
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో హీరో సూర్య ఫ్యాన్స్కు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన వచ్చే మూవీని టాలీవుడ్ డైరెక్టర్తోనే తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యనే స్వయంగా ప్రకటించారు. దీంతో సూర్య టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సూర్య గజిని సినిమా వచ్చినప్పుడు నా ఇంజినీరింగ్ పూర్తయిందని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. ఆ సినిమాను థియేటర్లో చూసి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించిందన్నారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చూసినప్పుడు.. లవ్, ఫెయిల్యూర్, క్రమశిక్షణ నేర్పిన సినిమా సార్ అది అని వెంకీ అన్నారు.
#Suriya46 💥💥@Suriya_offl - #VenkyAtluri - @Vamsi84 - @SitharaEnts ❤️🔥❤️🔥 🎥 pic.twitter.com/CD7XEkRz6h
— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2025