తెలంగాణ సెక్రటరియేట్‌లో నకిలీ ఉద్యోగుల కలకలం.. రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ | Telangana Government Takes Serious Action Against Fake Employees in the Telangana Secretariat | Sakshi
Sakshi News home page

తెలంగాణ సెక్రటరియేట్‌లో నకిలీ ఉద్యోగుల కలకలం.. రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌

Apr 21 2025 4:55 PM | Updated on Apr 21 2025 7:01 PM

Telangana Government Takes Serious Action Against Fake Employees in the Telangana Secretariat

హైదరాబాద్‌,సాక్షి: తెలంగాణ సెక్రటరియేట్‌లో నకిలీ ఉద్యోగుల కలకలంపై సీఎం రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. సెక్రటేరియట్ భద్రత ఏర్పాట్లు, సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాల నిఘాపై జీఏడీ ఆరాతీ తీసింది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఎంట్రీ ,ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎస్పీఎఫ్‌పై జీఏడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  

ఇప్పటికే సెక్రటరియేట్‌ మొత్తం 246 సీసీ కెమెరాలు మరో 30 కెమెరాలు పెట్టే యోచనలో ఉన్నట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలతో పాటు కీలకమైన 6వ అంతస్తులో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ ప్రజలు ఎంట్రీ అయ్యే సౌత్ ఈస్ట్ గేటుతో పాటు ఇన్‌సైడ్‌ ఎంట్రీ వద్ద మరోసారి చెకింగ్ చేయనుంది.సెక్రటరియేట్‌లో రెండంచెల భద్రత వలయాన్ని ఎస్పీఎఫ్‌ మోహరించింది.

తెలంగాణ సచివాలయంలోకి నకిలీ ఉద్యోగుల ఎంట్రీపై ప్రభుత్వం సీరియస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement