దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా రెండవ రోజు పడిపోయాయి. సెన్సెక్స్ 187.90 పాయింట్లు 0.24 శాతం క్షీణించి 77,966.35 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,435.95 వద్ద స్థిరపడ్డాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ 1.54 శాతం క్షీణించి చెత్త పనితీరు కనబరిచింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 2శాతం పెరిగి సహచర రంగాలను అధిగమించింది.


