-
ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు
శని, ఆదివారాలు రెండు రోజులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ‘గద్దరన్న యాదిలో’ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పసునూరి రవీందర్ అధ్యక్షత వహించనున్నారు. ప్రొఫెసర్ ఖాసీం, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, ఏపూరి సోమన్న, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, యశ్పాల్, మాస్టార్జీ తదితరులు పాల్గొంటారు. 11వ తేదీ ఆదివారం సాయంత్రం ‘నేటి బాలసాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు ఉంటుంది. మణికొండ వేదకుమార్, చొక్కాపు వెంకటరమణ, డా.సి.ఎ.ప్రసాద్, డా.విఆర్.శర్మ, అమరవాది నీరజ, దుర్గం బైతి, పెందోట వెంకటేశ్వర్లు పాల్గొంటారు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాలు కొలువుదీరాయి. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవానికి తరలివచ్చాయి. శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శనను ప్రముఖ రచయిత, ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్న పుస్తక మహోద్యమకారుడు పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పుస్తకమే మనిషిని పరిపూర్ణం చేస్తుందన్నారు. పుస్తక ప్రదర్శన వేదికకు, ప్రాంగణానికి ప్రజాగాయకుడు గద్దర్, ఆచార్య రవ్వా శ్రీహరిల పేర్లు పెట్టడం అభినందనీయమన్నారు. పుస్తకమే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని, పుస్తకాలు బాగా చదివిన వాళ్లే మహాత్ములయ్యారని చెప్పారు. తాను ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, పుస్తకమే ప్రపంచాన్ని ఏలుతోందన్నారు. అక్షరానికి మరణం లేదని చెప్పారు. పుస్తక ప్రదర్శన కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్రెడ్డి, కె.శ్రీనివాస్, సుధా భాస్కర్, ‘వీక్షణం’ వేణుగోపాల్, గద్దర్ కూతురు వెన్నెల తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు బుక్ఫెయిర్ ప్రాంగణంలో తెలంగాణ అమరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకల రుగ్మతలకు విరుగుడు పుస్తక పఠనమేనని పేర్కొన్నారు. విభిన్న రంగాలపై అరుదైన గ్రంథాలు బుక్ఫెయిర్లో ఈసారి 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. విభిన్న రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో పేరొందిన పలు ప్రచురణ సంస్థలు సరికొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాయి. రచయితలు తాము రాసిన పుస్తకాలను స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా ప్రదర్శన ప్రారంభమైన మొదటి రోజే వేలాది మంది పుస్తకప్రియులు, సందర్శకులు తరలి వచ్చారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం, ఆయుర్వేదం, హోమియో వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. మరోవైపు మాజీ ప్రధాని పీవీకి శుక్రవారం కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో పలువురు యువతీ యువకులు ఆయన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆయన రాసిన పుస్తకాలు, ఆయనపై వెలువడినవి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. రైటర్స్ స్టాల్లో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’ వివిధ భాషల్లో ఇప్పటికే కోటికి పైగా అమ్ముడైన జిమ్కార్బెట్ రాసిన ‘ది మ్యాన్ ఈటింగ్ లియోపార్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్’ పుస్తకం తెలుగులో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’గా వెలువడింది. అనేక సంవత్సరాలుగా తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పుస్తకాన్ని 356– 360 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. -
‘చదువరి చెంతకు పుస్తకం’.. ప్రారంభం కానున్న జాతియ పుస్తక ప్రదర్శన!
సాక్షి, సిటీబ్యూరో: పుస్తక ప్రియులకు పండగే. చదువరులకు ఇక వరమే. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి 10 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శన ఈసారి ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో రెండు నెలలు ఆలస్యమైంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ నెల 19 తేదీ వరకు కొనసాగనుంది. ‘చదువరి చెంతకు పుస్తకం’అనే లక్ష్యంతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత ఏడేళ్లుగా ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఏటా 6 నుంచి 7 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలతో పాటు చరిత్ర, సామాజిక, తత్వ శాస్త్రాలు, విజ్ఞాన గ్రంథాలకు పాఠకాదరణ పెరిగింది. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలకు ఆదరణ పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. కోల్కతాలో గత జనవరిలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో సుమారు 29 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. డిజిటల్ మీడియా వెల్లువలోనూ.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘సామాజిక చింతనకు, ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకొనేందుకు సాహిత్య అధ్యయనం ఒకటే మార్గం. సాహిత్యాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నవాళ్లే గొప్ప విజేతలుగా నిలుస్తారు. అలాంటి అభిరుచి కలిగిన పాఠకులు కోట్లాది మంది ఉన్నారు’ అని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు ఉద్ధృతంగా వెల్లువెత్తినా గత ఏడేళ్లుగా పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త పుస్తకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు తమ సృజనాత్మకతకు పదును పెట్టుకుంటున్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. పిల్లలకు ప్రత్యేక పోటీలు.. బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు ఉంటాయి. జానపద నృత్యాలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు, క్విజ్, మాట్లాడే బొమ్మ, పిల్లల గ్రంథాలయాల ఆవశ్యకతపై చర్చ, హస్తకళల వర్క్షాపు, గ్రూప్డ్యాన్స్, సోలోడ్యాన్స్, పాటలు, పద్యాలు, పెయింటింగ్, స్టోరీ టెల్టింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఇతరులకు ప్రవేశ రుసుము రూ.10. పుస్తక మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక, కళా రూపాలను ప్రదర్శించనున్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. -
హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (ఫొటోలు)
-
హైదరాబాద్ : కన్నుల పండుగగా ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement