ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్‌, మహేశ్‌.. ఇది కదా కావాల్సింది! | Chiranjeevi, Nagarjuna, Ram Charan, Akhil Group Lunch Party In Maldives, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న టాలీవుడ్‌ స్టార్స్‌.. బొమ్మ అదిరింది!

Nov 7 2024 8:24 PM | Updated on Nov 8 2024 12:36 PM

Chiranjeevi, Nagarjuna, Ram Charan, Akhil Lunch at Maldives

ఒకరిద్దరు స్టార్‌ హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది టాలీవుడ్‌ అగ్ర హీరోలందరూ ఒక్కచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది.. మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, అఖిల్‌.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

స్టార్స్‌ అంతా ఒకేచోట
ఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వీళ్లంతా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోలందరూ కలిసి భోజనం చేశారు. ఉపాసన, నమ్రత సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అద్భుత కలయికకు మాల్దీవులు వేడుకగా నిలిచింది.

సినిమా..
సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేశ్‌బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

చదవండి: ఫైట్ యాక్షన్‌ సీక్వెన్స్‌.. సునీల్ శెట్టికి గాయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement