breaking news
Varanasi Movie
-
వారణాసి జానర్పై కన్ఫ్యూజన్.. రాజమౌళి ఫుల్ క్లారిటీ..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్ టచ్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్లో మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.కొందరు ఈ సినిమాను ఫిక్షన్ అని అంటున్నారు. మరికొందరేమో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్లుక్ చూసి సైన్స్ ఫిక్షన్ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్పై ఆడియన్స్లో విపరీతమైన కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆడియన్స్ అనుమానాలకు చెక్ పడినట్లైంది. కాగా.. వారణాసిలో మహేశ్బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్ రోల్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మీ వారణాసి కోసం వెయిటింగ్ సార్
-
'తన కెరీర్లోనే అతిపెద్ద సినిమా'..వారణాసిపై ప్రియాంక భర్త కామెంట్స్
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అండ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. తొలిసారి వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డేట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ గురించి ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత పద్నాలుగు నెలలుగా ప్రియాంక ఓ మూవీ కోసం పనిచేస్తోందని తెలిపారు. ఈ సౌతిండియా ఫిల్మ్ను ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. ఇది తన కెరీర్లోనే అతి పెద్ది సినిమా అని నిక్ జోనాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ అద్భుతంగా ఉండనుందని నిక్ కొనియాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు . ఇందులో మహేశ్బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. -
మహాతెరపై... మహేష్ వారణాసి, చూడగలమా?
దర్శక థీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు ల కాంబోలో వస్తున్న వారణాసి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఎప్పటి నుంచో తమ హీరోని గ్లోబల్ స్టార్గా చూడాలని ఆశిస్తున్న ప్రిన్స్ అభిమానుల అంచనాలకైతే ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో మరో ఏడాదిలో రానున్న వారణాసి గురించిన ప్రతీ వార్తా సంచలనమే అవుతోంది. అదే క్రమంలో ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారణాసిని ఐమ్యాక్స్ తెరపై చూపాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కథా వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, వారణాసి చిత్రంలో హిందూ దేవుడైన శ్రీరాముని పునర్జన్మ గా రుద్ర పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నట్టు సమాచారం. ’ది వ్రాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఐమాక్స్ కోసం చిత్రీకరించిన రెండవ భారతీయ చిత్రంగా నిలవనున్న తమ వారణాసి గురించి రాజమౌళి మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. వచ్చే 2027లో సినిమా విడుదల నాటికి స్క్రీన్ సిద్ధంగా లేకపోతే లాస్ ఏంజిల్స్లోని ఐమాక్స్ కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతానని రాజమౌళి చమత్కరించారు. అయితే తెలుగు చలనచిత్ర రాజధాని నగరమైన హైదరాబాద్లో ఇంకా నిజమైన ఐమాక్స్ స్క్రీన్ అందుబాటులోకి రాలేదు. ఇదే అక్కడ సమస్య. అత్యంత వ్యయ ప్రయాసలతో వారణాసి చిత్రాన్ని పూర్తిగా 1.43:1 ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో అభిమానులు కూడా దానిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకోవడం సహజమే.మరోవైపు ఐమాక్స్ విస్తరణకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్ ఇంకా వేచి చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గత 2020 నుంచి ఐమాక్స్ తన ఉనికిని 60% వరకూ పెంచుకుంది, అదే క్రమంలో భారతదేశంలో కూడా విస్తరించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఐమాక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జియోవన్నీ డోల్సీ చెబుతున్నారు. మన దేశం కనీసం 150 ఐమాక్స్ స్క్రీన్స్ ఏర్పాటు చేయవచ్చునని వారు నమ్ముతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం గుజరాత్లోని సైన్స్ సిటీలో కేవలం ఒకే ఒక నిజమైన 1.43:1 స్క్రీన్ ఉంది, అది కూడా వాణిజ్య ఉపయోగం కోసం అందుబాటులో లేదు. తెలుగు రాష్ట్రాలలో భారీ సినిమాలతో పాటు పెద్ద తెర అనుభవాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ మల్టీఫ్లెక్స్లను నెలకొల్పడంలో క్యూ కడుతున్న ఏ ఎగ్జిబిటర్ లేదా సెలబ్రిటీ కూడా నగరంలో ఐమాక్స్ స్క్రీన్ ప్రణాళికలను ఇప్పటి దాకా థృవీకరించలేదు.’వారణాసి’ చిత్రాన్ని ఐమాక్స్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు హైదరాబాద్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడంపై మహేష్ బాబు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీనికోసం సోషల్ మీడియా వేదికగా ఐమ్యాక్స్ సాకారం దిశగా చర్యలు తీసుకోవాలని మహేష్ బాబును ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే హైదరాబాద్లో నిజమైన ఐమాక్స్ స్క్రీన్ ను ఏర్పాటు చేయడంలో ప్రధాన సమస్య అధిక వ్యయం. అటువంటి స్క్రీన్ ఏర్పాటు చేయడానికి నిర్వహించడానికి భారీ పెట్టుబడి అవసరం. టిక్కెట్ ధరలపై పరిమితులు అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా, ప్రదర్శనదారులు ఈ రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మరిన్ని స్క్రీన్లను అందించడానికి ఐమాక్స్ సిద్ధంగా ఉంది, కానీ స్థానిక ప్రదర్శనదారులే ఒక చొరవ తీసుకోవాలి. మహేష్ బాబు అభిమానులతో సహా సినీ ప్రియులు, ఐమాక్స్ స్క్రీన్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. -
‘వారణాసి’ కోసం రాజమౌళి, మహేశ్ కొత్త స్ట్రాటజీ!
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఒక్కటే నిర్వహించారు. ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్స్ షురూనే చేయలేదు కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఓ రేంజ్లోకి వెళ్లిపోయాయి. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాకు గాను జక్కన్న, మహేశ్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారట. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి తీసుకోవద్దని ఫిక్స్ అయ్యారట.గత సినిమాలకు కూడా రాజమౌళి పూర్తిగా పారితోషికం తీసుకునేవాడు కాదు. కొంతమేర రెమ్యునరేషన్గా తీసుకొని.. మిగతాది లాభాల్లో వాటాగా తీసుకునేవాడు. కానీ ఈ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి తీసుకోకుండానే పని చేస్తున్నాడట. పారితోషికంగా ఓవర్సీస్ రైట్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు కూడా ఒక్క పైసా తీసుకోకుండా, నిర్మాణంలో భాగస్వామి అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఉన్న బజ్ దృష్ట్యా..కచ్చితంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం.. ఊహించని కలెక్షన్స్ రావడం ఖాయం. ఈ లెక్కన అటు జక్కన్నకు, ఇటు మహేశ్కు రెగ్యులర్గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అందే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఓవర్సీస్లో రైట్స్ తీసుకోవడం ద్వారా జక్కన్నకు రూ. 150 కోట్లకు పైనే లాభం వచ్చే చాన్స్ ఉంది. అలాగే నిర్మాణం భాగస్వామ్యం అయిన మహేశ్కు రూ. 150-200 కోట్ల వరకు రావొచ్చు. మహేశ్బాబు ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అందుకే మహేష్ తో 15 ఏళ్ళు పట్టింది.. వారణాసి సీక్వెల్ పై రాజమౌళి
-
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. -
నాకు స్టార్డమ్ తెచ్చిన సినిమా అదే! రాముడి పాత్రకోసం..
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ వారణాసి. మహేశ్బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. 2025 చివర్లో వారణాసి గ్లింప్స్ రిలీజ్ చేయగా మూవీకి భారీ హైప్ వచ్చింది. ఈ మధ్యే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా చిత్రయూనిట్ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది.స్టార్గా మారిందే ఆ సినిమాతోఅందులో మహేశ్బాబు తనకు స్టార్డమ్ తెచ్చిన సినిమా ఏదో వెల్లడించాడు. అలాగే వారణాసిలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. 'పోకిరి సినిమా నన్ను స్టార్గా నిలబెట్టింది. ఆ మూవీ చాలా పెద్ద విజయం సాధించింది. వారణాసి విషయానికి వస్తే.. రాజమౌళి నాకు ఈ కథ చెప్పగానే ఆశ్చర్యపోయాను. తర్వాత ఓసారి.. మీ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. మీరు హీరోలను చాలా బాగా చూపిస్తారు, మీకు హీరోలంటే చాలా ప్రేమ అని రాజమౌళికి మెసేజ్ పెట్టాను. అందుకాయన థాంక్యూ, కానీ నా సినిమాల్లో నాకు విలన్లంటేనే ఎక్కువ ఇష్టం అని రిప్లై ఇచ్చాడు.మొదట్లో భయపడ్డా..రాజమౌళి అభిమానిగా నేను కూడా వారణాసి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇందులో హీరోగా చేయడానికి నేను మొదట్లో భయపడ్డాను. కానీ ఆయన కథను వివరించి చెప్పాక ఆ భయం పోయింది. ఇందులో రాముడి పాత్ర పోషించాను. రాముడు అంటేనే హుందాతనం. నిలబడే దగ్గరనుంచి పాత్రలో నటించేవరకు ఎన్నో రిహార్సల్స్ చేశాం అని చెప్పాడు. తనకు ఇష్టమైన వంటకం ఏంటని అడగ్గా హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇష్టమని మహేశ్బాబు తెలిపాడు.చదవండి: చిరంజీవిపై ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు -
రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్కి 6 నెలలు ట్రైనింగ్
మహేశ్ బాబు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి రన్నింగ్. ఇతడు చేసిన ఏ సినిమా చూసినా మిగతా వాళ్లతో పోలిస్తే మహేశ్ కాస్త డిఫరెంట్గా పరుగెత్తుతాడు. అయినా సరే ఇది అభిమానులకు బాగానే నచ్చేసింది. ఎవరైనా మహేశ్ గెటప్ వేయాలన్నా సరే అతడి రన్నింగ్ స్టైల్నే ఫాలో అయిపోతుంటారు. అలాంటిది కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్ల తర్వాత మహేశ్.. ఈ విషయంలో కొత్తగా కనిపించనున్నాడు. లేదు రాజమౌళి ఏకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ మార్చేశాడు. దీని గురించి స్వయంగా మహేశ్ బాబే చెప్పాడు.మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. గతేడాది నవంబరులో టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియోతో రివీల్ చేశారు. ప్రస్తుతం, గతం, భవిష్యత్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మహేశ్.. శ్రీ రాముడి పాత్రలోనూ కాసేపు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసమే తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకున్నానని మహేశ్ చెప్పాడు.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై రాజమౌళి క్లారిటీ)రాముడి పాత్ర కోసం ఆహార్యం మెంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు ఏడాది ప్రిపరేషన్ చేశాం. 2-3 నెలలు కలరీ యుద్ధవిద్య కూడా నేర్చుకున్నాను. అలానే రాజమౌళి.. నా రన్నింగ్ టెక్నిక్ మార్చాలని అన్నాడు. దీనికోసం ఏకంగా 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాం. కాకపోతే 2 సీన్లు మాత్రమే తీశారు. అలాంటి నిబద్ధత 'వారణాసి' కోసం నేను చూపించాను అని మహేశ్ బాబు.. తాజాగా రిలీజ్ చేసిన 'వారణాసి' ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్నికొన్నిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ఇప్పటివరకు పాన్ ఇండియా వరకే తమ మూవీస్ రిలీజ్ చేసిన జక్కన్న.. 'వారణాసి'తో గ్లోబల్ వైడ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు) -
మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ
'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'వారణాసి'. 2024లో షూటింగ్ మొదలైనప్పటికీ.. గతేడాది నవంబరులోనే అన్ని విషయాలు బయటపెట్టారు. టైటిల్తో సహా మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని గ్లింప్స్ రూపంలో రివీల్ చేశారు. దానికోసం భారీ ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, రాజమౌళి.. పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇందులోనే రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్ అంటూ వస్తున్న రూమర్స్పైనా క్లారిటీ ఇచ్చేశారు.15 ఏళ్ల క్రితమే మహేశ్ బాబు, మీరు కలిసి పనిచేయాలనుకున్నారు? మరి దానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి.. '2010లో నేను-మహేశ్ మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని ఫిక్సయ్యాం. కాకపోతే నాకున్న మూడు కమిట్మెంట్స్ పూర్తి చేసి వస్తానని మాటిచ్చాను. ఆరు నెలల్లో ఈగ తీద్దామనుకుంటే రెండేళ్లు పట్టేసింది. రెండేళ్లలో బాహుబలి తీద్దామనుకుంటే మూడేళ్లు పట్టేసింది. కొవిడ్ వల్ల 'ఆర్ఆర్ఆర్' చాలా ఆలస్యమైపోయింది. అందుకే మహేశ్ బాబుతో చేయడానికి ఇన్నేళ్లు పట్టేసింది' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజమౌళి.. మేం ఆలోచించుకున్న తర్వాత సీక్వెల్ వద్దని డిసైడ్ అయ్యాం. దాదాపు 3 గంటల నిడివితోనే మూవీ థియేటర్లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చేశాడు. అలానే ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్.. ఐదు నిమిషాలు బోర్ కొట్టినా సరే ఫోన్ చూసుకుంటాడు. స్టోరీ విషయంలో ప్రేక్షకుడు తల పక్కకు తిప్పకుండా ఉండేలా మూవీని తీస్తున్నాం. అదే అతిపెద్ద ఛాలెంజ్ అని అన్నాడు. 'వారణాసి'లో రామాయణం సీన్స్ ఉండటానికి గల కారణాన్ని కూడా రాజమౌళి వెల్లడించాడు. 'నా సినిమాలన్నీ కూడా రామాయణ, మహాభారత నుంచి స్ఫూర్తి పొందినవే. కానీ ఈసారి స్ఫూర్తి కాకుండా 'రామాయణం' ఓ భాగాన్ని 'వారణాసి'లో చూపించే అవకాశం దొరికింది' అని జక్కన్న అన్నాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారులు కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..'వారణాసి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మొన్నటివరకు విడుదల తేదీపై కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అంటే ఉగాది సందర్భంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ బల్లగుద్ది చెప్పింది.(ఇదీ చదవండి: సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్) -
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
చలో జార్జియా
హీరో మహేశ్బాబు జార్జియా వెళ్లనున్నారట. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. మహేశ్బాబు–ప్రియాంకా చోప్రా పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.కాగా, ‘వారణాసి’ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్ను అంటార్టికాలోనూ ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. -
వారణాసి కోసం రూల్స్ పక్కన పెట్టిన రాజమౌళి.. షాక్ లో పాన్ ఇండియా
-
నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి
పాన్ ఇండియా అనే పేరు చెప్పి.. చాలామంది హీరోలు, దర్శకులు ఏళ్లకు ఏళ్లు వృథా చేస్తున్న కాలమిది. పోనీ కంటెంట్తో ఏమైనా హిట్ కొడుతున్నారా? అంటే లేదు. హడావుడి తప్పితే ఏం ఉండట్లేదు. చాలా తక్కువమంది మాత్రమే ప్రేక్షకుల అంచనాలని అందుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ ట్రెండ్ని సృష్టించిన రాజమౌళి.. ఇప్పుడు ఎవరి ఊహలకు అందని విధంగా నమ్మలేని పనులన్నీ చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)సాధారణంగా సినిమా చేస్తున్నాం అంటే షూటింగ్ ప్రారంభానికి ముందే టీమ్ నుంచి ప్రకటన వస్తుంది. లాంచింగ్ లాంటి హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ట్రెండ్ని బ్రేక్ చేసిన రాజమౌళి.. అసలు చిత్రీకరణ మొదలైన విషయాన్నీ చాన్నాళ్లు దాచిపెట్టాడు. షూటింగ్ అప్డేట్ లాంటివి అస్సలు బయటపెట్టలేదు. సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినా ఒక్కటంటే ఒక్కదానిపై కూడా స్పందించలేదు. గతేడాది నవంబరులో వేరే లెవల్ అనే రేంజులో ఈవెంట్ ఏర్పాటు చేసి 'వారణాసి' గురించి ప్రకటించాడు. ఇదేదో రెగ్యులర్ ఫార్మాట్ అయితే కాదు.మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియో రూపంలో చూచాయిగా చెప్పేసిన దర్శకుడు రాజమౌళి.. అందరి అంచనాలు పెంచేశాడు. ఇదే ఈవెంట్లో సినిమా గురించి చాలానే విషయాలు బయటపెట్టాడు. చిత్రం పూర్తయ్యే వరకు ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా కట్టుదిట్టం చేసే జక్కన్న.. ఇలా మారిపోవడం ఎవరూ ఊహించలేదు. ఇదే కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ 2027 వేసవిలో 'వారణాసి'.. థియేటర్లలోకి రావొచ్చని అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))చాలామంది దర్శకనిర్మాతలు ఒక అప్డేట్ ఇస్తున్నారంటే.. ఫలానా టైమ్కి ఓ సర్ప్రైజ్ ఉందని ఓ అప్డేట్, దీనికి మరో అప్డేట్ అని చెప్పి నెటిజన్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. రాజమౌళి మాత్రం ఉరుము లేని పిడుగులా.. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. దీంతో అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే జక్కన్న సినిమా అంటే చెప్పిన టైంకి రాదు, వాయిదా పడుతుందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ 'వారణాసి' విషయంలో అంతా పకడ్బందీగానే ఉన్నట్లయితే కనిపిస్తుంది.ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వరకే పరిమితం. ఈసారి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాలని అనుకుంటున్నాడు. చెప్పిన టైంకి రాకుండా వాయిదాల్లాంటివి మన దగ్గర కుదురొచ్చు. ఎందుకంటే ఇది మనకు అలవాటైపోయింది కాబట్టి. కానీ గ్లోబల్ రేంజులో రిలీజ్ అన్నప్పుడే మాటమీద నిలబడాల్సి ఉంటుంది. లేదంటే బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఈ లెక్కలన్నీ వేసుకునే రాజమౌళి.. గతంలో చేసినట్లు కాకుండా ఈసారి డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. అంతా చూస్తున్న సగటు తెలుగు ప్రేక్షకుడు.. రాజమౌళిని నిజంగానే నమ్మొచ్చా అని మాట్లాడుకుంటున్నాడు.(ఇదీ చదవండి: 'ధురందర్' లాంటి హిట్ తర్వాత శంకర్ తోనా?) -
వారణాసి పోస్ట్ ఫోన్..?
-
'వారణాసి' రిలీజ్పై మళ్లీ క్లారిటీ.. అయినా నమ్మట్లేదు
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. రెండు నెలల క్రితం హైదరాబాద్లో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించి టైటిల్ అనౌన్స్ చేశారు. 2027లోనే రిలీజ్ ఉంటుందని అన్నట్లు చెప్పుకొచ్చారు. రాజమౌళి మూవీ అంటే చెప్పిన సమయానికి ఎప్పుడు రాదు. తెలుగు ప్రేక్షకులకు ఇది తెలుసు. దీంతో ఈ చిత్రం కూడా 2027లో రావడం సందేహామే అని చాలామంది అనుకుంటున్నారు. దీంతో టీమ్ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్కి అస్సలు అచ్చిరాలేదు!)2027లోనే 'వారణాసి' రిలీజ్ అవుతుందని టీమ్ ఇప్పుడు ట్వీట్ చేసింది. తద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది. చాలామంది ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చని అనుకుంటున్నారు. ఈ రెండు పండగలు అంటే మరో ఏడాది మాత్రమే టైమ్ ఉంది. అప్పట్లో రాజమౌళి, సినిమాని సిద్ధం చేస్తారా అనేది చూడాలి? మహేశ్ అభిమానులు, చాలామంది నెటిజన్లు మాత్రం 2027లోనే రిలీజ్ అంటే అస్సలు నమ్మట్లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ కామెంట్స్ పెడుతున్నారు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లు కాగా.. 'వారణాసి'లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ విలన్గా చేస్తున్నాడు. ఇందులో కాసేపు మహేశ్ రాముడి పాత్రలోనూ కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే బయటపెట్టాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)COMING IN 2027.#VARANASI pic.twitter.com/yuInvgJwIk— Varanasi (@VaranasiMovie) January 21, 2026 -
1300 కోట్ల భారీ బడ్జెట్తో వారణాసి.. రాజమౌళి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?
-
కాశీలో రుద్ర తాండవం
‘వారణాసి’లో ప్రత్యర్థుల బెండు తీస్తున్నారట రుద్ర. ఈ రుద్ర తాండవం ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్పై ఆడియన్స్ చూసేందుకు కొంత సమయం ఉంది. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ అండ్ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రపాత్రలో మహేశ్బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఓ కీలకపాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు.ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. ముందు మహేశ్బాబు, ప్రకాశ్రాజ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారట. ప్రస్తుతం మహేశ్బాబు పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కోసం కాశీ నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. కేఎల్. నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది. -
వారణాసి ఇన్ని ట్విస్టులా..!
-
ప్రతిష్టాత్మక వేదికపై 'వారణాసి' టీజర్.. అధికారికంగా ప్రకటన
మహేష్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి.. యాక్షన్ అడ్వెంచరస్గా రానున్న ఈ మూవీపై ఇండియన్ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో #GlobeTrotterevent టైటిల్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీ కథా నేపథ్యాన్ని తెలిపేలా ఉన్న ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. జనవరి 5న పారిస్లో టీజర్వారణాసి నుంచి వచ్చిన తాజా అప్డేట్ ఏమిటంటే.., అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఈ మూవీ టీజర్ ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ఇప్పుడు చరిత్ర సృష్టించనుంది. పారిస్(Paris)లోని 'లే గ్రాండ్ రెక్స్'(Grand Rex)లో ఈ టీజర్ను విడుదల చేయనున్నారు. 2,702 సీట్లు కలిగిన ఈ థియేటర్.. యూరప్లోనే అతిపెద్దదిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్ బాబు వారణాసి చిత్రం నిలుస్తుంది. జనవరి 5 రాత్రి 9 గంటలకు టీజర్ విడుదల కానుంది. భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్న ఫిల్మ్స్ ఈ వార్తను ధృవీకరించింది. టీజర్ను పెద్ద స్క్రీన్పై గొప్ప ఫార్మాట్లో ప్రదర్శించడంతుందని ఇది ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుందని వారు భావిస్తున్నారు. వారణాసిని ప్రపంచ వార్తల్లో ఉంచడానికి రాజమౌళి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, షోయింగ్ బిజినెస్కు చెందిన ఎస్.ఎస్. కార్తికేయతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నారు. స్వరకర్త ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా.. కథ స్క్రీన్ప్లేను విజయేంద్ర ప్రసాద్ రాశారు.RAJAMOULI et son équipe sont dans une autre planète. Le teaser d'un film indien à être projeté pour la première fois en Grand Large au Grand Rex sera celui de VARANASI. Et ceci à plus d'un an avant la sortie ! Ne ratez pas cette occasion unique.#varanasifrance pic.twitter.com/HTrdiPjSvW— Aanna Films France (@AannaFilms) January 2, 2026 -
మరోసారి పోకిరి కాంబో.. వారణాసితో పాన్ వరల్డ్ షేక్
-
రాజమౌళి-మహేశ్ బాబు వారణాసి.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది..!
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ను గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వారణాసికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను.. ఇది నాలో నటుడి ఆకలి తీర్చిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు..మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.ప్రకాశ్ రాజ్ రోల్ అదేనా?అయితే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ రోల్పై టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు తండ్రిగా కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో ప్రకాశ్ రాజ్ రోల్పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ప్రకాశ్ రాజ్ గతంలో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు చిత్రంలో నటించారు. Wrapped up a wonderful schedule of #Varanasi .. a joy to the hungry actor within me .. thank you @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @priyankachopra ❤️❤️❤️ it was exhilarating to work with you all .. can’t wait to resume the next schedule 🥰🥰🥰— Prakash Raj (@prakashraaj) December 23, 2025 -
వారణాసి బడ్జెట్ అన్ని కోట్లా?.. ప్రియాంక చోప్రా క్రేజీ ఆన్సర్!
దర్శకధీరుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ ప్రకటించేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. గ్లోబ్ట్రాటర్ పేరుతో ఈవెంట్ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. అయితే ఈ మూవీ బడ్జెట్పై ఇప్పటికే టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్ స్పందిస్తూ.. అంటే బడ్జెట్లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Priyanka chopra about #Varanasi on Kapil Sharma show pic.twitter.com/6kgkusKaGf— Sunaina🦋 (@Sunaina_speaks) December 20, 2025 -
'వారణాసి' సెట్కి వస్తా కెమెరా పట్టుకుని సీన్స్ తీస్తా: 'అవతార్' డైరెక్టర్
గత నెలలో రాజమౌళి-మహేశ్ బాబు సినిమా లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. 'వారణాసి' అని టైటిల్ ప్రకటించారు. మూడున్నర నిమిషాల ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే దీన్ని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరిస్తారని అప్పుడు రూమర్స్ వచ్చాయి కానీ అదేం జరగలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి-జేమ్స్ కామెరూన్ మధ్య 'వారణాసి' గురించి డిస్కషన్ నడిచింది. సెట్కి వచ్చి కెమెరా పట్టుకుని సీన్స్ తీస్తానని కామెరూన్ చెప్పడం విశేషం.(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)జేమ్స్ కామెరూన్ తీసిన లేటెస్ట్ సినిమా 'అవతార్ 3'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఫాక్స్ స్టూడియో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. రాజమౌళి ఇక్కడే ఉండగా.. వీడియో కాల్ ద్వారా కామెరూన్ జక్కన్నతో మాట్లాడారు. మిగతా విషయాలు ఏమో గానీ 'వారణాసి' గురించి చేసుకున్న డిస్కషన్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.'వారణాసి' సినిమా సంగతేంటి అని కామెరూన్ అడగ్గా.. ఏడాది నుంచి షూటింగ్ చేస్తున్నామని, మరో ఏడెనిమిది నెలల్లో పూర్తవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. 'వారణాసి' షూటింగ్, సెట్స్ చూడాలని ఉందని చెప్పిన కామెరూన్.. కెమెరా పట్టుకుని తాను కూడా కొన్ని సీన్స్ తీస్తానని అన్నారు. అలానే 'పులులతో ఏదైనా షూట్ ప్లాన్ చేస్తుంటే చెప్పు' అని కామెరూన్ సరదాగా అన్నారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. రాజమౌళి చెప్పిన దానిబట్టి చూస్తుంటే వచ్చే ఏడాది ద్వితియార్ధానికి షూటింగ్ అయిపోతుందనమాట. అంటే చెప్పినట్లు 2027 వేసవిలో రిలీజ్ చేస్తారనమాట.(ఇదీ చదవండి: ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం) -
వారణాసిలో మహేష్ బాబు గెటప్స్ తెలిస్తే ఫ్యాన్స్ కు నిద్రపట్టదు భయ్యా !
-
'వారణాసి' ఫేమ్ ప్రియాంక చోప్రా స్టన్నింగ్ లుక్ (ఫొటోలు)
-
మహేశ్ 'వారణాసి'.. సమస్య పరిష్కారమైందా?
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండు వారాల క్రితం హైదరాబాద్లో భారీ స్థాయిలో లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరీ మూవీ విశేషాలని పంచుకున్నారు. దాదాపు నాలుగు నిమిషాల వీడియోని కూడా రిలీజ్ చేశారు. తద్వారా మూవీ ఎలా ఉండబోతుందనేది అందరికీ ఓ అంచనా వచ్చేలా చేశారు. అయితే టైటిల్ విషయంలో సమస్య రావొచ్చని చాలామంది అనుకున్నారు. అదే జరిగింది. ఇప్పుడు సదరు సమస్య పరిష్కారం కూడా అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'స్పిరిట్' సినిమా.. డైరెక్టర్ సందీప్ షాకింగ్ డెసిషన్!)ప్రకటించడానికి ముందే రాజమౌళి-మహేశ్ చిత్రానికి 'వారణాసి' టైటిల్ పెట్టబోతున్నారని రూమర్స్ వచ్చాయి. తర్వాత అదే నిజమైంది. కానీ ఇది లాంచ్ కావడానికి కొన్నిరోజుల ముందు మరో తెలుగు చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్ పెట్టారు. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇదో చిన్న సినిమా. నటీనటులు గానీ దర్శకుడు గానీ ఎవరో కూడా తెలియదు. అయితే వీళ్ల వల్ల రాజమౌళి చిత్రానికి సమస్య ఉండొచ్చని అనుకున్నారు. తర్వాత కాలంలో వీళ్లు.. ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు కూడా. దీంతో రాజమౌళి ఏం చేస్తారా అని మాట్లాడుకున్నారు.ఇప్పుడు టైటిల్ విషయంలో సమస్య పరిష్కారం అయినట్లు తెలుస్తోంది. ప్రకటించిన పేరుకి ముందు రాజమౌళి పేరు తగిలించినట్లు టాక్. అంటే ఇకపై 'రాజమౌళి వారణాసి' అని ఉండబోతుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే దీని గురించి బయటపెట్టేందుకు టీమ్ ఏమంత ఆసక్తితో లేదట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సమస్య పరిష్కారం అయిపోయినట్లే. గతంలోనూ ఇలానే టైటిల్స్ విషయం ఇబ్బందులు తలెత్తాయి. అప్పుడు 'మహేశ్ ఖలేజా', 'కల్యాణ్ రామ్ కత్తి' అని హీరోల పేర్లు టైటిల్ ముందు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం దర్శకుడి పేరు ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ఏదైనా ప్రకటన వచ్చినప్పుడు 'వారణాసి' టైటిల్ విషయంలో క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
గ్లోబ్ట్రాటర్ ఈవెంట్.. మహేశ్ బాబు ఎంట్రీ కోసం ఇంత కష్టపడ్డారా?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి(Varanasi Movie). ఇటీవలే మెగా ఈవెంట్ ఏర్పాటు చేసిన టైటిల్ రివీల్ చేశారు మన దర్శకధీరుడు. గ్లోబ్ట్రాటర్ (Globe Trotter Event) పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్కు వేలమంది అభిమానులు హాజరయ్యారు.అయితే ఈ వేడుకలో రిలీజ్ టైటిల్ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా నిలిచింది. ఈ బిగ్ ఈవెంట్లో మహేశ్ బాబు వృషభంపై(బొమ్మ) వస్తూ ఎంట్రీ ఇవ్వడం ప్రిన్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సీన్ కోసం మేకర్స్ ఎంత కష్టపడ్డారో తాజాగా వీడియోను పంచుకున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు జక్కన్న సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే మహేశ్ బాబు ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వారణాసి బీట్స్ పై క్లారిటీ ఇచ్చేసిన కీరవాణి
-
మహేష్ కోసం జక్కన్న సూపర్ ప్లాన్.. హనుమాన్ ఎవరంటే..!
-
వివాదాల సుడిగుండంలో దర్శకధీరుడు
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) ఇప్పుడు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. 'వారణాసి’ ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి దారి తీశాయి.అసలేం జరిగింది?నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి కొత్త సినిమా 'వారణాసి' టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్లతో పాటు రాజమౌళి కుటుంబం ఈ ఈవెంట్కి కూడా హాజరయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది. తాను అనుకున్నట్లుగా ఈవెంట్ జరగకపోవడంతో జక్కన్న కాస్త నిరాశకు లోనయ్యాడు. తన బాధను అభిమానులతో పంచుకున్నాడు ‘నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. కానీ మా నాన్నగారు(విజయేంద్ర ప్రసాద్) టెన్షన్ పడొద్దని, 'హనుమంతుడు అన్నీ సవ్యంగా నడిపిస్తాడు' అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఈవెంట్ సాంకేతిక లోపాలతో ఆగిపోయింది.. ఆయన ఏం చేస్తున్నాడు? అందుకే నాన్న అలా అంటే నాకు కోపం వస్తుంది’ జక్కన్న ఎమోషనల్ అయ్యాడు. దేవుడిని నమ్మనంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి దారీతీశాయి. 'హనుమంతుడిని అవమానించాడు’ అంటూ హిందూ సంఘాలు రాజమౌళిపై భగ్గుమన్నాయి. రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన (వానర సేనా) సంస్థ హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 'హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు' అని ఆరోపిస్తూ, రాజమౌళి, మహేష్ బాబు ఇళ్లను ముట్టడిస్తామని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. వారణాసిలో కూడా మరో కేసు నమోదు అయింది. భగ్గుమన్న బీజేపీ నేతలుబీజేపీ నేతలురాజమౌళిని తీవ్రంగా విమర్శించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ..‘రాజమౌళి నిజంగా నాస్తికుడైతే బహిరంగంగా చెప్పాలి లేదా క్షమాపణ చెప్పాలి. దేవుళ్ల కథలతో సినిమాలు తీసి కోట్లు సంపాదించి, ఇప్పుడు 'నమ్మకం లేదు' అంటే ఏమిటి? బాహుబలి, ఆర్ఆర్ఆర్లా హిందూ కథలు ఉపయోగించి డబ్బులు దక్కించుకున్నాడు. హిందూ సమాజం అతని ప్రతి సినిమాను బహిష్కరించాలి. గతంలో రాముడి కథను 'బోరింగ్' అని, శ్రీకృష్ణుడి దాసీలపై కామెంట్స్ చేశాడు. ఇలాంటి వాళ్ల సినిమాలు చూడకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ స్పందిస్తూ జక్కన్నపై తనదైన శైలీలో సెటైర్లు వేశాడు. ‘రాజమౌళి నిండు నూరేళ్ళు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నాను. దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి.. ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా అని బండి సంజయ్ అన్నారు.బీజేపీ నేత చికోటీ ప్రవీణ్ మాట్లాడుతూ..‘రాజమౌళి తీరు 'మదం ఎక్కిన ఏనుగు మురికి కాల్వలో పడ్డట్టు'. అహంకారంతో వెళ్తే పతనం ఖాయం. దేవుడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించి, ఇలా మాట్లాడటం తగ్గదు. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి’ అని ఫైర్ అవ్వడం లేదు. రాజమౌళి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలంటూ బీజేపీ నాయకురాలు మాధవీలత సూచించారు.టైటిల్ విషయంలోనూ.. హనుమంతుడి విషయంతో పాటు, సినిమా టైటిల్ కూడా వివాదాస్పదం అయింది. తెలంగాణ డైరెక్టర్-నిర్మాత సుబ్బారెడ్డి 'రామభక్త హనుమ క్రియేషన్స్' బ్యానర్లో 'వారణాసి' టైటిల్ను తెలుగులో ముందే రిజిస్టర్ చేసి ఉన్నారు. రాజమౌళి టీమ్ దీనిని తెలుగులో వాడలేక, ఇంగ్లీష్లో 'Varanasi'గా రిజిస్టర్ చేసి, అదే టైటిల్తో ముందుకు సాగుతున్నారు. సుబ్బారెడ్డి తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. ఇది లీగల్ ఇష్యూకు మారే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.పెదవి విప్పన జక్కన్నమీడియాలో, సోషల్ మీడియాలో ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా... హిందూ సంఘాలు కేసులు పెడుతున్నా..బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నా..రాజమౌళి మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ వివాదం మొదలై నాలుగైదు రోజులైనప్పటికీ..అతని నుంచి స్పందన లేకపోవడం ఆశ్చర్యాన్నికలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే.. రాజమౌళి క్షమాపణలు చెబితే తప్ప ఈ వివాదం ముగిసేలా కనిపించడం లేదు. మరి జక్కన్న క్షమాపణలు చెబుతాడా లేదా? చూడాలి. -
రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు
-
Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!
-
రాజమౌళి వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. రాజమౌళి నిజంగా నాస్తికుడు అయితే డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదించారని, దేవుళ్లు అంటే నమ్మకం లేనప్పుడు ఆ సినిమాలు తీయడం ఎందుకుని రాజాసింగ్ ప్రశ్నించారు. గతంలో దేవుళ్లపై రాజమౌళి ఇష్టారీతిన కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసమే ఆలా మాట్లాడారా.. అనే దానిపై క్లారిటీ ఇచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తామని హెచ్చరించారు రాజాసింగ్.కాగా, మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమాన్ ఉన్నాడని విజయేంద్రప్రసాద్ చెప్పారు.అయితే, వారణాసి గ్లింప్స్ విడియో రిలీజ్కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. 'నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన (హనుమంతుడు) ఉంటే ఇదేనా నడిపించేది..?' అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అయ్యారు. తాజాగా దీనిపై రాజాసింగ్ సైతం స్పందించడంతో రాజమౌళి వ్యాఖ్యల ఎపిసోడ్ ఎంతవరకూ పోతుందో చూడాలి. -
వారణాసి బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే?
-
మహేశ్ బాబు 'వారణాసి' సినిమా ఈవెంట్ (ఫొటోలు)
-
'వారణాసి' ఈవెంట్.. తట్టుకోలేకపోయిన మహేశ్ అభిమాని
మహేశ్ బాబు హీరోగా కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్లో ఈవెంట్ జరిగింది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు మూడున్నర నిమిషాల గ్లింప్స్ వీడియోని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు మహేశ్ ఫ్యాన్ చేసిన మరో పని కూడా చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్ శివారులో జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం మహేశ్ కారులో వస్తున్న వీడియోని ఓ నెటిజన్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మహేశ్ కారు నంబర్తో చెక్ చేయగా.. రెండు చలాన్లు ఉన్నట్లు తేలింది. మహేశ్ బాబు లాంటి హీరో కారుపై చలాన్లు ఉండటంతో ఈ విషయం టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన ఓ అభిమాని.. మహేశ్ కారుపై చలాన్ల డబ్బుని కట్టేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్కి అన్ని కోట్లు ఖర్చయిందా?)మహేశ్ బాబు వ్యక్తిగత కారుపై ఉన్న రూ.2070 చలాన్ని ఓ ఫ్యాన్ స్వయంగా చెల్లించడం చూసిన పలువురు నెటిజన్లు.. ఇదెక్కడి అభిమానం బాబోయ్ అని మాట్లాడుకుంటున్నారు.'వారణాసి' సినిమా విషయానికొస్తే ఇందులో మహేశ్ బాబు, రాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ఈ లుక్తో 60 రోజుల పాటు షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించాడు. మరోవైపు గ్లింప్స్ వీడియో బట్టి చూస్తే గతం నుంచి వర్తమానం, భవిష్యత్ కాలాలన్నింటిని మిక్స్ చేస్తూ ఫాంటసీ స్టోరీతీ దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2027 వేసవిలో రిలీజ్ కానుందని కీరవాణి చెప్పారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!)#MaheshBabu fans paying his car challan shows their love goes far beyond screens it’s pure admiration in action.#GlobeTrotter #Varanasi pic.twitter.com/Gj21PeSqqw— Addicted To Memes (@Addictedtomemez) November 16, 2025 -
'వారణాసి' ఈవెంట్కి అన్ని కోట్లు ఖర్చయిందా?
మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఫిక్స్ అయింది. నిన్నటివరకు రకరకాల పేర్లు వినిపించాయి గానీ చివరకు దీనికి జక్కన్న కట్టుబడి ఉన్నారు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్లో 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పేరిట భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతకీ ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి?సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తుంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తుంటారు. ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఏడాది క్రితమే టైటిల్, గ్లింప్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు.(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)టైటిల్ లాంచ్ని ఏదో ఆషామాషీగా కాకుండా 100x130 అడుగల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు. కేవలం ఈ స్క్రీనింగ్ సెటప్ కోసమే రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశారట. మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి రూ.10-15 కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది.ఎందుకంటే టీజర్ కోసమో, గ్లింప్స్ వీడియో కోసమే ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం. కానీ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజులో కోట్లు ఖర్చు పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అనిపిస్తుంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి.. ఈసారి ప్రపంచవ్యాప్తం ఆడియెన్స్ని ఆకట్టుకోవాలనే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చూస్తే అది అనిపించింది కూడా.(ఇదీ చదవండి: రాజమౌళిపై హనుమాన్ భక్తులు ఫైర్) -
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. ఆ ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!
తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో దర్శకధీరుడు సైతం సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాడు. ప్రియాంక చోప్రా లుక్తో ఏకంగా సాంగ్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా భారీ ఈవెంట్తో టైటిల్ గింప్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్రాండ్ జరిగింది. ఇంత భారీ ఎత్తున చేసిన ఈవెంట్లో ఓ చిన్న సంఘటన రాజమౌళికి కోపం తెప్పించింది. ఆడియన్స్కు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఈ మూవీ గ్లింప్స్ను ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయాలని భావించాం.. అందుకే టెస్టింగ్ చేయాలనుకున్నామని రాజమౌళి తెలిపారు. కానీ ఈ గ్లింప్స్ టెస్ట్ ప్లే సమయంలో కొందరు డ్రోన్ విజువల్స్తో లీక్ చేయడం నిరాశ కలిగించిదన్నారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల బడ్జెట్, ఎంతో మంది శ్రమతో రూపొందించామని.. ఇలా చేయడంపై దర్శకధీరుడు బాధగా ఉందన్నారు. నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లుగా మా కంటెంట్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని అన్నారు. ఈ సంఘటనతో మేం సరిగ్గా పరీక్షించలేకపోయామని వెల్లడించారు.కాగా.. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్రగా కనిపించనున్నారు. తాజాగా రిలీజైన టైటిల్ గ్లింప్స్ ప్రిన్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'గ్లోబ్ట్రాటర్' పేరుతో ఈ ఈవెంట్ను భారీ ఎత్తున నిర్వహించారు. వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'వారణాసి'లో పవర్ఫుల్ దేవత.. రాజమౌళి ప్లాన్ అదుర్స్
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి నుంచి టైటిల్ గ్లింప్స్ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ వచ్చేసింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో ఈ మూవీ రానుందని అర్థం అవుతుంది. భూమి ఆవిర్భావం మొదలు.. త్రేతా యుగం వరకూ ఆపై ఉల్కాపాతాల ప్రళయం, ఘోర కలి వరకు అన్ని కాలాలతో వారణాసి కథకు లింక్ అయినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు కాలాలతో కథ ఉన్నప్పటికీ దానిని కలిసే డాటెడ్ లైన్ మహేష్ అని కనిపిస్తుంది. అయితే, ఇందులో రాక్షస ఘణాన్ని వేటాడే 'ఛిన్నమస్తా దేవి' విజువల్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు అందుతాయి. ఆపై ఎదుటివారు ఎంతటి గొప్పవారైనే సరే చీల్చిచెండాడే శక్తి సొంతమౌతుంది.ఛిన్నమస్తా దేవి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారు తన తలను తన చేతితోనే నరికి పట్టుకున్నట్లు ఉంటుంది. ఆమె తల నుంచి వచ్చే రక్తాన్ని కుడి, ఎడమ పక్కన ఉన్న డాకిని, వర్ణినిలు తాగుతున్నట్లు ఉంటుంది. ఎంతో భయంకరంగా కనిపించేలా ఆమ్మవారి రూపం ఉంటుంది. ఈమెను శక్తి యొక్క రౌద్ర రూపంగా పూజిస్తారు. చిన్నమస్తా దేవి కథను తెలుసుకుంటే మరణంతో పాటు సృష్టి, వినాశనం అనే వైరుధ్యాలను సూచిస్తుంది. ఆమెను కేవలం తంత్రవిద్యను అభ్యసించే వాళ్లు మాత్రమే పూజిస్తారు.వారణాసితో లింక్ఛిన్నమస్తా దేవి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించి తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే రుద్ర పాత్రలో ఉన్న మహేష్ బాబు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం రాక్షస ఘణాన్ని అంతం చేసినప్పటికీ ఆమెకు రక్త దాహం తీరలేదు. తన వెంట ఉన్న వారికి కూడా తీరకపోవడంతో స్వయంగా శిరచ్ఛేదం చేసుకుని రక్తాన్ని అందిస్తుంది. అంతటి ఉగ్రరూపంతో ఆమె ఉంటుంది. సినిమా ప్రకారం ఉన్న రాక్షస ఘణాన్ని ఎదుర్కునేందుకు కావాల్సిన శక్తిని రుద్ర పాత్రలో ఉన్న మహేష్ ఆమె కటాక్షం పొందవచ్చని తెలుస్తోంది. ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతం అవుతుంది. ఆమె శత్రు నాశని కూడా అందుకే రాజమౌళి ఆమె పాత్రను వారణాసిలో చూపించనున్నారు. ఆమె పార్వతి దేవి రూపం అని కూడా పూరాణాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలోని రామ్నగర్లో ఆమె ఆలయం ఉంది. పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్లో కూడా ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉంది. -
ఈ రోజు నా మాటలను నాన్న వింటుంటారు: మహేశ్ బాబు
‘‘నాన్నగారంటే (సూపర్స్టార్ కృష్ణ) నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను, పాటించాను. కానీ ఒక్కటి మాత్రం చేయలేదు. ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను వినలేదు. ఈ రోజు నా మాటల్ని ఆయన వింటుంటారు (‘వారణాసి’లో మహేశ్ చేసిన రుద్ర పాత్రకు పౌరాణికం టచ్ ఉంది). నాన్న ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి. ‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతా పడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అని భావోద్వేగంగా మాట్లాడారు మహేశ్బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి ‘వారణాసి’ టైటిల్ ఖరారైంది. శనివారం హైదరాబాద్లో ‘గ్లోబ్ట్రోటర్’ ఈవెంట్ పేరిట చిత్రయూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. çపృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రియాంకా చోప్రా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్, కంచి కథ అందించారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది. ఈ వేడుకలో మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపైకి సింపుల్గా నడిచొస్తానంటే రాజమౌళిగారు కుదరదన్నారు... చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో (బొమ్మ నందిపైన కూర్చుని వస్తున్నట్లుగా). ఇదంతా మీకోసమే (అభిమానులు). మీరంతా మమ్మల్ని స΄ోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అప్డేట్స్... అప్డేట్స్ అన్నారు. అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అభిమానులందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటే మేమంతా చాలా సంతోషంగా ఉంటాం’’ అని తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం తెలియదు. చిన్నప్పుడు ఎన్టీఆర్గారి అభిమానిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక... సినిమా ఏంటో అర్థమయ్యాక కృష్ణగారి గొప్పదనం తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారులను బ్రేక్ చేసుకుంటూ, ఎన్నో దారులు వేసుకుంటూ వెళ్లాలి. ఇక నిన్న (శుక్రవారం) రాత్రి మా సినిమా వీడియోను టెస్ట్ చేయాలనుకున్నాం. లీక్ కాకూడదని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డ్రోన్స్తో వీడియోలు తీసి, నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఈ వీడియోను ఎంతో దూరం నుంచి వచ్చిన ఆడియన్స్ కోసం ఈ రోజు మేం ప్లే చేద్దామనుకున్నాం. ఇక మహేశ్బాబు నుంచి మనందరం నేర్చుకునే ఒక గుణం ఉంది. మనందరికీ సెల్ఫోన్ ఎడిక్షన్ ఉంది. ఆఫీసుకు వచ్చినా, షూటింగ్కు వచ్చినా సెల్ఫోన్ పట్టుకోడు. 8 గంటలైనా, 10 గంటలైనా తన సెల్ఫోన్ కారులోనే ఉంటుంది. మళ్లీ కారు ఎక్కితేనే మహేశ్ తన ఫోన్ టచ్ చేస్తాడు. మనందరం ఇది నేర్చుకోవాలి. మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఫస్ట్ డే మహేశ్కి రాముడి వేషం వేసి, ఫొటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. సినిమాలోని ఆ ఎపిసోడ్ను 60 రోజులు షూట్ చేశాం. నా సినిమాల్లో మోస్ట్ మెమొరబుల్ సీక్వెన్స్గా అది ఉండబోతోంది. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా, దయార్ద్ర హృదయంతో ఉంటాడు మహేశ్. ఈ ఎసిసోడ్ షూట్ చేసినందుకు నేను చాలా లక్కీ’’ అన్నారు.ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మందాకిని పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్న రాజమౌళిగారికి థ్యాంక్స్. మహేశ్బాబుగారు, ఆయన ఫ్యామిలీ... నేను హైదరాబాద్ని మరో ఇల్లుగా భావించేలా చేశారు’’ అని అన్నారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం రాజమౌళిగారి నుంచి నాకో మెసేజ్ వచ్చింది. ఆయన చెప్పిన ఐదు నిమిషాల నరేషన్ విని మైండ్ బ్లో అయ్యింది. ఇండియన్ సినిమా లిమిట్స్ దాటేలా ఈ చిత్రకథ, రాజమౌళి విజన్ ఉంటాయి’’ అని చెప్పారు.ఎమ్ఎమ్ కీరవాణి మాట్లాడుతూ– ‘‘కీరవాణిగారు మెలోడీ బాగా కొడతారు. కానీ బీట్ కాస్త స్లోగా ఉంటుందన్న పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈసారి మెలోడీ నాదే. బీటూ నాదే’’ అని చెప్పారు.కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మహేశ్బాబు విశ్వరూపాన్ని చూస్తూ నేనలా ఉండిపోయాను. డబ్బింగ్ లేదు... సిజీ లేదు... రీ రికార్డింగ్ లేదు... అయినా నన్ను మంత్రముగ్దుడ్ని చేసింది ఆ సీన్... మర్చిపోలేను. మీరు (ఆడియన్స్) కూడా చక్కని అనుభూతి చెందుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడు’’ అని చెప్పారు కార్తికేయ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా గ్లోబల్ ప్లాట్ఫామ్పై నా తొలి స్పీచ్ ఇది. చాలా గౌరవంగా ఉంది. మన ఇండియా వైపు గ్లోబల్ ఆడియన్స్ చూసేలా, మన ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.కేఎల్ నారాయణ మాట్లాడుతూ– ‘‘పదిహేనేళ్ల క్రితం మహేశ్బాబు, రాజమౌళిగార్లతో సినిమా చేయాలనుకుని, వారిని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత టైమ్ పడుతుందని రాజమౌళి గారు, నేనూ ఊహించలేదు. ఇప్పుడు నా కల నిజమైంది’’ అన్నారు.ఈ వేడుకలో నమ్రత, సితార, రమా రాజమౌళి, సుప్రియ, కంచి, దేవ కట్టా, ఫైట్ మాస్టర్ సాల్మన్ లతో ΄పాటు పలువురు సినీ ప్రముఖలు పాల్గొన్నారు. -
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్లో శనివారం ఈ మూవీ టైటిల్తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోని 'గ్లోబ్ ట్రాటర్'లో ప్రసారం చేశారు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ ఉండగా.. అభిమానులు దీన్ని చూసి మైమరిచిపోయారు. ఇదే అనుకుంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీరాముడిగా నటించారని చెప్పి రాజమౌళి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ చిత్రీకరించామని చెప్పారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు 'వారణాసి'.. 2027 వేసవిలో రిలీజ్)'తొలిరోజు ఫొటోషూట్లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీశాం. అయితే మహేశ్, కృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు మహేశ్.. నా అంచనా తప్పు అని నిరూపించాడు. దీంతో మహేశ్ రాముడి గెటప్ ఫొటోని నా వాల్ పేపర్గా పెట్టుకున్నాను. కానీ ఎవరు చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేశాను. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేశ్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్ని 60 రోజుల పాటు తీశాం. రీసెంట్గానే అది పూర్తయింది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్.. నాకు, మహేశ్ కెరీర్లోనే మర్చిపోలేని సీక్వెన్స్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 30 నిమిషాల ఫైట్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్) -
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమా వీడియో రిలీజ్
సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించిన ఈవెంట్లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ వీడియో అద్భుతమనే రేంజులో ఉంది. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ మతిపోగొట్టేలా కనిపించాయి.వారణాసి 512సీఈ నుంచి మొదలుపెట్టి.. ఆస్టరాయిడ్ శంభవి 2027సీఈ.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి గుహ.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. అంటూ చూపించారు. చివర్లో మహేశ్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో కనిపించారు. చివరలో 'వారణాసి' అనే టైటిల్ పడింది. 3 నిమిషాల 40 సెకన్ల వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా సరే విజువల్ వండర్ అనేలా తీర్చిదిద్దారు. -
మహేశ్ బాబు 'వారణాసి'.. 2027లో రిలీజ్
మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదు. మిగతా యాక్టర్స్ నుంచి కూడా ఒక్కటి కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఎత్తున హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. సినిమా గురించి డీటైల్స్ బయటపెట్టారు.ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మూవీ టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి కూడా చాలా మాట్లాడారు. పనిలో పనిగా మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా చూచాయిగా బయటపెట్టారు.'మహేశ్ బాబు ఫ్యాన్స్.. మీ అందరి హృదయాల్లో పర్మినెంట్గా ఉండిపోటానికి ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండోవర్ చేసేసాడు. ప్రొడ్యూసర్ హ్యాపీ. డైరెక్టర్ హ్యాపీ. టైల్స్ ఏత్తన్నారు. మెలోడీ నాదే బీటు నాదే. సమ్మర్ 2027కి గృహప్రవేశం' అని కీరవాణి చెప్పుకొచ్చారు.కీరవాణి చెప్పడమైతే చెప్పారు గానీ 2027 వేసవిలోనే కచ్చితంగా రిలీజ్ అవుతుందా అంటే సందేహమే. ఎందుకంటే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా పలు కారణాల వల్ల ఆలస్యం కావడం, ముందు అనుకున్న విడుదల తేదీ వాయిదా పడటం తెలిసిందే. మరి ఈసారైనా కీరవాణి చెప్పినట్లు 2027 వేసవిలోనే వస్తారా లేదా అనేది చూడాలి?


