
టీమిండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల అంశం ఇప్పటికీ ఏదోలా చర్చకు కారణమవుతూనే ఉంది. 2020లో ఈ జంట పెళ్లి చేసుకోగా కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ ఏడాదిన్నర క్రితం విడాకుల రూమర్స్ వచ్చాయి. కట్ చేస్తే ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. అప్పటినుంచి సైలెంట్గానే ఉన్న ఈమె.. ఇప్పుడు తొలిసారి మీడియాతో మాట్లాడింది. విడాకుల తర్వాత తాను చాలా మారిపోయినట్లు చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: Spirit: రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా.. త్రిప్తికి ఎంత ఇస్తున్నారంటే?)
'ట్రోలింగ్ నన్నేం బాధపెట్టదు. ఎందుకంటే నాకు మనోబలం ఎక్కువ. బయట సమస్యలు నన్నేం చేయలేవు. నెగిటివిటీ, బహిరంగ విమర్శలు.. నన్ను ఎప్పుడూ బాధించలేదు. నేను చాలా కష్టపడే మనిషిని. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నన్ను నేను ప్రేమించుకోవడం, క్రమశిక్షణ, వ్యాయామం, మంచి ఫుడ్తో పాటు నన్ను ప్రేమించే, గౌరవించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నారు' అని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది.
రీసెంట్ టైంలో ఎదురైన పరిస్థితులు నన్ను దృఢంగా మార్చాయి. నా తల్లిదండ్రులు ఎంత బలమైన కూతుర్ని పెంచారో తెలిసొచ్చింది. ఇప్పుడు నాపై వస్తున్న పుకార్ల గురించి క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడేం చెప్పినా అది మరింత చర్చకు కారణమవుతాయి. అలానే ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైన అంశం అని ధనశ్రీ చెప్పింది.
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్)
చాహల్తో విడాకులు తీసుకోవడం ఏమో గానీ ధనశ్రీపై చాలా విమర్శలు వచ్చాయి. రూ.60 కోట్ల భరణం తీసుకుందని అన్నారు. కానీ అదంతా పుకారే అని తేల్చారు. మరోవైపు చాహల్తో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న ఆర్జే మహ్వశ్ అనే అమ్మాయి కూడా అప్పుడప్పుడు పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేది. ఇప్పుడు వాటిపైనే స్పందించిన ధనశ్రీ.. అలాంటివే పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది.
ప్రస్తుతం తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో హీరోయిన్గా చేసిన ధనశ్రీ వర్మ.. హిందీలో భోల్ చుక్ మాఫ్ అనే మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అంతకు ముందు ఈమె యూట్యూబర్గా చాలా ఫేమస్.
(ఇదీ చదవండి: ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?)