సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. సూచీలు ఆల్‌టైమ్‌ హై! | stock market today opening profits 28 december 2023 | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. సూచీలు ఆల్‌టైమ్‌ హై!

Dec 28 2023 10:35 AM | Updated on Dec 28 2023 1:12 PM

stock market today opening profits 28 december 2023 - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్ల లాభాల ర్యాలీ కొనసాగుతోంది. క్రితం రోజు లాభాలతో ముగిసిన దేశీయ ప్రధాన సూచీలు ఈరోజు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. నిఫ్టీ తొలిసారిగా 21,700 మార్కును అధిగమించగా, సెన్సెక్స్ 72,300 మార్కుకు చేరుకుంది. మీడియా, రియాల్టీ మినహా  చాలా రంగాల్లో కొనుగోలు చర్య కనిపించింది.

ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్‌ 72,362.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21,715 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. హీరో మోటర్‌కార్ప్‌, మహీంద్రా& మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌, ఎన్‌టీపీసీ, టైటాన్‌ కంపెనీల షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యాక్సిస్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటర్స్‌, ఇన్ఫోసిస్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాలతో టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement