సచివాలయం వద్ద ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు బైక్తో సహా మ్యాన్హోల్లో పడిపోయాడు. గమనించిన స్ధానికలు వెంటనే అప్రమత్తమై అతనిని రక్షించారు. సచివాలయం వద్ద రోడ్డు మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వారు. ఇది గమనించని వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్ హోల్లో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో సదరు వ్యక్తికి స్వల్పగాయలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అధికారుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. రోడ్లపై గుంతలు తవ్వి రక్షణ లేకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.