత సినిమాలను 4కెలో లో రీరిలీజ్ చేయడం వంటి మార్పుల్ని ఇప్పటికే మనకు పరిచయం చేసిన టాలీవుడ్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్కు నాంది పలికింది. అదే పాత సినిమాలో కొత్త పాటల్ని కలపడం. పాత విజువల్స్కు కొత్త పాటని జత చేసే ట్రెండ్ కు నాంది పలికింది సినీనటుడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమా. ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుండడంతో మొత్తం టాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్లోకి పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లి అప్పట్లో హిట్ అయిన చిత్రాల్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తెచ్చే క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. జూన్ 8 న ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. బాలకృష్ణ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. దీనిని నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్ గా నటించింది. 21ఏళ్ల క్రితం 2004 లో రిలీజ్ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రీరిలీజ్ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్ ను రూపొందించి విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త పాటనే రూపొందించారు. మొదట లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్ ను రివీల్ చేసే సాంగ్ ఒకటి రూపొందించారట. అయితే షూటింగ్ కూడా చేసినా ఆ సాంగ్ ని వాడలేదట. దీంతో ఆ పాత బాలయ్య డ్యాన్స్ విజువల్స్ను కొత్తగా పాట రాయించి మరీ ఆ విజువల్స్కు జత చేశారట.తాజాగా ఈ కొత్త సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. మంచినీళ్లు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు.. మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు అంటూ సాగే ఈ పాటనుచంద్రబోస్ రాయగా, స్వరాగ్ కీర్తన్ ఆలపించగా, భీమ్స్ నేపధ్య సంగీతం అందించారు. పాట చివర్లో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ బాలకృష్ణకు యధాశక్తి భజన చేశారు బెల్లంకొండ. సినిమా రీరిలీజ్ రోజు కలెక్షన్స్ కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు..అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాత సినిమాకు కొత్త ఆకర్షణలను జోడించడం కూడా తప్పు కాదు. కానీ తాజాగా జోడించిన పాటలో వాక్యాలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ వైపు మద్యం ప్రకటనల్లో, ప్రచారాల్లో సినిమా తారలు పాల్గొనడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏకంగా మందు తాగితేనే ఘనుడు, మ్యాన్షన్ హౌస్ తాగితేనే మహానుభావుడు..వాడిని ఎవడూ ఆపలేడు... అంటూ తన పాటల ద్వారా చెప్పడం అంటే... ఒక ప్రజా ప్రతినిధి యువతకు ఏం సందేశం ఇస్తున్నట్టు? పైగా ఆయన పుట్టిన రోజు నాడు.. అభిమానులకు ఇవ్వాల్సిన సందేశం ఇదేనా? -
'లక్ష్మీ నరసింహా'లో కొత్త పాట.. రీ రిలీజ్లో ట్రెండ్
బాలకృష్ణ (Balakrishna), అసిన్ నటించిన 'లక్ష్మీ నరసింహా' (Lakshmi Narasimha) చిత్రం సుమారు 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మరో కొత్త సాంగ్ను ఈ చిత్రంలో చేర్చారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా దానిని తాజాగా విడుదల చేశారు. 'మంచినీళ్లు తాగినోడు మామూలోడు' అంటూ సాగే ఈ సాంగ్ను చంద్రబోస్ రచించగా భీమ్స్ సంగీతం అందించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం హిందీలో IPS నరసింహగా డబ్చేశారు. తమిళ చిత్రం సామికి రీమేక్గా తెలుగులో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు. జూన్ 8న ఈ మూవీ 4కె వెర్షన్లో విడుదల కానుంది. -
బాలయ్య బర్త్ డే స్పెషల్.. లక్ష్మీ నరసింహ ట్రైలర్ వచ్చేసింది!
టాలీవుడ్ కొద్దికాలంగా రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, ఆసిన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహ సైతం బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఈనెల 10న బాలయ్య బర్త్ డే కావడంతో రెండు ముందుగానే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ బ్లాక్బస్టర్ మూవీని జూన్ 8న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారుఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. 200లో వచ్చిన ఈచిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. -
పురవీధుల్లో విహరించిన స్వామి అమ్మవార్లు
-
7 నుంచి లక్ష్మీనరసింహుడి వార్షిక ఉత్సవాలు
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక ఉత్సవాలు మే 7వ తేదీ నుంచి జరగనున్నాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయన్నారు. మే 7న స్వస్తి వచనం, లక్ష కుంకుమార్చన, 8 న లక్ష పుష్పార్చన, 9 న సహస్ర కలశాభిషేకం ఉంటాయని వివరించారు. ఈ మూడు రోజులపాటు నిత్య కల్యాణం, సుదర్శన హోమం రద్దు చేసినట్లు ఈవో తెలిపారు -
నారసింహునికి చందన సిరి
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల చినవెంకన్న ఉపాలయం ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై లక్షీ్మనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం చందనోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉగ్ర నారసింహుడు చందనలేపనంతో సేదతీరారు. కల్యాణోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిత్యహోమాలు, మూలమంత్ర హవనాలు జరిగాయి. స్వామి మూలవిరాట్కు చందన మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛారణ నడుమ వైభవంగా నిర్వహించారు. ఉగ్రరూపంలో ఉండే లక్షీ్మనరసింహుని శాంతింపచేసే క్రమంలో జరిగిన ఉత్సవం నేత్రపర్వమైంది. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, రాత్రి ధ్వజఅవరోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
లక్ష మంది వచ్చినా ఇబ్బందులుండొద్దు
-
లక్ష మంది వచ్చినా ఇబ్బందులుండొద్దు
యాదాద్రిపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ► స్వామి దర్శనం చేసుకుని భక్తులు సంతృప్తితో వెనుదిరగాలి ► కొండపైకి వెళ్లివచ్చేందుకు వేరువేరు మార్గాలుండాలి సాక్షి, హైదరాబాద్: ఒకేసారి లక్షమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం తలెత్తని విధంగా యాదాద్రి ఆలయం రూపొందాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. సాఫీగా స్వామి దర్శనం చేసుకుని భక్తులు సంతృప్తితో తిరిగి వెళ్లేలా పరిస్థితులు ఉండాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో యాదాద్రి ప్రధాన ఆలయం. యాదగిరి, లక్ష్మి నరసింహం, నరసింహ, నరసింహారావు, యాదయ్య... ఇలాంటి పేర్లు లేని ఊళ్లుండవు, మాఘం, చైత్యం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఫాల్గుణ మాసాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కొంతకాలంగా సెలవు రోజుల్లో రద్దీ బాగా పెరిగింది. ఇలా ఒకేరోజు లక్ష మంది వస్తే సంతృప్తికర దర్శనంతోపాటు అందరికీ మంచి వసతి దొరకాలి, ఎక్కడా ట్రాఫిక్ చిక్కులు ఉండొద్దు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున యాదాద్రికి నలువైపులా నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలి, నాలుగు వరసల రింగు రోడ్డు, ప్రదక్షిణ మార్గాలను నిర్మించాలి. ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై అన్ని వసతులతో కూడిన కాటేజీలు ఏర్పడాలి. ఈశాన్య భాగంలో 13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై ప్రెసిడెంట్ సూట్ నిర్మించాలి. ఇప్పుడున్న బస్టాండ్, బస్ డిపోలను వేరేచోటికి మార్చాలి. పోలీసు, ఫైర్, హెల్త్ సేవలు మెరుగుపడాలి. వాటిని అత్యవసరంగా భావించాలి’’అని పేర్కొన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం సమీక్షించారు. యాదాద్రిని గొప్పగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు కేటాయించామని, కావాల్సినంత భూమిని కూడా సేకరించిపెట్టామని, ఇక మెరుగైన ప్రణాళికతో నిర్మాణాలు చేపట్టడమే మిగిలి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనేక విశిష్టతలతో దేశంలోనే గొప్ప దివ్య క్షేత్రంగా మార్చాల్సి ఉన్నందున ఎలాంటి తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక ప్రణాళికలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. దేశంలోని ప్రధాన క్షేత్రాల్లో ఉన్న వసతులను గుర్తించి వాటిపై సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవతారాలన్నీ ప్రతిబింబించాలి లక్ష్మినరసింహస్వామివారికి 32 అవతారాలున్నాయని, అవన్నీ యాదాద్రిలో ప్రతిబింబించాలని సీఎం అన్నారు. అక్కడి వివిధ ప్రాంతాలకు దేవుడి పేర్లను పెట్టాలని, వాటి ఉఛ్చారణతో భక్తులు అన్యాపదేశంగానైనా దైవనామస్మరణ చేసిన ఫలితం వస్తుందన్నారు. ఆలయ ప్రాంగణంలో దైవ స్తోత్రాలు, కీర్తనలు వినిపించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాదగిరీశుడికి ప్రత్యేక కీర్తనలు, వాగ్గేయకారులుండేవారన్నారు. ఆ కీర్తనలను సేకరించి ప్రాచుర్యంలోకి తేవాల్సి ఉందన్నారు. కింది నుంచి గుట్టపైకి భక్తులను తరలించేందుకు ఆలయ ప్రత్యేక బస్సులుండాలని, వచ్చి వెళ్లేందుకు వేర్వేరు దారులు అవసరమని, దిగువకు వచ్చేందుకు కొత్తమార్గం నిర్మించాలని, మెట్లు కూడా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. మార్గాలు, గుట్టపైన ప్రకృతి రమణీయంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సువాసనలు వెదజల్లే మొక్కలను పెంచాలని, భక్తులకు క్యూలైన్లలో ఆహారం, పానీయాలు అందించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి వ్యాపారులు సహకరిస్తున్నందున వారి ఉపాధి కోసం కింద నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలు కేటాయించాలన్నారు. చేతి వృత్తులు, చేనేత వస్త్రాలను పోత్రహించాలని పేర్కొన్నారు. కొండపై నిద్రించి స్వామివారికి సేవ చేయాలనుకునే భక్తులకు, మండల దీక్షాచరించే భక్తులకు సమీపంలోనే వసతి ఉండాలని, అర్చకులకు కూడా చేరువలోనే నివాస సముదాయాలుండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. సమీపంలోని 85 ఎకరాల అటవీ భూములను సద్వినియోగం చేసుకోవాలన్నారు.