
అల్లూరి సీతారామరాజు జిల్లా: 11 మంది మావోయిస్టు మిలీషియ సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఎస్పీ అమిత్ బర్ధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీకే వీధి మండలం గాలికొండ ఏరియా కమిటీకి చెందిన 11 మంది మావోయిస్టు మిలీషియ సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిపై ఒక్కొకరిపై సుమారు ఆరేడు కేసులు ఉన్నాయని తెలిపారు.
2021లో అనేక నేరాల్లో వీరంతా పాల్గొన్నారు. లొంగిపోయిన వారిపై ఏ కేసులు లేకుండా వదిలిపెడుతున్నామని ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు. మావోయిస్టులు గిరిజనుల కోసం ఏనాడు పని చేయలేదని.. మావోయిస్టుల వలన గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని ఎస్పీ అన్నారు.