కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు

కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన  కాంగ్రెస్‌ పార్టీ బృందాన్ని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సచివాలయంలోని అన్ని బ్లాకులను ఓ గంటపాటు అన్ని బ్లాకులను పరిశీలించేందుకు వచ్చారు. అయితే పోలీసులు... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాహనాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను ఎందుకు అడ్డగిస్తున్నారంటూ భట్టి విక్రమార్క సీరియస్‌ అయ్యారు. అలాగే ఆ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంతరావు వాహనాన్ని కూడా పోలీసులు మధ్యలోనే ఆపేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top