సచివాలయం వద్ద ప్రమాదం

 accident at telangana secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు బైక్‌తో సహా మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. గమనించిన స్ధానికలు వెంటనే అప్రమత్తమై అతనిని రక్షించారు.  సచివాలయం వద్ద రోడ్డు మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వారు. ఇది గమనించని వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్‌ హోల్‌లో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంలో సదరు వ్యక్తికి స్వల్పగాయలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అధికారుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. రోడ్లపై గుంతలు తవ్వి  రక్షణ లేకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top