తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పులు | Architectural Changes In Telangana Secretariat Again | Sakshi
Sakshi News home page

తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పులు

Nov 6 2024 7:13 PM | Updated on Nov 6 2024 7:32 PM

Architectural Changes In Telangana Secretariat Again

తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్‌ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.

బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్‌ గేటును పూర్తిగా తొలగించనున్నారు. హుస్సేన్‌ సాగర్‌ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం తేదీ నుంచే కొత్త గేటు అందుబాటులోకి రానుంది.

కాగా, తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎఫ్‌) చేరిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్‌ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్‌ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు కేటాయించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement