
Air India Plane crash అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అందరినీ దుఃఖంలో ముంచెత్తింది. భయంకరమైన ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా రోదిస్తున్న వీడియో వైరల్గా మారింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావద్దేశాన్ని దిగ్భ్రాతిలో ముంచెత్తింది. ఈ ఘోర ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన వారు రోదిస్తున్న అనేక దృశ్యాలు వైరల్ అయ్యాయి. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియురాలి మృతదేహం కోసం మౌనంగా రోదిస్తున్నాడు. గుండెలు పగిలే దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో పలువురి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని కన్నీరు కార్చుతున్న అతణ్ని ఎవరికోసం ఎదురు చూస్తున్నారని అక్కడి అధికారి అడిగినపుడు, ‘మై లవ్ అంటూ సమాధానం చెప్పడంతో పలువురి కంట నీళ్లు తెప్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై నుండి ఇక్కడికి చేరుకున్నాడు. తన ప్రియురాలి మృతదేహం కోసం ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న ఒంటరి వ్యక్తి, ఇలాంటి దృశ్యాలను చూడటం నిజంగా హృదయ విదారకంగా అంటూ జర్నలిస్ట్ వీడియోను షేర్ చేశారు.
జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదంలో AI171 అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి B.J. మెడికల్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు, విద్యార్థులు , స్థానికులు సహా 272 మంది మరణించారు.
At hospital waiting room, we found this young man. The body was yet to be handed over.
He quietly sat there and wept on his own. He lost his girlfriend. No one by his side but a whole bundle of memories that he has to live with for the rest of his life.
“Who are you waiting… pic.twitter.com/pdxsZhBPPN— Tamal Saha (@Tamal0401) June 13, 2025