Telangana Secretariat
-
తెలంగాణ సెక్రటేరియట్ లో మిస్ వరల్డ్ సుందరీమణులు
-
తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు
-
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలం.. రేవంత్ సర్కార్ సీరియస్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలంపై సీఎం రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. సెక్రటేరియట్ భద్రత ఏర్పాట్లు, సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాల నిఘాపై జీఏడీ ఆరాతీ తీసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి ఎంట్రీ ,ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎస్పీఎఫ్పై జీఏడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సెక్రటరియేట్ మొత్తం 246 సీసీ కెమెరాలు మరో 30 కెమెరాలు పెట్టే యోచనలో ఉన్నట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలతో పాటు కీలకమైన 6వ అంతస్తులో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ ప్రజలు ఎంట్రీ అయ్యే సౌత్ ఈస్ట్ గేటుతో పాటు ఇన్సైడ్ ఎంట్రీ వద్ద మరోసారి చెకింగ్ చేయనుంది.సెక్రటరియేట్లో రెండంచెల భద్రత వలయాన్ని ఎస్పీఎఫ్ మోహరించింది. -
వియ్ హబ్ బ్రాండ్ అంబాసిడర్ వంట గెలిచింది
ఆమె... వంటతో జీవితాన్ని నిలబెట్టుకుంటానని, వంటలతో అవార్డులు అందుకుంటానని, వియ్ హబ్ (విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్)కి బ్రాండ్ అంబాసిడర్ అవుతానని కలలో కూడా కలగనలేదు. పాలతో కూరలు వండే గుజరాత్ వాళ్లు ఆమె చేసిన పుదీనా పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. కొబ్బరి, అరటితో మసాలాలు లేని తేలిక ఆహారం తీసుకునే కేరళ వాసులు కూడా ఆమె చేతి రుచికి ఫిదా అయ్యారు. గోవా వాళ్లకు చేపలతో కొత్త వంటలను పరిచయం చేశారామె. ఈ విజయాలన్నీ ఆమెను రాష్ట్ర సెక్రటేరియట్ వైపు నడిపించాయి. తెలంగాణ సెక్రటేరియట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ఆకుల కృష్ణకుమారి. ఊరు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మూడు చింతలపల్లి గ్రామం. నెలకు లక్షకు పైగా ఆర్జిస్తున్న కృష్ణకుమారి జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.కృష్ణకుమారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీసర్. తనకు వంటలు చేయడం, వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ ఇష్టంతో తాను చేసిన కొత్త వంటకాలను కొలీగ్స్కి ఇచ్చేవారామె. ‘‘మా నాన్న టైలర్. ఓ రోజు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) డీపీఎమ్ సురేఖ గారు మా షాప్కి వచ్చారు. నన్ను చూసి నేను చేస్తున్న పని తెలిసిన తర్వాత ఆమె నాకో డైరెక్షన్ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నా కుటీర పరిశ్రమ మొదలైంది. తొలి ఆర్డర్ యూఎస్కి, డాక్టర్ గీతాంజలి మేడమ్ పది వేల రూపాయల ఆర్డర్ ఇచ్చారు. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయంతో విజయవంతంగా సాగుతోంది. మిల్లెట్స్తో ప్రయోగాలు నన్ను నిలబెట్టాయి.’’ అన్నారు కృష్ణకుమారి.మహిళాశక్తి క్యాంటీన్డ్వాక్రా స్వయంసహాయక బృందంలో చేరిన తర్వాత తన కార్యకలాపాలను వేగవంతం చేశారు కృష్ణకుమారి. హైదరాబాద్, రాజేంద్రనగర్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్డీలో శిక్షణ తీసుకోవడంతోపాటు, తన ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టడంతో మొదలైన ఆమె జర్నీ సరస్ మేళా ఎగ్జిబిషన్లతో అండమాన్, కశ్మీర్ మినహా దేశమంతటికీ విస్తరించింది.ఆమె విజయపథం... ఎగ్జిబిషన్లో స్టాల్ కోసం అధికారులను అడగాల్సిన దశ నుంచి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్టాల్ పెట్టవలసిందింగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే దశకు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది జూన్ నెల రెండవ తేదీన జరిగిన వేడుకల్లో ఆమె స్టాల్ పెట్టారు. ఆ స్టాల్లోని ఉత్పత్తులను ఆసాంతం పరిశీలించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆమె అక్కడికక్కడే లైవ్ కౌంటర్లో వండిన తెలంగాణ రుచులకు కూడా సంతృప్తి చెందారు.డ్వాక్రా మహిళల కోసం శాశ్వతంగా ఒక వేదికను ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో ‘సెక్రటేరియట్ క్యాంటీన్ మహిళలకే ఇద్దాం’ అని నోటిమాటగా వచ్చిన ఉత్తర్వుతో అదే నెల 21న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ మొదలైంది. అందులో కృష్ణకుమారితో పాటు పదిమంది మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నారు. జయహో మహిళాశక్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిచిన్న రైతులేనా ఉత్పత్తులకు స్వాద్ అనే బ్రాండ్నేమ్ రిజిస్టర్ చేశాను. పరిశ్రమ దమ్మాయిగూడలో ఉంది. ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. నేను ఉదయం తొమ్మిదిన్నరకు సెక్రటేరియట్కు చేరుకుంటాను. తిరిగి ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదవుతుంది. యూనిట్లో నిన్న తయారైన మెటీరియల్ను ఈ రోజున కౌంటర్లో పెడతాను. ఏ రోజుకారోజు అమ్ముడైపోతాయి. సెక్రటేరియట్ క్యాంటీన్తోపాటు యూనిట్లోనే అవుట్లెట్ కూడా ఉంది. రాపిడో ద్వారా సప్లయ్ చేస్తున్నాం. వినియోగదారులు మా దగ్గరకు రావడం కంటే మేమే వినియోగదారుల దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతో మొబైల్ యూనిట్ ప్రారంభించనున్నాను.నా సక్సెస్కి కారణం తోటలే. పచ్చళ్లు, పొడులు ఏవి చేయాలన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోను. నేరుగా తోటలకే వెళ్లి తెచ్చుకుంటాను. భారీ స్థాయిలో పండించే వాళ్లు స్వయంగా మార్కెట్కు తరలించగలుగుతారు. చిన్న రైతులు తమకు తాముగా మార్కెట్కి తీసుకెళ్లాలంటే ఆ ఖర్చులు భరించలేరు. నేను వారి దగ్గర తీసుకుంటాను. నేను ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెషన్. నాకు ఉపాధినివ్వడంతోపాటు గుర్తింపును కూడా తెచ్చింది. ఇందులోనే భవిష్యత్తును నిర్మించుకుంటాను. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం పని చేస్తాను.– ఆకుల కృష్ణకుమారి, స్వాద్ ఫుడ్స్ -
సచివాలయంపై డ్రోన్ చక్కర్లు.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన తెలంగాణ సచివాలయంపై ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. దీన్ని గమనించిన ఎస్పీఎఫ్ పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తులను సైఫాబాద్కు చెందిన వంశీ, నాగరాజుగా గుర్తించారు. దీంతో, వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సెక్రటేరియల్ అవుట్ పోస్టుతో పాటు సచివాలయం లాన్ ఏరియాను డ్రోన్తో చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. -
తెలంగాణ సచివాలయం క్యాంటిన్ ఫుడ్లో ఈగలు, బొద్దింకలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియేట్ క్యాంటిన్ ఫుడ్లో ఈగలు, బొద్దింకలు కలకలం సృష్టించాయి. క్యాంటిన్లో ఇడ్లీ తినే సమయంలో ఈగలు కనిపించడంతో ఉద్యోగులు కంగుతిన్నారు. ఇందేటని ప్రశ్నించినా క్యాంటిన్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస శుభత్ర పాటించడం లేదని యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఉద్యోగులకు ఫుడ్ పాయిజన్ అయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా, ఉద్యోగులు సైతం అదే తరహా -
తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు కలకలం రేపుతున్నాయి. పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి.. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.ఘటనపై స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థసెక్రటేరియట్ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్మెంట్ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని.. అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్సీ ఫ్రేం. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్ఎసీ డ్రిల్ చేస్తున్నారు.. డదీంతో జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. ఎలాంటి నాణ్యత లోపం లేదు. మేము ఘటనపై రివ్యూ చేస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్? -
రూ.20వేలకే గవర్నమెంట్ జాబ్ .. తెలంగాణ సచివాలయంలో కలకలం
సాక్షి,హైదరాబాద్ : ‘నేను ఐఏఎస్ని. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి. మీకున్న అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పిస్తా. ముందుగా అడిగినంత డబ్బులు ఇవ్వండి. అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇంటికి పంపిస్తా. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో జాయినింగ్ తేదీ ఎప్పుడు ఉంటే అప్పుడు సచివాలయానికి రండి’ అంటూ బాధితుల్ని మోసం చేసిన ఘటన తెలంగాణ సచివాలయంలో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో ఇద్దరు నకిలీ ఉద్యోగుల్ని అరెస్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఐఏఎస్ పట్టుబడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన కేటుగాడికి సచివాలయంలోని రెగ్యులర్ ఉద్యోగులు సహకరించడం గమనార్హం.నిందితుడు నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక్కో బాధితుడి నుంచి ఒక్కో ఉద్యోగానికి 20వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు. అలా ఏడుగురు బాధితులు నిందితుడ్ని నమ్మి డబ్బులు ఇచ్చినట్లు సైఫదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో నిందితుడు నకిలీ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.అంతేకాదు, ఫేక్ అపాయింట్మెంట్ ఇచ్చి బాధితుల్ని డైరెక్ట్గా సచివాలయానికి రప్పించడంపై ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, నిందితుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరి నుంచి భారీ మొత్తంలో డబ్బుల్ని వసూలు చేసినట్లు గుర్తించారు. నకిలీ ఐఏఎస్కు సచివాలయంలో పలువురు రెగ్యులర్ ఉద్యోగులు సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు కలకలం రేపుతున్నారు. ఇవాళ మరో నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన నకిలీ ఉద్యోగిని గుర్తించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తహశీల్దార్ పేరుతో కొంపల్లి అంజయ్య సచివాలయంలోకి వెళ్లాడు. అయితే అతనిపై అనుమానం రావడంతో అధికారులు విచారించి.. ఫేక్ ఐడీ కార్డుతో వచ్చాడని గుర్తించారు. సైఫాబాద్ పోలీసులకు అంజయ్యను అప్పగించారు.కాగా, కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. గత వారం.. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్మీట్ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు.తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిన సంతి తెలిసిందే. భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సచివాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. సెక్రటరియేట్ను బాంబుపెట్టి పేల్చేస్తాంమంటూ అగంతకుడు సీఎం రేవంత్రెడ్డి పీఆర్ఓపీకి ఫోన్ చేశాడు. బెదిరింపులతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ పోలీసులు తెలంగాణ సెక్రటరియేట్లో తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చి చెప్పారు. మూడు రోజుల నుంచి అగంతకుడు బెదిరింపు కాల్స్ చేశాడు. అగంతకుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు .. ఎందుకు బెదిరింపు కాల్స్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
సెక్రటేరియట్లో విజిటర్లపై నిఘా..!
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సెక్రటేరియట్లో భద్రతను అధికారులు కట్టుదిటం చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో సెక్రటేరియట్ భద్రత మరింత పెంచనున్నారు. భద్రత 24 గంటల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 300 సీసీకెమెరాలతో సెక్రటేరియట్ బయట లోపలు నిరంతర నిఘా ఉంచనున్నారు.విజిటర్లు సెక్రటేరియట్లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేవరకు వారి కదలికలను పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇటీవలే సెక్రటేరియట్లో నకిలీ ఐడీ కార్డుతో అధికారిగా చెలామణి అయిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.దీంతో సెక్రటేరియట్లో ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీఎఫ్ నిర్ణయించింది. సెక్రటేరియట్లో రికార్డైన మొత్తం డేటాను 5 నెలలపాటు అందుబాటులో ఉంచేలా సర్వర్లను ఏర్పాటు చేశారు. సచివాలయంలో ప్రతిరోజు సీఎం సహా మంత్రులు ఐఏఎస్ అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగి దొరికాడిలా!
సాక్షి,హైదరాబాద్ : కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. తాజాగా, తెలంగాణ సెక్రటరియేట్లో కేటుగాళ్లు..‘మేం తెలంగాణ సెక్రటరియేట్ ఉద్యోగులం మీకు ఏమైనా పని కావాలంటే చెప్పండి. చిటికెలో చేసి పెడతాం. కాకపోతే దానికి కొంత ఖర్చవుతుంది’ అంటూ పలువురి దగ్గర భారీ వసూళ్ల పాల్పడ్డారు. చివరికి ఎత్తుగడ ఫలించక దొరికిపోయారు. ఇంతకీ ఆ ఫేక్ ఉద్యోగి ఎవరు? ఆ ఫేక్ ఉద్యోగికి సహకరించింది ఎవరు? వాళ్లని పోలీసులు ఎలా పట్టుకున్నారు? రెండ్రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్మీట్ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ ఐడీ కార్డు వ్యవహారంలో.. ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవిలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాస్కర్రావు, రవిలు సచివాలయంలో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఫేక్ ఐడీ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. -
సచివాలయం విజిటర్స్కు కొత్త నిబంధనలు.. వాళ్ళకే ఛాన్స్!|
-
తెలంగాణ సెక్రటేరియట్ లో కొత్త రూల్స్ షురూ
-
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం(డిసెంబర్ 9) సాయంత్రం ఆరు గంటలకు అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో 20 అడుగుల తెలంగాణతల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో వరి,జొన్న, సజ్జ ధాన్యాలతో విగ్రహాన్ని రూపొందించారు.తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టం: సీఎం రేవంత్మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణతల్లి4 కోట్ల ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిఉద్యమ సమయంలో టీజీని యువకులు తమ గుండెలపై రాసుకున్నారుబీఆర్ఎస్ టీజీ అని కాకుండా టీఎస్ అని మార్చింది.తమ కుటుంబం కోసమే గత ప్రభుత్వం ఆలోచించిందిఈరోజు తెలంగాణతల్లి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన అదృష్టంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్చను: భట్టి విక్రమార్కగత ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందిరూ.7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నాం ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నాంతెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛను మాత్రమే -
TG: ‘సీఎస్’ వస్తే ఎవరూ ఉండకూడదా? పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం. -
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానుంది.కాగా, తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) చేరిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు కేటాయించారు. -
తెలంగాణ సచివాలయం వద్ద భారీ భద్రత
హైదరాబాద్: ‘ఛలో సచివాలయం’కు బెటాలియన్ కానిస్టేబుల్స్ పిలుపునివ్వడంతో సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.ఒకే పోలీస్ వ్యవస్థ( ఏక్ పోలీస్ వ్యవస్థ) కోసం బెటాలియన్ కానిస్టేబుల్స్ పట్టుబడుతుండగా గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని పోలీస్ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసన ఉధృతం చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం) ఛలో సచివాలయంకు పిలుపునిచ్చారు. దాంతో ఆందోళన చేపట్టిన వారిపై పోలీస్ శాఖ వేటు వేస్తోంది. ఇప్పటికే పది మందిని సర్వీస్ రిమూవ్ చేయగా, 34 మందిని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ బెటాలియన్ కానిస్టేబుల్స్ తమకు కచ్చితమైన హామీ వచ్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. -
మేం వచ్చాక రాజీవ్గాంధీ విగ్రహం అక్కడికే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించటంపై సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్రెడ్డి తెలంగాణతల్లి ఆత్మను తాకట్టుపెట్టాడని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధేనని హెచ్చరించారు. ఇదీ చదవండి.. రాజీవ్ విగ్రహాన్ని టచ్చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్ -
రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్
సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని21వసెంచరీలోకి తీసుకుపోవడానికి కృషి చేసిన వ్యక్తని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కొనియాడారు. అలాంటి నేత విగ్రహాన్నికూలగొడతామని బీఆర్ఎస్ నేతలు అనడం సరికాదన్నారు.య గాంధీభవన్లో మంగళవారం(సెప్టెంబర్16) వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది బీఆర్ఎస్కు పెద్ద నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.‘దేశం కోసం ప్రాణాలు అర్పించినిన ఫ్యామిలీ గాంధీలది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. విగ్రహాలు కూలుస్తాం లాంటి మాటల వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట తగ్గిపోతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే సచివాలయంలోనే పెట్టాలి. విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెప్తారు. అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నేతలు మానుకోవాలి’అని వీహెచ్ హితవు పలికారు. ఇదీ చదవండి.. టచ్ చేసి చూడు.. పొన్నం సవాల్ -
టచ్ చేసి చూడు: పొన్నం సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అనవసర రాజకీయాలకు తెరలేపొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చి ప్రేరాపనలు చెయ్యద్దని మండిపడ్డారు. విగ్రహాన్ని కూల్చుతాం పేల్చుతాం అంటే ఎవరు చూసుకుంటూ కూర్చోరని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండదని, దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానించదు.. అవమానించలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తమకు తెలంగాణ తల్లిపై అభిమానం ఉంది కాబట్టే.. సెక్రటేరియట్ లోపల విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీఆర్కు చేతనైతే తమకంటే మంచి పనులు చేయాలని సూచించారు. 18 సంవత్సరాలకు యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు.కాగా తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై రాజీకాయ రగడ నెలకొంది. విగ్రహావిష్కరణపై కాంగ్రెస్, బీఆర్ మధ్య మాటల యుద్దం నడుతస్తోంది. సచివాలయం ఎదుట తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించామని, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని మండిపడుతోంది. అంతేగాక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని, ఏం జరుగుతోందో చుద్దాం అంటూ సవాల్ విసురుతున్నారు. -
తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మంగళవారం(జులై 16) ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటలకుపైగానే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ లేకపోవడంతో సెక్రటేరియట్లో పలు శాఖల సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుపుతుండగానే ఈ విఘాతం చోటు చేసుకోవడం గమనార్హం. సెక్రటేరియెట్కు ఇంటర్నెట్ సేవలు అందించే ‘నిపుణ’ నెట్వర్క్కు పెండింగ్ బిల్లులు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయని, అందుకే సేవలు నిలిచిపోయాననే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. దీంతో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఇంటర్ నెట్ నిలిపివేసిందని కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే.. అధికారులు మాత్రం టెక్నికల్గా తలెత్తిన సమస్యేనని, కాసేపటికే వైఫై సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని అంటున్నారు. -
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రెండు గ్యారంటీల ప్రారంభం సచివాలయంలోనే!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన మరో రెండు గ్యారంటీ హామీల ప్రారంభోత్సవ వేదిక మారింది. ప్రభుత్వం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలోనే ప్రారంభించనుంది. నిజానికి మంగళవారం సాయంత్రం చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో ఈ పథకాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదలవడం, వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో.. వేదికను మారుస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ఈ రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభించిన అనంతరం చేవెళ్లలో యధావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభ కోసం టీపీసీసీ విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. -
నూతన ప్రభుత్వానికో ప్రేమలేఖ!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయా? లేదా ప్రజలు గెలుస్తారా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే ఐదేళ్ళు రాజకీయం, పౌరసమాజం మధ్య వైరుద్ధ్యాలు తలెత్తకుండా మరిన్ని విజయాలు సాధించవచ్చు. రాబోయే లోక్సభ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకపోతే దేశవ్యాప్త అపజయానికి దారి తీసినట్టే! ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకులు. వేసేది ప్రజలు. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఓటుకు ఉంది. అందుకే ప్రజల పాత్రకు విలువ. పార్టీల జయాపజయాలను నిర్ణయించేది ప్రజలే! అటువంటి ప్రజలను విస్మరించిన పార్టీలకు అపజయం తప్పదు. తప్పటడుగులు వేస్తే, అధికారం హక్కుభుక్తమని విర్రవీగితే... ఇవాళ గెలిచిన పార్టీకి కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయానంతర పరిస్థితి రాబోయే విజయానికో, అపజయానికో భూమిక అవుతుంది. గతం నాస్తి కాదు. అది దారి దీపం. ఈ దీపం వెలుగుతూనే ఉండాలంటే సుపరిపాలన, ప్రజా దృక్పథం, జన సంక్షేమం అనే చమురు నిరంతరం పడుతుండాలి. తెలంగాణ ప్రజాకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో పాటు నడిచిన నాయకత్వానికి ప్రజలు అండదండలు అందించారు. 1200 మంది బలిదానాల పునాది మీద అధికారం చేజిక్కించుకుని వారి పాత్రను, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి అనేకమంది పాత్రను కావాలని విస్మరించి తామే తమ కుటుంబం త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని విర్రవీగుతూ ప్రజలనూ, పౌర సమాజాన్నీ అవమానించినందుకు నిశ్శబ్ద నిరసనే తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల సరళిగా భావించాలి. గమనిస్తే... ఏక కుటుంబ పాలన తెలంగాణ ప్రజలను అసహ్యించుకునేలా చేసింది. అంతేకాదు. తాము చేసిన ప్రతి తప్పునూ ఆ నలుగురు మైకుల ముందు, పత్రికా ప్రకటనల రూపంలో ఊదరగొట్టడం అసహ్యించుకున్నారు. అలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా విర్రవీగే తత్వం ప్రజలను దాదాపుగా ప్రతిఘటించేట్లుగా చేసింది. అయితే ఊరిలో దొర మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తమను వ్యతిరేకించే వారు పుట్టి ఉండరు అని అనుకుంటారు. ప్రజలు కట్టిన డబ్బును పట్టుకొని... తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతిబింబించింది. ఆ పథకాల గురించి వేల కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించడంలో కూడా తమ ఫోటోలు, వ్యక్తిగత ప్రచారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా వ్యక్తిగత అహంభావం వల్ల సవరించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో, తదనంతర పాలనలో... దళితుల, ఆదివాసీల, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చాలి. ఎందుకంటే ఈ పదేళ్ళ పాలనలో వారు వంచించబడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దగ్గర నుండి, ‘దళిత బంధు’ స్కీమ్ వరకు అడుగడుగునా మోసగింపునకు గురయ్యారు. వోటు బ్యాంక్గా వారిని వాడుకున్నారు. దళితులలో గల రెండు ప్రధాన కుల సమాజాలను విడదీసి ఒక వర్గాన్నే చేరదీసిన ఫలితమే... ఎస్టీ నియోజకవర్గాలలో ఫలితాలు! అలాగే ఆదివాసుల బతుకులు ఆగమాగం చేయబడ్డాయి. ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు తలెత్తినప్పుడు ఒక తెగ వైపే మద్దతునిచ్చి మిగతా 17 తెగ, ఉప తెగలను వంచించారు. పోలీసు, అటవీ శాఖల వంటివి వారిని అగౌరవపరిచాయి. వారి భూములను లాక్కున్నాయి. బతికే స్వేచ్ఛను హరించింది ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుండి అడవులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన జరిపి పోడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన అధినాయకుడు తీరా వారి గురించి మాట్లాడడం మరిచాడు. మేడారంలో జరిగే ‘సమ్మక్క – సారక్క’ జాతరకు వెళ్ళి మొక్కులు చెల్లించలేదు. అలాగే గోండుల ఆరాధ్య దైవం ‘నాగోబా’ జాతరకు కూడా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చాక, అంతకు ముందు కన్నా వారి జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా అవమానాలు పెరిగాయి. అందుకే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గులాబీ జెండా అవనతం అయింది. ఇతర ఆదివాసుల పేరుతో ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరిగింది. తెలంగాణ అస్తిత్వ చైతన్యం భావన మరింత పెరుగుతుంటే దాన్ని త్రుంచివేయడం జరిగింది. ప్రపంచ మహాసభల్లో వంద పైగా కోట్ల డబ్బు పంచుకున్నారే తప్ప భాషకూ, సంస్కృతికీ, సాహిత్యానికీ ఒరిగిందేమీ లేదు. భాషా సాంస్కృతిక శాఖ రాజకీయ నేతలకు ఊడిగం చేసింది. కోట్ల రూపాయలతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయ నాయకుల ప్రాబల్యం పెంచుకోవడానికి పనికొచ్చాయి. ఏ ఒక్క ప్రజా కళారూపాన్నీ బతికించి దేశవ్యాప్త కీర్తినీ, వైభవాన్నీ చాటలేదు. పనికిరాని పుస్తకాలను అచ్చువేసి రాజకీయ నేతలకు ఉచితంగా పంచిపెట్టారే తప్ప ప్రజలలోకి తీసుకెళ్ళలేదు. వాటికోసం చేసిన ఖర్చు దుబారా చేశారు. ఎన్నో ప్రతులు పంచిపెట్టి ప్రజల సొమ్ముని పట్టపగలు దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాల్సి ఉంది. ప్రతి మూడేండ్లకో, ఎక్కువలో ఎక్కువ ఐదేండ్లకో అధికారుల, ఉద్యోగుల బదిలీలు జరగాల్సిందే! అలా జరపకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఒకేచోట తిష్ఠ వేసుకునే ఉద్యోగుల వల్ల ప్రజలు ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రే కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఒకరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేయాల్సిందే! ముఖ్యంగా కలెక్టర్లు కూడా! పౌర సమాజాన్ని సంప్రదిస్తూ పోవాలె తప్ప మేమే గొప్ప అనే భావనను దూరం చేయకపోతే వ్యక్తిగత అహంభావం పెరిగి ప్రభుత్వానికి ప్రజలు దూరం అవుతారు. ‘ధరణి’ వంటి పాపాల పుట్ట పనిపట్టకపోతే చిన్న రైతు, చిన్న ఇళ్ళు కట్టుకునే వారికి న్యాయం జరగదు. ప్రగతి భవన్ను ప్రభుత్వాసుపత్రిగానో, ప్రజా కళల మ్యూజియంగానో మార్చాలి. నీటి ప్రాజెక్టులలో ఆర్థిక దుర్వినియోగాన్నీ, అలసత్వాన్నీ వెలికి తీయాలి. తెలంగాణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేసి ప్రొఫెసర్ కోదండరావ్ు వంటి వారి సలహా సూచనలనూ, రికమెండేషన్స్నూ అమల య్యేలా చూడాలి. ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడం కాదు. ‘మాకు అధికారం వచ్చాక చూడండి... ఇంతలా అభివృద్ధి చేశాం’ అని చెప్పుకునే రీతిలో అభివృద్ధి జరగాలి. ఓట్లు ఏ ఒక్క కులం వారు వేస్తే ప్రభుత్వం గద్దెనెక్కలేదు. అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. దొరల రాజ్యం పోయి పటేళ్ళ రాజ్యం వచ్చిందని అనుకోకుండా చూడాలి. పెనం మీంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు అనుకొనే పరిస్థితి రాకూడదు. కర్నాటక, తెలంగాణల్లో లాగా కాంగ్రెస్ వస్తే ఇలా బాగుపడతాం అని అన్ని రాష్ట్రాల ప్రజలూ చెప్పుకోవాలి. తెలంగాణను దేశ ప్రజలు గర్వించే రీతిలో అభివృద్ధిపరచాలి. ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు – వ్యాసకర్త జానపద పరిశోధకుడు, సామాజికవేత్త, మొబైల్ – 9951942242 -
పొలిటికల్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్ఎస్ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాలుగో తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుందని తెలిపారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంపై ఇది అత్యాశ లేక అతి నమ్మకమా? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని రోజులు సచివాలయం వైపు కూడా చూడని కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు రాకముందే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు.. ఈరోజు(శుక్రవారం) ప్రగతిభవన్లో కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్ టాపిక్గా మారింది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం.. కేసీఆర్పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పనుల కోసం నేను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నట్టు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకుని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమని, దీనిపై తాను ఏదైనా చేయవచ్చు కానీ.. అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. నేను ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేది ఉండదని, పైగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్నారని ఆరోపించారు. సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి అని చురకలు అంటించారు. హోంమంత్రిగా ఉండి గన్మెన్లను కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులకు పౌరుషం రావాలని, హోంమంత్రి వెంటనే సంబంధిత గన్మెన్కు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్కు ఫోన్ చేసి.. -
జీవో 81ను సవరణ చేయాలని వీఆర్ఏల డిమాండ్
-
తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు నూతన సెక్రటేరియట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. కాగా, కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో సెక్రటేరియల్ గేటు ముందు బైఠాయించి జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, తక్షణమే అలర్ట్ అయిన పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ.. రిక్రూట్మెంట్ను పాత పద్దతితోనే చేపట్టాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు -
పదేళ్ల తెలంగాణ.. ఆవిర్భావ వేడుకల ఫోటోలు
-
ఆ అవకాశం నాకు దక్కింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. గన్పార్క్లో స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం.. సచివాలయం వద్ద జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించి.. అక్కడి సభా వేదిక నుంచి ప్రసంగించారాయన. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానానికి పదేళ్లు పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం రక్తసిక్తమైంది. శాంతియుతంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయి. మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర సాధనలో అమరులైనవారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అరవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 🎤 తెలంగాణపథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మన సంక్షేమ మోడల్ను కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఏ పథకం తెచ్చినా అందులో మానవీయ కోణమే ఉంటుంది. 🎤 రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవా కానుకగా.. బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం. 🎤 పోడు భూముల శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నాం. పోడు భూములకు రైతు బంధు వర్తించేలా చర్యలు చేపట్టబోతున్నాం. 🎤 గొల్ల, కుర్మలకు భారీ ఎత్తున్న గొర్రెలను పంపిణీ చేయబోతున్నాం. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో విడుత పంపిణీ చేయబోతున్నాం. 🎤 గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అర్హులైన వాళ్లకు ఇళ్ల స్థలాలు అందిస్తాం. గృహలక్ష్మి పథకం ఒక్కో ఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. 🎤 దళిత బంధు ద్వారా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇస్తున్నాం. హుజూరాబాద్లో వందకు వంద శాతం ఈ పథకం అమలు అయ్యింది. ఇప్పటివరకు మొత్తం 50 వేలమందికి దళిత బంధు లబ్ధి చేకూరింది. 🎤 మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించాం. చెరువుల కింద పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. 🎤 ఇవాళ తెలంగాణలో కరెంట్ కోతలు లేవు.. అన్నీ వరి కోతలే 🎤 గ్రామీణఆర్థిక వ్యవస్థను బలపరిచాం. మన పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డు వస్తున్నాయి. 🎤 ఇంటింటికీ తాగు నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎన్నో అవార్డులు మిషన్ భగీరథకు వచ్చాయి.స్వరాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ సమస్యలు లేవు. 🎤 నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశాం. కాళేశ్వరంను అతితక్కువ కాలంలో పూర్తి చేశాం. 🎤 రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం.. కేంద్ర ప్రభుత్వానికి కూడా కళ్లు తెరిపించింది. 🎤 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. 🎤 పవర్ హాలీడేతో పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. మోదీ స్వరాష్ట్రంలోనూ పవర్ హాలీడే అమలు అవుతోంది. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. -
అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్కే సాధ్యం: విజయేంద్ర ప్రసాద్
పట్టుదల, అకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేపడుతూ.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వరల్డ్ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం నాడు తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వ సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. “ఇప్పుడే ఒక అద్భుతం చూశాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు, స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ ఆనందం వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్. చదవండి: పుష్ప శ్రీవల్లితో ఐశ్వర్య రాజేశ్ పంచాయితీ.. స్పందించిన రష్మిక -
సరికొత్త లుక్లో తెలంగాణ నూతన సచివాలయం (ఫోటోలు)
-
TS New Secretariat Latest Images: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు)
-
TS New Secretariat: కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
కొత్త సచివాలయం ప్రారంభ సంబరాలు (ఫొటోలు)
-
Secretariat : నూతన సచివాలయంలో చాంబర్లను స్వీకరించిన మంత్రులు ( ఫొటోలు)
-
విద్యుత్ దీపాల ధగధగలతో తెలంగాణ కొత్త సచివాలయం.. ఫోటోలు వైరల్
-
విద్యుత్ దీపాల ధగధగలతో తెలంగాణ కొత్త సచివాలయం.. ఫోటోలు వైరల్
విద్యుత్ దీపాల ధగధగలతో తెలంగాణ కొత్త సచివాలయం.. ఫోటోలు వైరల్ -
Telangana: రాష్ట్ర పునర్నిర్మాణ ప్రతీక
చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం, పాలమూరు, ఇతర ప్రాజెక్టులన్నీ తెలంగాణ పునర్నిర్మాణ ప్రతీకలే.. వేసవిలోనూ మత్తడి దూకే చెరువులే సాక్ష్యం సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున తలెత్తుకుని నిలిచిన కొత్త సచివాలయం తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అతి తక్కువ కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలవడమే.. తెలంగాణ సాధించిన ప్రగతి అన్నారు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తీరాన నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత ఆయనతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సచివాలయం నుంచి తొలి సంతకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేస్తున్న సందర్భంలో.. తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివాళ్లు కారుకూతలు కూశారు. ఉన్నయన్ని కూలగొట్టి కడతారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మళ్లా కడతారా? అని కొందరు మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. వేసవిలోనూ మత్తడి దూకే చెరువులతో.. పునర్నిర్మాణం అంటే ఏమిటో తెలియని మరుగుజ్జులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సమైక్య పాలనలో చిక్కిశల్యమై శిథిలమై రంధ్రాలు పడి వచ్చిన కాస్త నీటిని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో.. కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ పునరుద్ధరించుకోవడమే పునర్నిర్మాణం. నాడు సమైక్య రాష్ట్రంలో గోదావరిలో నీళ్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇదీ పునర్నిర్మాణం. ఉప నదుల మీద, వాగుల మీద నిర్మించిన చెక్డ్యామ్లతో ఎక్కడ చూసినా నీళ్లే. ఏప్రిల్, మేలో కూడా చెరువులు మత్తడి దూకడమే పునర్నిర్మాణం. నాడు నెర్రెలుబారి బీళ్లుగా మారిన లక్షల ఎకరాల తెలంగాణ భూములు.. నేడు నిండుగా వెదజల్లుతున్న హరితకాంతులే తెలంగాణ పునర్నిర్మాణం. ఈ యాసంగిలో దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి వేస్తే.. అందులో 56లక్షల ఎకరాలు తెలంగాణలోనివే. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం, ఒక పాలమూరు, ఒక సీతారామ ప్రాజెక్టు. దేశానికే ఆదర్శంగా వెలుగుతూ.. పరిపాలనా సంస్కరణలతో, ఆచరణాత్మకంగా 33 జిల్లాలతో అలరారుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ వెలుగుతోంది. సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమంతోపాటు పారిశ్రామిక విధానంతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇండస్ట్రియల్, ఐటీ విధానంలో బెంగళూరును కూడా దాటేసి తారాజువ్వలా దూసుకుపోతోంది. మత కల్లోలాల ఊసే లేకుండా.. అరాచక శక్తులను అణచివేస్తూ.. శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా మారారు. గత పదేళ్లుగా తెలంగాణలో ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా చేశాం. మహిళలకు భరోసానిస్తూ షీ టీమ్లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్.. ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎన్నోరకాల సౌకర్యాలతో ముందుకుపోతోంది. నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, అద్భుతమైన వరంగల్ హెల్త్ సిటీ.. ఇవన్నీ తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీకలు. భూలోక వైకుంఠంగా యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం జరిగింది. మహనీయుడి స్ఫూర్తితో.. అంబేడ్కర్, గాంధీజీ చూపిన బాటలో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. సెక్ర టేరియట్కు వచ్చే సీఎం, మంత్రులు, అధికారులందరికీ నిత్యం బాబాసాహెబ్ ఆదర్శాలు స్ఫురణకు రావాలని, అంకితభావంతో పనిచేయాలనే ఉద్ధేశంతో సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. ఇదే కోవలో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటామని అందరికీ హామీనిస్తున్నాం. తెలంగాణ సాధన పోరాటంలో అసువులు బాసిన వారికి అంజలి ఘటిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి కొలమానాల్లో మనమే టాప్ ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు. ఒకటి తలసరి ఆదాయం (పర్క్యాపిటా ఇన్కమ్), రెండోది తలసరి విద్యుత్ వినియోగం (పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్). ఇప్పుడు తెలంగాణ రూ.3,00,017 తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్గా ఉంది. ఒకనాడు సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,100 యూనిట్లుగా ఉంటే.. నేడు 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. ఇదే తెలంగాణ పునర్మిర్మాణం. నిరాదరణకు గురైన వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో బాధితులు రూ.2,016 ఆసరా పింఛన్లు అందుకుంటూ చిరునవ్వుతో బతుకుతున్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో భాగంగా చేపట్టిన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న వివిధ రాష్ట్రాల కూలీలు, కార్మికులకు తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు. అడవులను తిరిగి తెచ్చుకున్నాం నాడు క్షీణించిపోయి ఆగమైన అడవులు ఇప్పుడు అటవీశాఖ పీసీసీఎఫ్లు, ఇతర అధికారుల పట్టుదల, కృషితో దేశంలోనే రికార్డు స్థాయిలో పునరుద్ధరణ అయ్యాయి. కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోడమే పునర్నిర్మాణం. వలసపోయిన పాలమూరు కూలీలంతా తిరిగొచ్చి సొంత పొలాల గట్ల మీద కూర్చుంటే.. ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణ పొలాల్లో పనిచేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణం. ఒకనాడు దాహంతో అల్లాడి ఫ్లోరైడ్తో నడుం వంగి లక్షలాది మంది జీవితాలు కోల్పోయిన తెలంగాణలో మిషన్ భగరీథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏ నీళ్లు ఉంటాయో.. ఆదిలాబాద్ గోండు గూడెంలో అదే నీరందిస్తున్న మిషన్ భగరీథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. కరెంటు వెలుగులతో.. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక.. పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో.. ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయి. తెలంగాణ కరెంటు వెలుగుజిలుగులతో విరాజిల్లుతోంది. నాడు పొలాల బోర్లు ఆన్ చేసుకునేందుకు అర్ధరాత్రి పొలాలకు వెళ్లి కరెంటు షాకులు, పాము, తేలు కాట్లతో చనిపోయిన రైతులు.. నేడు పొద్దున్నుంచి సాయంత్రం 6 గంటల దాకా పొలాలకు నీరు పారించుకొని.. దర్జాగా ఇంటికి వచ్చి కంటినిండా కునుకుతీస్తున్నారు. ఇదీ తెలంగాణ పునర్నిర్మాణం. గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరారుతున్నాయో, ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటున్నాయో అందరికీ తెలుసు. -
సరికొత్త లుక్లో తెలంగాణ నూతన సచివాలయం (ఫోటోలు)
సరికొత్త లుక్లో తెలంగాణ నూతన సచివాలయం(ఫోటోలు) -
‘బాబా సాహెబ్’కు తుదిమెరుగులు.. చివరిదశకు చేరుకున్న పనులు
సాక్షి, హైదరాబాద్: దేశ రాజ్యాంగ నిర్మాత, భావిభారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణకు దాదాపుగా సిద్ధమైంది. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ విగ్రహానికి కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. దేశ భవిష్యత్తు కోసం దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఎడం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని కుడి చేతిని ముందుకు చాచి గొప్ప ఆత్మవిశ్వాసంతో చూస్తున్న బాబాసాహెబ్ విగ్రహం నెక్లెస్ రోడ్డులో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం మరోవైపు కోట్లాది మంది తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల కోసం ప్రాణాలొడ్డిన అమరుల స్మారకం.. అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుతో నెక్లెస్రోడ్డు మరింత చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆరేళ్ల యజ్ఞం.. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ప్రకటించారు. ఆ ఏడాది అంబేడ్కర్ జయంతి రోజున నెక్లెస్రోడ్డులోని ఎన్టీయార్ పార్కు పక్కన 11.4 ఎకరాల స్థలాన్ని కేటాయించి అదేరోజు భూమి పూజ కూడా చేశారు. నిజానికి ఏడాది వ్యవధిలోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల జాప్యం జరిగింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు విగ్రహం రూపుదిద్దుకుంది. సుమారు రూ. 146 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 155 టన్నుల స్టీల్ 111 టన్నుల కంచు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్, పద్మభూషణ్ రాంవంజి సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్లు అంబేడ్కర్ భారీ కళాఖండానికి రూపకర్తలు. బాబాసాహెబ్ గంభీరమైన విగ్రహాన్ని మమ్మూర్తులా రూపొందించడంలో వారి అద్భుతమైన ప్రతిభ కనిపిస్తుంది. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని అయినా తట్టుకొనేవిధంగా విగ్రహం నిర్మాణం చేపట్టారు. విగ్రహం కోసం 155 టన్నుల స్టీల్ను, 111 టన్నుల కంచును వినియోగించారు. విగ్రహం బయటి వైపు లేయర్ కోసమే సుమారు 9 టన్నుల కంచును వాడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహం వెడల్పు 45 అడుగులు ఉంటుంది. కింద పార్లమెంటు ఆకృతిలో ఏర్పాటు చేసిన పీఠం 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రీనరీ ఏర్పాటు చేయవలసి ఉంది. అలాగే బేస్మెంట్లోని హాళ్లలో అంబేడ్కర్ జీవితంపై విస్తారమైన సమాచారంతో కూడిన గ్రంథాలయం, ఆయన జీవితవిశేషాలను, రాజ్యాంగ రచనాకాలం నాటి ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఆడియో, వీడియో ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఈ పనులు ఇంకా పూర్తి చేయవలసి ఉంది. అలాగే విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలి. అన్ని పనులు పూర్తయితే ఆహ్లాదభరితమైన వాతావరణంలో మహనీయుడి అద్భుతమైన విగ్రహాన్ని వీక్షించవచ్చు. -
తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
-
Telangana: సచివాలయం కింద చెరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయం సకల హంగులతో సిద్ధమవుతోంది. భవనం భూగర్భంలో ఏకంగా ఓ మినీ రిజర్వాయర్ను నిర్మించారు. రెండున్నర లక్షల లీటర్ల సామర్ధ్యంతో ఈ స్టోరేజీ ట్యాంకును సిద్ధం చేశారు. మరోవైపు సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేయబోతున్నారు. ఇందుకోసం భవనం రూఫ్ టాప్లో భారీ సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సచివాలయం ప్రధాన ద్వారం ముందు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. వేయి అడుగుల పొడవుండే ఈ రోడ్డు చివరలో రెండు వరసల్లో ఏకంగా 300 కార్లను నిలిపి ఉంచేలా పార్కింగ్ వసతి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం వచ్చే నెల 17న ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలుండగా, ప్రాంగణంలోనూ మరిన్ని ప్రత్యేకతలు జోడించారు. వెరసి ఇదో ప్రత్యేక నిర్మాణంగా నిలవనుంది. వాన నీటిని ఒడిసిపట్టేలా.. వాన నీటిని ఒడిసి పట్టేందుకు వీలుగా సచివాలయం కింద రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని ఇందులోకి తరలించేందుకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయంలో దాదాపు 9 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పచి్చక బయళ్లుంటాయి. భవనం ముందు వైపు రెండు వైపులా మూడెకరాల చొప్పున రెండు, మధ్య కోర్ట్యార్డు, ఇతర ప్రాంతాల్లో కలిపి మరో మూడెకరాల మేర లాన్లుంటాయి. వాటి నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుంది. భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచి్చకబయళ్లకు వాననీటిని వాడే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. బయట రోడ్డు లెవల్ కంటే సచివాలయం ప్రాంగణం బేస్ ఐదడుగుల ఎత్తున ఉంటుంది. దాని మీద భవన నిర్మాణం జరిగింది. దీంతో ఎక్కడా వాననీరు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. పార్కింగ్కు వీలుగా రోడ్డు విస్తరణ సచివాలయ ప్రధాన ద్వారం ముందున్న రోడ్డును వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా ఫుట్పాత్పై ఉన్న దాదాపు 40 చెట్లను తొలగించనున్నారు. ఈ మేరకు సంబంధిత కమిటీ అనుమతి ఇచ్చింది. ఆ చెట్లను సంజీవయ్య పార్కులో (ట్రాన్స్లొకేట్) తిరిగి నాటనున్నారు. కాగా సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు లోపల విశాలమైన పార్కింగ్ యార్డులున్నాయి. అవి సరిపోని పక్షంలో, ఈ వంద అడుగుల రోడ్డు చివరలో నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సాయంత్రం వేళ సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు ప్రస్తుతం పార్కింగ్ ఇబ్బందులున్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ కొత్త రోడ్డులో రెండు వరుసల్లో 300 కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సౌర వెలుగులు పది లక్షల చదరపు అడుగుల సువిశాల భవనంలో వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వినియోగం ఉంటుంది. దీంతో కరెంటు ఖర్చు ఎక్కువే అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమేర పొదుపు చేసేందుకు సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భవనం రూఫ్టాప్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవనాన్ని ప్రారంభించిన తర్వాత వీటి ఏర్పాటు మొదలు పెడతారు. ఇందుకోసం ఓ కన్సల్టెంటును కూడా నియమిస్తున్నారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. భారత నూతన పార్లమెంటు భవనానికి సైతం అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని గత మంగళవారం రాష్ట్ర శాసనసభ ఏకగీవ్రంగా తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఏదో ఆశామాషీకి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరడం లేదని స్పష్టంచేశారు. దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, భారత సామాజిక తాత్వికుడు, రాజ్యాంగ నిర్మాతకు మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలందరికీ గర్వ కారణం రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్కు అంబేడ్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేడ్కర్ తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ స్వయంపాలన కొనసాగించడం వెనక అంబేడ్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు. మమ్మల్ని అంబేడ్కర్ స్ఫూర్తే నడిపిస్తోంది.. ‘అంబేడ్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడతాయనే అంబేడ్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత. అప్పుడే నిజమైన భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేడ్కర్ పేరును సెక్రటేరియట్కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జై భీం. జై తెలంగాణ. జై భారత్’ అని సీఎం తన ప్రకటనను ముగించారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. చదవండి: మంత్రి vs సిట్టింగ్ ఎమ్మెల్యే -
సచివాలయం కూల్చివేతపై కౌంటర్ ఇంకెప్పుడు వేస్తారు?: ఎన్జీటీ
సాక్షి, హైదరాబాద్: సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రేవంత్రెడ్డి పిటిషన్పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కౌంటర్ వేయకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దాదాపు 50 శాతానికిపైగా కొత్త భవనాల నిర్మాణం పూర్తయినా ఇంకా కౌంటర్ దాఖలు చేయరా?’అని నిలదీసింది. డిసెంబర్ 17లోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. నిబంధనల మేరకు అనుమతులు తీసుకోకుండానే పాత సచివాలయాన్ని కూల్చేశారని, కొత్త నిర్మాణాలకు సరైన అనుమతులు లేవని రేవంత్ వేసిన పిటిషన్ను ఎన్జీటీ ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కొత్త సచివాలయం నిర్మాణం కోసమే పాత సచివాలయాన్ని అనుమతుల్లేకుండా కూల్చివేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్కుమార్ నివేదించారు. (చదవండి: కొత్త పంట గెర్కిన్.. లక్షల్లో ఆదాయం) -
కొత్త సచివాలయ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన కొత్త సచివాలయానికి లైన్క్లియర్ అయ్యింది. నూతన సచివాలయానికి గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరుచేసింది. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను ఇటీవల జారీచేసిన విషయం తెలిసిందే. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ ఈ భవన సముదాయానికి రూపకల్పన చేసింది. కాగా సచివాలయం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవ్వగా దాని స్థానంలో కొత్త భవనాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కొరకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. -
కొత్త సచివాలయ టెండర్ షాపూర్జీ– పల్లోంజీకి?
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకున్న సంస్థ పేరును గురువారం ప్రకటించనున్నారు. షాపూర్జీ– పల్లోంజీ, ఎల్ అండ్ టీ .. ఈ రెండు సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. రోడ్లు, భవనాల శాఖ టెక్నికల్ బిడ్లను తెరిచి రెండు సంస్థలూ సాంకేతిక అర్హత సాధించినట్టు వెల్లడించింది. తదుపరి ఫైనాన్షియల్ బిడ్లను తెరిచేందుకుగాను టెండర్ వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)కు పంపారు. ప్రాజెక్టు వ్యయం (రూ.450 కోట్లకు పైగా) దృష్ట్యా టెండర్లను ఆమోదించే అధికారం రోడ్లు, భవనాల శాఖకు ఉండదు. ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి ఎల్1ను సీఓటీ ప్రకటించనుంది. అధికారికంగా గురువారం ప్రకటించనున్నప్పటికీ, షాపూర్జీ–పల్లోంజీ సంస్థనే తక్కువ కోట్ చేసి ఎల్1గా నిలిచిందన్న (టెండర్ దక్కించుకుందన్న) ప్రచారం అధికారవర్గాల్లో సాగుతోంది. దీనికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ అధికారులను ప్రశ్నించగా, వివరాలను గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. పది రోజుల్లో ఎల్1 సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలన్న విషయాన్ని అందులో పేర్కొంటారు. -
కొత్త సచివాలయం.. కిటికీలే కీలకం
సాక్షి, హైదరాబాద్: సెంట్రలైజ్డ్ ఏసీ.. అద్దాలు.. అధునాతన నిర్మాణశైలీ.. ఇవీ భవంతుల నిర్మాణాల్లో సర్వసాధారణంగా కనిపించే డిజైన్లు. కానీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్ ప్రభావంతో ఇప్పుడు ఆలోచన పూర్తిగా మారుతోంది. భవనాల డిజైన్లూ మారుతున్నాయి. కొత్తగా నిర్మించబోతున్న తెలంగాణ సచివాలయ భవనం కూడా దీనికి అతీతంకాదు. తెలంగాణ రాష్ట్ర ఘనతను సమున్నతంగా చాటే రీతిలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలో సాక్షాత్కరించబోతున్న కొత్త సచివాలయ భవనం సంప్రదాయపద్ధతిలో, వీలైనన్ని ఎక్కువ కిటికీలతో రూపుదిద్దుకోనున్నది. అత్యున్నత స్థాయి సమావేశమందిరాలకు కూడా కిటికీలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ కొత్త సచివాలయ భవనాన్ని సెంట్రలైజ్డ్ ఏసీ వసతితో నిర్మించాలని తొలుత భావించారు. అయితే, ఈ తరహా డిజైన్లపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచీ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. భవనం అంతా ఏసీపై ఆధారపడేటట్లు ఉండే డిజైన్పట్ల సీఎం వ్యతిరేకంగానే ఉన్నారు. ముఖ్యమైన సమావేశ మందిరాలు, కొన్ని గదులు ఏసీతో ఉండేలా నిర్మించాలనుకున్నారు. ఈ మేరకు ఇటీవల ఆర్కిటెక్ట్ సంస్థ, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చ జరిగింది. ఎంత ఆధునికంగా నిర్మిస్తున్నప్పటికీ, దీనికి సెంట్రలైజ్డ్ ఏసీ వద్దని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించినట్టు సమాచారం. ఆ సమావేశం జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో కోవిడ్ మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి సెంట్రలైజ్డ్ ఏసీ భవనాలు తక్కువగా ఉండటం, ఏసీల్లో ఎక్కువ సమయం గడిపేవారి సంఖ్య తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రెండు పర్యాయాలు సీఎం అధికారులతో భేటీ అయి డిజైన్లపై ప్రత్యేక సూచనలు చేశారు. తాజాగా భవనంలో ఎక్కడా కిటికీలు లేకుండా పూర్తిగా ఏసీపై ఆధారపడే గది ఒక్కటి కూడా ఉండొద్దని నిర్ణయించారు. అన్ని సమావేశ మందిరాలకూ సహజరీతిలో గాలి, వెలుతురు ప్రసరించేలా విశాలమైన కిటికీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏసీ వసతితోపాటు ప్రతి గదిలో సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉండేలా చూస్తున్నారు. ఇక్కడి చెట్లు సంజీవయ్య పార్కుకు.. సచివాలయ ప్రాంగణంలో చిన్నా, పెద్దా కలిపి 630 చెట్లున్నాయి. వీటిల్లో పెద్దవి దాదాపు వంద వరకు ఉంటాయి. ప్రధాన భవనాలు నిర్మించే ప్రాంతంలో 30 వరకు ఉన్నాయి. వీటిని కచ్చితంగా తొలగించాల్సి ఉంటుంది. కొత్త సచివాలయ ప్రాంగణంలోనే మరో చోటకు వాటిని ట్రాన్స్లొకేట్ చేయాలని భావిస్తున్నారు. అనుకూల పరిస్థితులు లేని పక్షంలో వాటిని సంజీవయ్య పార్కుకు తరలించాలని నిర్ణయించారు. కానీ, కొన్ని మాత్రమే ఆ పద్ధతిలో జీవించి ఉంటాయి. కొన్ని చనిపోతాయి. త్వరలో నిపుణులతో ఆ విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. -
కేసీఆర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ ఆవరణలో నల్ల పోచమ్మ ఆలయం, మసీదులు కూల్చివేతలకు బాధ్యులైన ముఖ్యమంత్రి కేసీఆర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావన్ దాసోజు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను, మత పరమైన విశ్వాసాలను గాయపరుస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చట్ట విరుద్ధంగా, రాజ్యంగానికి వ్యతిరేకంగా నియంతత్వ పోకడలతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అత్యంత ప్రాచీనమైన ప్రార్థనా స్థలాలను మూడో కంటికి తెలియకుండా చట్ట వ్యతిరేకంగా దుర్మార్గంగా కూల్చివేశారని విమర్శించారు. వీటిలో ఓమసీదు 1889 వ సంవత్సరంలో ఆనాటి నిజాం రాజు నిర్మించిన తెలంగాణ వారసత్వ సంపద అని, అంతేకాకుండా సీ బ్లాక్ పక్కనే ఉన్న మసీదు ఇఫ్తార్ - ఏ - ముతామాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రార్థనా మందిరమని గుర్తుచేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ పాల్గొన్నారు. -
రూ.400 కోట్లతో సచివాలయం నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీచేసింది. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ రూపకల్పన చేసిన కొత్త సచివాలయం భవన డిజై¯Œ ను ఆమోదించడంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి మూడు రోజుల క్రితం పరిపాలనా అనుమతులను సాధారణ పరిపాలన శాఖ జారీచేసింది. సచివాలయం నిర్మాణం కోసం మరో వారం రోజుల్లో గ్లోబల్ టెండర్లను పిలవనున్నారు. నెలాఖరులోగా పనులను ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా సచివాలయం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. శిథిలాల తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. మరో వారం లేదా పదిరోజుల్లోగా శిథిలాల తరలింపు పూర్తి చేసి, కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా మొత్తం స్థలాన్ని చదును చేయనుంది. -
సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్ : కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో ప్రధాన భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. భవన నిర్మాణానికి వీలుగా 4 రకాల విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉండటంతో అధికారులు ఆ కసరత్తు ప్రారంభించారు. అనుమతులు వచ్చేలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. గుమ్మటం ఎత్తే 111 అడుగులు.. డెక్కన్–కాకతీయ శైలిలో రూపుదిద్దుకోబోతున్న తెలంగాణ సచివాలయ భవనం ఎత్తు 278 అడుగులు. ఇందులో మధ్యభాగంలో ఉండే ప్రధాన గుమ్మటం ఎత్తే ఏకంగా 111 అడుగులు కావటం విశేషం. మొత్తం ఏడంతస్తులుగా ఉండే భవనంలో.. ఈ గుమ్మటం ఎత్తు ఇంచుమించు 4 అంతస్తులతో సమానంగా ఉండనుందంటే దాని ఆకృతి ఎంత పెద్దదో ఊహించవచ్చు. ఇక గుమ్మటంపై 11 అడుగుల ఎత్తుతో నాలుగు సింహాలతో కూడిన అశోకముద్ర అలరారనుంది. భవనం పైభాగం మధ్యలో విశాలమైన స్కైలాంజ్ నిర్మిస్తున్నారు. ఇది గుమ్మటం దిగువ భాగమన్నమాట. ఈ స్కైలాంజ్ 50 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దానిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం పైభాగం ఉంటుంది. నాలుగువైపులా రోడ్డు.. పాత సచివాలయానికి మూడు వైపులనే రోడ్డు ఉంది. కానీ కొత్త సచివాలయ భవనానికి వెనక వైపు కూడా రోడ్డు నిర్మించనున్నారు. వెరసి నాలుగువైపులా రోడ్డు ఉండబోతోంది. రోడ్డు రూపంలో గతంలో ఎదురైన వాస్తు దోషం.. దీంతో సరిదిద్దినట్టు కానుందని సమాచారం. మింట్ భవనం–సచివాలయం మధ్య నుంచి ఇప్పుడు కొత్తగా రోడ్డును నిర్మించనున్నారు. గతంలో జీ బ్లాక్ ఉన్న ప్రాంతానికి కాస్త అటుఇటుగా ప్రధాన భవనం నిర్మితం కానుంది. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ప్రాంతం కొత్త సచివాలయ ప్రహరీ ఆవలివైపు చేరనుండటం విశేషం. ప్రస్తుతమున్న తెలంగాణ సచివాలయ ప్రవేశద్వారం కనుమరుగు కానుంది. హుస్సేన్సాగర్ వైపు ఉన్న పాత ప్రవేశద్వారమే ఉండనుంది. –ప్రవేశద్వారం వద్ద ఉండే పోర్టికో పైన జాతీయపతాక దిమ్మె ఏర్పాటు చేస్తున్నారు. –కొత్త సచివాలయ బేస్మెట్కు రాజస్తాన్లోని ధోల్పూర్లో లభించే ఎర్ర రాతిని వినియోగించనున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనాన్ని ఈ రాతితోనే నిర్మించారు. –ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఏడో అంతస్తు కిటికీలు బుల్లెట్ ప్రూఫ్తో ఉండనున్నాయి. –భవనం మొత్తం తెలుపు రంగుతో తళతళలాడనుండగా, కిటికీలు మాత్రం నీలిరంగు అద్దాలతో కొత్త అందాలు ఒలకబోయనున్నాయి. –ఇక ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450 కోట్లు. –మరో ఐదారు రోజుల్లో కూల్చివేత శిథిలాల పూర్తిగా తొలగించనున్నారు. ఆ వెంటనే పర్యావరణ అనుమతులు, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ, ఎయిర్పోర్టు అథారిటీల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నారు. -
సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు
-
సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి గాను గురువారం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చెన్నై ఆర్కిటెక్ట్స్ ఆస్కార్, పొన్నిలతో భేటీ అయ్యారు. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త సచివాలయ భవనంలో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని సూచించారు. -
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని కోరింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబం« దించిన డిజైన్లను ఆమోదించింది. బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు కరోనా వ్యాప్తి – వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స– ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. ‘కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని వైద్య నిపుణులు కేబినెట్ కు వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్ ఉద్ఘాటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బుకైనా వెనకాడేది లేదని స్పష్టం చేసింది. – రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్డెసివిర్, డెక్సామితజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కోవిడ్ చికిత్సపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి. – పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలి. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలి. – రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలి. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించుకునేందుకు కలెక్టర్లకు అధికారం. – కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. – ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెలవారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి. –ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. – ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లు పెట్టాలనే సీఎం నిర్ణయాన్ని కేబినెట్ అభినందించింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. వలస కార్మికుల సంక్షేమానికి పాలసీ లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్నవారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. టీఎస్–బీపాస్కు ఆమోదం భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్–బీపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్–ఐపాస్ లాగానే టీఎస్–బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానిక సంస్థలకు వన్టైం సెటిల్మెంట్ అవకాశం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్ బిల్లుల బకాయిలను వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది – ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. – కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. –దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానించింది. – రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతిలో 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10–12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. -
సకల సౌకర్యాలతో సచివాలయం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవనంలో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని సూచించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. కొత్త భవనానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. గత సమీక్షలో సీఎం సూచనల మేరకు మార్పులు చేసిన డిజైన్లను ఆర్కిటెక్ట్ నిపుణులు ఈ సమావేశంలో ఆయన ముందు ఉంచగా.. వీటిలో మళ్లీ పలు మార్పులను సీఎం సూచించారు. తదుపరి సమీక్షలో సవరించిన డిజైన్లను పరిశీలించి తుది డిజైన్ ఖరారు చేసే అవకాశం ఉంది. -
సచివాలయంలో ఏముంది? సీక్రసీ ఎందుకు!
సెక్రెటరీయేట్ కూల్చివేత పనుల్లో అంత సీక్రసి ఏముంది? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నిజంగానే పాత సెక్రెటరీయేట్ భవనాల కింద గుప్తనిధులున్నాయా? లేదా ఎవరు ఏమనుకుంటే మాకేంటి మేం అనుకున్నది చేసి తీరుతామనేదే ప్రభుత్వ పాలసీనా? పాత భవనాల కూల్చివేతను ప్రభుత్వం అంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం ఎందుకు? సాక్షి, హైదరాబాద్ : పరిపాలనకు అనుకూలంగా లేదని, ఒక్కో శాఖ ఒక్కో దగ్గర ఉండడం సరైన పద్ధతి కాదని పాత సెక్రెటరీయేట్ కూల్చివేసి నూతన సెక్రెటరీయేట్ కడదామనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సంవత్సరం క్రితం నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన కేసీఆర్ వివిధ కారణాలవల్ల దాని జోలికే వెళ్ళలేదు. కేవలం వాస్తు బాగాలేదని మంచి భవనాలను కూల్చేయడం సరైంది కాదని పలువురు కోర్టులో పిల్స్ వేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం పాత భవనాల కూల్చివేతకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రభుత్వం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. కూల్చివేతల వద్దకు ఎవరిని అనుమతించకపోవడంతో పాటు మీడియా పట్ల కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని ప్రజాసంఘాలు, పలు పార్టీల నేతలు వివిధ కారణాలు చూపెడుతూ, కూల్చివేతను అడ్డుకొని ఆ భవనాలను కోవిడ్ సెంటర్ గా మార్చి ప్రజలకు ఉపయోగపదేవిధంగా చూడాలని కోర్టులో మళ్ళీ పిల్స్ వేశారు. కోర్టు స్టే ల తర్వాత కూల్చివేతలకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో మీడియాకైనా అనుమతి ఇవ్వాల్సిందిగా పలువురు పిటిషన్ వేయడంతో పాత భవనాల కూల్చివేత ప్రక్రియను మీడియా కవేరేజ్ కోసం అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో మీడియాని క్షేత్ర పర్యటనకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. 15 నిమిషాల్లోనే బయటకు ఇన్ని రోజులు ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం మీడియాని అనుమతిస్తోందని తెలియడంతో వాస్తవాలు బయటకొస్తాయని అందరూ భావించారు. ప్రభుత్వం అనుమతిచ్చినా పోలీసుల కఠినమైన ఆంక్షల మధ్య మీడియాను లోపలికి తీసుకెళ్లి బయటకి తీసుకొచ్చారు. మీడియా కోసం ఐదు వెహికల్స్ ఏర్పాటు చేసి అందులోనే మీడియా ప్రతినిధులతో పాటు వందలమంది పోలీసులను కుక్కి సెక్రెటరీయేట్ కి తీసుకెళ్లారు. సెక్రెటరీయేట్ వెళ్లిన తర్వాత మీడియా ప్రతినిధులను కనీసం వాహనాల నుండి కిందకి దిగకుండా అడ్డుకొని కవరేజ్ చేయకుండా పొలీసులు నిలువరించారు. మీడియాను పాత భవనాల కూల్చివేత దగ్గరికి మీడియాను తీసుకెళ్లిన అధికారులు కేవలం 15 నిమిషాల్లోనే బయటకి తీసుకొచ్చారు. పాత భవనాల కవరేజీకి ఎందుకు అనుమతించడం లేదని కోర్టు అడగడంతో మాత్రమే ప్రభుత్వం మీడియాని అనుమతించిందని పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. భవనాల కూల్చివేత ప్రక్రియకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వం మీడియాని ఆంక్షలు లేకుండా కవరేజీ చేసుకొనివ్వకుండా ఎందుకు వ్యవహరించిందో సమాధానం లేని ప్రశ్న. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలైతే కనిపించలేదు.కానీ కూల్చివేత పనులైతే కొనసాగుతున్నాయి. దుమ్ము లేవకుండా భవనాలను నీళ్లు కొట్టడం, పాత ఇనుప చువ్వల్లో బాగున్నవాటిని తిరిగి ఉపయోగించడం లాంటి సాధారణ ప్రక్రియ తప్పా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవీ లేవనే చెప్పుకోవాలి. ఇప్పటికే 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయని చెప్తోన్న ప్రభుత్వం అక్కడి శిధిలాలను వేరే దగ్గర డంప్ చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే 2500 లారీ ట్రిప్పుల శిధిలాలు డంప్ చేశామని, మరో 2000 లారీ ట్రిప్పుల శిధిలాలను డంప్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బ్లాకుల పరంగా చూస్తే జీ బ్లాక్ను వంద శాతం కూల్చివేయగా, ఎన్, జే బ్లాక్లు యాభై శాతం కూల్చివేశారు.ఏ,బీ,సీ బ్లాక్లు 80 శాతం, కే బ్లాక్ 20 శాతం కూల్చివేశారు. ఇక సౌత్ హెచ్, నార్త్ హెచ్ బ్లాకులు 95 శాతం కూల్చివేత ముగిసింది. వృక్షాలకు ఇబ్బంది కలగకుండా కూల్చివేతలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కూల్చివేత పనులను కవరేజీకి అనుమతించమని చెప్పుకోవడానికి మాత్రమే మీడియాను అనుమతించిన ప్రభుత్వం ఈ ప్రక్రియలో ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అనుమతించిన ప్రతి వాహనంలో మీడియా ప్రతినిధులతో పాటు, పదుల సంఖ్యలో పోలీసులను కుక్కింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యతో ఈ కమ్యూనిటీల్లో కరోనా కేసులు పెరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రభుత్వమే చెప్పాలి. -
సినిమా అయిపోయాక టికెటిస్తే?
సాక్షి, హైదరాబాద్: ‘సచివాలయం భవనాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే 90 శాతానికిపైగా పూర్తయిందని చెబుతున్నారు. మరోవైపు మీడియాను అనుమతించాలా లేదా అన్నదానిపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పడానికి సోమవారం వరకు గడువు కోరుతున్నారు. సినిమా అయిపోయాక టికెట్ ఇస్తే ఏం లాభం’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను అనుమతించాలంటూ వీఐఎల్ మీడియా సంస్థ తరఫున జి.సంపత్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం మరోసారి విచారించారు. నగరంలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియను కవర్ చేసేందుకు మీడియాను అనుమతిస్తున్నారని, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాల్సిన సచివాలయం భవనాల కూల్చివేత ప్రక్రియను కవర్ చేసేందుకు మాత్రం మీడియాను అనుమతించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి నవీన్కుమార్ వాదనలు వినిపించారు. సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఇదేం ప్రైవేటు వ్యవహారం కాదన్నారు. ఇంత రహస్యం గా కూల్చివేత పనులు చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే 90 శాతానికిపైగా భవనాలను కూల్చివేశామని, రక్షణ చర్యల్లో భాగంగానే మీడియాను అనుమతించడం లేదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని సోమవారంలోగా తెలియజేస్తానని గడువు ఇవ్వాలని కోరారు. 90 శాతానికిపైగా భవనాలను కూల్చివేశామని చెబు తున్న నేపథ్యంలో మీడియాను అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నవీన్కుమార్ కోరా రు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. రోజూ ఎన్ని భవనాలు కూలుస్తున్నారో కలర్ ఫొటోలతో సహా సాయంత్రం మీడియాకు బులెటిన్ రూపంలో ఇవ్వండి. దీనిపై నేటిలోగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపండి’ అని న్యాయమూర్తి ఏజీని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
కొత్త సచివాలయం డిజైన్పై ఎల్లుండి ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం సాగునీటి, ఆర్ అండ్ బీ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల సాగునీటికి సంబంధించి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. భవిష్యత్లో గోదావరి కృష్ణా జలాల వినియోగంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం నీటి పారుదలశాఖ, ఎల్లుండి ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక సాగునీటి రంగానికి ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం జరిగే సమావేశంలో కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణంకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం క్యాబినెట్ ఆమోదించిన తర్వాత డిజైన్లపై అధికారిక ప్రకటన చేస్తారు. (సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్) కాగా తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. (సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!) -
సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్
-
సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పాత భవనాల కూల్చివేతకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమన్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ప్రస్తుతమున్న భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపింది. అలాగే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. (సచివాలయ వివాదం : సర్కార్కు ఊరట) ఈ మేరకు కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. అంతకుముందు రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం కూల్చివేతలకు ముందస్తు పర్యావరణ అనుమతి అవసరంలేదని హైకోర్టుకు నివేదించింది. దీంతో ఆయా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. -
సచివాలయ వివాదం: సర్కార్కు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పాత భవనాలు కూల్చివేసి దాని స్థానం కొత్తవాటిని నిర్మించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సచివాలయం వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే సమగ్రంగా పరిశీలిస్తోందని, ఈ సమయంలో తాము ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమంటూ న్యాయస్థానం తెలిపింది. (కూల్చివేతకు అనుమతి అవసరమా.. కాదా?) ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషన్ ధర్మాసనం శుక్రవారం పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి తాజా వివాదంపై కొంత ఊరట లభించింది. కాగా ఇదే అంశంపై హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. -
కూల్చివేతకు అనుమతి అవసరమా.. కాదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘భూమిని సిద్ధం చేయడం (ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్)’అన్న పదానికి స్పష్టమైన అర్థం చెప్పాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నిర్మాణాలకు అనుమతి అవసరమా.. కాదా.. భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాలు భూమిని సిద్ధం చేయడం అన్న అర్థానికి లోబడి ఉంటాయా లేదా అన్నది కూడా తెలపాలని సూచించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ లేదా ఇతర హైకోర్టులు భూమిని సిద్ధం చేయడం అన్న పదానికి ఏమైనా నిర్వచనం చెప్పాయా అన్నది కూడా పరిశీలించి చెప్పాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేతను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు ధర్మాసనం పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సచివాలయం కూల్చివేతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందలేదని, ఈ నేపథ్యంలో కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కూల్చివేతలకు అనుమతులు తీసుకోవాల్సిందేనని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పలు సుప్రీంకోర్టు తీర్పులను, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలను సమర్పించారు. నూతన భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉందని, కూల్చివేయడానికి అనుమతి అవసరం లేదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ అథారిటీ ఇచ్చిన నివేదికలను, పలు సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనానికి సమర్పించారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం... గతంలో తాము లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఈ నివేదికలో స్పష్టమైన వివరణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ధర్మాసనం లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర పర్యావరణ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారని, శుక్రవారంలోగా స్పష్టమైన వివరణ ఇస్తామని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్రావు ధర్మాసనానికి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎన్జీటీ నోటీసులు... సచివాలయం భవనాల కూల్చివేత వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సచివాలయం భవనాల కూల్చివేతను సవాల్ చేస్తూ ఎంపీ ఎ.రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హరిత ట్రిబ్యునల్ చెన్నై విభాగం జ్యుడీషియల్æ మెంబర్ జస్టిస్ కె.రామక్రిష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారించి ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ కమిటీలకు నోటీసులు జారీ చేసింది. -
కూల్చివేత వెనుక ‘ఆపరేషన్ ఖజానా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సీఎం కేసీఆర్ కదలికలను లోతుగా పరిశీలిస్తే సచివాలయం కూల్చివేత వెనుక ‘ఆపరేషన్ ఖజానా’బయట పడిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి వెల్లడించారు. మంగళవారం తన పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో అనుమానాస్పదంగా అనేక పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండు వారాలపాటు సీఎం ఎవరికీ కనిపించలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారు. అదే సమాచారం మీడియాకు చెప్తున్నా’అని ఆయన అన్నారు. వేల మంది పోలీసుల పహారాలో సెక్రటేరియట్ను కూల్చివేశారని, కూల్చివేత పనులు వీడియో తీశారని ఇద్దరు కానిస్టేబుళ్లను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని చెప్పారు. అణుబాంబు ప్రయోగం చేసేటప్పుడు కూడా ఇంత రహస్యం పాటించలేదని, గుప్త నిధుల కోసం తవ్వేవారు మాత్రమే అర్ధరాత్రి ఇలాంటి పనులు చేస్తారని వ్యాఖ్యానించారు. హోంసైన్స్ కాలేజీ కింద వనపర్తి మహారాజ సంస్థానం సంపద దాచిపెట్టిందని ఆర్కియాలజీ విభాగం గతంలోనే చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిజాం కాలంలో జీ బ్లాక్ కింద బంకర్లలో నిధులు దాచిపెట్టారని చరిత్ర చెబుతోందని అన్నారు. హెచ్ఎండీఏ నోటిఫై చేసిన హెరిటేజ్ బిల్డింగ్లలో సైఫాబాద్ ప్యాలెస్ (జీ బ్లాక్ ) కూడా ఉందని, దాన్ని 183 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. సీఎంకు అత్యంత నమ్మకస్తులు సీఎస్, డీజీపీతో మాత్రమే రహస్యంగా సమీక్షించాల్సిన అవసరం ఏముందని, ఆర్కియాలజీ విభాగం, ఎన్ఎండీసీని కూల్చివేత పనుల్లో ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదని ప్రశ్నించారు. -
కేబినెట్ ఆమోద ప్రతిని ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనుల్ని నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఈ నెల 15 వరకూ హైకోర్టు పొడిగించింది. కూల్చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. భవనాల్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం విధానపరమైనదని, దీని విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్ ప్రసాద్ చెప్పారు. గతంలో ఇదే విధంగా తీర్మానం చేసిన దానిపై తాము ఉత్తర్వులు ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. మంత్రివర్గం గత నెల 30న తీర్మానం చేసిన విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు అనిపిస్తోందని,, పత్రికల్లో వార్తలు రాలేదని, ప్రభుత్వం కూడా ప్రకటన జారీ చేయలేదని వ్యాఖ్యానించింది. ప్రజలకు చెప్పకపోయినా కోర్టులకైనా తెలియజేయాలని ఆదేశించింది. ప్రజలకు తెలియజేయకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. సీల్డ్ కవర్లో మంత్రివర్గ తీర్మాన ప్రతిని అందజేయాలని కోరింది. పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ... నిర్మాణాలు, కూల్చివేతలకు ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, పలు చట్టాలను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడిందని, అనుమతి తీసుకుని కూల్చారో లేదో ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ఈ వాదనను ఏజీ వ్యతిరేకిస్తూ, భవనాల కూల్చివేత పనులు మధ్యలో నిలిచిపోయాయని, వాటిని పూర్తిగా కూల్చేందుకు వీలుగా స్టేను ఎత్తేయాలని కోరారు. మంత్రివర్గ తీర్మాన ప్రతిని ఈరోజే మధ్యాహ్నానికి ఇస్తామని, విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై.. పిటిషనర్ వాదనల దాఖలుకు సమయం ఇవ్వాలని, విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం మంత్రివర్గ తీర్మాన ప్రతిని, పిటిషనర్ కౌంటర్ రిప్లై్ల దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మంత్రివర్గం ఆమోదించింది ప్రభుత్వం చట్ట ప్రకారమే సచివాలయ భవనాల్ని కూల్చివేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. మంత్రివర్గం జూన్ 30న ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ఆర్అం డ్బీ ఈఎన్సీ అదే నెల 4న 25.50 ఎకరాల్లోని సచివాల య భవనాల కూల్చివేతకు నివేదిక ఇచ్చారని, దీనికి అనుగుణంగా కూల్చివేతలకు జీహెచ్ఎంసీ కూడా అనుమతి ఇచ్చిందన్నారు. కాలుష్య సమస్యతో ఎవ్వరూ బాధపడటం లేదని, హుస్సేన్సాగర్ సమీపంలో కూల్చివేయరాదన్న వాదన చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిర్మాణాలు– కూల్చివేతలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లోని 4(3)ను ఉల్లంఘించలేదన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, వీటిని కొట్టేయాలని కోరారు. -
కూల్చివేతపై లంచ్మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా కేంద్రం.. సచివాలయ భవనాల్ని కూల్చకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం ఎదుట పిటిషనర్ న్యాయవాది ప్రభాకర్ కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కూల్చివేత పనుల్ని వాయిదా వేయాలన్నారు. కూల్చివేత వల్ల సచివాలయ పరిసర ప్రాంతాల్లోని 5 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలుష్య సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు. కూల్చివేత ఏకపక్షంగా, కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పారు. దీనిపై లంచ్మోషన్ పిటిషన్ అవసరం లేదని, పిటిషన్గా దాఖలు చేస్తే దానిని ఇతర వ్యాజ్యాల క్రమంలో విచారణ చేస్తామని ధర్మాస నం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇదిలాఉండగా సచి వాలయ కూల్చివేతపై మంత్రివర్గం కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, మధ్యంతర నిర్ణయం మాత్రమే తీసుకుందని ఇటీవల హైకోర్టు తీర్పులో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోకుండా భవనాల కూల్చివేత నిర్ణయం చెల్లదని చెప్పారు. -
కొత్త సచివాలయం అవసరమా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ తో జనం అల్లాడుతుంటే ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. కరోనా సంక్షోభంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం) తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలని కోరారు. పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని తాము కోరామని, 10 వేల మంది రోగులకు అక్కడ వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారని, మొదటి నుంచి కరోనా విషయంలో తప్పుడు విధానాలనే ఆయన అవలంభిస్తున్నారని మండిపడ్డారు. సీఎం మొండివైఖరి కారణంగానే రాష్ట్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని హితవు పలికారు. కూల్చివేత దారుణం: జీవన్ రెడ్డి సచివాలయాన్ని కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు మీద కట్టుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఊరి వాడికి వారి ఆపద వస్తే... ఊసు గళ్ళ వాడికి దోమల ఆపద అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే సచివాలయ భవనాలు కూల్చివేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. -
సచివాలయంవైపు వెళ్లే దారులన్నీ మూసివేత
-
తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత ప్రారంభం
-
తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం అర్థరాత్రి నుంచి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోలీసులను భారీగా మొహరించి సెక్రటేరియట్ దారులన్ని మూసివేశారు. ఖైరతాబాద్, ట్యాంక్బండ్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను పోలీసులు మూసివేశారు. హైకోర్టు ఏడాది క్రితమే సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వం భూమిపూజ చేసింది. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం.. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. (సచివాలయంపై తొందరెందుకు?: హైకోర్టు) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పాలనా కేంద్రమైంది. మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయాన్ని నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సచివాలయాన్ని 10 బ్లాకులుగా నిర్మించారు. అతిపురాతనమైన జీ బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మించింది. 2003లో డీ బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్లను ప్రభుత్వం ప్రారంభిచింది. పాత సచివాలయాన్ని కూల్చివేసి అన్నీ హంగులతో నూతన సచివాలయం నిర్మాణంకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొత్తం 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనుంది. 6 లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయాన్ని నిర్మించి... సీఎం, అధికారులు, మంత్రుల సమావేశం కోసం అధునాతన హిల్స్ నిర్మించనుంది. మంత్రుల పేచీలోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలతో నూతన సచివాలయం కట్టడానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. నూతన సచివాలయం నమూనా వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ జామ్ సచివాలయంలో కూల్చివేత లు నేపథ్యంలో ట్రాఫిక్ దారి మళ్లించారు. సచివాలయం నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందిరా పార్క్ నుంచి వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్, బషీర్బాగ్ పైపు మళ్లిస్తున్నారు. ఐ మాక్స్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, బషీర్బాగ్లోనూ వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఈ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ట్రాఫిక్ స్తంభించింది. -
తెలంగాణ సచివాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత
-
సచివాలయంపై తొందరెందుకు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా నూతన సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గం పూర్తి తుది నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు ఎందుకు సచివాలయం భవనాలు కూల్చివేత చేపట్టారని సూటిగా ప్రశ్నించింది. గత విచారణలో కూల్చివేతపై ప్రభుత్వాన్ని హైకోర్టు సమగ్ర నివేదిక కోరింది. అయితే నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. మరి డిజైన్లు, ప్లాన్ పూర్తి కానప్పుడు కూల్చివేతకు ప్రభుత్వానికి ఎందుకు తొందర అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉన్నా ఇంకా డిజైన్, ప్లాన్ ఇంకా సిద్ధం కాలేదని చెప్పడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న కేబినెట్ మరి.. డిజైన్ ప్లాన్ కోసం నిర్ణయం ఎందుకు తీసుకోలేదని, నూతన సచివాలయం మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునేవరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా సచివాలయంలోని అధిక శాతం కార్యాలయాలను సమీపంలోని బీఆర్కేఆర్ భవనానికి, ఇతర కార్యాలయాలను సంబంధిత శాఖల హెచ్ఓడీల భవనాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలతో దాదాపు 90 కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. -
సచివాలయాన్ని కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయాన్ని కూల్చొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నందున కూల్చివేయరాదని, ఈ విషయాన్ని ప్రభుత్వా నికి తెలియజేయాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్కు ధర్మాసనం సూచిం చింది. కోర్టులో విచారణలో ఉండగా ప్రభుత్వం కూల్చివేత చర్యలు తీసు కుంటే అది న్యాయ ప్రక్రియలో జోక్యమే అవుతుందని వ్యాఖ్యానిం చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. సచివాలయ భవనాలను కూల్చేయాలనే నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, సామాజిక కార్యకర్త ఒ.ఎం. దేబ్ర, ఎంపీ రేవంత్రెడ్డి ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచా రించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. కేబినెట్ భేటీలో సచి వాలయ భవనాల కూల్చివేత అంశంపై నిర్ణ యం తీసుకోనుందని, దసరా సెలవుల నేపథ్యంలో కూల్చివేత ప్రారంభించే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల దృష్ట్యా పిల్స్ను విచా రించాలన్నారు. అయితే భోజన విరామ సమ యం తర్వాత విచారిస్తామని ధర్మాసనం తెలి పింది. కానీ మున్సిపల్ ఎన్నికల పిల్స్పై మధ్యాహ్నమంతా వాదనలు జరగడం, కోర్టు సమయం ముగియడంతో సచివాలయ భవ నాలపై పిల్స్ను దసరా సెలవుల తర్వాత విచా రిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 14న పిల్స్పై విచారణ జరుపుతామని, ఈలోగా భవన సముదాయాన్ని కూల్చివేయరాదని ఆదే శించింది. అంతకుముందు అడ్వొ కేట్ జనరల్ వాదిస్తూ.. సచివాలయంలో అన్ని కార్యాల యాలను ఇతర భవనాల్లోకి మార్పు చేశామని తెలిపారు. దీనిపై ధర్మాస నం స్పందిస్తూ ఆ కార్యాలయాలను అక్కడే కొనసాగించవచ్చునని, తిరిగి సచివాలయంలోకి మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. సంప్రదాయ విధానం ద్వారానే.. సచివాలయ భవనాల కూల్చివేతను సంప్రదాయ విధానంలో మనుషులను వినియోగించి పూర్తిచేయడమే ఉత్తమమని అధికారులు తాజాగా భావిస్తున్నట్లు సమాచారం. సంప్రదాయ పద్ధతిలో అన్ని భవనాలను కూల్చి నేలను చదును చేసేందుకు నెల రోజుల సమయం పడుతుందని, పైగా పాత భవనాల స్టీల్, ఇతర వస్తువులను పునర్వినియోగానికి వాడొచ్చని అధికారులు అంటున్నారు. తొలుత ఇంప్లోజివ్ విధానంలో కూలుద్దామని భావించినా భవనాలను ఇప్పటివరకు అలా విజయవంతంగా కూల్చిన దాఖలాలు లేవని, దాని ఫలితాలపై అంచనా కూడా లేదని చెబుతున్నారు. ఆ విధానాన్ని అనుసరిస్తే ఖర్చు కూడా చాలా ఎక్కువగా అవుతుందని, దాని నిపుణులు స్థానికంగా లేనందున వారిని ఇతర ప్రాంతాల నుంచి రప్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల సంప్రదాయ కూల్చివేత విధానమే ఉత్తమమనేది అధికారుల మాట. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. -
తెలంగాణ సచివాలయానికి తాళం!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాన్ని పునర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే 90 శాతానికి పైగా ప్రభుత్వ శాఖలు తమ ఫైళ్లను తరలించడంతో చాలా బ్లాకులు ఖాళీ అయ్యాయి. సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది శుక్రవారం బృందాలుగా ఏర్పడి పాత సచివాలయంలోని బ్లాకులను పరిశీలించారు. ఆదివారం ఉదయం నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి తాళం వేసేందుకు జీఏడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో తాళం చెవులు ఉంటాయని, అవసరమైన శాఖలు అక్కడి నుంచే తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. -
‘9 కల్లా సచివాలయం ఖాళీ కావాల్సిందే’
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 9 నాటికి ప్రస్తుత సచివాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఇంకా ఖాళీ చేయని శాఖల కార్యాలయాలను సోమవారంలోగా వాటికి కేటాయించిన భవనాలకు తరలించాలని స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత సచివాలయ భవనాలకు విద్యుత్, నీటి సరఫరా వంటి సదుపాయాలను నిలిపి వేస్తామని హెచ్చరించింది. సచివాలయంలోని అధిక శాతం కార్యాలయాలను సమీపంలోని బీఆర్కేఆర్ భవనానికి, ఇతర కార్యాలయాలను సంబంధిత శాఖల హెచ్ఓడీల భవనాలకు తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా, దాదాపు 90 కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముగిసింది. మిగిలిన కార్యాలయాలను ఒకట్రెండు రోజుల్లో తరలించనున్నారు. ఆ తర్వాత సచివాలయంలోని భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణ పనులకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. -
ఆలో‘చించే’ పడేశారా?
సాక్షి, హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు విలువైన కాగితాలేనని భద్రంగా దాచిపెట్టుకున్న కాగితాలను ఇప్పుడు ముక్కలుముక్కలుగా చించేసి పడేశారు. ఇది కూల్చివేతకు సిద్ధ మవుతున్న రాష్ట్ర సచివాలయ భవనాల్లోని దృశ్యం. సామాన్య ప్రజలతో పాటు వివిధ వర్గాల నుంచి వందలు, వేల సంఖ్యలో వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టిన సచివాలయ అధికారులు.. చివరకు సచివాలయ కార్యాలయాల తరలింపును సాకుగా చూపుతూ ఇలా వదిలించుకుని చేతులు దులుపుకుంటున్నారనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలతో పాటు పాత జీవోల కాపీలు, సర్క్యులర్లు, ప్రభుత్వ శాఖల మధ్య అంతర్గత వ్యవహారాలకు సంబంధిం చిన పాత లేఖలు, ప్రభుత్వ సమావేశాలకు సంబంధించిన కాగితాలను ముక్కలు ముక్కలుగా చించి చిందరవందరగా పడేస్తు న్నారు. పాత సచివాలయ భవనమంతా కుప్పలుతెప్పలుగా పడేసిన కాగితాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ రోజైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్జీలు పెట్టుకున్న వ్యక్తులు ఓ వైపు నిరీక్షిస్తుంటే.. వారికి తెలియకుండానే వీటన్నింటినీ బుట్టదాఖలు చేసేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చించిపడేసిన కాగితాల్లో వివిధ సమస్యలపై సామాన్య ప్రజల నుంచి వచ్చిన అర్జీలే ఎక్కువగా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. రోజూ సచివాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు పెట్టుకుంటూ ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతస్థాయి వ్యక్తుల సిఫారసులు ఉన్న కొన్నింటికి మాత్రమే పరిష్కార యోగం లభిస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాదాసీదా వ్యక్తుల అర్జీలు ఏళ్ల తరబడి సంబంధిత సెక్షన్ల అధికారుల వద్దే పెండింగ్లో ఉంటాయని, ఇలా నిర్లక్ష్యానికి గురైన ఫైళ్లను అవసరమైనప్పుడు వెతికినా దొరకని విధంగా వాటిని ఎక్కడో పడేస్తారని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇలా అదృశ్యమైన తమ ఫైళ్లను వెతుక్కుంటూ వచ్చే వారు ఎందరో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం సచివాలయం ఖాళీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైళ్లు, అర్జీలు బయటపడితే వాటిని అక్కడికక్కడే చించిపారేస్తున్నారన్నారు. ఇలా మొత్తం సచివాలయం ఖాళీ చేసేసరికి టన్నుల కొద్దీ కాగితాలు, పాత ఫైళ్లు బుట్టదాఖలు కావడం ఖాయమని సచివాలయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్కే భవన్కు ఫైళ్లు ప్రస్తుత సచివాలయంలోని భవనాలన్నింటినీ కూల్చివేసి అక్కడే ఆధునిక సదుపాయాలతో కొత్త సచివాలయ భవన సముదాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేసే క్రమంలో.. ఇక్కడి కార్యాలయాలను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్కు తరలిస్తోంది. గత సోమవారం ప్రారంభమైన సచివాలయం శాఖల కార్యాలయాల తరలింపు వేగవంతమైంది. సాధారణ పరిపాలన శాఖ సూచనల మేరకు ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రికి సంబంధించిన జాబితాలను అన్ని శాఖలు తయారు చేసుకున్నారు. తరలింపు సమయంలో ఫైళ్లు, ఇతర సామగ్రి గల్లంతు కాకుండా ఈ జాబితాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన అర్జీల ఫైళ్లను ‘ప్రాధాన్యత లేనివి’గా పరిగణించి వాటిని తాత్కాలిక సచివాలయానికి తరలించకుండా ఇక్కడే వదిలించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సచివాలయం డీ–బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లోని సంక్షేమ శాఖలు, కమర్షియల్ ట్యాక్సుల శాఖలు, పై అంతస్తుల్లోని రెవెన్యూ, సీ–బ్లాక్ తొలి అంతస్తులో జీఏడీ కార్యాలయాల వద్ద ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చించిపడేసిన కాగితాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ శాఖలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల లబ్ధిదారుల నుంచి వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పెట్టి ఇప్పుడు బుట్టదాఖలు చేశారనే విమర్శలొస్తున్నాయి. తక్షణమే సచివాలయ తరలింపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించడం కూడా ప్రాధాన్యత లేని ఫైళ్లు, కాగితాలపై ఆలోచించకుండానే పడేస్తున్నారన్న చర్చమొదలైంది. -
లోన్ సురక్ష విస్తరణ సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : లోన్ సురక్ష విస్తరణ కార్యక్రమం సేవలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రుణాలు పొందిన మహిళలు దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా సొమ్ము నుంచే చెల్లించేందుకు లోన్ సురక్ష ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో పాటు అత్యవసర సహాయం కింద మరణించిన మహిళ కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా స్త్రీ నిధి కరదీపిక, స్నేహ అవగాహన బ్రోచర్లతో పాటు ఉపాధిహామీ వార్షిక నివేదికను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. -
సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ పాత భవనాలను కంట్రోల్ బ్లాస్టింగ్ పద్ధతిలో పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త భవన సముదాయానికి డిజైన్లు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో వాటిని ఖరారు చేసి నిర్మాణానికి వీలుగా టెండర్లు ఖరారు చేయబోతున్నారు. శ్రావణ మాసంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో కొత్త భవనాల సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పాత భవనాలను కూల్చివేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను కూడా శ్రావణ మాసంలోనే మొదలుపెట్టాలని భావిస్తున్నారు. 15 రోజుల్లో కార్యాలయాల తరలింపు... ప్రస్తుతం సచివాలయంలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలున్నాయి. ఒక్కో భవనం ఒక్కో బ్లాకుగా మొత్తం పది భవనాలున్నాయి. ఇందులో జీ బ్లాకుగా ఉన్న నిజాం హయాంలో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ అన్నింటికంటే పురాతనమైంది కాగా, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాలున్న డి బ్లాక్ భవనం కొత్తది. మిగతావి ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి తదితరులు ముఖ్యమంత్రులుగా ఉండగా నిర్మించినవి. ఇప్పుడు ఈ భవనాలన్నింటినీ కూల్చివేయనున్నారు. తొలుత ఎ, బి, సి, డి బ్లాకుల్లోని కార్యాలయాలను హెచ్, జే, కే బ్లాకుల్లోకి తరలించి వాటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. కానీ అదే ప్రాంగణంలో కార్యాలయాలుంటే, కూల్చివేతల సమయంలో దుమ్ము ధూళితో ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించారు. దీంతో వేరే చోటకు కార్యాలయాలను తరలించి మొత్తం భవనాలన్నింటినీ ఒకేసారి కూల్చి కొత్త భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా బీఆర్కే భవన్ను ఎంపిక చేసి అందులోని కార్యాలయాలను ఖాళీ చేయించారు. వచ్చే పక్షం రోజుల్లో సచివాలయ కార్యాలయాలు అందులోకి తరలిపోనున్నాయి. పాత విధానంలో దుమ్ము ధూళి సమస్య... సచివాలయం మొత్తం ఖాళీ కాగానే ఆ భవనాల కూల్చివేతలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. పది బ్లాకులుగా పెద్దపెద్ద భవనాలున్నందున వాటిని సంప్రదాయ పద్ధతిలో కూల్చివేయటానికి చాలా సమయం పడుతుండటమే కాకుండా, పనులు జరుగుతున్నన్ని రోజులు దుమ్ము ధూళి సమీప ప్రాంతాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున ఆధునిక పద్ధతిలో కూల్చివేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పేలుడు పదార్థాలు అమర్చి ఒకేసారి భవనం మొత్తాన్ని నేలకూల్చే బ్లాస్టింగ్ను ఎంచుకోనున్నట్టు సమాచారం. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే అన్ని బ్లాకులను కూల్చివేసి శిథిలాలను తరలించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణులను పిలిపించి చర్చించనున్నారు. ఈ విధానం హైదరాబాద్లో పెద్దగా చేపట్టిన దాఖలాలు లేవు. గతంలో మూడునాలుగు పర్యాయాలు కొన్ని భవనాలను కూల్చారు. అయితే, వాటిలో కొన్ని పూర్తిగా విజయవంతం కాలేదు. దీంతో ఈ విధానంలో నైపుణ్యం ఉన్నవారికే ఈ బాధ్యత అప్పగించాలని యోచిస్తున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పురాతన ఎర్రమంజిల్ భవన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేత పిటిషన్పై విచారణ సందర్భంగా .. ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా?. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారా?, అనుమతి ఉందా లేదా అన్న విషయం చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకంటూ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై రేపటిలోగా వివరాలు ఇవ్వాలంటూ తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. కాగా ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎర్రమంజిల్ భవనాల్ని 1870లో నవాబ్ సఫ్దర్జంగ్ ముషీర్దౌలా ఫక్రుల్ ముల్క్ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివిల్ వివాదం ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదంటూ నవాబు వారసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
సచివాలయ భవనాల పరిశీలన
సాక్షి, హైదరాబాద్ : సచివాలయంలోని ప్రస్తుత భవనాల వాస్తవ పరిస్థితి, వాటి పటుత్వాన్ని తెలుసుకునేందుకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ సచివాలయం కొనసాగుతున్న ఏ, బీ, సీ, డీ బ్లాక్లు, ఇటీవలి వరకు ఏపీ అధీనంలో ఉన్న హెచ్, జే, కే, ఎల్ బ్లాకులతో పాటు శిథిలావస్థకు చేరిన జీ బ్లాక్ భవనాలను పరిశీలించారు. సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం ఆదేశంతో, అధికారుల కమిటీ సభ్యులు గణపతిరెడ్డి, మురళీధర్రావు, రవీందర్రావు, సత్యనారాయణరెడ్డిలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జీ బ్లాక్ మినహా మిగతా భవనాలను పరిశీలించారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు ఆధ్వర్యంలో భవనాల పటుత్వాన్ని పరిశీలించారు. ప్రస్తుతం కార్యకలాపాలు సాగుతున్న ఏ, బీ, సీ, డీ బ్లాకులన్నీ బాగున్నా.. ఏపీ ప్రభుత్వం అధీనంలో ఇటీవలి వరకు ఉన్న హెచ్, జే, కే, ఎల్ బ్లాకు భవనాలు చాలాకాలంగా వినియోగంలో లేవు. ఇటీవల వాటిని తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ భవనాల్లోని కార్యాలయాలను అమరావతికి తరలించే సమయంలో కొన్ని కార్యాలయాల్లో ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు కూడా తీసుకుపోయారు. దీంతో కొన్ని గోడలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి మినహా మిగతా భవనాలన్నీ పటుత్వంగానే ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుత సచివాలయ భవనాలను ఏం చేయాలనే విషయంలో స్పష్టత కోసం మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు త్వరలో భవనాల పటుత్వంపై నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే వాటిని కూల్చొద్దంటూ హైకోర్టును పలువురు ఆశ్రయించిన నేపథ్యంలో.. కోర్టుకు తెలిపేందుకు కూడా ప్రభుత్వానికి నివేదిక అవసరం. -
రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు బంధు పథకం పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు. రైతులు చెల్లించాల్సిన ఏడు శాతం వడ్డిలో ప్రభుత్వం నాలుగు శాతం చెల్లిస్తే మిగతా మూడు శాతం రైతులు చెల్లించి వడ్డీ లేకుండా లక్ష రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గత రుణం చెల్లిస్తినే కొత్త రుణం ఇస్తామని బ్యాంకులు చెప్పటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనికి చర్యగా ప్రభుత్వం బ్యాంకులు వెంటనే కొత్త రుణాలను జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బ్యాంకర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా నాలుగు శాతం కేంద్రం నాబార్డ్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. -
టీ సర్కారుకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్ : ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత- అసెంబ్లీ నూతన భవన నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు ఎర్ర మంజిల్ భవనాలను కూల్చవద్దని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని ఇందుకు సంబంధించిన పిటిషన్ను విచారిస్తున్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పిటిషన్ విచారణ సందర్భంగా తొలుత కౌంటర్కు గడువు కోరిన ప్రభుత్వ లాయర్.. తర్వాత ఈరోజు మధ్యాహ్నమే తమ వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా ప్యాలెస్ అనుమతి లేకుండా ఎర్రమంజిల్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ నవాబు వారసులు హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఎర్రమంజిల్లో ఉన్న 12 ఎకరాల భూమికి పరిహారం చెల్లించాలని కోరారు. 1951 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో... తుదితీర్పు వెలువడకముందే అసెంబ్లీ భవనాన్ని ఎలా నిర్మిస్తారని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సామాజిక వేత్త పాడి మల్లయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇక చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. -
సచివాలయంలో అన్ని బ్లాక్లు చాలా బాగున్నాయి
-
తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు
-
తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సచివాలయంలో పర్యటిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు సోమవారం ఉదయం సచివాలయంలోని అన్ని బ్లాకులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా సచివాలయం నిర్మాణాలు , నూతన నిర్మాణ భూమి పూజ ప్రాంగణాన్ని నేతలు పరిశీలించారు. కాగా అంతకు ముందు పోలీసులు... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాహనాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను ఎందుకు అడ్డగిస్తున్నారంటూ భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు వాహనాన్ని కూడా పోలీసులు మధ్యలోనే ఆపేశారు. అనంతరం వారిని లోనికి అనుమతించారు. కాగా నాగార్జునసాగర్లో శనివారం జరిగిన టీపీసీసీ సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి సచివాలయ సందర్శన ప్రతిపాదన చేశారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్న రేవంత్ ప్రతిపాదనకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు ఇతర నేతలు కూడా ఏకీభవించడంతో సోమవారమే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
-
కొత్త సచివాలయానికి శంకుస్థాపన
-
భూమిపూజ నిర్వహించిన సీఎం కేసీఆర్
-
సచివాలయం కూల్చివేతను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేత నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరుతూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందు లో సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవ నాల శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ప్రస్తుత సచివాలయ భవనానికి 50 నుంచి 70 ఏళ్ల పాటు మన్నిక సామర్థ్యం ఉందని, అయినా ప్రభుత్వం దీనిని కూల్చివేయాలని నిర్ణయించడం ప్రజాధనాన్ని, వనరులను వృథా చేయడమేనని రేవంత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2016లోనే సచివాలయాన్ని కూల్చివేసేందుకు ప్రభు త్వం ప్రయత్నించగా దీనిపై పిల్ దాఖలు చేసినప్పుడు, దాన్ని కూల్చివేయబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే ప్రజల ఆస్తులకు ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమేనని, ఈ ఆస్తులను ఎలా పడితే అలా దుర్వినియోగం చేయడానికి వీల్లేదని రేవంత్రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుత భవనాన్ని కూల్చివేయకుండా దానిని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని, సచివాలయం కోసం మరోచోట భవనాన్ని నిర్మించుకుంటే ఏ ఒక్కరికీ ఇబ్బంది ఉండదన్నారు. -
కొత్త సచివాలయానికి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేశారు. సచివాలయం డీ–బ్లాక్ వెనుక భాగం లోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి పూజ నిర్వహించారు. శృంగేరీ పీఠం వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు శుభసూచకంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్ కుడి చేతికి ఇమామ్ జామిన్ కట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎ.ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప ల ఈశ్వర్, జగదీశ్వర్రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు. మాజీ మంత్రి హరీశ్రావు, సీఎస్ ఎస్.కె. జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.పద్మాచారి, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు. పనులు ఇప్పుడే ప్రారంభం కావు.. కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన నిర్వహించినా పనులు ప్రారంభం కావడానికి కనీసం 3–4 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. జూన్ ముగిసిన తర్వాత మరో నెలన్నరపాటు మంచి ముహూర్తాలు లేకపోవడంతో సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ప్రస్తుత సచివాలయ భవనాల్లో వాస్తుదోషాలున్నాయని, సరైన సదుపాయాలు లేవన్న కారణంతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలోని ప్రస్తుత భవనాలన్నింటినీ కూల్చేసి ఒకే బ్లాక్గా కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయిం చింది. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం త్వరలో సమావేశమై సచివాలయం, ఎర్రమంజిల్లో ఏయే భవనాలను కూల్చాలి? ఏయే భవనాలను మనుగడలోకి ఉంచాలన్న అంశాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ నివేదిక అందిన తర్వాత భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత సచివాలయం 10 బ్లాకులుగా 25.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. సచివాలయం చుట్టూ ఉన్న విద్యుత్శాఖ కార్యాలయాల భవనాలు, ఉద్యోగ సంఘాల భవనాలను స్వాధీనం చేసుకొని అందులో కలిపేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత భవనాలన్నీ కూల్చేసి నేలను సమాంతరంగా చదును చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. 4 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. సచివాలయానికి నలువైపులా రోడ్లు, సచివాలయం సముదాయం ఎదురుగా గార్డె న్లు, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్ట్ల నుంచి ప్రభుత్వం డిజైన్లను సేకరిస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో రూ. 400 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తా మని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేయనున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న అన్ని శాఖల కార్యాలయాలను ఆయా శాఖల పరిధిలోని హెచ్ఓడీ కార్యాలయాలకు తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బావా.. మన చాంబర్లను చూసుకొద్దామా? కొత్త సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్, హరీశ్రావు సరదాగా ఒకరినొకరు ముచ్చటించుకున్నారు. ‘‘బావా.. ఒక సారి మన చాంబర్లకు పోయి చూసుకొద్దామా?’’అని హరీశ్రావుతో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కేటీఆర్, హరీశ్రావులకు అప్పట్లో సచివాలయంలో ప్రత్యేక చాంబర్లు ఉండేవి. ప్రస్తుతం వాటిని ఖాళీగా ఉంచారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్తో సచివాలయ ఉద్యోగులు అరగంటపాటు సెల్ఫీలు దిగారు. -
నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్ : నూతన సచివాలయ భవన నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయంలోని డీ–బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీఛైర్మన్లు హాజరయ్యారు. రూ. 400 కోట్లతో నూతన సచివాలయ భవన నిర్మాణం జరగనుంది. అనంతరం ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్అండ్బీ కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 100కోట్లతో తెలంగాణ అసెంబ్లీ భవన నిర్మాణం జరగనుంది. చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. -
నేడు సచివాలయం, ‘అసెంబ్లీ’కి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డీ–బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 12 గం.కు ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్అండ్బీ కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీస్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తారు. చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లను ఆహ్వానించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ వీరికి విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్ గౌడ్తో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై చర్చించనుందని అధికారవర్గాలు తెలిపాయి. -
సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేృత్వత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ మంత్రివర్గ ఉపసంఘానికి సహాయ, సహకారాలు అందించనున్నారు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, సచివాలయంలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల తరలింపు, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం, ఈ భవనాలకు సంబంధించిన డిజైన్ల ఖరారు తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరింది. శంకుస్థాపనలకు ఏర్పాట్లు... కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. సచివాలయంలోని డీ–బ్లాక్ భవనం వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో కొత్త సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్ అండ్ బీ కార్యాలయ భవన సముదాయం మధ్యలోని ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లలో భాగంగా ఈ రెండు చోట్లా శిలాఫలకాలను సిద్ధం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయం, ఎర్రమంజిల్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రసుత్తం ఉన్న భవనాన్ని కూల్చేది లేదంటూ 2016లో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ వేసిందని.. ఇప్పుడు పాత భవనాన్ని కూల్చి వేసి మళ్ళీ నూతన సచివాలయం నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి, భారీ భవనాలు నిర్మించేందుకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించగా పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో సచివాలయంను తరలించమని కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. మరోసారి నూతన భవనం తెరపైకి రావడంతో.. ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా పిటిషన్పై స్పందించిన ధర్మాసనం శుక్రవారం పూర్తి వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది. ప్రస్తుత సచివాలయం మొత్తం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకొని కూల్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం వెలుపల ఉన్న ఈ భవనాల స్థలాలను కలిపేసుకోవడం ద్వారా వాస్తుదోషాల్లేకుండా కొత్త సచివాలయ నిర్మిత స్థలాన్ని చతురస్రాకార రూపంలో అభివృద్ధిపరచాలని యోచిస్తోంది. -
భవనాల కూల్చివేతకే మొగ్గు..!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ ప్రాంగణం లోని భవనాల కూల్చివేతకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. సచివాలయంలోని కట్టడాలన్నింటినీ కూల్చేసి నేలను సమాంతరంగా చదును చేశాకే కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుత సచివాలయం మొత్తం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకొని కూల్చేయాలని భావిస్తోంది. సచివాలయం వెలుపల ఉన్న ఈ భవనాల స్థలాలను కలిపేసుకోవడం ద్వారా వాస్తుదోషాల్లేకుండా కొత్త సచివాలయ నిర్మిత స్థలాన్ని చతురస్రాకార రూపంలో అభివృద్ధిపరచాలని యోచిస్తోంది. ప్రస్తుత సచివాలయం 10 బ్లాకులుగా విస్తరించి ఉండగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ఒకే సమీకృత భవనంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే ప్రకటించారు. హుస్సేన్ సాగర్కు అభిముఖంగా (లేక్వ్యూ) దాదాపు 4 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త భవన సముదాయం ఎదురుగా ఖాళీగా ఉండే సువిశాల స్థలంలో వనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దనుంది. కొత్త సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ భవనాల కూల్చివేతపై తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. కూల్చివేతలకు మార్గం సుగమం... ప్రస్తుత సచివాలయంలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సర్వహిత బ్లాక్ (జీ–బ్లాక్) శిథిలావస్థకు చేరడంతో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంచారు. సైఫాబాద్ ప్యాలెస్గా ఖ్యాతి గడించిన ఈ భవనాన్ని 1888లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ నిర్మించారు. ఈ భవనానికి ఉన్న వారసత్వ సంపద హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చట్ట సవరణ జరపడంతో దీని కూల్చివేతకు మార్గం సుగమమైంది. ఇక సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులు 35,818 చదరపు మీటర్ల స్థలంలో విస్తరించి ఉండగా జే, కే, ఎల్, హెచ్ నార్త్, సౌత్ బ్లాక్లు 49,342 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్నాయి. వీవీఐపీలకు రక్షణ, ఇతర భద్రతా ప్రమాణాల రీత్యా ఈ భవనాలు సురక్షితం కాదని రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించినట్లు తెలిసింది. దీంతో ఈ బ్లాకులను సైతం కూల్చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. కొత్త సచివాలయానికి నలువైపులా రోడ్లు... కొత్త సచివాలయాన్ని 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సచివాలయం చుట్టూ ఉన్న కొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. సీ–బ్లాక్ వెనుక భాగంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మింట్ కాంపౌండ్, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ మినహా మిగిలిన భవనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటితోపాటు ఎన్టీఆర్ గార్డెన్స్కు ఆనుకొని ఉన్న దారిలోని తెలంగాణ గేట్ పక్కనున్న విద్యుత్ సంస్థల భవనాలు, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, ఇతర భవనాలను కొత్త సచివాలయ ప్రాంగణంలో కలిపేసుకోనున్నారు. కొత్త సచివాలయ నిర్మిత ప్రాంతానికి చతురస్రాకార రూపు కల్పించడం ద్వారా వాస్తుదోషాలను నివారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సచివాలయం చుట్టూ నలువైపులా రోడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఏకకాలంలో రెండింటి నిర్మాణాలు... కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏకకాలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చేసి కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనుంది. మూడేళ్ల కింద అదే ప్రాంతంలో నిర్మించిన రోడ్లు, భవనాలశాఖ భవనాన్ని కొత్తగా నిర్మించనున్న శాసనసభ కార్యాలయంగా వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎర్రమంజిల్లోని జలసౌధ భవనాన్ని కూల్చాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం ఏయే భవనాలను స్వాధీనం చేసుకోవాలి? ఏయే భవనాలను కూల్చేయాలి? ఏయే భవనాలను మనుగడలో ఉంచాలన్న అంశాలపై అధ్యయనం జరపడానికి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వశాఖల తరలింపుపై కసరత్తు ముమ్మరం... ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఇక్కడున్న వివిధ శాఖల కార్యాలయాలను వేరే ప్రాంతాల్లోని భవనాలకు తరలించడంపై కసరత్తు ముమ్మరం చేసింది. సచివాలయంలో వివిధ శాఖలు వినియోగిస్తున్న స్థలం, ఆయా శాఖల తరలింపునకు సంబంధించిన కార్యాచరణ, సచివాలయం వెలుపలి ప్రాంతాల్లో ఉన్న ఆయా శాఖల హెచ్ఓడీ కార్యాలయాల భవనాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల సమాచారాన్ని సాధారణ పరిపాలనశాఖ సేకరించింది. సచివాలయానికి దగ్గరలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన కార్యాలయం, ఆర్థికశాఖ కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయానికి వచ్చింది. మిగిలిన శాఖలను ఆయా శాఖల హెచ్ఓడీ కార్యాలయాలకు తరలించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
విభజన సమస్యలపై మళ్లీ భేటీ !
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు, వివాదాల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కమిటీ సోమవారం తెలంగాణ సచివాలయంలో మళ్లీ సమావేశమై చర్చలు జరపనుంది. ఈ సమావేశ ఎజెండా ప్రకారం... ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాల ఆస్తుల వివాదాలపై అనుసరించాల్సిన విధానంపై తెలంగాణ చర్చించనుంది. ప్రధాన కార్యాలయం నిర్వచనంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం, సంస్థల పేరు మీద లేని భూములు, ఆస్తుల విలువ నిర్ధారణ విధానం, సొంత రాష్ట్రంలో పనిచేయని చివరి శ్రేణి ఉద్యోగులు, వేర్వేరు సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు, అధ్యాపకుల పరస్పర బదిలీల్లో అనుసరించాల్సిన విధానం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ వద్ద ఉన్న నిధుల పంపకాలు, సచివాలయానికి విద్యుత్, నీటిచార్జీల బకాయిల చెల్లింపు, ఏపీపీఎస్సీ ఉద్యోగుల విభజన, టీఎస్పీఎస్సీకి అదనపు స్థలం కేటాయింపు, విభజన తర్వాత కేంద్రం ఏపీకి విడుదల చేసిన రూ.1,621 కోట్ల నిధుల్లో తెలంగాణ వాటా చెల్లింపు, ఈఏపీ రుణాల తిరిగి చెల్లింపుకోసం కేంద్రం ఏపీకి విడుదల చేసిన రూ.478.68 కోట్లలో రూ.108.67 కోట్ల తెలంగాణ వాటా చెల్లింపు, బాలామృతం పథకానికి ఏపీ నుంచి రావాల్సిన రూ.98.02 కోట్ల బకాయిలు, మే 2014కు సంబంధించి మద్యంపై వసూలైన పన్నులో తెలంగాణ వాటా రూ.135.98 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.141.68 కోట్ల ఏపీపీఎఫ్సీ బాండ్ల నిధుల బకాయిల చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఏపీ ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రధానంగా ఏపీ భవన్ ఆస్తుల బట్వాడా, ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలపై చర్చించనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో స్థిరాస్తులు లేని నగదు, చరాస్తులు మాత్రమే కలిగి ఉన్న 10వ షెడ్యూల్లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్లోని 40 సంస్థలు, పలు వివాదాలు తదితర అంశాలు ఉన్నాయి. -
సచివాలయం వద్ద ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు బైక్తో సహా మ్యాన్హోల్లో పడిపోయాడు. గమనించిన స్ధానికలు వెంటనే అప్రమత్తమై అతనిని రక్షించారు. సచివాలయం వద్ద రోడ్డు మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వారు. ఇది గమనించని వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్ హోల్లో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సదరు వ్యక్తికి స్వల్పగాయలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అధికారుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. రోడ్లపై గుంతలు తవ్వి రక్షణ లేకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. -
సచివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు
► నేడు విజేతలకు బహుమతుల అందజేత సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం, ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని తెలంగాణ సచివాలయ టీఎన్జీవోల యూనియన్ ఆధ్వర్యలో గురువారం సచివాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో బంగారు తెలంగాణలో ఉద్యోగుల ప్రాతపై ప్రసంగం, పరిపాలన సంస్కరణలపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 11న (శుక్రవారం) బహుమతులు అందజేస్తామని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారం రవీందర్, మామిళ్ల రాజేందర్ తెలిపారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో మంత్రులు నాయిని, ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరవుతారని తెలిపారు. -
సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవన్న (37)కు ప్రభుత్వం చెరువు పక్కన గతంలో మూడెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద మామిడి, జామ చెట్లు పెంచుకుంటున్నాడు. చెరువు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవన్న కొంత భూమిని కోల్పోయాడు. భూమికి బదులు భూమి ఇప్పించాలంటూ కొన్నాళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలసి సచివాలయం వద్దకు వచ్చాడు. మంత్రి హరీశ్రావును కలవాలని భావించాడు. మూడేళ్ళుగా అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సూసైడ్ నోట్ రాశారు.‘నా చావుకు కారణం ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివ లింగయ్య’అని అందులో పేర్కొన్నారు. తనకు తిండి, నీరు, ఉపాధి లేకుండా చేసి వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. దళితులకు న్యాయం చేయాలని సీఎంను వేడుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కూడా లేఖ రాశాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నానని పార్టీ కోసం పని చేసిన పుణ్యానికి నా తండ్రిని, కొడుకుని పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భార్య బిడ్డలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ను కోరారు. టాయిలెట్ క్లీనర్ తాగిన దేవయ్యను పోలీసులు మాక్స్క్యూర్ ఆస్పత్రికి తరలించారు. దేవయ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింత
► రాష్ట్ర ప్రభుత్వ వినతికి రక్షణ శాఖ అంగీకారం! ► కొత్త సచివాలయ నిర్మాణానికి కోరిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ నూతన సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు స్థలాల అప్పగింతకు రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. బైసన్ గ్రౌండ్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్రావు కూడా ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయంగా సైనికావసరాలకు కావాల్సినంత భూమిని నగర శివార్లలో కేటాయిస్తామంటూ ప్రతిపాదనలు సమర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ పరిసరాల్లో దాదాపు 170 ఎకరాల విస్తీర్ణంలో రక్షణ శాఖ భూములున్నాయి. సచివాలయ నిర్మాణానికి వాటిలో దాదాపు 60 ఎకరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రక్షణ శాఖకు లేఖలు రాసింది. దీనిపై సీఎంతో పాటు ఉన్నతాధికారులు రక్షణ మంత్రిని, సంబంధిత అధికారులను పలుమార్లు కలిశారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత స్థలాన్ని కేటాయించేందుకు రక్షణ శాఖ గురువారం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ మేరకు తమకు అధికారిక సమాచారం రాలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి, ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ దాకా తలపెట్టిన ఎలివేటేడ్ కారిడార్లకు అవసరమైన స్థలాలను కేటాయించేందుకు రక్షణ శాఖ ఇప్పటికే అంగీకరించడం తెలిసిందే. పారడైజ్ నుంచి బోయిన్పల్లి సమీపంలోని సుచిత్ర జంక్షన్ దాకా రోడ్డు నిర్మాణానికి 5.5 కి.మీ., పారడైజ్ నుండి షామీర్పేట్ దాకా 18.3 కి.మీ. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి 99 ఎకరాలను అప్పగించనుంది. ప్రత్యామ్నాయంగా వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో ఫైరింగ్ రేంజ్కు 100 ఎకరాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వెలిబుచ్చింది. రక్షణ శాఖ అధికారులు ఆ భూములను పరిశీలించి శాఖకు నివేదిక సమర్పించారు కూడా. -
సెక్రటేరియట్ ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదుపులోకి తీసుకున్న విద్యార్థి నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. -
సచివాలయం ముందు విద్యార్ధుల ఆందోళన
-
ప్రస్తుతానికి కూల్చివేత ఆపండి: హైకోర్టు
-
ప్రస్తుతానికి కూల్చివేత ఆపండి: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ తదుపరి విచారణను ఉమ్మడి హైకోర్టు 10రోజులకు వాయిదా వేసింది. దీనిపై 10 రోజుల గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ పిటిషన్ విచారించిన హైకోర్టు కేసు తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేస్తూ.. అప్పటివరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టేంతవరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయం నిర్మించేవరకూ ఏపీ భవనాలను తాత్కాలిక సచివాలయంగా వినియోగించుకోవాలని టీసర్కార్ యోచిస్తోంది. -
పాతబడిందని చార్మినార్ను కూల్చేస్తారా?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయడం లేదని ఆయన గురువారమిక్కడ అన్నారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతోనే విద్యార్ధి పోరు గర్జనను నిర్వహించాల్సి వచ్చిందన్నరు. బకాయిలు ఇచ్చేంతవరకూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తామని జానరెడ్డి స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దిల్సుఖ్నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. పాతబడిందని చార్మినార్ను కూల్చేస్తారా? విద్యార్థి పోరు గర్జనలో పాల్గొన్న ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యార్థులను శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దీంతో కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్కు డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి కొత్త సచివాలయం నిర్మించడానికి నిధులు ఎలా వచ్చాయన్నారు. వాస్తు బాగోలేదని, పాతబడిందని చార్మినార్ను కూల్చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించకుండా ఇచ్చిన హామీని విస్మరించి, తనకు మాత్రం సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు నిర్మించిన తర్వాతే కేసీఆర్ అధికార నివాసంలోకి వెళ్లాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించాలని, వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, ఎమ్మెల్యేలు జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్రెడ్డి, భిక్షపతి యాదవ్, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్కే భవన్లో ఎవరెక్కడ?
• తొమ్మిది అంతస్తులు.. మూడు బ్లాక్లు • తొమ్మిదో అంతస్తులో సీఎం, డిప్యూటీ సీఎంలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం తరలించే చర్యల్లో భాగంగా తాత్కాలిక భవనాల ప్రణాళికను ప్రభుత్వం తయారు చేసింది. ప్రస్తుతమున్న సచివాలయంలో అత్యధిక శాఖల ఆఫీసులన్నీ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్కు తరలించాలని నిర్ణయించింది. బీఆర్కే భవన్లో మొత్తం తొమ్మిది ఫ్లోర్లున్నాయి. ఒక్కో ఫ్లోర్లో మూడు బ్లాక్లున్నాయి. వీటిలో ఏ ఫ్లోర్కు ఏ కార్యాలయం తరలించాలి.. తాత్కాలిక వసతికి ఎంత స్థలం కేటాయించాలనే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించుకుంది. ఎనిమిదో ఫ్లోర్లో సీఎస్... ఎనిమిదో ఫ్లోర్లో డీ బ్లాక్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆఫీసు, సీఎస్ పేషీ, మీటింగ్ హాల్, అదే ఫ్లోర్లోని సీ బ్లాక్లో పొలిటికల్ ముఖ్య కార్యదర్శి, విజిటర్స్ రూమ్, ముగ్గురు డిప్యూటీ సెక్రెటరీలు, అడిషనల్ సెక్రెటరీ, ముఖ్య కార్యదర్శి (జీపీఎం అండ్ ఏఆర్), సెక్రెటరీ సర్వీసెస్ విభాగం. బీ బ్లాక్లో హోంమంత్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, వైద్యారోగ్య మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆఫీసు. ఏడో ఫ్లోర్లో జీఏడీ.. ఏడో ఫ్లోర్లో డీ బ్లాక్లో జీఏడీ అసిస్టెంట్ సెక్రెటరీలు ముగ్గురు, జీఏడీకి సంబంధించి 19 సెక్షన్లుంటాయి. సీ బ్లాక్లో ముగ్గురు డీఎస్లు, ముగ్గురు డీఎస్, ముగ్గురు ఏఎస్లు, ఆర్థిక శాఖకు సంబంధించి 25 సెక్షన్లుంటాయి. బీ బ్లాక్లో ఆర్థిక మంత్రి, ముఖ్య కార్యదర్శి ఆఫీసు. ఆరో ఫ్లోర్లో ఇంధన శాఖ... ఆరో ఫ్లోర్లో అడ్వకేట్ జనరల్, జీఏడీ డీఎస్, ఏఎస్ సెక్షన్లు, పశుసంవర్థక ముఖ్య కార్యదర్శి, విద్యుత్ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి. అయిదో ఫ్లోర్... స్టోర్ రూమ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, డిజిటల్ విభాగాలు, సంబంధిత జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ, అసిస్టెంట్ సెక్రెటరీలు. పర్యాటక మంత్రి, శాఖ కార్యదర్శి, రవాణా మంత్రి, రాష్ట్ర ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు. నాలుగో ఫ్లోర్... ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, మంత్రులు, కార్యదర్శులకు ఉమ్మడి ఆఫీస్ రూమ్, అదే ఫ్లోర్లో సీ బ్లాక్లో కాన్ఫరెన్స్ హాల్, బీ బ్లాక్లో ఐటీ, మున్సిపల్ మంత్రి, ఆ శాఖ స్పెషల్ సీఎస్, పేషీ, ఎక్సైజ్ మంత్రి, రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి. మూడో ఫ్లోర్... మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్లు, ప్రభుత్వ సంస్థల విభాగం, సీ బ్లాక్లో ఐదు గురు ప్రభుత్వ సలహాదారులు, పరిశ్రమలు , వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్ప్రెజైస్ కార్యదర్శి, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు. రెండో ఫ్లోర్... రెవెన్యూ (వాణిజ్య పన్నులు), రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) విభాగాలు, ప్లానింగ్ విభాగం, పశుసంవర్ధక శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ, కార్మిక ఉపాధి కల్పన, ఫ్యాక్టరీల శాఖ అధికారులు, సెక్షన్లు, కార్మిక ఉపాధి ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి, కమలనాథన్ కమిషన్, ఇంధన శాఖ అధికారులు, ఆఫీసులు. ఒకటో ఫ్లోర్... వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ అధికారులు, సెక్షన్లు, సీపీఆర్వో, సీఎం పీఆర్వోలు, ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖ గ్రౌండ్ ఫ్లోర్, గ్యారేజీలు.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్, గిరిజన, మైనారిటీ సంక్షేమ విభాగాలు, ఎస్బీ స్టోర్స్, ఆర్ అండ్ బీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్, ఎంఈఏ బ్రాంచ్. తొమ్మిదో ఫ్లోర్లో సీఎం ఆఫీస్ బీఆర్కే భవన్లో అత్యంత ఎత్తున ఉన్న తొమ్మిదో ఫ్లోర్లో డీ బ్లాక్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కార్యాలయం, సీ బ్లాక్లో సీఎంవో కార్యదర్శులు, విజిటర్స్ రూమ్, జీఏడీ ప్యాంట్రీ, బీ బ్లాక్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రెవిన్యూ ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యా ముఖ్య కార్యదర్శి, డిప్యూటీ సీఎంల పేషీలు ఉంటాయి. -
మా దయవల్లే ‘గుత్తా’ గెలుపు
రైతుల కోసం 72 గంటల దీక్ష చేస్తా: కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: తమ అన్నదమ్ముల దయ వల్లనే నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం గుత్తా రాజకీయాలు చేస్తున్నారని, రోజుకోపార్టీ మారుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ టిక్కెట్పై గెలిచిన ఎంపీ పదవికి పుష్కరాల తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన ఎందుకు మాట మారుస్తున్నాడని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణం కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన నిర్ణయం పిచ్చితుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇటీవల నిర్మించిన డి-బ్లాక్ను కూలగొడతామనడం పిచ్చిపని అని, వాస్తు బాగుండకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని సూచించారు. పేదలు వైద్యం అందక, రుణమాఫీ లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేల కోట్లు పనులు ఇచ్చి, కమీషన్ల ద్వారా కేసీఆర్ వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయడానికి, ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వడానికి, పేదలకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడానికి, విద్యార్థులకు ఫీజును రీయింబర్స్మెంట్ చేయడానికి నిధుల్లేవంటున్న సీఎం.. విలాసాల కోసం దుబారా ఖర్చులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నాడని విమర్శించారు. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ కోసం నవంబరు మొదటి వారంలో 72 గంటల దీక్ష చేస్తానని, పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని ఇందిరాపార్కువద్ద పోరాటానికి దిగుతానని కోమటిరెడ్డి ప్రకటించారు. కేసీఆర్ చేస్తున్న పిచ్చి పనుల్లో వంద అస్త్రాలు ప్రతిపక్షాలకు ఉన్నాయని చెప్పారు. -
'సీఎంది పిచ్చి తుగ్లక్ చర్య'
-
టీ సచివాలయంలో ఎలుకలు వీరవిహారం
-
సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన
-
సచివాలయం వద్ద రెండో రోజు ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్మిట్టల్ పీఎస్ పద్మావతిపై వారు ఫిర్యాదు చేశారు. అనంతరం పద్మావతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మావతి చైర్ను ఉద్యోగులు బయటపెట్టారు. ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని నినదించారు. -
సచివాలయంలో వైభవంగా బోనాలు
-
సచివాలయంలో వైభవంగా బోనాలు
రెండు రాష్ట్రాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సచివాలయం రెండు రాష్ట్రాల ఉద్యోగుల కోలాహలంతో కళకళలాడింది. ప్రాంగణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఉద్యోగులు బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఉన్నతాధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఉద్యోగులు పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఏపీ ఉద్యోగులు అమరావతికి వెళ్లిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి.. ఏపీ ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉద్యోగులను ఇదే వేదికపై సన్మానించారు. ఉద్యోగరీత్యా ఇన్నేళ్లు ఒకేచోట పని చేసి ఇప్పుడు విడిపోవడం బాధగా ఉందన్నారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. జీఏడీ కార్యదర్శులు అదర్ సిన్హా, వెంకటేశ్వరరావు, ఏపీ నుంచి పాణిగ్రాహి, ప్రేమ్చంద్రారెడ్డి పాల్గొన్నారు. రిటైరయ్యాక ఇక్కడే ఉంటాం హైదరాబాద్లోనే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఉద్యోగ విరమణ తర్వాత ఇక్కడే సెటిలవుతామని కొందరు ఏపీ ఉద్యోగులు చెప్పారు. ప్రాంతాలు విడిపోయినా అన్నాదమ్ముళ్లుగా కలసి ఉందామన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో మొదటి స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో మంచి వాతావరణం ఉంటుందని, ఎక్కడి నుంచి వచ్చినవారైనా ఈ ప్రాంతాన్ని తమ సొంత ప్రాంతంగా భావిస్తారని లింగరాజు పాణిగ్రహి అభిప్రాయపడ్డారు. అనంతరం ఇరు రాష్ట్రాల ఉద్యోగులు కలసి సామూహిక భోజనాలు చేశారు. ఏటా బోనాలకు ఆహ్వానిస్తాం ప్రతి ఏటా ప్రాంతాలకతీతంగా బోనాల పండగను నిర్వహించుకునే వారమని, రెండు రాష్ట్రాల ఉద్యోగులు విడిపోయినందున వచ్చే ఏడాది ఏపీకి వెళ్లి ఉద్యోగులను ఆహ్వానిస్తామని, బోనాల పండగను నిర్వహించుకుంటామని నరేందర్రావు చెప్పారు. -
ఎంసెట్-2 రద్దు చేయొద్దు
సచివాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన హైదరాబాద్: ‘మెడిసిన్లో సీటు మా కల. అందుకోసం చిన్నప్పటి నుంచి అన్ని ఆనందాలు వదులుకుని చదువుకున్నాం. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్, ఎంసెట్-2 రాశాం. కేంద్ర ప్రభుత్వం ‘నీట్’ అంటే అదీ రాశాం. ఎంసెట్-2లో మెరిట్ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో చేరుదామనుకుంటే.. లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతామంటే మా గతేం కావాలి. ఇప్పటికి 5 పరీక్షలు రాశాం. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్లు రాసే శక్తి మాకు లేదు..’.. ఎంసెట్-2 ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సచివాలయం వద్దకు వచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మలను కలవాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సచివాలయం ప్రధాన గేటు ఓముందు ఎన్టీఆర్ గార్డెన్స్ను ఆనుకొని ఉన్న ఫుట్పాత్పై బైఠాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు. ఎంసెట్-2 రద్దు చేయొద్దని, దోషులను మాత్రమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాంకర్లకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వారిని మళ్లీ పరీక్ష రాయనివ్వం: నాయిని ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొందరిని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన చాంబర్కు పిలిపించుకుని మాట్లాడారు. ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తే తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు నాయినికి విన్నవించుకున్నారు. లీకేజీకి కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని... 72 మంది కారణంగా వేలాది మంది విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరారు. దీనిపై స్పందించిన నాయిని.. ‘‘ఎంసెట్ పేపర్ లీకైనట్టు రుజువైంది. మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం ఒక్క ప్రశ్న లీకైనా మళ్లీ పరీక్ష నిర్వహించాలి. లీకైన పేపర్తో పరీక్ష రాసిన 72 మంది విద్యార్థులను మళ్లీ పరీక్ష రాయనివ్వం. మీరేం ఆందోళన చెందవద్దు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..’’ అని పేర్కొన్నారు. నిక్కచ్చిగా విచారణ జరపాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించాలని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిక్కచ్చిగా, పారదర్శకంగా విచారణ చేపట్టి తెర వెనుక ఉన్న వారి పేర్లను బయట పెట్టాలన్నారు. మళ్లీ ఎంసెట్ పరీక్ష రాసే పరిస్థితి రానివ్వొద్దని సూచించారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేపట్టాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఆగస్టులో తెలంగాణ సచివాలయం కూల్చివేత
మంచి రోజులు రాగానే కొత్త సచివాలయ భవనానికి ముహూర్తం ఏడాదిలో పనుల పూర్తి లక్ష్యం.. అప్పటిదాకా తాత్కాలిక విడిది ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన విభాగానికి అద్దె భవనం పరిశీలనలో ఎంసీహెచ్ఆర్డీ, బూర్గుల భవన్, ఎక్స్పోటెల్ హోటల్ హెచ్వోడీ కార్యాలయాల్లో మంత్రులు, అధికారులకు సర్దుబాటు హైదరాబాద్: తాత్కాలిక సచివాలయానికి సరిపడే భవనాల వేట మొదలైంది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయ నిర్మాణానికి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మంచి రోజులు రాగానే.. ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికార వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలో కొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించే వరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రెండ్రోజుల కిందట సీఎస్ రాజీవ్శర్మ సారధ్యంలోని ఉన్నతాధికారుల కమిటీ వీటిపై ప్రత్యేక సమాలోచనలు జరిపింది. ముఖ్య కార్యదర్శులు అధర్సిన్హా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాణ వ్యవధిలో ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, సచివాలయ కేంద్రంగా ఉండే మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు తమ కార్యకలాపాలు ఎక్కణ్నుంచి నిర్వహించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. తాత్కాలిక విడిదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి..? ఎక్కడెక్కడ అందుకు అనువైన భవనాలున్నాయని ఆరా తీశారు. హైదరాబాద్లో ఉన్న హెచ్వోడీ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఎక్కడెక్కడ ఎంత ఖాళీ స్థలముంది..? ఎక్కడైనా సచివాలయంలోని కార్యాలయాలను సర్దుబాటు చేసే అవకాశముందా.. అనే సమాచారంపై ఆరా తీశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, సిబ్బందిని సంబంధిత హెచ్వోడీ కార్యాలయాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేయాలని, అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సీఎస్కు సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ సలహాదారులు ఏడాది పాటు తమ నివాసాల నుంచే విధులు నిర్వహించే అవకాశమిద్దామని ముఖ్యమంత్రి వారితోనే అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి, సీఎంవో, సాధారణ పరిపాలన విభాగం అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేయటమొకటే మిగులుతుందని, అంతమేరకు సరిపడే భవనమేదైనా ఉందా.. పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. దీంతో సచివాలయం సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్, లోయర్ ట్యాంక్బండ్ రోడ్లోని ఎక్స్పోటెల్, జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(ఎంసీహెచ్ఆర్డీ) భవనాల పేర్లు ఉన్నతాధికారుల కమిటీ పరిశీలనకు స్వీకరించింది. వీటిని స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ ఉన్నతాధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న హెచ్వోడీ భవనాలు, కార్యాలయాల్లో అంతకు మించి సదుపాయాలున్నవి ఏమైనా ఉన్నాయా..? అని ఆరా తీస్తున్నారు. దీంతో తాత్కాలిక సచివాలయం ఎక్కడ ఏర్పాటవుతుంది.. సచివాలయ కేంద్రంగా పని చేస్తున్న శాఖల అధికారులు, సిబ్బందిని ఎక్కడెక్కడికి తరలిస్తారనేది ఆసక్తి రేపుతోంది. -
రాష్ట్ర అవతరణ వేడుకలపై మంత్రుల కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బుధవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సన్నాహాలపై మంత్రుల కమిటీ సమావేశం అయినట్టు తెలిసింది. ఈ సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, చందులాల్, జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా
హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) జేఏసీ విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు సచివాలయం ముందు బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకుని పది రోజులు కావొస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత భాస్కర్ అన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీసీ అప్పారావులపై కేసు నమోదైనా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. -
పెండింగ్ రాజ్!
- సచివాలయంలో నిలిచిపోయిన కీలక ఫైళ్లు - పాలన పడక.. నెలరోజులుగా క్లియరెన్స్కు నోచుకోని ఫైళ్లు - హామీలన్నీ ఎక్కడివక్కడే.. అన్ని విభాగాల్లో స్తబ్దత - నోటిఫికేషన్లు లేక లక్షలాది నిరుద్యోగుల్లో ఆందోళన - ఇంకా తేలని పరీక్షల విధానం, వయో పరిమితి పెంపు - ‘క్రమబద్ధీకరణ’ కలల్లోనే కాంట్రాక్టు ఉద్యోగులు - కదలని పీఆర్సీ ఫైలు.. - వర్సిటీలు, హైకోర్టు సిబ్బందికి పెరగని జీతాలు - వీసీల నియామకం లేక గాడితప్పుతున్న యూనివర్సిటీలు - ఆరు నెలలైనా ఉద్యోగులకు అందని కరువు భత్యం - ఇప్పటికీ ఖరారు కాని సర్వీసు రూల్స్, జోనల్ విధానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో పాలన పడకేసింది. స్వయంగా ముఖ్యమంత్రి ఆమోదం తెలపాల్సిన కీలక ఫైళ్లన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్దానాలకు సంబంధించిన ఫైళ్లు మోక్షానికి నోచుకోవటం లేదు. నెల రోజులుగా సీఎంవో కార్యాలయంలో ఫైళ్ల క్లియరెన్స్ దాదాపుగా నిలిచిపోయింది. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)కు వచ్చే దరఖాస్తులు తప్ప సచివాలయంలో మిగతా కార్యకలాపాలు నత్తనడకన సాగుతున్నాయి. గతనెల 23 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ సచివాలయంలో అడుగు పెట్టలేదు. దీంతో అన్ని విభాగాల్లో స్తబ్దత నెలకొంది. గడచిన నెల రోజుల్లో హరితహారం, గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలపైనే ప్రభుత్వం దృష్టి సారించటంతో మిగతా కార్యకలాపాలు, ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికక్కడే ఉండిపోయాయి. రాష్ట్ర ఖజానా ఇబ్బందుల్లో ఉండటంతో నిధులతో ముడిపడి ఉన్న ఫైళ్లన్నీ ముందుకు కదలడం లేదని అధికారులు సైతం నిట్టూరుస్తున్నారు. నోటిఫికేషన్లు ఇంకెప్పుడు? జూలైలో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని, నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వీటిపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈనెలలో నోటిఫికేషన్లు వెలువడుతాయో, లేదో అన్న సందిగ్ధత నిరుద్యోగులను వెంటాడుతోంది. అభ్యర్థుల వయో పరిమితి పెంపు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల విధానంపై మంత్రుల సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలు సీఎం కార్యాలయం వద్దే ఆగిపోయాయి. దీంతో లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. అయోమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు జూలై నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రారంభిస్తామని సీఎం చేసిన వాగ్దానం ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. స్థానికులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, వారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని సీఎం ప్రకటించి నెల దాటింది. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం పేషీలో ఆమోదానికి సిద్ధంగా ఉంది. సీఎం ఆమోదం పొందని కారణంగా ఆ నోటిఫికేషన్ వెలువడలేదు. ఆమోదానికి నోచుకోని డీఏ ఫైలు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం (డీఏ) ఫైలు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. జనవరి నుంచి అమలు చేయాల్సిన కరువు భత్యం సాధారణంగా మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేనంత ఆలస్యంగా జూలైలోనూ అందకపోవటంతో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 3.144 శాతం డీఏ ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు సీఎం పేషీలో ఆగిపోయింది. గండాలు దాటని పీఆర్సీ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన తెలంగాణ సర్కారు.. ఉత్తర్వుల జారీలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో రెండు లక్షల మందికి పైగా పెన్షనర్లు గందరగోళంలోఉన్నారు. వయసు పైబడే కొద్దీ చెల్లించే అదనపు పెన్షన్పై ఆర్థిక శాఖ కొర్రీ పెట్టింది. దీంతో సీఎం తుది నిర్ణయం కీలకంగా మారింది. గ్రాట్యుటీకి సంబంధించి ఉత్తర్వులు కూడా రాకపోవటంతో ఇటీవల రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ రావటం లేదు. పెరిగిన పెన్షన్ ఒకసారి, గ్రాట్యుటీ మరోసారి ఇచ్చేందుకు అకౌంటెంట్ జనరల్ కార్యాలయం అభ్యంతరం తెలిపింది. దీంతో రిటైరైన ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారు. పీఆర్సీ తొమ్మిది నెలల బకాయిలపైనా ప్రభుత్వం ఊసెత్తటం లేదు. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో రెండేళ్ల పాటు చైల్డ్ కేర్ లీవ్ను పీఆర్సీ సిఫారసు చేసింది. వికలాంగులైన ఉద్యోగులకు పీహెచ్ అలవెన్స్ పెంచింది. ఈ జీవోలేవీ విడుదల కాలేదు. యూనివర్సిటీల్లో ఆందోళన యూనివర్సిటీ సిబ్బంది, హైకోర్టు సిబ్బందికి పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదు. ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఈ ఫైళ్లు సీఎం కార్యాలయంలోనే ఆగిపోయాయి. దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఇన్చార్జిల పాలనతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పింది. వైస్ చాన్స్లర్లు, పాలక మండలి నియామకం విషయాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. చట్టం సవరిస్తే తప్ప కొత్త వీసీలు, పాలక మండళ్లను నియమించే అవకాశం లేదని చెబుతున్నప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కాలేదు. సర్వీస్ రూల్స్, జోన్ల విధానంపై అస్పష్టత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ను సరళీకృతం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతమున్న జోన్ల విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తారా.. పునర్విభజిస్తారా..? అన్నది తేల్చడం లేదు. నియామకాలు, బదిలీలన్నింటికీ ఇదే కీలకమైన అంశం కావటంతో నిరుద్యోగులు, ఉద్యోగులందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. -
టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్.. పీఎస్కు తరలింపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నన్నారు. దాంతో పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట ధర్నాకు దిగారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన హక్కులు, వేతనాలు పెంచాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగి వారంపైన అయినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద నీళ్లు పోసిన చందంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ను చెత్తా హైదరాబాద్గా మార్చిందని ఎద్దేవా చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు వీహెచ్, అంజన్కుమార్ యాదవ్, పొన్నాల, షబ్బీర్ అలీతోపాటు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
సచివాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
సచివాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. గతంలో కాంట్రాక్టు విద్యుత్ కార్మికుడిగా పనిచేసిన తనను విధుల్లోంచి తీసేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించారు. ముందు ఇద్దరు యువకులు కలిసి సచివాలయానికి వచ్చారు. వారిలో ఒకరు పురుగుల మందు డబ్బా తీసుకొని తాగేశాడు. ముందు ఎవరు గుర్తించకపోయినా అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పక్కనే వచ్చిన మరో యువకుడు సమీపంలో వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి ఒక్కసారిగా పోలీసులు, సమీప అధికారులు హుటాహుటిన వచ్చి ఆ యువకుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. ఒకపక్క, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం చెప్తుండగా.. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నామంటూ కొన్ని ప్రభుత్వ సంస్థలు ఎంతోకాలంగా పనిచేస్తున్నవారిని తొలగిస్తుండటంతో వారు తీవ్ర మనస్థాపానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. -
బైసన్ గ్రౌండ్స్లో సచివాలయం
-
బైసన్ గ్రౌండ్స్లో సచివాలయం
మైదానాన్ని ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిని కోరిన కేసీఆర్ ►అందుకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇస్తామని వెల్లడి ►కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణకు ఇబ్బందుల ప్రస్తావన ►సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి పారికర్ ►రాష్ట్రంలో రెండు సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు హామీ ►కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్తోనూ ముఖ్యమంత్రి భేటీ న్యూఢిల్లీ: తెలంగాణ సచివాలయం నిర్మించేందుకు వీలుగా సికింద్రాబాద్లోని 60 ఎకరాల బైసన్ గ్రౌండ్స్ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, సీఎంఓ కార్యాలయ ముఖ్య అధికారులతో కలసి సౌత్బ్లాక్లో పారికర్తో సమావేశమమైన కేసీఆర్ ఈ అంశంపై చర్చించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పారికర్... డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చినందుకు ప్రతిగా నిబంధనల ప్రకారం భూమి ఇవ్వాలని సూచించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ ‘మాకు ల్యాండ్బ్యాంక్ ఉంది. అందులోంచి మీకు 60 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ అధికారులను పంపండి. గోల్కొండ దగ్గర, లేదంటే ప్రస్తుత కంటోన్మెంట్ వైపు ఉన్న స్థలాలు ఇస్తాం’ అని చెప్పారు. ఈ అంశంపై మరోమారు హైదరాబాద్లో ఎస్టేట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించుకోవాలని వారిరువురూ నిర్ణయించారు. రాష్ట్రంలో సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరగా తెలంగాణలో రెండు సైనిక్ స్కూళ్లు త్వరలోనే మంజూరు చేస్తామని పారికర్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కొన్ని రోడ్ల విస్తరణలో సమస్యలతోపాటు హైదరాబాద్కు వచ్చే గోదావరి నీటి పైప్లైన్ ఏర్పాటులో కంటోన్మెంట్ ప్రాంతంలో కొన్ని ఇబ్బందులున్న విషయాన్ని కేసీఆర్...రక్షణ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ భేటీ అనంతరం ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్కుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలపై రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్లోని ఆదిభట్లలో టాటా గ్రూపు హెలికాప్టర్ తయారీ సంస్థకు అవసరమైన అదనపు భూములను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం శ్రీకారంచుట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’కు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రితో కేసీఆర్ అన్నట్లు జితేందర్రెడ్డి తెలిపారు. మేడ్చల్-నాగ్పూర్ జాతీయ రహదారిని బోయిన్పల్లి వద్ద విస్తరించాల్సి ఉందని, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా జేబీఎస్ బస్స్టాండ్ నుంచి నేరుగా కరీంనగర్ రోడ్డులో హకీంపేట్ దాటాక కలిసేలా ఎలివేటెడ్ హైవే వేస్తున్నామని, రోడ్డు వెడల్పు కోసం కొన్ని రక్షణశాఖ భూములు ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు వినోద్కుమార్ చెప్పారు. రోడ్ల విస్తరణకు అవసరమైన భూములు కేటాయించేలా స్థానిక అధికారులతో మాట్లాడతానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. విభజన హామీలు నెరవేర్చండి... ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను సీఎం కేసీఆర్ కోరారు. అలాగే తెలంగాణలో పోలీస్శాఖను పటిష్టపరిచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావులతో కలసి నార్త్బ్లాక్కు చేరుకున్న కేసీఆర్ అరగంటకుపైగా రాజ్నాథ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పోలీస్శాఖ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పోలీస్ వ్యవస్థ ఆధునీకీకరణలో భాగంగా మెగాసిటీ పోలీసింగ్, మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ (ఎంపీఎఫ్) కింద నిధులు విడుదల చేయాలని కోరారు. గతంలోనూ భూముల బదిలీ హైదరాబాద్లోని కంటోన్మెంట్ భూములను రాష్ట్ర పరిధిలోకి బదలాయించాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తులు ఫలిస్తే విశాల మైదానాల్లో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టే అవకాశముంది. విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 30 ఎకరాల్లో జింఖానా, 28 ఎకరాల్లో బైసన్ పోలో, 30 ఎకరాల్లో పరేడ్మైదానాలు విస్తరించి ఉన్నాయి. ఈ భూములన్నీ ప్రస్తుతం రక్షణ శాఖ పరిధిలో ఉన్నా యి. 1991లో రక్షణ శాఖ అధీనంలోని 28 ఎకరాల భూమిని పీజీ కళాశాల నిర్మాణం కోసం, 1992లో నందమూరినగర్ కోసం 15 ఎకరాల భూమిని రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసింది. వీటికి బోయిన్పల్లిలోని రామన్నకుంటలో ఏడున్నర ఎకరాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రక్షణ శాఖకు అప్పగించింది. ఇప్పుడు కూడా ఈ మైదానాలను రాష్ట్రానికి ఇస్తే.. పీజీ కళాశాల భూములను సచివాలయ నిర్మాణానికి వాడుకొని వాటిని ఉస్మానియా వర్సిటీకి తరలించే అవకాశముంది. జూబ్లీ బస్స్టాప్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బేగంపేట ఎయిర్పోర్టు, మెట్రోరైల్ జంక్షన్ కూడా ఈ మైదానాలకు సమీపంలో ఉన్నందున ఇక్కడ సచివాలయం నిర్మిస్తే అన్నింటికీ అనువుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా తాము అప్పగించే భూములకు ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఇతర ప్రాంతాల్లో ఆ మేరకు భూములను తీసుకోవాలని రక్షణ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. -
హవ్వ..... ఆటోలో వస్తారా...
సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం అసలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి... ఖరీదయిన ఖద్దరు బట్టలు... ఇద్దరు గన్ మెన్లు పక్కన మందీ మార్బలం ప్రయాణించేందుకు కాస్ట్ లీ కారు.. ఇవి ఓ శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు. అయితే ఆయన ప్రయాణించేందుకు ఎట్ లీస్ట్ మారుతీ కారు కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించాల్సిందే. అదే ఆయన చేసిన తప్పిదం. దాంతో తానేంటో నిరూపించుకునేందుకు గుర్తింపు కార్డు చూపించుకుని దుస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన సామాన్య వ్యక్తా అంటే కానేకాదు. సాక్షాత్తు సీనియర్ ఎమ్మెల్యే. పోనీ తొలిసారి ఎన్నికైన శాసనసభ్యుడా అంటే అదీ కాదు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినాసరే ఆ పెద్ద మనిషి...'నేను ఎమ్మెల్యేను మహాప్రభో నమ్మండి...అంటూ మొత్తుకున్నా వినలేదు. దాంతో తన గుర్తింపు కార్డును చూపించి సచివాలయంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజును చూసిన కళ్లతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి వేసిందంట ఓ ఇల్లాలికి. మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ కార్లులో రయ్ రయ్ మంటూ వచ్చే ఎమ్మెల్యేలను చూడటం అలవాటు అయిన పోలీసులకు ఆటోలో వచ్చిన ఆయన కళ్లకు ఆనలేదు. అంతేకాకుండా నువ్వు ఎమ్మెల్యేవా ...అయితే కారేదీ...గన్ మెన్లు ఏరీ అంటూ విసిగించారు. సచివాలయం సాక్షిగా ఖమ్మం జిల్లా భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు గురువారం ఈ చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గంలో ఓ పని నిమిత్తం సచివాలయానికి ఆటోలో వచ్చిన రాజయ్యను సచివాలయ భద్రతా సిబ్బంది లోపలకి పంపకుండా బయటే ఆపేశారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన ఎమ్మెల్యే అంటూ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. దాంతో ఆటో దిగి సున్నం రాజయ్య లోనికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బడాయిలకు పోకుండా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా సింపుల్ జీవితాన్ని గడిపే ఎమ్మెల్యేలను మన రాష్ట్రంలో వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య...ఆయన ఎవరూ అని ఇప్పటికీ చాలామంది తెల్లమొహం వేస్తారు. ఎంతమంది ఆయనను గుర్తుపడతారు అనేది కూడా క్విజ్ పోటీల్లో వేసే ప్రశ్న లాంటిదే. అసెంబ్లీలో పేపర్ల చింపేసి...మైకులు విరగొట్టి... బూతులు తిట్టివారికి సినిమా హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ లభిస్తుంది కానీ....ప్రజా సమస్యల కోసం నిస్వార్థంగా పోరాడేవారికి ఆ గుర్తింపు ఉండదేమో. ధర్నాలు, నిరసనలు అంటూ నిత్యం మీడియాలో హైలెట్ అయ్యే పాలి(ట్రి)టిక్స్ ను మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన వంటపట్టించుకోపోవటం వల్లే సెక్యూరిటీ సున్నం రాజయ్యను గుర్తు పట్టలేదేమో. పక్క రాష్ట్రంలో సీఎం ఆటోలో వెళ్లాడు... రైలులో ప్రయాణించాడంటూ గొప్పలు చెప్పుకుంటాం. అదే మన రాష్ట్రంలో ఎమ్మెల్యే మాత్రం ఆటో ప్రయాణిస్తే మాత్రం జీర్ణించుకోలేం. . అలాంటి ఎమ్మెల్యే ఆటోలో మన స్టేటస్ కు నామోషీ కదా. ప్రజల మధ్యలో నుంచి వచ్చి..వారితో మమేకమే..ప్రజా సమస్యల కోసం పోరాడే వారికి మనమిచ్చే గౌరవం ఇదా. నయా పైసా స్వలాభం కోసం ఆశ పడకుండా ప్రజల కోసం పాటుపడుతూ 'రాజకీయాలను' వంట పట్టించుకోలేని రాజయ్యది తప్పా! పార్వతి.వై -
టీ.సచివాలయం తరలింపుపై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం తరలింపుపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేసినందుకు న్యాయస్థానం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్పై ప్రశ్నించింది. కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు పిటిషనర్కు హైకోర్టు వెయ్యి రూపాయిలు జరిమానా విధించింది. కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తు దోషంతో సచివాలయం తరలించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆప్ పార్టీకి చెందిన ఓ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తు దోషం పేరిట రూ. 150 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. -
టి- సచివాలయంలో మీడియాకు నో-ఎంట్రీ
-
కొత్త సచివాలయానికి ఈశాన్య గండం?
సాక్షి, హైదరాబాద్: వాస్తుదోషం పేరిట ఇప్పడున్న తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చినా అవే తిప్పలు తప్పవా?..కొత్త సచివాలయం నిర్మించ తలపెట్టిన ఛాతీ ఆస్పత్రి స్థలానికి ఈశాన్యంలో వాస్తు దోషం ఉందా?..ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆ స్థలాన్ని పరిశీలిస్తున్న వాస్తు నిపుణులు ఇదే చెబుతున్నారు. ప్రస్తుత సచివాలయానికి వాస్తుదోషం ఉందని.. సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి స్థలంలోకి మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టే ఛాతీ ఆస్పత్రి స్థలంలో వాస్తుదోషాలను తేల్చేందుకు వాస్తు నిపుణులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రికి వాస్తు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ నిపుణుడితోపాటు మరికొందరు రెండు రోజులుగా ఆ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆ స్థలంలో ఈశాన్యం వైపు ఓ అక్రమ నిర్మాణంతో ఏర్పడ్డ కోత వల్ల వాస్తుపరమైన సమస్యలేర్పడినట్టు వారు గుర్తించారు. దానికి విరుగుడుగా ఆ భాగాన్ని ప్రతిపాదిత స్థలం నుంచి వేరు చేసేలా గోడ నిర్మిస్తే సరిపోతుం దని భావిస్తున్నట్లు సమాచారం. లోపాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సరిచేసే పనులు ప్రారంభించనున్నారు. ఇక ప్రతిపాదిత స్థలంలో ఏ వైపు ఏముండాలన్నది వారు గుర్తిస్తున్నారు. వాస్తు నిపుణుడి ఎంపికలో సమస్యలు ముఖ్యమంత్రికి వాస్తు సూచనలిస్తున్న వ్యక్తికి రోడ్లు భవనాల శాఖలో వాస్తు కన్సల్టెంట్గా పోస్టింగ్ ఇవ్వాలని తొలుత భావించారు. అయితే సాంకేతికంగా ఆ పోస్టు ఏర్పాటు సాధ్యం కాకపోవటంతో బిల్డింగ్ కన్సల్టెంట్గా నియమించాలని నిర్ణయించారు. సంబంధిత ఫైలును రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆర్థిక శాఖకు పంపారు. కానీ బిల్డింగ్ కన్సల్టెంట్కు సివిల్ ఇంజనీరింగ్ అర్హత ఉండాలి. సదరు నిపుణుడికి విద్యార్హత లేకపోవటంతో ఆర్థిక శాఖ ఫైలును తిప్పి పంపినట్టు తెలిసింది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్హత లేదని, ఆయనకు ఎంఏ పట్టా మాత్రమే ఉందని పేర్కొం టూ రోడ్లు భవనాల శాఖ అధికారులు మళ్లీ ఫైల్ను ఆర్థిక శాఖకు పంపారు. వెరసి సదరు నిపుణుడికి సాంకేతిక కారణాలతో పోస్టు ఇచ్చే అవకాశం కనిపించటం లేదు. -
'వాస్తు దోషం అంటున్న కేసీఆర్కే దోషం'
కరీంనగర్ : తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సచివాలయంలోనే తెలంగాణపై మొదట చర్చ జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంచి సచివాలయానికే వాస్తు దోషం అంటున్న కేసీఆర్కే దోషం ఉందని జీవన్ రెడ్డి సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఎనిమిది మాసాల్లో తెలంగాణ సర్కార్ పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదన్నారు. కేసీఆర్ మాటలు...చేతల్లో కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. -
వాస్తు లొల్లి @ తెలంగాణ స్టేట్
-
వాస్తు.. వివాదమస్తు
సచివాలయం తరలింపుపై విపక్షాల మండిపాటు గతంలోనూ తరలింపునకు పలువురి యత్నాలు వెనక్కి తగ్గిన అప్పటి ముఖ్యమంత్రులు ఆనవాయితీగా సాగిన వాస్తు మార్పులు గేట్లు.. చాంబర్ల మార్పులతో సర్దుబాటు దోషమున్నా.. ప్రత్యామ్నాయాలున్నాయి: వాస్తు నిపుణులు సాక్షి, హైదరాబాద్: న్యూయార్క్.. లండన్.. సింగపూర్ తరహాలో స్మార్ట్ సిటీలు... ఆకాశ హర్మ్యాలు.. స్కైవేలు... ఫై్ల ఓవర్లు... అన్నింటా అధునాతనం.. అంతర్జాతీయ స్థాయిని తలపించే బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వాస్తు దోషం ఉందంటూ సచివాలయాన్ని తరలిస్తుందా..? ఏకంగా రూ.150 కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయం నిర్మిస్తుందా...? రాష్ట్రంలో అందరి నోటా ఇదే హాట్ టాపిక్. ‘సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్లేవరూ ముందర పల్లేదు..’ అని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం నాటి కేబినేట్ భేటీ అనంతరం ప్రకటించారు. అది మొదలు సచివాలయంలో అధికారులు, ఉద్యోగులందరిలోనూ ఇదే అంశంపై చర్చోపచర్చలు ఆసక్తికరంగా మారాయి. వాస్తు దోషముంటే నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలుంటాయని అదే శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడున్న స్థలంలోనే మార్పులు చేర్పులు చేసుకునే ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ఏకంగా సెక్రెటేరియట్ తరలింపు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ‘సీఎం హోదాలోని వ్యక్తి వాస్తు గురించి మాట్లాడటం.. ప్రజల్లో మూఢ నమ్మకాలను ప్రచారం చేసినట్లయింది. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి పట్టుకుంది..’ అని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు సీఎం తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. దీని వెనుక మరేదైనా ఆంతర్యముందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘భారత ప్రజల జీవన విధానంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు సిద్ధాంతాన్ని నమ్మడం ఆహ్వానించదగ్గ పరిణామం. సచివాలయానికి వాస్తుదోషం ఉన్న మాట వాస్తవమే. కొన్ని అనుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి. రాజ ప్రసాదాలు, రాజ భవనాలకు నలు దిక్కులా రోడ్డు ఉండాలనే నియమం కూడా ఉంది. తూర్పున హుస్సేన్ సాగర్ ఉండటంతో పాటు తూర్పు, ఉత్తరాన గేట్లు ఉండటం కూడా మంచిదే. పశ్చిమ నైరుతి భాగం పెరగటం, నైరుతి దిశలో వీధిపోటు, హోంసైన్స్ కాలేజీ, ఆర్బీఐ నుంచి వచ్చే రోడ్ల కారణంగా భయంకరమైన దోషాలే ఉన్నాయి. దీంతో పాలకులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కానీ వీటికీ పరిష్కార మార్గాలున్నాయి. నైరుతి దిశలో ఎతై్తన గోడ కట్టి ఈ స్థలాన్ని వేరు చేసే వీలుంది. అటువైపున ఉన్న భవనాన్ని వాడకుండా ఉన్నా దోష నివారణ జరుగుతుంది’ అని వాస్తు నిపుణులు రాచ సురేశ్ అభిప్రాయపడ్డారు. వాస్తుకు సంబంధించిన నమ్మకం పాలకులకు ఉండడం కొత్తేమీ కాదని, సచివాలయం తరలింపునకు గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులు ప్రయత్నించారని ఒక రిటైర్డ్ అధికారి తెలిపారు. ‘గతంలో సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాంపల్లిలో ఇప్పుడున్న గృహకల్ప స్థలానికి సచివాలయాన్ని మార్చాలని యోచించారు. తీరా ఆ ప్రాంతాన్ని చదునుచేశాక విరమించుకున్నారు. అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదనపై కసరత్తు జరిగింది. విజయభాస్కరరెడ్డి హయాంలో ఇప్పుడు అనుకుంటున్న చెస్ట్ ఆసుపత్రికి తరలించాలనే ప్రయత్నం జరిగింది. కానీ.. చారిత్రక కట్టడాలు ఉన్నాయనే కారణంగా ఉపసంహరించుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రులకు వాస్తుపై ఉన్న నమ్మకం, పండితులు చెప్పిన శాస్త్రం ఆచరించి, గేట్లు, తమ ఛాంబర్లను మార్చుకోవటం ఆనవాయితీగానే కొనసాగింది. అందులో భాగంగా ఇప్పటివరకు సచివాలయానికి మూడు వైపులా గేట్లను మార్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు గేట్లు మార్చారు. అయినా నాదెండ్ల, చంద్రబాబుల వెన్నుపోట్లు ఆయనను వెంటాడాయి. కానీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సీఎంగా ఇదే సచివాలయ కేంద్రంగా సుదీర్ఘంగా తొమ్మిదేళ్లు పాలించారు. రాష్ట్ర విభజనకు ముందు తూర్పున ఉన్న గేటును వాస్తు నమ్మకంతోతెలంగాణ ప్రభుత్వం ఉత్తర దిశలో నిర్మించింది. కనీసం ఈ గేట్ల నిర్మాణం కూడా పూర్తి కాకుండానే సచివాలయాన్ని మార్చాలని ఆకస్మిక నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత వాహనాల రంగు, కేబినెట్లో సంఖ్యాబలం, వివిధ పథకాల ముహూర్తాలు ఇలా అన్నింటా ఆయన తనకంటూ సలహాలిచ్చే పండితుల నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారనే వాదనలున్నాయి. సచివాలయం తరలింపు నిర్ణయం అందులో భాగమేనని, త్వరలోనే వాస్తు నిపుణుడు ఒకరిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. -
చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై ఉద్యోగులు ధర్నా
-
వంద అంతస్థుల్లో తెలంగాణ సచివాలయం!
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రగడ్డకు మర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛాతీ ఆస్పత్రి ఉన్న ప్రాంగణంలో సచివాలయం ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సర్కారు యోచిస్తోంది. నిజాం హయాంలో నిర్మించిన చెస్ట్ ఆస్పత్రి 62 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించివుంది. 75 ఏళ్లుగా రోగులకు సేవలు అందిస్తోంది. ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సచివాలయం భవనాన్ని వంద అంతస్థుల్లో నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చెస్ట్ ఆస్పత్రి తరలించాలన్న ప్రతిపాదనపై వైద్యులు, సిబ్బంది నిరసిస్తున్నారు. ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించొద్దని కోరుతున్నారు. -
బిల్లుల చెల్లింపు ఎప్పుడో !
బోధన్ : చెరుకు రైతు ఏటా గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పడం లేదు. ఏడాది కాలం శ్రమిం చి పండించిన చెరుకును ఫ్యాక్టరీ క్రషింగ్కు పంపుతుంటే నిబంధనల ప్రకారం రావాల్సి బిల్లులు అందకపోగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతియేడు బిల్లుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితు వస్తున్నాయి. నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుని ధర చెల్లించాలని రైతులు చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే దిక్కలేదు. చక్కెర ఫ్యాక్టరీ ప్రైవే ట్ సంస్థ గుప్పిట్లోకి వెళ్లింది. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం విస్మరించాయి. ప్రైవేట్ ఫ్యా క్టరీ యాజమాన్యం లాభపేక్షధోరణితో వ్యవహరిస్తోందని రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకపక్షంగా ధర నిర్ణయిస్తోందనే ఆరోపణలు వసున్నాయి. చెరుకు సరఫరా చేసిన రైతులు ప్రస్తుతం బిల్లుల కోసం ఎదురు చూ స్తున్నారు, ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరి స్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర.. బోధన్ ఎన్డీఎస్ఎల్లో 2014-15 సీజ న్కు సంబంధించి గత డిసెంబర్ 1న క్రషింగ్ ప్రారంభించారు. సుమారు 90 వేల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ పూర్తయ్యిందని ఫ్యాక్టరీ అధికారులు పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో క్రషింగ్ పూర్తి అయ్యే అవకాశాలున్నా యి. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో రైతులకు బిల్లులు చెల్లిం చా లి. అయితే నెల పదిహేను రోజులు కావస్తు న్నా.. ఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు ఎప్పు డు చెల్లించేది స్పష్టం చేయలేదు.యాజమాన్యం ప్రకటించిన ధర ప్రకారం రైతులకు రూ. 20 కోట్లవరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఒత్తిడి మేరకు.. వాస్తవంగా అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను రద్దు చేసి తిరిగి స్వాధీ నం చేసుకుంటామని, పూర్వవైభవం తెస్తామ ని సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో హామీ ఇచ్చా రు. దీంతో ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం డోలాయమాన పరిస్థితిలో క్రషింగ్ ప్రా రంభించేందుకు సుముఖత చూపలేదు. ఈ పరిస్థితిని గమనించిన రైతులు స్థానిక ఎమ్మె ల్యే షకీల్ నేతృత్వంలో ఎంపీ కవిత, రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు . ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రైవేట్ యాజమాన్యం క్రషింగ్ ప్రారంభించింది.క్రషింగ్ప్రారంభం కథ సుఖాంతంగా ముగిసింది. టన్ను ధర రూ.2260 ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఈ ఏడాది క్రషింగ్ సీజన్ టన్ను ధర రూ.2200, ప్రభుత్వ కొనుగోలు ధర రూ. 60 కలుపుకుని రూ. 2260 ప్రకటించింది.గత ఏడాది సీజన్లో టన్ను ధర రూ. 2600 చెల్లించారు. ఈ ధరను కూడా రౌండ్ల వారీగా చెల్లించారు.ఈ ధరనైనా చెల్లించాలని రైతులు కోరుతున్నా యాజమాన్యం మౌనం వహించింది. ఈ ధర వివాదం మళ్లీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. ఈ నెల 5న హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో రైతుల సమావేశంలో సీఎం కేసీఆర్ ధర పై స్పష్టత ఇచ్చారు. టన్నుకు రూ. 2600 ధర చెల్లిస్తామని సీఎం కేసీఆర్ భరోసాఇచ్చారు.ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించిన టన్ను ధర రూ. 2260 చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. బిల్లుల చెల్లింపు పై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదు. బిల్లుల చెల్లింపులో ఇంకెంత కాలం జాప్యం జరుగుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సచివాలయానికి వాస్తు దోషం!
దక్షిణంవైపు గోడ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశం హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి వాస్తుదోషం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నారు. ఇటీవల వాస్తు పండితులు సెక్రటేరియెట్ను సందర్శించిన సమయంలో.. సచివాలయానికి దక్షిణం వైపు ఉన్న ప్రాంతం మొత్తం మూసేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో భారీ ఐరన్ గ్రిల్స్ ఉన్నచోటును మొత్తం ప్లాస్టిక్ షీట్స్తో పూర్తిగా మూసేయాలని ఇటీవల ఛత్తీస్గఢ్ వెళ్లే ముందు అధికారులకు సూచించారు. ఛత్తీస్గఢ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయ అధికారులు ఆగమేఘాల మీద ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ఆ గ్రిల్స్, కొత్తగా ఏర్పాటు చేసిన షీట్స్ కూడా తొలగించి ప్రహరీ నిర్మించాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నా.. ఆశించిన స్థాయిలో పేరురాకపోగా విమర్శలు అధికమవుతున్నాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. అందుకు రాష్ట్ర పరిపాలన ప్రధాన కేంద్రంలో వాస్తు దోషాలు ఉన్నట్లు వాస్తు నిపుణులు తేల్చడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి క్యాంపు నివాసం ముందున్న అధికారిక భవనాన్ని కూడా వాస్తు దోషం కారణంగా సీఎం వినియోగించుకోని విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి తన వాహన శ్రేణిని కూడా నల్ల రంగు నుంచి తెలుపు రంగుగా మార్చుకోవడం గమనార్హం. సచివాలయం వరకు బస్సులు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల ద్వారా నేరుగా ఉత్తరం వైపున్న ప్రధాన గేటు వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీకి, నగర ట్రాఫిక్ అదనపు సీపీకి సచివాలయ వర్గాలు లేఖ రాశాయి. వర్షాకాలం, వేసవిలో ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు షెల్టర్లు కూడా నిర్మించనున్నారు. -
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియట్లో పని చేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రకాష్ వీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తాగి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం కారణంగానే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపుల వల్లే ప్రకాష్ వీర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా ప్రకాష్ వీర్ మంగళవారం భార్యకు ఫోన్ చేసి ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని... ఉద్యోగం చేయలేకపోతున్నానని చెప్పినట్లు సమాచారం. పోలీసులు ప్రకాష్ వీర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. -
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
-
సగం మందికి అందని జీతాలు
ఆంధ్రా సచివాలయ ఉద్యోగులకు 1న అందని వేతనాలు ఎస్బీహెచ్ సర్వర్ సమస్యే కారణమన్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సగం మంది ఖాతాల్లోనూ జమకాని జీతాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులెవరికీ ఈ నెల 1వ తేదీన వేతనాలు అందలేదు. అలాగే జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు కొంతమందికి కూడా 1వ తేదీన వేతనాలు అందలేదు. శనివారం కావడం వల్ల బ్యాంకులు మధ్యాహ్నం వరకే పనిచేయడం ఇందుకు ప్రధాన కారణమని ట్రెజరీ అధికారులు పేర్కొన్నారు. ఈ కారణం వల్లే కొంతమంది ఉద్యోగులకు వేతనాలు క్రెడిట్ అయ్యాయని, కొంతమందికి కాలేదని వారు చెప్పారు. సచివాలయంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వేతన ఖాతాలు కలిగిన ఉద్యోగులెవ రికీ వేతనాలు అందలేదని, ఇందుకు ప్రధాన కారణం ఎస్బీహెచ్ సర్వర్ పనిచేయకపోవడమేనని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి తెలిపారు. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఆంధ్రా సచివాలయ ఉద్యోగులెవరికీ 1వ తేదీన వేతనాలు ఖాతాల్లో పడలేదు. తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం 1వ తేదీన వేతనాలు జమ కాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు జీతాలు జమ కాకపోవడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వేతనాలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయ్యే దృష్ట్యా శనివారం కాకపోతే ఆదివారం అయినా అకౌంట్లలో డబ్బులు పడతాయని ఉద్యోగులు ఆశించారు. కొంతమంది ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకుందామని ప్రయత్నిస్తే జీతాలు పడలేదని తేలింది. ఇక కడప, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తేదీన వేతనాలు పడలేదు. కడప, చిత్తూరు జిల్లాల్లోని ఉపాధ్యాయులకు, గుంటూరులో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు వేతనాలు ఖాతాల్లో జమ కాలేదు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందికి వేతనాలు అందగా మరో సగం మందికి వేతనాలు అందలేదని అధికార వర్గాలు తెలిపాయి. వేతనాల బిల్లులను సాధారణంగా అన్ని శాఖలు నాలుగు రోజుల ముందుగానే సమర్పిస్తాయి. అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించగా.. బ్యాంకులు శనివారం మధ్యాహ్నం వరకే పని చేయడంతో పాటు కొన్ని బ్యాంకుల్లో సర్వర్ సమస్య కారణంగా కొంతమందికి వేతనాలు అందలేదని, సోమవారం జమ అవుతాయని పేర్కొన్నారు. -
సచివాలయంలో ఏసీల తొలగింపు
-
సచివాలయంలో ఏసీల తొలగింపు
హైదరాబాద్: విద్యుత్ కొరత రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరెంట్ పొదుపు చర్యలపై దృష్టి సారించింది. ప్రధాన పరిపాలన కార్యాలయం సచివాలయం నుంచే విద్యుత్ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. అనుమతి, అర్హతలేని అధికారులకు ఏసీ కనెక్షన్లు తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శి స్థాయి అధికారులు మాత్రమే ఏసీ వాడాలని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ సచివాలయంలోని ఏసీబీడీ బ్లాకుల్లో అక్రమంగా వాడుతున్న ఏసీలను అధికారులు సోమవారం తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలోనూ కరెంట్ ఆదా చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. -
బంగారు మనసివ్వు ఉయ్యాలో..
-
ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో..
-
సీఎం కేసీఆర్ సారూ... మొర వినే దెవరు?
ఈ చిత్రంలోని అభాగ్యురాలిని చూశారా? నడవలేని దీన స్థితిలో ఎంతో కష్టపడి తెలంగాణ సెక్రెటేరియట్కు వచ్చిన ఆమె గాధ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. కానీ మన అధికారులకు మాత్రం ఆమె బాధ అర్థం చేసుకునే ఓపిక.. తీరిక లేవు. ఆమె పేరు రమాదేవి. నల్గొండ పట్టణానికి చెందిన ఆమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో నడవలేకపోతోంది. ఆమె భర్త పేరు శ్రావణ్కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త శ్రావణ్ కుమార్కు కాలు విరిగిపోయింది. అతను మంచాన పడ్డాడు. హైదరాబాద్ : ఇల్లు గడవడం కష్టమైంది. ఏం చేయాలో తోచని ఆమె సీఎం కేసీఆర్కు తన దుస్థితిని వివరించి, ఆదుకోవాల్సిందిగా కోరాలని భావించింది. వినతిపత్రంతో సోమవారం తెలంగాణ సచివాలయానికి చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు తన పరిస్థితిని వివరించి...సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఫలితం కనిపించలేదు. ఆమెను లోపలికి పంపించేందుకు వారు నిరాకరించారు. ఎవరిని కదిపించినా ఉపయోగం లేకుండాపోయింది. చాలా సేపు అదే ఆవరణలో నిరీక్షించిన ఆమె చివరకు అటుగా వస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి తన దుస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించగా...‘నాకెందుకు ఇస్తావ్’ అని ప్రశిస్తూ వెళ్లిపోయారు. ‘నా ఇద్దరు పిల్లలు కడుపు నిండా తినగలిగితే అదే చాలు’ అంటున్న ఆమె మాటలు ప్రభుత్వ పెద్దలకు చెప్పే వారే లేకపోయారు. అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయిన ఆ అభాగ్యురాలు నిరాశతో... కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగింది. -
తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం
హైదరాబాద్ : కౌన్సెలింగ్ తేదీలను తక్షణమే ప్రకటించాలంటూ విద్యార్ధులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు విద్యార్థులను మధ్యలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చేస్తున్న అన్ని కోర్సుల కౌన్సెలింగ్ తేదీలను ప్రభుత్వం ప్రకటించాలని, అలాగే ప్రకటించిన కౌన్సిలింగ్ తేదీలను వాయిదా వేయటం సరికాదన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. -
బలవంతంగానైనా పంపించండి: శర్మ
హైదరాబాద్: విభజన పురోగతి, శాఖల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనుకున్నంత వేగంగా తెలంగాణలో శాఖల విస్తారణ ఏర్పాటు చేయడం లేదని రాజీవ్శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సోమవారాని కల్లా తెలంగాణ సచివాలయంలో కొనసాగుతున్న ఇతర శాఖలను బలవంతంగానైనా పంపించాలని ఆదేశించారు. తెలంగాణ సచివాలయంతో సహా కమిషనరేట్లు, డైరెక్టరేట్లలో కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా ఇవన్నీ ఏర్పాటు చేయాలని రాజీవ్శర్మ ఆదేశించారు. -
ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయం
* సచివాలయం ‘సీ’ బ్లాక్ ముందు ఉద్యోగుల ధర్నా * తానున్నానంటూ ఉద్యోగులకు కేసీఆర్ భరోసా * ఆంధ్రాకు కేటాయించిన ఉద్యోగులు తెలంగాణలోనే ఉంటారని హామీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ సచివాలయం.. అయినా జై తెలంగాణ నినాదాలు.. ధర్నా! అదీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే ‘సీ’ బ్లాకు ముందు!! బుధవారం సచివాలయంలో తెలంగాణకు చెందిన దాదాపు రెండు వందల మందికిపైగా నాలుగో తరగతి ఉద్యోగులు ఈ ఆందోళనకు దిగారు. తమను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించారని, ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేసే ప్రశ్నే లేదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయ బ్లాకులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో వారు పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. కాసేపటికి సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వచ్చి వారికి సర్దిచెప్పే యత్నం చేశారు. అదే సమయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ముగించుకుని, మెదక్ జిల్లా గజ్వేల్ వెళ్లడానికి కిందకు దిగిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నేరుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్దకు వచ్చారు. ‘‘మీకు ఆందోళన వద్దు.. మీకు నేనున్నాను. మీరంతా తెలంగాణ ప్రభుత్వంలోనే పనిచేస్తారు. ఆ భరోసా నేనిస్తున్నా’’ అని స్పష్టం చేయడంతో వారు శాంతించారు. కాగా, నాలుగో తరగతి ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించిన అంశాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసినట్లు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తమ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఇక్కడే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రతి తెలంగాణ ఉద్యోగీ ఇక్కడే: శ్రీనివాసగౌడ్ ప్రతి తెలంగాణ ఉద్యోగి ఇక్కడే ఉంటాడని టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగాక ఉద్యోగుల విషయంలో కొంత గందరగోళం జరిగిన మాట వాస్తవమేనన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మాట్లాడుకున్నాక ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందన్నారు. సీమాంధ్రకు పంపిన ఉద్యోగులు ఒకవేళ అక్కడ చార్జి తీసుకోకపోయినా వారిని కాపాడుకుంటామన్నారు. -
తొలిసారిగా సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్
-
ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటాం: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇక్రిమెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీయిచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత సచివాలయానికి వచ్చిన ఆయన ఉద్యోగులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులకు వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. పెండింగ్ లో పీఆర్సీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామన్నారు. ఉద్యోగులకు నిబంధనలను సరళీకృతం చేస్తామన్నారు. ఆశించిన ప్రగతి సాధించాలంటే ఉద్యోగులతో స్నేహంగా మెలగాలన్నారు. కలిసిమెలిసి ముందుకు సాగుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో మనవైపు చూస్తున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.