Mahesh Babu Enjoying Vacation With Family In London, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu: లండన్‌ వేకేషన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. నమ్రత పోస్ట్ వైరల్!

Jul 24 2023 9:47 PM | Updated on Jul 25 2023 11:22 AM

Mahesh Babu Family vacation in London Pics Goes Viral - Sakshi

టాలీవుడ్‌ ప్రిన్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ప్రిన్స్‌ కాస్తా టైం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వ్యాకేషన్‌ ప్లాన్ చేస్తుంటారు. అంతేకాదు ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం షూటింగ్‌కు కాస్త విరామం లభించడంతో మహేశ్‌బాబు కుటుంబంతో సహా లండన్‌లో వాలిపోయారు. ఇటీవలే వేకేషన్‌కు వెళ్తూ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. 

(ఇది చదవండి: హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్)

తాజాగా నమ్రత లండన్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. లండన్‌లో ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో డిన్నర్‌ చేస్తున్న ఫోటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ అన్నను జాగ్రత్తగా చూసుకో మేడమ్ అంటూ కొందరు నెటిజన్స్ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.  గతంలో కూడా పలుసార్లు మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి లండన్‌కు వేకేషన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 

కాగా..మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి పూజా హేగ్డే హీరోయిన్‌గా తప్పుకోవడంతో... పెళ్లి సందడి భామ శ్రీలీల ఆ ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మరో చిత్రం చేయనున్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement