గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 113.61 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో.. 78,079.96 వద్ద, నిఫ్టీ 40.10 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,395.85 వద్ద నిలిచాయి.
ఆస్ట్రల్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, శారదా ఎనర్జీ & మినరల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఫిజిక్స్వాలా లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


