సచివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు | cultural events held in Telangana Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

Aug 11 2017 4:12 AM | Updated on Sep 11 2017 11:46 PM

తెలంగాణ సచివాలయ టీఎన్జీవోల యూనియన్‌ ఆధ్వర్యలో గురువారం సచివాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నేడు విజేతలకు బహుమతుల అందజేత
సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం, ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని తెలంగాణ సచివాలయ టీఎన్జీవోల యూనియన్‌ ఆధ్వర్యలో గురువారం సచివాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో బంగారు తెలంగాణలో ఉద్యోగుల ప్రాతపై ప్రసంగం, పరిపాలన సంస్కరణలపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు.

పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 11న (శుక్రవారం) బహుమతులు అందజేస్తామని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారం రవీందర్, మామిళ్ల రాజేందర్‌ తెలిపారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో మంత్రులు నాయిని, ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరవుతారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement