మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడి   | Janasena Worker Assaulted On Minor In West Godavari | Sakshi
Sakshi News home page

మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడి  

Oct 18 2023 7:23 AM | Updated on Oct 18 2023 7:23 AM

Janasena Worker Assaulted On Minor In West Godavari - Sakshi

పంజా నాగేంద్ర

మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీరవాసరం పోలీసులు తెలిపిన వివరాలు.

వీరవాసరం: మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీరవాసరం పోలీసులు తెలిపిన వివరాలు..

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పంజావేమవరానికి చెందిన జనసేన కార్యకర్త పంజా నాగేంద్ర అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్‌ బాలికపై సోమవారం రాత్రి లైంగిక దాడి చేశాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మైనర్‌ బాలికను కాళ్లు, చేతులు కట్టేసి వాటర్‌ ట్యాంక్‌ సమీపంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

తనపై జరిగిన దారుణాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పి.రమేష్‌ తెలిపారు.
చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement