Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం | TTD News: Tirumala Que Updates On Jan 15 2024 | Sakshi
Sakshi News home page

సర్వదర్శనానికి 16 గంటల సమయం

Jan 15 2024 7:39 AM | Updated on Jan 15 2024 10:54 AM

TTD News: Tirumala Que Updates Jan 15 2024 - Sakshi

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు

తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. 

ఇక ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,849 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా లెక్క తేలింది.

ఇక ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement